breaking news
Medical Colleges Privatization
-
‘ చంద్రబాబు ప్రభుత్వంలో విద్య, వైద్యం పూర్తిగా నాశనం’
తాడేపల్లి : ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఇది నిజంగా కూటమి ప్రభుత్వం సిగ్గు పడాల్సిన అంశమని మండిపడ్డారు. ఈరోజు(గురువారం, సెప్టెంబర్ 25వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్.. ‘చంద్రబాబు ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలు పూర్తిగా నాశనం అయ్యాయి. ఆ రెండు రంగాలనూ తమ గుప్పెట్లో పెట్టుకుని పేదలను పీల్చి పిప్పి చేస్తున్నారు. గిరిజనులకు మెరుగైన వైద్యం కోసం జగన్ పాడేరులో మెడికల్ కాలేజీ పెట్టారు. అలాంటి కాలేజీని కూడా అడవి బిడ్డలకు దూరం చేస్తున్నారు. అదేమని అడిగితే చట్టసభలోనే లోకేష్ పీకుడు భాష మాట్లాడుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి మెడికల్ కాలేజీలు వెళ్లిపోతే పేద, మధ్య తరగతి ప్రజలు బతికేది ఎలా?, జగన్ సీఎం అయ్యాక మెడికల్ కాలేజీలను మళ్ళీ ప్రభుత్వపరం చేస్తాం. మంత్రి సత్యకుమార్ అసత్యాలు మాట్లాడుతున్నారు. ఆయన రాష్ట్ర మంత్రిగా కాకుండా బీజేపీ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. లోకేష్ నోరు తెరిస్తే పీకుడు భాష తప్ప మరేమీ మాట్లాడటం లేదు. బూతు మాటలు మానేసి మంచి మాటలు నేర్చుకుంటే మంచిది. చంద్రబాబు తనవారికి మెడికల్ కాలేజీలను దోచి పెడుతున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలు సహించే పరిస్థితి లేదు’ అని స్పష్టం చేశారు. -
YSRCP పాలనలో ఇలాంటి పరిస్థితులు లేవు: వైఎస్ జగన్
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చర్చపై పట్టు వీడని YSRCP..
-
మోదీని మరోసారి అవమానించిన బాబు.. మీ శిష్యుడిని చూసి బుద్ధి తెచ్చుకో
-
మీరు చెప్పినట్టు ముగ్గురు పిల్లల్ని కనాలంటే ఆరోగ్యం కావాలి కదా బాబు.. యువ డాక్టర్ సెటైర్లు
-
మెడికల్ కాలేజీల విషయంలో పాపం మూట కట్టుకుంటున్న బాబు సర్కార్
సాక్షి, వెలగపూడి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యమ సంఘాలు, ప్రజలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. మరోవైపు.. రాజకీయంగానూ వైఎస్సార్సీపీ తమ ఆందోళనలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో.. చట్ట సభలో ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనని పట్టుబడుతోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయంపై అసెంబ్లీలో చర్చకు వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. అయితే ప్రభుత్వం ఈ అంశంపై ఇంతకు ముందు షార్ట్ డిస్కషన్కు ఒప్పుకుంది. ఈ క్రమంలో ఇవాళ శాసన మండలిలో ఎలాగైనా చర్చ జరిగేలా చూడాలని వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోంది. తక్షణమే ఈ అంశంపై చర్చించాలని సోమవారం మండలి చైర్మన్కు వాయిదా తీర్మానం అందజేసింది కూడా. అయితే.. ఈ వాయిదా తీర్మాన్ని చైర్మన్ తిరస్కరించడంతో.. ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. నల్ల కండువాలతో మండలిపై శాసనమండలికి హాజరైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ‘‘ఈరోజు చర్చ జరుపుతాం అన్నారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు పాటించరు?. ఇది ప్రజలకు సంబంధించిన సమస్య. ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం. ఈ అంశంపై చర్చించాల్సిన అవసరం ఉంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు కావాల్సిందే’’ అని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. తక్షణం చర్చ జరగాలి అంటూ మండలి చైర్మన్ పోడియం చుట్టూ చేరి వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. వైఎస్సార్సీపీ పట్టు వీడకపోవడంతో ఆందోళన నడుమ.. చైర్మన్ మండలిని కాసేపు వాయిదా వేశారు.మండలి బయట ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం పాపం మూట కట్టుకుంటోంది. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణను ఆపాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నా చంద్రబాబుకు చెవికి ఎక్కటం లేదు. ప్రజల నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేస్తే ఆ ప్రభుత్వాలనే జనం కూల్చేసిన సంఘటనలు ఉన్నాయి. తమ తాబేదార్లకి మెడికల్ కాలేజీలను దోచి పెడుతున్నారు. రాష్ట్ర ప్రజలు దీనిపై తిరుగుబాటు చేయబోతున్నారు. వైద్యం అందుబాటులో లేక జనం ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వానికి కనపడటం లేదా?. 17 కాలేజీలను ప్రభుత్వ పరంలోనే నడపాలి అని డిమాండ్ చేశారు.అంతకు ముందు.. సోమవారం ఉదయం శాసనమండలి ప్రారంభానికి ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు.. నల్లకండువాలతో, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ ఫ్లకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తూ అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. ఆ సమయంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ముందుకు సాగారు. ‘‘కూటమి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఆలోచిస్తోంది. ప్రజారోగ్యాన్ని చంద్రబాబు రోడ్డుపాలు చేస్తున్నారు. ప్రజల కోసం ఎందాకైనా పోరాటం చేస్తాం’’ అని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా అన్నారు. -
