master developer
-
సింగపూర్ సంస్థలతో చర్చలకు యనమల అధ్యక్షతన కమిటీ
మాస్టర్ డెవలపర్ ఎంపికకు జిమ్మిక్కులు సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి మాస్టర్ డెవలపర్ ఎంపికలో ప్రభుత్వ కుట్రలు ఒకటొకటిగా బహిర్గతమవుతున్నాయి. మాస్టర్ డెవలపర్ ఎంపికకు ఇప్పటికే స్విస్ ఛాలెంజ్ విధానంలో సింగపూర్ ప్రైవేటు సంస్థల కన్సార్టియం ప్రతిపాదనలు పంపింది. వాటిని ఛాలెంజ్ చేస్తూ(కౌంటర్) ప్రతిపాదనలు ఆహ్వానించడానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాల్సిన సర్కారు సరికొత్త సాంప్రదాయానికి తెర తీసింది. కౌంటర్ ప్రతిపాదనలను ఆహ్వానించేలోగా సింగపూర్ ప్రైవేటు సంస్థల కన్సార్టియంతో బేరసారాలు, సంప్రదింపులు జరిపేందుకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) కమిషనర్ ఎన్.శ్రీకాంత్ సభ్య కార్యదర్శిగా వ్యవహరించే ఈ కమిటీలో.. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీవీ రమేశ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు, సీసీడీఎంసీ చైర్మన్, ఎండీ డి.లక్ష్మీ పార్థసారథి, పురపాలక శాఖకు చెందిన ప్రకాష్ గౌర్, చార్టెట్ అకౌంటెంట్లు బీఎస్ చక్రవర్తి, శరత్కుమార్లను సభ్యులుగా నియమించారు. సింగపూర్ కన్సార్టియంతో సంప్రదింపులు జరిపి.. వాటి ప్రతిపాదనలు రాష్ట్ర అవసరాలను తీర్చేలా ఉన్నాయా లేదా.. ఇబ్బందులు ఉన్నాయా? అన్నది పరిశీలించి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆ కమిటీని ఆదేశించింది. తద్వారా కన్సార్టియం ప్రతిపాదనలను ఛాలెంజ్ చేస్తూ ఇతర సంస్థలు షెడ్యూలు దాఖలు చేసినా.. ఆ కన్సార్టియంనే మాస్టర్ డెవలపర్గా ఎంపిక చేసేందుకు ఎత్తులు వేస్తోంది. -
అమరావతి నిర్మాణంలో పచ్చ తమ్ముళ్ళ ఇష్టారాజ్యం
-
స్విస్ చాలెంజ్ పద్ధతిలోనే మాస్టర్ డెవలపర్
హైదరాబాద్: కొత్త రాజధానిలోని ప్రధాన నగరం (సీడ్ కేపిటల్) కోసం.. కేపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కంపెనీ (సీసీడీఎంసీ) ఆధ్వర్యంలో మాస్టర్ డెవలపర్ను ఎంపిక చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మాస్టర్ డెవలపర్ ఎంపిక ప్రక్రియను స్విస్ చాలెంజ్ పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుభవమున్న డెవలపర్స్ తమ ప్రతిపాదనలను పురపాలక పట్టణాభివద్ధి శాఖ ముఖ్యకార్యదర్శికి పంపించాల్సి ఉంటుందని, ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ పరిశీలిస్తుందని వివరించారు. వివరాలకు పురపాలక పట్టణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిని సంప్రదించాలని, ప్రతిపాదనలు ఞటట్ఛఛిడఝ్చఠఛీః్చఞ.జౌఠి.జీ మెయిల్కు పంపచ్చునని తెలిపారు. ఈ ప్రక్రియను కొనసాగించడానికి ఎలాంటి వ్యవస్థ లేదని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సీసీడీఎంసీని ఏర్పాటు చేస్తూ శనివారం జీవో జారీ చేసింది. -
పీఆర్సీపై నిర్ణయం తీసుకోని ఏపీ కేబినెట్
-
పీఆర్సీపై నిర్ణయం తీసుకోని ఏపీ కేబినెట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పనులను స్విస్ ఛాలెంజింగ్ విధానం ద్వారా మాస్టర్ డెవలపర్కు అప్పగించాలని ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. బుధవారం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో రాజధాని నిర్మాణ బాధ్యతల గురించి చర్చించారు. పీఆర్సీపై చర్చించినా నిర్ణయం తీసుకోలేదు. ఏపీ కేబినెట్ సమావేశంలో ఇంకా పలు విషయాలు చర్చకు వచ్చాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూసమీకరణకు రైతులను ఒప్పించేందుకు మంత్రుల బృందాన్ని పంపాలని కేబినెట్ నిర్ణయించింది. నీరు-చెట్టుపై సమగ్రంగా చర్చించారు. కమర్షియల్ ట్యాక్స్ చెల్లింపులు, అటవీ హక్కుల చట్టం మార్పులు తదితర అంశాలు చర్చకు వచ్చాయి. రోజ్వుడ్ తరహాలో ఎర్రచందనానికి కూడా అదే తరహాలో శిక్షా చట్టాలను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. -
రాజధాని ఎవరి చేతికి?
-
రాజధాని ఎవరి చేతికి?
