Lal Krishna Advani
-
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ను న్యూఢిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ప్రస్తుతం ఎల్కే అద్వానీ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు.గత నెల 27న ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్చిన విషయం తెలిసిందే. -
లౌకిక వాదానికి హిందుత్వ వారధి
‘భారతరత్న’ లభించడంతో వార్తలలోకి వచ్చిన బీజేపీ రాజకీయ దిగ్గజం లాల్ కృష్ణ అద్వానీ విలక్షణమైన నాయకుడు. ఆయన మాటల్లో దాపరికాలు ఉండవు. తన తప్పును అంగీకరించడానికి భేషజ పడటం ఉండదు. అవసరం అయితే క్షమాపణ అడిగేందుకు కూడా సుముఖంగా ఉంటారు! స్వచ్ఛమైన, సరళమైన జాతీయవాదం కోసం నిలబడిన నాయకుడాయన. హైందవ దుస్తుల్ని తొలగించుకున్న దిగంబర జాతీయవాదం అర్థం లేనిదని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆయనంతటి ఆత్మనిశ్చయం గల శక్తిమంతులు ఓ గుప్పెడు మంది మాత్రమే కనిపిస్తారు. పరస్పర వైరుధ్యం కలిగిన హిందుత్వానికి, లౌకికవాదానికి మధ్య వారధి నిర్మించే ప్రయత్నంలో అద్వానీ... లోకమాన్య తిలక్, గాంధీజీల దృక్పథాన్ని అనుసరించారు. నాకు చాలాకాలంగా, అతి సన్నిహితంగా పరిచయం ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుడు – ఆయన ద్వారా ఆయన కుటుంబం కూడా – లాల్ కృష్ణ అద్వానీ అని నేను నిస్సందేహంగా చెప్పగలను. ఒక కాలం ఉండేది... నేను ఆయన విశ్వాసాన్ని స్పష్టంగా గెలుపొందిన కాలం; కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో నా సలహాను సైతం ఆయన తీసుకున్న కాలం. ఆ క్రమంలో ఆయన నన్ను భారత రాజకీయాలలోని గుంభనమైన అంతర్గత కార్యకలాపాలపైన కూడా నా దృష్టి చొరబాటును అనుమతించారు. ఇప్పుడు ఆయనకు ‘భారతరత్న’ లభించడంతో ఆయనతో నా మొదటి ఇంటర్వ్యూ నా మదికి, మననానికి వచ్చింది. ఆయన్ని నిజమైన ప్రత్యేక రాజకీయ నాయకుడిగా మార్చిన ఆయనలోని లక్ష ణాలను సంగ్రహించిన ఇంటర్వ్యూ అది. తన మాటల్లో దాపరికాలు లేకుండా, నిజాయితీగా ఉండే నాయకుడు మాత్రమే కాదాయన... తన తప్పుల్ని అంగీకరించడానికి సైతం సుముఖంగా ఉండేవారు. అవసరం అయితే ‘మన్నింపు’ను కోరేవారు. ఆయన లాంటి రాజకీయ నాయకులు అతికొద్ది మంది మాత్రమే నాకు తెలుసు. 1990లో అద్వానీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ ఇంటర్వ్యూ జరిగింది. అప్పుడు నేను – ఆ ముందరే ఇండియాకు తిరిగి వచ్చిన – ఒక అనామక జర్నలిస్టుని. ‘హిందూస్థాన్ టైమ్స్ ఐవిట్నెస్’ ప్రారంభ ఎపిసోడ్ కోసం ఆ ఇంటర్వ్యూను చేశాన్నేను. డిసెంబరు నాటి ఒక అహ్లాదకరమైన అపరాహ్నవేళ అద్వానీ పండారా పార్క్ నివాసంలో ఆయనతో కలిసి కూర్చున్నాను. మరీ దీర్ఘంగా ఏం కాదు, బహుశా కేవలం పది నిముషాలు మా మధ్య సంభాషణ జరిగినట్లుంది.అందులోని చిన్న భాగం ఇది: కరణ్ థాపర్: మీరు అధికారంలో ఉండి ఉంటే కనుక ఇండియాను హిందూ దేశంగా మార్చేవారా? ఒక అధికారిక హిందూ దేశంగా? ఎల్.