July 10
-
బాహుబలి... సీన్ బై సీన్..
⇒స్టన్నింగ్ షాట్స్, స్పెక్టాక్యులన్ సీన్స్. ⇒మూవీ ప్రారంభం, పెద్ద శబ్దం.. జీవనది మళ్లీ వచ్చిందా.. అన్నంతగా సైలెంట్. ⇒జలపాతమా.. కాదు కాదు.. అలాంటి వాతావరణమే. ⇒ఏం లేదు.. రమ్యకృష్ణ ఎంట్రీ. అంతలోనే శివుడిగా ప్రభాస్ ఎంట్రీ. ⇒ప్రభాస్ శివుడిగా కొనసాగుతాడు. ⇒శివుడు దేనికో వెతుకుతూ ఒక కొండకు వెళ్తాడు. ⇒ధీరవ అనే చోట అందాల భామ తమన్నా కనిపిస్తుంది. ⇒అవంతిక బ్యూటీ కాదు. శివుడితో పాటు యుద్ధం చేసే వనిత. ⇒ఒక్కసారిగా రాణి దేవసేన అనుష్క తెరమీదికి వస్తుంది. ⇒కరికాల కట్టప్ప ఎంట్రీ ఇస్తాడు. ఆయనే సత్యరాజ్. ⇒డైలాగ్స్.. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ప్రజల్ని ఆకట్టుకున్నాయి. ⇒అందులోంచి ఓ డైలాగ్ చూస్తే.. "మాట ఇచ్చిన వాళ్లు చనిపోవచ్చు కానీ.. మాట నిలిచిపోతుంది". ⇒అవంతిక, శివుడు మధ్య జరిగే సన్నివేశం కలయా.. నిజమా.. అనేంతగా ఉంది. ⇒అందాల భామ తమన్నాను యుద్ధ వనితగా చూపించాడు రాజమౌళి. ⇒అంతలోనే భల్లాలదేవగా.. రానా దగ్గుపాటి గ్రాండ్ ఎంట్రీ. ⇒రానా దగ్గుపాటి నటన.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ⇒ట్రైలర్ కంటే ఎక్కువగా.. దానికి మరింత రెట్టింపుగా ఉంది. ⇒కరికాల కట్టప్ప భల్లాల దేవ ప్రాణాలు కాపాడుతాడు. రాణి దేవసేనను విడుదల చేస్తాడు. ఇందుకు భల్లాలదేవ ఒప్పుకోడు. ⇒అంతలోనే నాజర్ ఎంట్రీ. వావ్.. నిజంగా ఆయన ఎంట్రీ ఓ అద్భుతం. ⇒భల్లాలదేవకు బంధువు అడవి శేషు.. ⇒అనుష్క (రాణి దేవసేన) సంకెళ్లతో బంధించి ఉంటుంది. ఆ సీన్లో అనుష్క దుస్తులు కూడా మురికిగా ఉంటాయి. ⇒అనుష్క అక్కడే ఒక డైలాగ్ చెబుతుంది.. ⇒"పుల్లలు ఏరుకోవడానికి నేను పిచ్చి దాన్ననుకున్నావా కట్టప్పా.. చితి పేరుస్తున్నాను.. ఆ భల్లాల దేవుణ్ని కాల్చడానికి" అని చెబుతుంది. ⇒అనుష్క రాణి దేవసేనగా మంచిగా నటించింది. ⇒అవంతిక, శివుడు చేసే కత్తి యుద్ధం సూపర్బ్. ⇒అందాల భామను వీరవనితగా చూపించిన ఘనత రాజమౌళిది. ⇒అనుష్క, ప్రభాస్ లను స్క్రీన్ మీద ప్రత్యేక ఆకర్షణగా చూపించారు. ⇒"పచ్చబొట్టేసిన" అనే సాంగ్ చాలా అమేజింగ్ గా ఉంది. సైలెంట్ సునామీలా సాగిపోతుంది. ⇒బాహుబలి స్వర్ణ విగ్రహం ఆవిష్కరిస్తారు. ⇒అలాంటి కొన్ని సీన్లను టీజర్లలో చూశాం. ⇒అయితే స్క్రీన్ పైన చూడటం ఓ అనుభూతి. ⇒అవంతికకు సహాయం చేయాలని శివుడు నిర్ణయించుకుంటాడు. ⇒అవంతికకు శివుడు సాయమందిస్తాడు. ఆ సీన్ సూపర్గా తీశాడు. ⇒అపుడు ప్రభాస్.. 