Kashmir freedom
-
‘కశ్మీర్’పై ప్రజా ఉద్యమం
లాహోర్: జమాత్ ఉద్ దవా చీఫ్ (జేయూడీ) హఫీజ్ సయీద్ మరోసారి భారత్పై నోరు పారేసుకున్నాడు. కశ్మీర్కు స్వాతంత్య్రం సాధించటానికి పాకిస్తాన్లో ప్రజా ఉద్యమం తీసుకొస్తానని ప్రతిజ్ఞ చేశాడు. 297 రోజుల గృహ నిర్బంధం అనంతరం ఈ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు గురువారం అర్ధరాత్రి దాటాక విడుదలయ్యాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘కశ్మీర్ గురించి మాట్లాడనీయకుండా చేయడానికే నన్ను 10 నెలలు గృహనిర్బంధంలో ఉంచారు. నేను కశ్మీరీల కోసం పోరాడుతాను. వారికి స్వాతంత్య్రం వచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తాను. కశ్మీర్కు స్వాతంత్య్రాన్ని కోరుకునే పాకిస్తానీలను ఏకం చేసి ఆ కల నెరవేరేందుకు ప్రయత్నిస్తాను’అని పేర్కొన్నాడు. అలాగే శుక్రవారం ఓ మసీదులో సయీద్ మతోపన్యాసం చేస్తూ..పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, భారత్తో మైత్రి కోసం ప్రయత్నించి దేశద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించాడు. 2008 నవంబరు 26న 10 మంది ఉగ్రవాదులు ముంబై నగరంలో పలుచోట్ల మారణహోమం సృష్టించి ఆరుగురు అమెరికన్లు సహా 166 మందిని పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ద్వారా హఫీజ్ సయీద్ ఈ దాడికి ప్రణాళిక రచించాడు. ఆ తర్వాత అతనికి వ్యతిరేకంగా పాకిస్తాన్కు భారత్ ఆధారాలు అందజేయడంతో ఈ ఏడాది జనవరి 31న సయీద్తో పాటు మరో నలుగురిని పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సు ప్రభుత్వం గృహనిర్బంధం చేసింది. సయీద్పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేస్తూ ఇతని తలపై అమెరికా కోటి డాలర్ల నజరానా కూడా ప్రకటించింది. అరెస్టు చేయాలి: అమెరికా హఫీజ్ సయీద్ చేసిన నేరాలకు అతణ్ని పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టాలని అమెరికా కోరింది. ‘లష్కరే తోయిబా స్థాపకుడు సయీద్ను గృహనిర్బంధం నుంచి విడుదల చేయడం మాకు ఆందోళన కలిగిస్తోంది. అమెరికన్లు సహా వందలాది మంది ప్రజలను లష్కరే తోయిబా అన్యాయంగా చంపేసింది. సయీద్ను పాక్ ప్రభుత్వం అరెస్టు చేయాలి’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. -
24 గంటల్లో ఆయనను గెంటేయండి!
ముంబై: జమ్ముకశ్మీర్ విషయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ పై శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ను రెచ్చగొట్టేలా మాట్లాడిన బాసిత్ను 24 గంటల్లోగా పాకిస్థాన్కు పంపించాలమని డిమాండ్ చేసింది. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రావత్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. 'ఢిల్లీలో కూర్చుని ఆ వ్యక్తి భారత్కు వ్యతిరేకంగా విషం చిమ్ముతున్నాడు. అతన్ని 24 గంటల్లోగా వెంటనే ఇస్లామాబాద్కు పంపించేయాలి. మన స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక్కరోజు ముందు అతను ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడా? అతనిపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం' అని పేర్కొన్నారు. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయాన్ని, ముంబైలోని పాక్ రాయబార కార్యాలయాన్ని వెంటనే మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా పాక్ హైకమిషనర్ వ్యాఖ్యల్ని ఖండించింది. ఆదివారం (ఆగష్టు 14న) పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ కశ్మీర్ విషయమై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాన్ని కశ్మీర్ విముక్తికి అంకితం చేస్తున్నాం. జమ్ముకశ్మీర్ ప్రజల త్యాగాలు విజయవంతమవుతాయని మేం నమ్మకంగా ఉన్నాం' అని బాసిత్ పేర్కొన్నారు. కశ్మీర్ లోయలో నెలకొన్న అశాంతి విషయమై భారత్-పాక్ సంబంధాలు ఉప్పు-నిప్పులా మారిన సంగతి తెలిసిందే. ఈ సంబంధాలను మరింత దెబ్బతీసేలా.. భారత్ను మరింత రెచ్చగొట్టేలా బాసిత్ వ్యాఖ్యలు చేశారు. -
భారత్ను రెచ్చగొడుతూ పాక్ రాయబారి వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: భారత్లోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ కశ్మీర్ విషయమై మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విముక్తికి తమ మద్దతు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం (ఆగష్టు 14న) పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయంలో జెండా ఎగురవేసి ఆయన ప్రసంగించారు. 'ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాన్ని కశ్మీర్ విముక్తికి అంకితం చేస్తున్నాం. జమ్ముకశ్మీర్ ప్రజల త్యాగాలు విజయవంతమవుతాయని మేం నమ్మకంగా ఉన్నాం' అని బాసిత్ పేర్కొన్నారు. కశ్మీర్ లోయలో నెలకొన్న అశాంతి విషయమై భారత్-పాక్ సంబంధాలు ఉప్పు-నిప్పులా మారిన సంగతి తెలిసిందే. ఈ సంబంధాలను మరింత దెబ్బతీసేలా.. భారత్ను మరింత రెచ్చగొట్టేలా బాసిత్ వ్యాఖ్యలు చేశారు. 'కశ్మీర్కు విముక్తి దొరికేవరకూ స్వాతంత్ర్య పోరాటం కొనసాగుతుంది. కశ్మీర్ ప్రజల త్యాగాలు వృథా కాబోవు' అని బాసిత్ అన్నారు. కశ్మీర్ అంశంపై చర్చలకు పాకిస్థాన్ చేసిన ప్రతిపాదనను భారత్ తిరస్కరించిన నేపథ్యంలో బాసిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
భారత్ను రెచ్చగొడుతూ పాక్ రాయబారి వ్యాఖ్యలు!