కె. అద్వానీ: ఇంగ్లండ్ క్రైస్తవ దేశం అయినట్లే, ఇండియా హిందూ దేశం అని నేను నమ్ముతాను. ఇందులో ఎక్కువ తక్కువలేం లేవు. ‘‘మీరు మాటలతో ఆడుకుంటారనే భావన చాలామందిలో ఉంది. కాబట్టి హిందుత్వం అంటే అర్థం ఏంటో చెప్పండి? హిందుత్వం కోసం మీరు నిలబడతారా, లేక తడబడతారా? హిందు త్వానికి మీరు అనుకూలమేనా?’’ ‘‘నేను స్వచ్ఛమైన, సరళమైన జాతీయవాదం కోసం నిలబడతాను. కానీ తన హైందవ దుస్తుల్ని తొలగించుకున్న దిగంబర జాతీయవాదం అర్థం లేనిదని నమ్ముతాను. ఇంతకు మించి చెప్పేదేం లేదు.’’ ‘‘ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుందాం. కచ్చితంగా ఇదీ అని చెప్పండి. మీరు కోరుకుంటున్నది లౌకిక భారతదేశాన్నా లేక హిందూ భారతదేశాన్నా?’’ ‘‘నిశ్చయంగా, నిజాయితీగా నేను లౌకిక భారతదేశం కోసమే నిలబడతాను.’’ ‘‘అక్కడే సమస్య వస్తోంది మిస్టర్ అద్వానీ. చాలామంది ప్రజలు మీరు అనుకూలంగా ఉన్న హిందుత్వకు, మళ్లీ మీరే అనుకూలంగా ఉన్న లౌకికవాదానికి మధ్య తీవ్రమైన వైరుధ్యాన్ని చూస్తున్నారు. ఎక్కువ మంది ప్రజలు మీరు వంతెన వేయలేరని అనుకుంటున్న వాటికి మీరు వంతెన వేయటానికి ప్రయత్నిస్తున్నారు.’’ ‘‘నేను విశ్వసిస్తున్నది లౌకికవాదం పట్ల నెహ్రూకి, లేదా సర్దార్ పటేల్కు ఉన్న దృక్పథాన్ని కాదు. లోకమాన్య తిలక్కు, గాంధీకి ఉన్న టువంటి దానిని. అయితే ఈ దృక్పథాన్ని గత నాలుగు దశాబ్దాలలో ఎన్నికల ప్రయోజనాలు వక్రీకరిస్తూ వచ్చాయి.’’ ‘‘భారతదేశంలోని పది కోట్లమంది ముస్లింల పట్ల మీ వైఖరి ఏమిటి? వారు ఈ దేశంలోని విడదీయరాని భాగం అని మీరు విశ్వసిస్తారా?’’ ‘‘కచ్చితంగా. కచ్చితంగా. నిస్సంకోచంగా.’’ ‘‘అప్పుడైతే, దేశంలోని దాదాపు 3,000 మసీదులను కూల్చివేసి వాటి స్థానంలో దేవాలయాలు నిర్మించాలనే వీహెచ్పీ డిమాండ్కు వ్యక్తిగతంగా మీరు వ్యతిరేకం అని నేను నమ్మొచ్చా?’’ ‘‘నేను వ్యతిరేకమే.’’ ‘‘పూర్తిగా?’’ ‘‘పూర్తిగా.’’ కావలిస్తే ఈ సంభాషణను మళ్లీ చదవండి. ప్రశ్నల దృఢత్వాన్ని, జవాబులలోని నిజాయితీని గమనించండి. అద్వానీ తర్వాతి నాయకు లలో ఎవరితోనైనా ఇలాంటి సంభాషణ ఈరోజు సాధ్యం అవుతుందని నేను అనుకోను. వాళ్లు దీనిని ఏమాత్రం సహించలేరు. లేచి వెళ్లి పోతారు. అయితే అసలు విషయం, ఇంటర్వ్యూ తర్వాత ఏం జరిగిందన్నది. తర్వాత నేను ఆద్వానీని కలిసినప్పుడు ‘‘ఇంటర్వ్యూ గురించి మీరేమనుకుంటున్నారు?’’ అని అడిగాను. అందుకు ఆయన కఠిన మైన పలుకులతో... అదొక హాస్యాస్పదం అని కొందరు తనతో అన్నట్లు చెప్పి, ఒక్కసారిగా వెనుదిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు! ఆయన ప్రవర్తన నన్ను నిరుత్తరుడిని చేసింది. ఆయనకు ఇంటర్వ్యూ వీడియోను పంపి, స్వయంగా తననే చూడమని కబురు పెట్టాను. ఆయన్ని ఎవరో తప్పుదారి పట్టించారని నా నమ్మకం. వారాలు, నిజానికి నెలలు గడిచినా ఆయన్నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. నేను కూడా వస్తుందని ఎదురు చూడటం మానే శాను. హఠాత్తుగా... చీకటి పడుతున్న ఒక వేసవి సాయంత్రం నా ఫోన్ మోగింది. అటువైపు ఎల్.