'దేవసేన ఎవరో నాకు తెలియదు' .. అంటాడు. ⇒అనంతరం 'నిప్పులే శ్వాసగా..' సాంగ్ వస్తుంది. ⇒భల్లాలదేవ పతనం కోసం శివుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ⇒రాణి దేవసేన.. భల్లాలదేవ వైపు అదో కోపంగా చూస్తుంది. ⇒అక్కడ ఆ సమయంలో ఉన్న సెట్టింగులు వర్ణనాతీతం. ⇒శివుడే బాహుబలి అనే విషయం తెలుస్తుంది.. ⇒⇒⇒ఇంటర్ మిషన్.. ⇒తర్వాత మూవీ కోయకోన లోకి వెళ్తుంది. ⇒భల్లాలదేవ.. శివుడి కోసం వెతుకుతుంటాడు. ఇద్దరూ ఎదురెదురు పడతారు. తర్వాత ఏం జరిగిందనేది తెరపైనే చూడాలి. ⇒రాయల్ మదర్ దేవసేన.. శివుడు.. బాహుబలిని కలుస్తుంది. ⇒అమేజింగ్ సీన్స్.. చక్కటి షాట్లు తీశారు. ⇒భద్ర.. శివుడి సీన్ మరొక సంచలనం. ⇒శివుడు.. బాహుబలి తనయుడని కరికాడ కట్టప్ప చెబుతాడు. ⇒అప్పడే మొదలవుతుంది అసలైన కథ. ⇒చిత్రం ఆమాంతం సీరియస్గా సాగుతుంది. ⇒నిజానికి శివుడు అంటాడు.. ⇒'నేనెవరిని' ⇒డైలాగ్: నువ్వు అమరేంద్ర బాహుబలి రక్తానివి ⇒అంటూ ఎంట్రీ ఇస్తారు శివగామిగా రమ్యకృష్ణ. ⇒అమరేంద్ర బాహుబలి తనయుడే శివుడు అని చెబుతుంది. ⇒రమ్య కృష్ణ నటనతో అదరగొట్టారు. ⇒ సత్యరాజ్ (కిట్టప్ప), సుదీప్ (అస్లాం ఖాన్) మధ్య కత్తి యుద్ధంలో గెలిచిన కిట్టప్ప ⇒పోరాటయోధురాలిగా అవంతిక.. గిరిజన సైన్యానికి ఆమే నాయకురాలు ⇒భల్లాల దేవ ఖైదు నుంచి దేవసేనను విడిపించేందుకు అవంతికకు అవకాశం వస్తుంది ⇒ మాహిష్మతీ రాజ్యం.. నియంత భల్లాలదేవ ఎంట్రన్స్ ⇒ భల్లాల దేవ బుల్ ఫైట్ లో ఎద్దును చంపేస్తాడు ⇒ శివుడు ఎప్పుడొస్తాడు.. తనను ఎలా విడిపిస్తాడు.. భల్లాల దేవుడిని ఎలా చంపుతాడని దేవసేన (అనుష్క) ఎదురు చూస్తుంటుంది ⇒ శివుడు, అవంతికల మధ్య వాగ్వాదం జరుగుతుంది ⇒పచ్చబొట్టేసిన పాట.. అవంతిక ఒక లక్ష్యం వేటలో తన అందాన్ని మరుగున పడేసుకుంటుంది. శివుడు ఆమెకు తన అందాన్ని మళ్లీ గుర్తించేలా చేస్తాడు. ⇒శివుడు, అవంతిక ప్రేమలో పడతారు. ⇒ మంచు తుపానులో చిక్కుకున్న శివుడు, అవంతిక. ⇒ మంచు తుపాను నుంచి శివుడు, అవంతిక తప్పించుకుంటారు. ఇప్పుడు శివుడు మాహిష్మతి రాజ్యంలోకి ప్రవేశించాడు. ⇒ దేవసేనను విడిపించడమే అతడి లక్ష్యం. ⇒ బాహుబలి బతికే ఉన్నాడని వచ్చి తనను చంపేస్తాడేమోనని భల్లాలదేవ భయపడతాడు. ⇒శివుడిని చూస్తాడు. ⇒ దేవసేనను శివుడు విడిపించుకుని తీసుకెళ్తాడు గానీ, వాళ్లను అడివి శేష్ పట్టుకుంటాడు. ⇒శివుడు, కిట్టప్పల మధ్య యుద్ధసన్నివేశం. ప్రభాస్ అడివి శేష్ ను చంపే సన్నివేశాలు అత్యద్భుతంగా ఉన్నాయి. ⇒కిట్టప్ప అప్పుడు శివుడి గతం గురించి చెబుతాడు. ⇒ ఫ్లాష్ బ్యాక్ ప్రారంభం. శివగామి మాహిష్మతి రాజ్యాన్ని ఏలుతుంటుంది. ⇒ భల్లాల దేవ, అమరేంద్ర బాహుబలిని పెంచుతున్న శివగామి ⇒ ఒక్కసారిగా స్టోరీలో ఊపు వచ్చింది. ⇒ సైనిక రహస్యాలను దొంగిలించిన సాకేత్ కోసం భల్లాలదేవ, అమరేంద్ర బాహుబలి వెతుకుతుంటారు. వాళ్లు దొంగల