నేటి కేబినెట్ ఎజెండాలో మాస్టర్ డెవలపర్ ఎంపిక సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని నిర్మాణం కోసం మాస్టర్ డెవలపర్గా సింగపూర్ కంపెనీలను ఎంపిక చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరగనున్న మంత్రివర్గ సమావేశం ఎజెండాలో మాస్టర్ డెవలపర్ ఎంపిక అంశాన్ని చేర్చారు. సింగపూర్ కంపెనీలతో నేరుగా సంప్రదింపులు జరిపి మాస్టర్ డెవలపర్ను ఎంపిక చేసేందుకు తొలుత చంద్రబాబు చేసిన ప్రయత్నాలకు అధికార యంత్రాంగం గండి కొట్టింది. 2001లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ‘ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబిలింగ్ చట్టం -2001’ ఆధారంగా.. సంప్రదింపుల ద్వారా మాస్టర్ డెవలపర్ను ఎంపిక చేయాలని ప్రభుత్వ పెద్దలు భావించారు. ఆ చట్టంలోని సెక్షన్ 19లో ఉన్న ‘ప్రపంచంలో ఎక్కడా లేని ప్రాపర్టీ, టెక్నాలజీ ఉన్న కంపెనీతో నేరుగా సంప్రదింపులు జరిపి డెవలపర్గా ఎంపిక చేయవచ్చు’ అన్న క్లాజ్ను ఆధారంగా తీసుకోవాలనుకున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా చేయడం సాధ్యం కాదంటూ అధికార యంత్రాంగం పలు నిబంధనలను ఉటంకించింది. అయితే ఎలాగైనా సింగపూర్కు కంపెనీలకే మాస్టర్ డెవలపర్ బాధ్యతలను అప్పగించాలనే కృతనిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి.. అదే పాత చట్టం, మరో సెక్షన్లోని స్విస్ ఛాలెంజ్ విధానంలో ఆయా కంపెనీలకే మాస్టర్ డెవలపర్ బాధ్యతలను అప్పగించేందుకు రంగం సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సింగపూర్ కంపెనీలను సంప్రదించి స్విస్ చాలెంజ్ విధానానికి ఒప్పించారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో స్విస్ ఛాలెంజ్ విధానంలో మాస్టర్ ప్రణాళికను తయారు చేసిన అనుభవం ఉన్న సింగపూర్ కంపెనీయే.. కోర్ రాజధాని నిర్మాణాన్ని ఎంత ధరకు చేపడుతుందో ప్రతిపాదనలను తయా రు చేసి ప్రభుత్వానికి అందిస్తుంది. ఆ నిర్మాణాల ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి ఎంత ఆదాయం సమకూర్చగలదనే ప్రతిపాదనలను ఇస్తుంది. ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం బహిరంగపరు స్తూ.. ఇంతకన్నా మెరుగ్గా ఎవరైనా చేస్తారా? అంటూ ఇతర కంపెనీలను ఆహ్వానిస్తుంది. ఒకవేళ సింగపూర్ కంపెనీ ప్రతిపాదించిన దాని కన్నా ఓ రూ.100 కోట్ల తక్కువకు కోర్ రాజ ధాని నిర్మాణం చేపడతామని ఏదైనా సంస్థ ముందుకొచ్చిన పక్షంలో.. ‘మరో సంస్థ ప్రతి పాదనలు తక్కువగా ఉన్నాయి.. ఆ మేరకు మీ రు చేయగలుగుతారా?’ అని మళ్లీ సింగపూర్ కంపెనీనే అడుగుతారు. సింగపూర్ కంపెనీ కనుక మరో సంస్థ చెప్పిన ధరలకు చేస్తానంటే సింగపూర్ కంపెనీకే బాధ్యతలను అప్పగిస్తారు. స్విస్ చాలెంజ్ విధానంలో భాగంగా.. సొంత డబ్బులతో రాజధానిని నిర్మించే సంస్థ తాను పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకోవడానికి టోల్, ఫీజులు, చార్జీలను వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. దీంతో పాటు సింగపూర్ కంపెనీలకు ప్రభుత్వం నూతన రాజధానిలో కొంత భూమిని కూడా ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే నిబంధనల మేరకు మాస్టర్ ప్రణాళిక రూపొందించిన కంపెనీలను స్విస్ చాలెంజ్ విధానానికి అనుమతించకూడదు. రాష్ట్ర ప్రభుత్వం, సింగపూర్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంయుక్తంగా మాస్టర్ ప్రణాళికను రూపొందిస్తున్న విషయం విదితమే. విదేశీ కంపెనీలైతే రెండంకెల వృద్ధి ఎలా సాధ్యం? ఏటా రాష్ర్టంలో రెండంకెల వృద్ధి సాధించాలని చెబుతున్న చంద్రబాబు.. మరోవైపు నూతన రాజధాని నిర్మాణ బాధ్యతలన్నీ విదేశీ కంపెనీలకు అప్పగించేందుకు ప్రయత్నించడంపై అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తం చేస్తోంది. ఇక్కడి సంస్థలే నూతన రాజధానికి సంబంధించిన మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణాలను చేపడితే.. సిమెంట్, స్టీలు, డీజిల్, లేబర్ వినియోగం పెరుగుతుంది. ఆ డబ్బులన్నీ ఇక్కడే చలామణీ అవుతాయి. మళ్లీ మార్కెట్లోకి వస్తాయి. ఆర్థిక పరిమాణం పెరుగుతుంది. అప్పుడే రెండంకెల వృద్ధి సాధ్యమవుతుందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఒక్క శాతం వృద్ధి సాధించాలంటే ఏటా 5 వేల కోట్లు ఆస్తుల కల్పనకు వెచ్చించాల్సి ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఏటా ఇంత మొత్తంలో వ్యయం చేస్తూ పోతే రెండంకెల వృద్ధి ఎలాసాధ్యమవుతుందని పేర్కొంటున్నాయి.