కె. అద్వానీ. ‘‘కరణ్, నేనిప్పుడే ఇంటర్వ్యూ చూశాను. అందులో కొంచెం కూడా నాకు తప్పు కనిపించలేదు. కానీ నాకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దానిని సాకుగా చూపడం నా వయసుకు తగినది కాదు. మనం చివరిసారి కలుసుకున్నప్పుడు నీతో అనుచితంగా ప్రవర్తించాను. క్షమాపణలు చెప్పడానికే నీకిప్పుడు ఫోన్ చేశాను’’ అన్నా రాయన. తప్పును అంగీకరించడానికి ఏ సంకోచమూ లేని సంసిద్ధతే బహుశా అద్వానీలోని గొప్ప గుణంగా తక్షణం ఆయన పట్ల నాకు అక ర్షణ కలిగేలా చేసింది. ఆయన తర్వాత మళ్లీ అతి కొద్దిమంది రాజకీయ నాయకులు ఓ గుప్పెడు మంది భేషజాలు లేకుండా తమ తప్పును ఒప్పుకుని క్షమాపణ అడగగల శక్తిమంతులు ఉన్నారు. అద్వానీ గురించి ఇంకా మీరేం అనుకున్నా – ఆయనపై ఇతరులకు భిన్నాభిప్రా యాలు ఉంటాయని నేను అంగీకరిస్తాను – ఒక మంచి మనిషి మాత్రమే అలా ఉండగలరు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అడ్వాణీకి భారతరత్న
న్యూఢిల్లీ: రాజకీయ కురు వృద్ధుడు, బీజేపీ అగ్ర నేత లాల్కృష్ణ అడ్వాణీ (96)కి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఎక్స్లో ఈ మేరకు పోస్ట్ చేశారు. ఆ వెంటనే రాష్ట్రపతి భవన్ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం 1990లో దేశవ్యాప్త రథయాత్రతో బీజేపీకి ఊపు తెచ్చి అధికార సాధనకు బాటలు పరిచిన అడ్వాణీని, రామాలయ ప్రారం¿ోత్సవం జరిగిన కొద్ది రోజులకే భారతరత్న వరించడం విశేషం. అడ్వాణీకి ఈ సందర్భంగా మోదీ అభినందనలు తెలిపారు. ‘‘సమకాలీన రాజకీయవేత్తల్లో అత్యంత గౌరవనీయుడు అడ్వాణీ. దేశాభివృద్ధిలో ఆయనది అత్యంత కీలక పాత్ర. అచంచలమైన చిత్తశుద్ధి, అంకితభావంతో దేశానికి దశాబ్దాల పాటు సేవ చేశారు. ప్రజాస్వామ్యానికి జాతీయవాద విలువలను కూర్చిన గొప్ప నాయకుడు. అత్యంత కింది స్థాయి నుంచి మొదలై ఉప ప్రధానిగా ఎదిగారు. రాజకీయాల్లో నైతిక విలువలకు నూతన ప్రమాణాలు నెలకొల్పారు’’ అంటూ ప్రశంసించారు. ‘‘ఇది నాకెంతో భావోద్వేగపూరిత క్షణం. అడ్వాణీతో అత్యంత సన్నిహితంగా మెలిగి ఎంతగానో నేర్చుకునే అవకాశం నాకు దక్కింది’’ అని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ప్రకటన అనంతరం అడ్వాణీకి మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. తనకు అత్యున్నత పౌర పురస్కారం లభించడం పట్ల అడ్వాణీ హర్షం వెలిబుచ్చారు. ‘‘దేశం కోసమే నా జీవితమంతా ధారపోశా. నా ఆశయాలకు సిద్ధాంతాలకు దక్కిన గౌరవమిది. నాకెంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. అద్వానీతో కలిపి ఇప్పటిదాకా 50 మందికి ఈ పురస్కారం దక్కింది. పది రోజుల క్రితమే బిహార్ దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సామాజికవేత్త కర్పూరి ఠాకూర్కు కూడా కేంద్రం భారతరత్న ప్రకటించడం తెలిసిందే. ఒక ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి ఈ పురస్కారం ఇవ్వవచ్చు. కానీ 1999లో మాత్రం నలుగురికి భారతరత్న ప్రకటించారు. కుటుంబ రాజకీయాలను సవాలు చేసిన అడ్వాణీ: మోదీ సంభాల్పూర్ (ఒడిశా): అడ్వాణీ ఆజన్మాంతం కుటుంబ రాజకీయాలను సవాలు చేశారని, దేశ ప్రజాస్వామిక విలువల పునరుద్ధరణ కోసం పోరాడారని మోదీ అన్నారు. బీజేపీపై