స్థావరంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ రాజమౌళి కామియో. ⇒ఆ తర్వాత ఐటెం సాంగ్ వస్తుంది. ⇒కొండ మీద నుంచి దూకేయడానికి సాకేత్ ప్రయత్నిస్తాడు. ⇒ ప్రభాస్ అతడిని కాపాడతాడు. కానీ భల్లాల దేవ అతడిని చంపేయాలనుకుంటాడు. అప్పుడు కట్టప్ప ప్రవేశిస్తాడు. ⇒ కాలకేయుడనే క్రూరుడైన రాజుకి ఆ సైనిక రహస్యాలను సాకేత్ అమ్మేస్తాడు. ⇒ మాహిష్మతి కాలకేయల మధ్య యుద్ధం మొదలవుతుంది. కాలకేయుడి తల నరికినవాళ్లే మాహిష్మతికి రాజు అవుతారని అమరేంద్ర బాహుబలి, భల్లాల దేవలకు చెబుతారు. ⇒ యుద్ధం మొదలైంది. ⇒ఈ యుద్ధ సన్నివేశం సినిమా మొత్తానికి హైలైట్. ⇒భీకర యుద్ధం కొనసాగుతుంటుంది. ⇒ప్రభాస్ తన సైన్యానికి ఉత్సాహం రేకెత్తిస్తుంటాడు. ఈ దృశ్యాలను వర్ణించడానికి పదాలు చాలవు. ⇒బాహుబలి, కాలకేయల మధ్య యుద్ధ సన్నివేశం. ⇒కాలకేయను సజీవంగా తీసుకురమ్మని శివగామి చెబుతుంది. కానీ భల్లాలదేవ అతడిని చంపేస్తాడు. ⇒అమరేంద్ర బాహుబలి తన ప్రజల ప్రాణాలు కాపాడతాడు కానీ భల్లాలదేవ ప్రాణాలను కాపాడడు. ⇒దాంతో బాహుబలిని రాజుగా ప్రకటిస్తారు ⇒కట్టప్ప బాహుబలిని చంపేస్తాడు. ⇒బాహుబలి మరణంతో ముగిసిన సినిమా. -
10న పీఎస్ఎల్ వీ సీ28 ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈనెల 10వ తేదీ రాత్రి 9.58 గంటలకు పీఎస్ఎల్వీ సీ28 రాకెట్ను ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం ప్రకటించింది. దీనికి సంబంధించి ఈ నెల ఎనిమిదిన ఉదయం 7.30 గంటలకు కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ ప్రయోగంలో కెనడాకు చెందిన ఐదు ఉపగ్రహాలను రోదసీలోకి పంపుతున్నారు. ఈ ప్రయోగం ద్వారా ఇస్రోకి రూ.1,440 కోట్ల ఆదాయం లభించనుంది. -
మోగనున్న షాహిద్ పెళ్లి బాజాలు
-
10 నుంచి అసెంబ్లీ
సాక్షి, చెన్నై: అసెంబ్లీ సమరం గురువారం నుంచి ఆరంభం కానుంది. 22 రోజుల పాటుగా సభ నిర్వహణకు అసెంబ్లీ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంది. రోజుకు రెండు శాఖల చొప్పున నిధుల కేటాయింపులపై సమీక్ష జరగనున్నది. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం దాఖలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో హడావుడిగా నాలుగు రోజుల్లో సభను ముగించారు. అయితే, శాఖల వారీగా నిధుల కేటాయింపులు, అభివృద్ధి, చర్చకు ఆస్కారం ఇవ్వలేదు. పస్తుతం ఎన్నికలు ముగియడంతో శాఖల వారీగా సమీక్షలకు అసెంబ్లీ సిద్ధం అయింది. గురువారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశంలో అధికార పక్షంతో ఢీ కొట్టేందుకు ప్రతి పక్షాలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, మౌళివాకం ఘటన, ధరల పెరుగుదల, శాంతి