Lenovo India
-
లెనోవో కే5 నోట్ భారత్ లోకి వచ్చేస్తుందోచ్!
వైబ్ కే4 నోట్ స్మార్ట్ ఫోన్ విజయంతో మంచి ఊపు మీద ఉన్న లెనోవో, తన కొత్త స్మార్ట్ ఫోన్ కే5 నోట్ లాంచింగ్ కు సిద్ధమైంది. చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం లెనోవో తన కొత్త స్మార్ట్ ఫోన్ లాంచింగ్ గురించి ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. బుకింగ్స్ అయిపోతాయని యూజర్లు చింతించాల్సినవసరం లేదని, సరిపడ నోట్5 లు అందుబాటులో ఉంటాయని తెలిపేందుకు సరదా ట్వీట్ ను కంపెనీ పోస్టు చేసింది. ఫైనల్ గా ఆగస్టు 20న నోట్ 5ను యూజర్ల ముందుకు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధంచేసింది. వైబ్ కే4 నోట్ ను విడుదల చేసిన ఆరు నెలల వ్యవధిలోనే ఈ ఫోన్ ను లెనోవో తీసుకొస్తోంది. ఈ ఫోన్ కు సంబంధించిన మొదటి టీజర్ ను బుధవారం విడుదలచేయనున్నట్టు లెనోవో ఇండియా క్లారిటీ ఇచ్చింది. కే4 నోట్ లో చాలా మెరుగుదలతో కే5 నోట్ ను భారత యూజర్ల ముందుకు తీసుకురాబోతుంది. లెనోవో కే5 నోట్ ను చైనాలో ఆవిష్కరించిన కొన్ని వారాల్లోనే వైబ్ కే4 నోట్ ను భారత్ లో ఆవిష్కరించి యూజర్లను ఆశ్చర్యపరిచింది. లెనోవో కే5 నోట్ ఫీచర్లు... 5.50 అంగుళాల డిస్ ప్లే 1.8గిగాహెడ్జ్ ప్రాసెసర్ 1080x1920 పిక్సెల్స్ 2జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజ్ 128 జీబీ విస్తరణ మెమరీ 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా 8 మెగాపిక్సెల్ ముందు కెమెరా ఆండ్రాయిడ్ 5.1 ఓఎస్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మెటల్ బాడీ డ్యూయల్ సిమ్ 4జీ ఎల్టీఈ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ 3500ఎంఏహెచ్ -
లెనొవొ కొత్త స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ: పర్సనల్ టెక్నాలజీ పరికరాలు తయారు చేసే లెనొవొ ఇండియా కంపెనీ కొత్త స్మార్ట్ఫోన్, వైబ్ ఎక్స్ను మంగళవారం భారత్లో ఆవిష్కరించింది. వైబ్ సిరీస్ స్మార్ట్ఫోన్లలో భారత్లో అందిస్తున్న ఈ తొలి ఫోన్ ధర రూ.25,999గా నిర్ణయించామని లెనొవొ ఇండియా ఎండీ అమర్ బసు తెలిపారు. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఓఎస్పై పనిచేసే ఈ ఫోన్లో ఐదు అంగుళాల ఫుల్ హెచ్డీ కెపాసిటివ్ టచ్స్క్రీన్, 1.5 గిగా హెట్స్ క్వాడ్-కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్, 13 మెగా పిక్సెల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ కెమెరా(ఫ్రంట్) వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. స్క్రాచ్ రెసిస్టెంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణ అని వివరించారు. కొన్నేళ్లలోనే భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో 5 శాతం మార్కెట్ వాటా సాధించడం లక్ష్యమని చెప్పారు.