అంటరాని పార్టీ ముద్రను పోగొట్టి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద రాజకీయ వేదికగా తీర్చిదిద్దారని కొనియాడారు. ‘‘దివంగత ప్రధాని వాజ్పేయితోకలిసి భారత ప్రజాస్వామ్యానికి అడ్వాణీ జాతీయ విలువలద్దారు. దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక కుటుంబ గుత్తాధిపత్యం నుంచి విముక్తం చేసేందుకు నిరంతరం పోరాడారు. ఆయనకు భారతరత్న లభించడం బీజేపీకి, దాని అసంఖ్యా కార్యకర్తలకు కూడా గొప్ప గౌరవం’’ అని ఒడిశాలోని సంభాల్పూర్ ర్యాలీలో మోదీ పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్సింగ్, అనురాగ్ ఠాకూర్ తదితరులతో పాటు పలు పారీ్టల నాయకులు కూడా అడ్వాణీకి అభినందనలు తెలిపారు. దేశానికి, బీజేపీకి, పార్టీ సిద్ధాంతానికి ఆయన చేసిన నిస్వార్థ సేవలను వరి్ణంచేందుకు మాటలు చాలవని షా అన్నారు. తన గురువైన అద్వానీకి ఇంతటి గౌరవం దక్కడం ఆనందంగా ఉందని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఆయనకు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపానన్నారు. జేడీ(ఎస్) నేత కుమారస్వామి, ఎల్జేపీ (రాంవిలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు తదితరులు అడ్వాణీకి అభినందనలు తెలిపారు. నేడు అయోధ్యలో రామాలయం కొలువుదీరిందంటే అందుకు అడ్వాణీయే కారణమని బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప అన్నారు. త్వరలో దిగిపోనున్న మోదీ సర్కారు బీజేపీ ఓటుబ్యాంకును కాపాడుకునేందుకే అడ్వానీకి భారతరత్న ప్రకటించిందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. నేను ఆచరించిన విలువలకు, నా సేవలకు గుర్తింపు ‘‘భారతరత్న పురస్కారం నాకు అత్యున్నత గౌరవం మాత్రమే కాదు. నేను జీవితాంతం ఆచరించిన విలువలకు, శక్తివంచన లేకుండా అందించిన సేవలకు గుర్తింపు కూడా. దీన్ని అత్యంత వినమ్రతతో, కృతజ్ఞతతో స్వీకరిస్తున్నా. 14 ఏళ్ల వయసులో కార్యకర్తగా ఆరెస్సెస్లో చేరిన రోజు నుంచి భరతమాతకు నిస్వార్థంగా సేవ చేయడమే లక్ష్యంగా బతికా. ఈ జీవితం నాది కాదు, దేశానిదేనన్న భావనే నన్ను ముందుకు నడిపింది. ఈ సందర్భంగా పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయిలను కృతజ్ఞతతో గుర్తు చేసుకుంటున్నా. ఈ ఇద్దరు మహనీయులతో కలిసి పని చేసే అదృష్టం నాకు దక్కింది. సుదీర్ఘ ప్రజా జీవితంలో నాతో పాటు కలిసి పని చేసిన లక్షలాది బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు తదితరులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు భారతరత్న ప్రకటించినందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. నాకు అడుగడుగునా అంతులేని ప్రేరణ శక్తిగా నిలిచిన నా కుటుంబీకులను, ముఖ్యంగా నన్ను వీడి వెళ్లిన నా భార్య కమలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నా. నా దేశం మరిన్ని ఘనతలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ – భారతరత్న ప్రకటన అనంతరం విడుదల చేసిన ప్రకటనలో అడ్వాణీ. -
ఇదేనా సభలు జరిగే తీరు?
