Kohima
-
సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించి చరిత్ర సృష్టించిన మహిళా ఎమ్మెల్యేలు
కోహిమా: 60 ఏళ్ల నాగాలాండ్ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అధికార ఎన్డీపీపీ టిక్కెట్పై పశ్చిమ అంగామీ స్థానం నుంచి హెకాని జకాలు, దిమాపూర్–3 స్థానం నుంచి సల్హోటనో క్రుసె విజయం సాధించారు. వారిద్దరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించడం విశేషం. నాగాలాండ్లో ఎన్డీపీపీ–బీజేపీ హవా నాగాలాండ్లో అధికార నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ)–బీజేపీ కూటమి మళ్లీ అధికార పీటం దక్కించుకుంది. 60 స్థానాలున్న అసెంబ్లీలో 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కూటమిలోని ఎన్డీపీపీకి 25, బీజేపీకి 12 సీట్లు దక్కాయి. ఇతర పార్టీ లేవీ రెండంకెల సీట్లు సాధించలేకపోయాయి. ఎన్సీపీ 7, నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) 5 సీట్లు గెలుచుకున్నాయి. ఎల్జేపీ(రామ్విలాస్ పాశ్వాన్) 2, ఆర్పీఐ(అథవాలే) 2, ఎన్పీఎఫ్ 2 సీట్లలో గెలుపొందాయి. జేడీ(యూ) ఒక స్థానంలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కి ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కలేదు. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అన్ని పార్టీ ల అభ్యర్థులకు ఎన్డీపీపీ నేత, సీఎం రియో అభినందనలు తెలిపారు. -
అట్టుడికిన నాగాలాండ్.. రంగంలోకి ఆర్మీ
-
అట్టుడికిన నాగాలాండ్.. రంగంలోకి ఆర్మీ
కోహిమా: మున్సిపల్ ఎన్నికల వ్యవహారం ప్రభుత్వానికి, నాగా గిరిజనులకు తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారడంతో నాగాలండ్ అల్లర్లతో అట్టుడికిపోయింది. ముఖ్యమంత్రి టి.ఆర్. జెలియాంగ్ సన్నిహితుల ఇళ్లతోపాటు పలు ప్రభుత్వ భవనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పరిస్థితితి చేయిదాటుతున్న తరుణంలో ఆర్మీ రంగంలోకి దిగింది. అల్లర్లు వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ప్రభుత్వ అధాకారులు చెప్పిన వివరాల ప్రకారం.. నాగారలాండ్లోని 32 మున్సిపాలిటీల ఎన్నికలకు గత నెలలో నోటిఫికేషన్ జారీచేసిన ప్రభుత్వం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను కేటాయించింది. దీనిని మెజారిటీ నాగా గిరిజనులు వ్యతిరేకించారు. మహిళలకు కోటా ఇవ్వడం తమ ఆచార,సంప్రదాయాలకు విరుద్ధమని నాగాలు నిరసనలకు దిగారు. రాజ్యాంగంలోని 371(ఎ) అధికరణ తమకు ఆ(మహిళా కోటాను వ్యతిరేకించే హక్కును) కల్పిస్తున్నదని నాగాల వాదన. దీంతో ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. ఒక దశలో ఎన్నికల వాయిదాకు సరేనన్న జెలియాంగ్ సర్కారు.. చివరికి ఎన్నికల నిర్వహణకు పచ్చజెండా ఊపడంతో నాగాలు ఆగ్రహంతో ఊగిపోయారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 1న 11 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వేలమంది నాగా గిరిజనులు రోడ్లెక్కారు. ఈ క్రమంలోనే పోలీసులకు, నాగాలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు నాగా యువకులు చనిపోయారు. చనిపోయిన యువకుల మృతదేహాలతో భారీ ర్యాలీ తీసిన నాగాలు.. గురువారం సాయంత్రం నుంచి రాజధాని కోహిమా సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాలను దిగ్భంధించారు. ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం రాజీనామా చేయాలని, కాల్పులు జరిపిన పోలీసులను డిస్మిస్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాత్రికి ఆందోళన కాస్తా హింసాత్మకంగా మారింది. కోహిమా మున్సిపాలిటీ కార్యాలయంతోపాటు ముఖ్యమంత్రి సన్నిహితుల ఇళ్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం అర్థరాత్రి తర్వాత సైన్యం రంగంలోకి దిగింది. ఐదు శ్రేణుల సైనిక బృందాలు కోహిమాను స్వాధీనం చేసుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ప్రస్తుతం నాగాలాండ్లో అల్లర్లేవీ కొనసాగడంలేదని అసోం రైఫిల్స్ అధికార ప్రతినిధి మీడియాకు చెప్పారు. అల్లర్లు వ్యాపించకుండా ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్రమంతటా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హింసాత్మక ఘటనల్లో ఎంతమంది చనిపోయింది, గాయపడింది తెలియాల్సిఉంది. -
సీఎం ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
-
సీఎం ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
కొహిమ : మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలన్న డిమాండ్కు ప్రభుత్వం దిగి రాకపోవడంతో నాగాలాండ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. డిమపుర్లో సీఎం జిలియంగ్ నివాసంతోపాటూ కొహిమ మున్సిపల్ కౌన్సిల్ బిల్డింగ్కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. -
పొగ మీద పగబట్టారు!