భద్రతల అంశాల్ని అస్త్రంగా చేసుకుని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు డీఎంకే, డీఎండీకే, పీఎంకే, సీపీఎం,సీపీఐ, కాంగ్రెస్లు సిద్ధమవుతున్నాయి. ప్రతి పక్షాల్ని దీటుగా ఎదుర్కొనేందుకు అధికార పక్షం సైతం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై చర్చించేందుకు మంగళవారం శాసన సభా వ్యవహారాల కమిటీ సమావేశం అయింది. 22 రోజులు : అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ ధనపాలన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి అధికార పక్షం తరపున మంత్రులు ఓ పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, ఎడపాడి పళని స్వామి, ప్రభుత్వ విప్ మనోహర్, డీఎంకే తరపున చక్రపాణి, డీఎండీకే తరపున మోహన్ రాజ్, సీపీఎం తరపున సౌందరరాజన్, సీపీఐ తరపున ఆర్ముగం, కాంగ్రెస్ తరపున గోపినాథ్, ఎంఎంకే తరపున జవహరుల్లా, పుదియ తమిళగం తరపున కృష్ణ స్వామి హాజరయ్యారు. గంటన్నర పాటుగా ఈ సమావేశంలో అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాల్ని సమీక్షించారు. తేదీల వారిగా చర్చించాల్సిన అంశాల్ని సిద్ధం చేశారు. సభను ఆగస్టు 12 తేదీ వరకు నిర్వహించేందుకు నిర్ణయించారు. శని, ఆది, ప్రభుత్వ సెలవు దినాల్లో అసెంబ్లీకి సెలవు. ఈ దృష్ట్యా, మొత్తంగా 22 రోజుల పాటు సభ జరగనుంది. పదో తేదీన నగరాభివృద్ధి, ప్రత్యేక పథకాలపై, 11న చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 14న హోం శాఖ, 15న సమాజ సంక్షేమ శాఖ, 16న రోడ్లు, భవనాలు, హార్బర్లు, క్రీడలు యువజన సర్వీసులు, 17న ఉన్నత విద్య, పాఠశాల విద్య, 18న సహకార 21న విద్యుత్, ఎక్సైజ్ శాఖల నిధుల కేటాయింపులపై సమీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజు ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. చివరి రోజు పన్నెండో తేదీన ఆర్థిక నివేదికను ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం సభకు సమర్పించనున్నారు. అదే రోజు పలు ముసాయిదాల్ని ప్రవేశ పెట్టి ఆమోదించనున్నారు.సీఎం భేటీ : అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కాబోతున్న దృష్ట్యా, శాఖల వారీగా జరిగిన కేటాయింపులు, ఆయా శాఖల్లో ప్రస్తుతం జరిగిన అభివృద్ధి, చేపట్టిన, చేపట్టాల్సిన పనులు, తదితర అంశాలతో పాటుగా మౌళివాకం ఘటనపై ప్రతి పక్షాలతో ఎదుర్కోవాల్సిన అంశాలపై మంత్రి వర్గంతో సీఎం జయలలిత సమీక్షించారు. ఉదయం సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో అసెంబ్లీలో సీఎం ప్రవేశ పెట్టే ప్రత్యేక ప్రకటనలపై కూడా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.