-
బీజేపీ ‘భీష్ముడు’
బిగ్ ఫిగర్: మోడీ బోనులో వృద్ధ సింహం... అద్వానీ నాంచారయ్య మెరుగుమాల: ‘‘అద్వానీజీ గాంధీనగర్లో బందీగా ఉన్నారు. అక్కడి నుంచి బయుట పడాలనుకుంటున్నా వీలు కాని నిస్సహాయ స్థితిలో ఉన్నారు’’ - బీహార్ వుుఖ్యవుంత్రి నితీశ్కువూర్ ఐదు రోజుల క్రితం పాట్నాలో అన్న ఈ వూటలు బీజేపీ అగ్రనేత లాల్కృష్ణ అద్వానీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నారుు. పార్టీ ఎదుగుదలకు విశేషంగా కృషి చేసిన మూల స్తంభాల్లో ముఖ్యుడిగా కొన్నేళ్ల క్రితం దాకా అద్వానీ ప్రభ వెలిగిపోయింది. కానీ ఇప్పుడు...? ‘అద్వానీ ఈసారి లోక్సభకు ఏ సీటు నుంచి పోటీ చేస్తారు? అసలు బరిలో ఉంటారా?’ అంటూ ఇంటా బయటా సవాలక్షసందేహాలు! 48 గంటల సంక్షోభం తర్వాత వాటికి సమాధానాలు సుస్పష్టంగా ఇచ్చిన సందేశం ఒక్కటే... బీజేపీలో అద్వానీది ఇక ముగిసిన శకమే! ఆ పరిణామాల క్రమాన్ని గమనిస్తే ఇది చక్కగా అర్థమవుతుంది. సిట్టింగ్ స్థానమైన గుజరాత్లోని గాంధీనగర్ను వదిలి వుధ్యప్రదేశ్లోని భోపాల్ నుంచి పోటీ చేయాలన్న ‘భీష్మ పితావుహుడి’ ఆకాంక్షను మన్నించేందుకు బీజేపీ నాయకత్వం తొలుత ససేమిరా అంది. రెండ్రోజులు సస్పెన్స్లో పెట్టి, చివరకు ‘ఎక్కడి నుంచి పోటీ చేయూలో మీరే తేల్చుకోండి’ అంటూ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ ప్రకటించడంతో చివరికి అంతా సద్దుమణిగినట్టే కన్పించింది. కానీ, ‘సంఘ్ పరివార్ పెద్ద ఆరెసెస్ వూటను వున్నించి, పార్టీని ఇబ్బంది పెట్టకుండా గాంధీనగర్ నుంచే వుళ్లీ నిలబడేందుకు’ అద్వానీ ఒప్పుకోవాల్సి వచ్చింది. అలా ఆయన తాజా, బహుశా చిట్టచివరి తిరుగుబాటు కూడా చరిత్రలో కలిసిపోరుుంది. పైగా ప్రధాని కావాలన్న అద్వానీ దీర్ఘకాలిక ఆకాంక్షలకు శిష్యుడైన నరేంద్ర మోడీయే శాశ్వతంగా గండి కొట్టారు. తన రాజకీయ జీవితపు మలి సంధ్యలో ఇలాంటి రోజులను చవిచూడాల్సి వస్తుందని ఈ 86 ఏళ్ల వృద్ధ నేత బహుశా ఊహించి ఉండరు. బీజేపీ అంటే అద్వానీయే... బీజేపీ రూపంలో అవతరించిన కాషాయు పార్టీ 1984 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన రెండు సీట్లను ఐదేళ్ల తర్వాత 86కు, 1990 సెప్టెంబర్-అక్టోబర్ కాలంలో సాగించిన రథయూత్రతో 1991లో 120 వరకూ పెంచడంలో అద్వానీది కీలక పాత్ర. 1996 ఎన్నికల్లో లోక్సభలో అత్యధిక స్థానాలు గెల్చుకోవడం ద్వారా తొలిసారి కేంద్రంలో బీజేపీకి అవకాశం రావడం వెనుక కూడా అద్వానీ శ్రవు ఉంది. 1999 ఎన్నికల్లో వురోసారి బీజేపీ 183 సీట్లు గెలుచుకుని, 23 పార్టీల భాగస్వావ్యుంలో ఏర్పాటు చేసిన సంకీర్ణం దాదాపు నాలుగున్నరేళ్లకు పైగా నడవడంలో కూడా ఆయన చాకచక్యమే ప్రధాన భూమిక పోషించింది. ఇంత చేసిన అద్వానీకి ఈసారి తాను ఎంచుకున్న స్థానం నుంచి పోటీ చేసే స్వేచ్ఛను కూడా నాయకత్వం ఎందుకివ్వనట్టు? గతంలో పలుమార్లు బీజేపీ నాయుకత్వం ఇచ్చిన సంకేతాల్లోనే ఈ ప్రశ్నకు సవూధానం కనిపిస్తుంది. పదేళ్లపాటు బీజేపీ అధికారంలో లేకపోవడం, ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడూ గెలవలేవునే భయూందోళనలు బీజేపీని వెనుక నుంచి నడిపించే ఆరెసెస్ నాయుకత్వాన్ని పీడించడం అద్వానీ ప్రస్తుత దయునీయు స్థితికి కారణాలని చెప్పవచ్చు. 