స్ఫూర్తి ఆ మధ్య వచ్చిన ఓ తెలుగు సినిమా గుర్తుందా? అందులో మద్యపానం కారణంగా నాశనమైపోతున్న ఓ ఊరిని మార్చడానికి హీరో నానా తంటాలు పడతాడు. త్యాగాలు చేస్తాడు. కానీ గరిపెమా గ్రామాన్ని బాగు చేయడానికి ఏ హీరో రాలేదు. ఆ ఊరిలోని ప్రతి వ్యక్తీ ఓ హీరో అయ్యాడు. అందుకే ఇప్పుడు గరిపెమా పేరు రికార్డులకెక్కింది. నాగాల్యాండ్ రాజధాని కోహిమాకి 49 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గరిపెమా గ్రామం. ఒకప్పుడు గరి అనే వృక్షాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆ ఊరికా పేరు వచ్చింది. మూడొందల కుటుంబాలు, ఓ బడి, ఓ ఆసుపత్రి... ఇంతే ఆ ఊరు. కానీ ఇప్పుడది సాధించిన ఘనత అంతా ఇంతా కాదు. దేశంలోనే తొలి పొగాకు రహిత గ్రామంగా రికార్డు సాధించింది గరిపెమా. మన దేశంలో యేటా 2.200 మంది పొగాకు కారణంగా మరణిస్తున్నారు. క్యాన్సర్తో చనిపోతున్న భారతీయుల్లో నలభై శాతం మంది ధూమపానం వల్ల క్యాన్సర్ బారిన పడ్డవారే. 90 శాతం మందికి నోటి క్యాన్సర్ పొగాకు వల్లే వస్తోంది. నాగాల్యాండ్లో కూడా ధూమపానం చేసేవారి సంఖ్య అధికమే. కానీ ఇప్పుడు ఆ ఊళ్లో ఒక్కరు కూడా పొగాకు జోలికి పోవడం లేదు. పొగ తాగాలని పరితపించడం లేదు. గ్రామ పెద్దలు, గ్రామంలోని యువసంఘం, విద్యార్థి సంఘాలు కలిసి ఊరిలో పొగాకు అన్నమాటే వినబడకుండా చేశాయి. అది మాత్రమే కాదు... ఎక్కడా మద్యం, గుట్కా కూడా లభించకుండా చేశారు. గ్రామస్తులెవరైనా పొగతాగితే ఐదు వందలు, మద్యం సేవిస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు. ఆ ఊరివారే కాదు... సందర్శకులకు, ఊరివారి కోసం వచ్చే బంధుమిత్రులు కూడా వీటిని పాటించాల్సిందే. ఈ నియమాలన్నిటినీ రాసిన ఓ పెద్ద బోర్డు గ్రామంలో అడుగుపెట్టగానే కనిపిస్తుంది. అందరూ అత్యంత కచ్చితంగా నియమాలను అనుసరించడంతో భారతదేశంలోనే తొలి పొగాకు రహిత గ్రామంతో గరిపెమా అవతరించింది. దేశంలోని ఇతర ప్రాంతాలన్నిటికీ ఆదర్శంగా నిలబడింది! -
జెలియాంగ్కు శుభాకాంక్షలు తెలిపిన మోడీ
నాగాలాండ్ కొత్త ముఖ్యమంత్రిగా నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) నేత టీఆర్ జెలియాంగ్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. నాగాలాండ్ రాజధాని కోహిమాలోని రాజభవన్లో జెలియాంగ్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ అశ్వనీ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. జెలియాంగ్తోపాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇప్పటి వరకు నాగాలాంగ్ ముఖ్యమంత్రిగా ఉన్న నైపూ రియో సీఎం పదవికి, శాసనసభా స్థానానికి శుక్రవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన నైపూ రియో 4 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే జెలియాంగ్కు భారతదేశానికి కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.