Advertisement
Law and ardar
-
హోం మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో నెలకొన్న అశాంతి, ప్రజల్లో పేరుకుపోయిన అభద్రతాభావ పరిస్థితులపై హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. లా అండ్ ఆర్డర్పై ప్రశ్నించిన మీడియాపై ఆమె అసహనం ప్రదర్శించారు. ‘మీరు హోంమంత్రిగా ఏం చేయలేకపోయారు కదా?’ అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ‘‘నన్నేం చేయమంటారు?. నేనే లాఠీ పట్టాలా..? గన్ పట్టాలా?. దేనికైనా టైం రావాలి. ఒకేసారి ఏం చేయలేం కదా. దేనికైనా టైం పడుతుంది’’ అని అన్నారామె. ఇక.. నెలకు పైగా సాగిన కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఓ వైపు వైఎస్సార్సీపీ నేతలపై కక్షసాధింపు దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు.. హత్యలు, వేధింపుల పర్వాలు, చిన్నారులతో సహా మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. -
రెజ్లర్ల నిరసనపై నోరు విప్పిన కేంద్ర మంత్రి.. ఏమన్నారంటే!
ఢిల్లీ: భారత రెజ్లర్లకు న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు.. కానీ న్యాయ ప్రక్రియ తర్వాతే అది జరుగుతుందని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగికంగా వేధించారని రెజ్లర్లు ఆందోళన చేపట్టి నెలదాటింది. పతకాలను గంగా నదిలో కలిపేస్తామని రెజ్లర్లు బెదిరించిన కొన్ని రోజుల తర్వాత అనురాగ్ ఠాకూర్ ఇలా స్పందించారు. 'ప్రభుత్వం నిష్పక్షపాత దర్యాప్తును ఆమోదిస్తుంది. బాధితులకు న్యాయం జరగాలని మనమందరం కోరుకుంటున్నాము. అయితే.. అది సరైన ప్రక్రియ ద్వారా జరుగుతుంది. పక్షపాతానికి అవకాశమే లేదు. నిందితుడు ఎంపీ అయినందున కొంత ఆలస్యమవుతుంది.' అని ఠాకూర్ అన్నారు. దర్యాప్తు వేగంగా జరగాలని అందరం కోరుకుంటున్నామన్నారు. రెజ్లర్ల ప్రతి డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించిందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. బ్రిజ్ భూషణ్ సింగ్పై దర్యాప్తు చేయడానికి ఒక ప్యానెల్ను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 'రెజ్లర్ అయినా మహిళ అయినా.. ఏదైనా అఘాయిత్యం జరిగితే బాధితులకు సత్వర న్యాయం జరగాలి' అని ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి:రెజ్లర్ల అంశంపై రైతు నాయకుల మధ్య వాగ్వాదం..అరుస్తూ..ఒకరికొకరు వేళ్లు చూపుతూ.. -
క్లూస్టీమ్స్ బలోపేతం
శాస్త్రీయ ఆధారాల సేకరణపై సైబరాబాద్ పోలీసుల దృష్టి త్వరలోనే ఐదు బృందాల ఏర్పాటు త్వరితం కానున్న నేరశోధన సిటీబ్యూరో: నేరగాళ్లకు శిక్ష పడటంతో ఆధారాలు ముఖ్య భూమిక వహిస్తాయి. ఈ నేపథ్యంలోనే ఘటనా స్థలంలో వీటిని సేకరించే క్లూస్ టీమ్లను బలోపేతం చేయడంపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ దృష్టి పెట్టారు. శాస్త్రీయ ఆధారాలు పక్కాగా ఉంటే నేరగాళ్ల శిక్ష శాతం పెరుగుతుందని భావిస్తున్న కమిషనర్ ...ప్రస్తుతమున్న ఫింగర్ ప్రింట్ యూనిట్కు తోడుగా క్లూస్టీమ్లను రం గంలోకి దింపాలని భావిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో లా అండ్ అర్డర్ పోలీసు స్టేషన్లున్నా...ఆధారాల సేకరణకు మాత్రం ప్రత్యేకంగా క్లూస్టీమ్ అంటూ ఏమీ లేదు. ఉన్నా ఫింగర్ ప్రింట్ విభాగంలో సిబ్బంది కూడా చాలా తక్కువగా ఉంది. దీంతో చాలా కేసుల్లో శాస్త్రీయ ఆధారాల సేకరణ వీలుపడటం లేదు. ఇటీవల ప్రత్యక్ష సాక్షులు తదితరుల సాక్ష్యాలు న్యాయస్థానాల్లో పెద్దగా నిలవడం లేదు. చివరి నిమిషంలో వారు ఎదురు తిరుగుతుండటంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విదేశాల్లో మాది రిగానే సైబరాబాద్లోనూ క్లూస్టీం సేవలను బాగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్న కమిషనర్ ఆనంద్... ఐదు జోన్లలోనూ ఒక్కో క్లూస్టీంను ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేపట్టారు. ప్రత్యేక శిక్షణ... ఇప్పటికే అన్ని పోలీసు స్టేషన్లలో శాస్త్రీయ ఆధారాల సేకరణ బాధ్యతను అక్కడి ఠాణాల్లోని ఇద్దరు పోలీ సులు చూసుకుంటున్నారు. వీరు బాగానే పనిచేస్తున్నప్పటికీ....శిక్షల శాతం పెరగాలంటే ప్రత్యేకంగా క్లూస్టీమ్ అవసరమని సీవీ ఆనంద్ భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని తీసుకొని శిక్షణ ఇవ్వనున్నారు. శాస్త్రీయ ఆధారాల సేకరణలో ప్రావీణ్యులైన వారిచే ఓరియంటేషన్ క్లాస్లతో పాటు ఫిజికల్గా కూడా క్లాస్లు తీసుకోనున్నారు. క్లూస్టీంలో అధికారితో పాటు ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, వేలిముద్రలు...రక్తనమూనా సేకరణ నిపుణులు, పేలుడు పదార్థాలను గుర్తించేవారు ఉంటారు. ఘటనాస్థలిలో రక్తం, వేలిముద్రల సేకరణకు విదేశాల నుంచి అత్యంత ఆధునికమైన పరికరాలను కూడా తెప్పిస్తున్నారు. ఈ బృందాలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి సేవలను వినియోగించడం ద్వారా నేరగాళ్లను అరెస్టు చేసే విషయంపై మరింత దృష్టి సారిస్తామని సైబరాబాద్ క్రైమ్స్ ఓఎస్డీ నవీన్ కుమార్ పేర్కొన్నారు.. నేరగాళ్లకు శిక్ష పడేందుకే... ఘటనాస్థలిలో శాస్త్రీయ ఆధారాలను పూర్తిస్థాయిలో సేకరిస్తే, దోషులకు శిక్ష విధించే వీలుంటుంది. క్లూస్టీం వల్ల నేర పరిశోధన సులువవుతుంది. క్లిష్టమైన కేసులను వెం టనే ఛేదించవచ్చు. అందుకే ఈ వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. - సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్