2012 డిసెంబర్లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వుుఖ్యవుంత్రి నరేంద్ర మోడీ నాయుకత్వంలో వుూడోసారి వుంచి మెజారిటీతో గెలిచే వరకూ కేంద్రంలో వుళ్లీ గద్దెనెక్కుతావునే నవ్ముకం బీజేపీలో కలగలేదు. 2014 లోక్సభ ఎన్నికల్లో కనీసం అతి పెద్ద పార్టీగానైనా అవతరించే అవకాశం బీజేపీకి వస్తుందనే ఆశ ఆ పార్టీ నేతల్లో కూడా అప్పటిదాకా కనిపించలేదు. కానీ గుజరాత్ విజయుంతో కాషాయుపక్షం అంచనాలు ఒక్కసారిగా వూరిపోయూరుు. అప్పటిదాకా 2002 నాటి గోధ్రా ఘటన తదనంతర వుుస్లింల ఊచకోతకు కారకుడిగా పేరుపడిన 62 ఏళ్ల మోడీ ఇమేజ్ ‘వికాస్ పురుష్’ అనే స్థారుులో కొత్త రూపు దిద్దుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని విజయుపథంలో నడిపించే నేతగా మోడీకి పార్టీలో, దేశంలో గుర్తింపు తొలిసారి లభించింది. జీవిత చరవూంకంలోనైనా ప్రధాని కావాలనే అద్వానీ ఆకాంక్షకు ఇదే అడ్డంకిగా వూరింది. ఆయున ఆరున్నర దశాబ్దాల రాజకీయు జీవితం గౌరవప్రదంగా వుుగియుడానికి వీలులేని దౌర్భాగ్య పరిస్థితుల్లోకి నెట్టేసింది. 2012 డిసెంబర్ 20న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వుర్నాడే విజయుగర్వంతో ఢిల్లీ వెళ్లి విలేకరుల సవూవేశంలో ప్రసంగించిన మోడీ - జాతీయుస్థారుులో పార్టీ అప్పగించే బాధ్యతను స్వీకరించడానికి సిద్ధమేనని ప్రకటించడంతో ప్రధాని అభ్యర్థిత్వం అందుకునే రేసులో వుుందుకొస్తున్నారనే విషయుం అందరికీ అర్థమైంది. అద్వానీ మినహా... ఆరెసెస్ అగ్రనాయుకత్వం, పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ సహా అగ్ర నేతలంతా మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడమే మేలనే అభిప్రాయూనికి వచ్చారు. తొలి అడుగుగా కిందటేడాది జూన్లో గోవాలో జరిగిన బీజేపీ జాతీయు కార్యవర్గ సవూవేశంలో మోడీని పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షునిగా ప్రకటించారు. దాంతో అద్వానీకి తన భవిష్యత్ చిత్రం అప్పుడే కళ్ల వుుందు కనిపించింది. పార్టీలో అన్ని పదవులకూ రాజీనావూ ప్రకటించి నిరసన వెలిబుచ్చినా, ఆరెసెస్ జోక్యంతో చివరికి ఆయనే దారికొచ్చి వెనక్కు తగ్గాల్సి వచ్చింది. అంతేగాక మోడీ ప్రమోషన్ను అరుుష్టంగానే అయినా అంగీకరించక తప్పలేదు. 2013 డిసెంబర్లో జరిగిన నాలుగు ఉత్తరాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపని ఎన్నికల సర్వేలు చెప్పడంతో ఆ పార్టీ నాయకత్వం ఇక ఆగలేకపోయింది. కనీసం ఆ ఫలితాలు వెల్లడయ్యేదాకా ప్రధాని అభ్యర్థి ప్రకటనను వారుుదా వేయూలన్న అద్వానీ ప్రతిపాదనను తోసిపుచ్చి మరీ సెప్టెంబర్లోనే మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేసింది. బీజేపీలో అద్వానీ ఇక చెల్లని నాణెవునే విషయుం అక్కడితో స్పష్టమైంది. తొమ్మిదేళ్ల క్రితమే అద్వానీపై ఆరెసెస్ కన్నెర్ర 2005లో పాకిస్థాన్లోని తన జన్మస్థానమైన కరాచీకి వెళ్లి, పాక్ నేత వుహ్మదలీ జిన్నా గొప్ప లౌకికవాది అని ఆ గడ్డ నుంచే కీర్తించి బీజేపీలో అప్రతిష్టపాలయ్యూరు అద్వానీ. అంతేగాక ఆరెసెస్ ఆగ్రహానికి కూడా గురై పార్టీ అధ్యక్ష పదవిని కోల్పోయూరు. సంఘ్ పెత ్తనాన్ని తొలుత తీవ్రంగా ప్రతిఘటించి చివరకు తలవంచారు. వురో జనాకర్షణగల నేత లేని పరిస్థితుల్లో 2009 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా అద్వానీని అంగీకరించింది. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ విజయూవకాశాలు లేవని అప్పటికే తేలిపోయింది. ఆరెసెస్ కూడా బీజేపీకి మద్దతుగా తన కేడర్ను రంగంలోకి దింపకుండా నిరాసక్తంగా ఉండిపోయింది. ఇప్పటి పాకిస్థాన్లోని ప్రాంతాల్లో పుట్టి భారత ప్రధాని పదవి చేపట్టిన గుల్జారీలాల్ నందా, ఐకే గుజ్రాల్, వున్మోహన్సింగ్ల జాబితాలో చేరాలన్న అద్వానీ ఆకాంక్ష నెరవేరేది కాదని ఇటీవలి పరిణావూలతో తేటతెల్లమైనట్టే. మల్కాజిగిరిలో ఓటర్ల సంఖ్య ఇది దేశంలో ఇదే అతిపెద్ద ఎంపీ స్థానం 29,53,915 కేఎస్సార్ దేశంలోకెల్లా అతి పెద్ద లోక్సభ నియోజకవర్గంగా రాష్ట్రంలోని మల్కాజిగిరి రికార్డుల్లోకెక్కింది. దేశవ్యాప్తంగా ఒక్కో లోక్సభ స్థానం పరిధిలో సగటున 15 లక్షల ఓటర్లుంటే మల్కాజిగిరిలో మాత్రం ఏకంగా అందుకు రెట్టింపు సంఖ్యలో ఉన్నారు! కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన గణాంకాల మేరకు మల్కాజిగిరి ఓటర్ల సంఖ్య 29,53,915! తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ (22,63,961), కర్ణాటకలోని బెంగళూరు నార్త్ (22,29,063), యూపీలోని ఉన్నావ్ (21,10,388), ఢిల్లీ నార్త్ వెస్ట్ (20,93,922) నిలిచాయి. ఇక కేవలం 47,972 మంది ఓటర్లతో లక్షద్వీప్ దేశంలోనే అతి చిన్న లోక్సభ స్థానంగా ఉంది. అంటే అసెంబ్లీ నియోజకవర్గం ఓట్లలో నాలుగో వంతు! లక్షద్వీప్ తర్వాతి స్థానాల్లో డామన్-డయ్యూ (1,02,260), జమ్మూ కాశ్మీర్లోని లడక్ (1,59,949), దాద్రానగర్ హవేలీ (1,88,783), అండమాన్ నికోబార్ (2,57,856) ఉన్నాయి. ఈ ఐదు లోక్సభ స్థానాల్లోని మొత్తం ఓటర్లను కలిపినా మన రాష్ట్రంలోని ఒక ఎంపీ స్థానం ఓటర్లలో సగమే ఉంటారు! తాతయ్య ‘ఓటు’ పిలుపు... హిమాచల్ప్రదేశ్కు చెందిన శ్యామ్శరణ్ నేగీ (97) ఓటు వేయాలంటూ ఓటర్లకు ఇచ్చిన పిలుపు ‘ఆన్లైన్’లో అందరినీ దృష్టినీ ఆకట్టుకుంటోంది. దేశంలోని అత్యంత వృద్ధ ఓటర్లలో ఒకరైన నేగీ, 1951లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి క్రమం తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ‘ప్లెడ్జ్ టు వోట్’ పేరిట నేగీపై గూగుల్ రూపొందించిన 2.34 నిమిషాల నిడివి గల మ్యూజికల్ వీడియోను బాలీవుడ్ మెగాస్టార్లు అమితాబ్ బచ్చన్, దియా మీర్జా తదితరులు నటించిన వీడియో కంటే పదిరెట్లు ఎక్కువ మంది చూశారంటే, తాతయ్య ‘ఓటు’ పిలుపు ఎంతగా ప్రభావం చూపుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోను మార్చి 24న ఆన్లైన్లో విడుదల చేయగా, ఇప్పటి వరకు దాదాపు 35 వేల మంది చూశారు. ఓటు హక్కు ఉపయోగించుకోవాలంటూ అమితాబ్ బచ్చన్, వీరేంద్ర సెహ్వాగ్, దియా మీర్జా, అర్జున్ రామ్పాల్, రైమా సేన్ తదితరులతో రూపొందించిన వీడియోను మాత్రం ఇంతవరకు దాదాపు మూడువేల మంది మాత్రమే చూశారు. హిమాలయాల దిగువన కల్పా గ్రామంలో నివసించే నేగీ, ఉపాధ్యాయుడిగా పనిచేసి, 1975లో రిటైరయ్యారు. చాయ్ పే ఓట్ నరేంద్రమోడీ పుణ్యమాని ఈ ఎన్నికల సీజన్లో టీ స్టాళ్ల పాపులారిటీ అమాంతంగా పెరిగిపోయింది. చాయ్ పే చర్చా అంటూ చాయ్ బండ్ల దగ్గర రచ్చబండ కార్యక్రమాలు పెట్టడంతో టీ కి గిరాకీ బాగా పెరిగింది. టీ స్టాళ్ల ప్రాముఖ్యతను గుర్తించిన ఒడిశాలోని నేతాలోగ్ కూడా ఉదయం లేవగానే ముందు చాయ్ బండి దగ్గరికి పరిగెత్తుతున్నారు. అక్కడే మాటామంతీ మాట్లాడుతూ.. పనిలో పనిగా ‘ఈ సారి మీ ఓటు మాకే’ అంటూ ఎన్నికల ప్రచారం కూడా కానిచ్చేస్తున్నరు. పొద్దున్నే అయితే, అంతా ప్రశాంతంగా ఉంటరు. తిక్కతిక్క ప్రశ్నలేయరు. మా పని ఈజీగా అయిపోతుంది అంటున్నారు. అలాగే ఓ పనైపోద్దనుకుంటూ మార్నింగ్ వాకర్స్ను, యోగా సాధకులను కూడా కలిసి ఓటడిగేస్తున్నారు. -
'అఖిలేష్ ప్రభుత్వానిది సిగ్గుమాలిన చర్య'
ఈ నెల 15న ఫతేపుర్ సిక్రిలో తమ పార్టీ తలపెట్టిన ర్యాలీకి అఖిలేష్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం పట్ల భారతీయ జనతాపార్టీ శ్రేణులు శుక్రవారం లక్నోలో నిప్పులుకక్కుతున్నాయి. ర్యాలీని రద్దు చేయటం అఖిలేష్ ప్రభుత్వం సిగ్గుమాలిన చర్యగా ఆ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదుర్ పాథక్ అభివర్ణించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఆ ర్యాలీని రద్దు చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర మైనారటీ వ్యవహారాల శాఖ మంత్రి అజాంఖాన్ నేతృత్వంలో అఖిలేష్ సింగ్ యాదవ్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ర్యాలీ నిర్వహించుకునే అవకాశం ఉందని, అలాంటిది ఏ కారణం లేకుండా తమ పార్టీ చేపట్టనున్న ర్యాలీని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందని పాథక్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మైనారిటీలను బుజ్జగించే చర్యల్లో భాగంగానే ర్యాలీని రద్దు చేసినట్లు కనబడుతోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలోని ముజఫర్నగర్లో చోటు చేసుకున్న మత ఘర్షణల నేపథ్యంలో ర్యాలీకి అనుమతించేది లేదని గత అర్థరాత్రి అఖిలేష్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. దీంతో బీజేపీ శ్రేణులు అఖిలేష్ ప్రభుత్వాం, అజాంఖాన్లకు వ్యతిరేకంగా నినాదాలు రాష్ట్ర వ్యాప్తంగా హురెత్తుతున్నాయి. అయితే బీజేపీ తలపెట్టిన ర్యాలీని అఖిలేష్ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందే సరైన వివరణ ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ కాంత్ బాజపాయి ఇక్కడ డిమాండ్ చేశారు. ఆ ర్యాలీని విజయవంతం చేయడానికి గత నెలరోజులుగా భారతీయ జనతాపార్టీ ముమ్మర చర్యలు చేపట్టింది. ఆ ర్యాలీ అనంతరం జరిగే బహిరంగ సభలో బీజేపీ ముఖ్యనేత ఎల్.కే.అద్వానీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వరణ్ గాంధీలు ఆ సభలో ప్రసంగించనున్నారు.ముజఫర్నగర్లో ఇటీవల చోటు చేసుకున్న మత ఘర్షణల్లో దాదాపు 44 మంది మరణించారు. మరో వెయ్యి మంది వరకు క్షతగాత్రులు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.