టీడీపీ నేతలు ప్రశ్న... దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన వడ్డే శోభనాద్రీశ్వరరావు
-
చంద్రబాబూ.. ఆ అధికారం నీకు ఎక్కడిది?: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ భూములను కోటీశ్వరులకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. పీపీపీ విధానం అంటూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గం. ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేసే అధికారం.. చంద్రబాబుకు ఎక్కడిది?. మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ కట్టించడం హర్షించదగినది అని ప్రశంసలు కురిపించారు.మాజీ మంత్రి వడ్డే శోభానాద్రీశ్వరరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తయిన మెడికల్ కళాశాల్లో పీపీపీ విధానం తీసుకురావడం సరైన విధానం కాదు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గం. వైద్య, విద్యా రంగాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?. వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేస్తే ప్రైవేటు వాళ్లకే లబ్ది జరుగుతుంది. 1972 నుండి నేను రాజకీయాల్లో ఉన్నాను. చంద్రబాబు.. కోటేశ్వరులకు ప్రభుత్వ భూములు కట్టబెడుతున్నారు. కోట్ల విలువ చేసే భూములను 95 పైసలకు చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నాడు.P4 విధానాన్ని చంద్రబాబు విరమించుకోవాలి. 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నడపాలి. UHI మెడికల్ కాలేజీ విశాఖపట్నంలో పెట్టాలి. అమరావతిలో పెట్టేందుకు వీల్లేదు. టూరిజం పాలసీ ప్రకారం లులు కంపెనీలకు చంద్రబాబు కట్టబెడుతున్నాడు. లులు మీద ప్రేమతో ఆర్టీసీ స్ధలాన్ని 99 సంవత్సరాలకు ప్రైవేటు పరం చేశాడు. చంద్రబాబుకు ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేసే అధికారం ఎక్కడుంది?. విజయవాడలో లులు కంపెనీకి ప్రైవేట్ పరం చేసిన దానిపై సుప్రీంకోర్టులో ఫిల్ వేశాను.చంద్రబాబుకు సానుకూలమైన పత్రికలోనే మట్టి దందా వార్తలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇబ్రహీంపట్నం బూడిద కంపెనీలో వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. గతంలో నీరు చెట్టు-కార్యక్రమంలో ఉన్న బాకీలు నేటి కూడా చంద్రబాబు చెల్లించలేదు. మంత్రి నారాయణ కళాశాలల్లో 10 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వండి. అప్పుడు పీఫోర్ విధానం అమలు చేయండి. గతంలో 75 ఏళ్లలో 2365 మెడికల్ సీట్లు ఉండేవి. వైఎస్ జగన్ తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలు వల్ల 2550 మెడికల్ సీట్లు వస్తాయి’ అని తెలిపారు. -
ప్రజల కోసం పోరాటం.. ఎన్ని రోజులైనా జైల్లో పెట్టండి: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నాం.. నెలకాకపోతే రెండు నెలల జైల్లో పెట్టండి అని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ మేం శాంతియుతంగా నిరసనకు పిలుపునిచ్చాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 400 మందిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. జిల్లా ఎస్పీ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని తాము తప్పుబట్టడం లేదన్నారు.వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘360 రోజులు సెక్షన్ 30 పెట్టడం అనేది ధర్మమేనా?. ఈ విషయాన్ని రాష్ట్ర హోం మంత్రి, డీజీపీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను నడపలేదని 2014-19 మధ్యలోనే చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019లో వైఎస్ జగన్ వచ్చిన తర్వాత వైద్యానికి పెద్దపీట వేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆలోచన చేశారు. పేద పిల్లలు మెరుగైన వైద్య విద్యను అభ్యసించాలని ఆలోచన చేశారు. 17 కొత్త మెడికల్ కాలేజీలను తెచ్చారు. ఇందులో భాగంగా ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేశారు.మాట తప్పిన లోకేష్ నాయుడు..కాలేజీల నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఒక 50 సీట్లకు పేమెంట్ కోట కింద పెట్టారు. వైఎస్ జగన్ ఆలోచనతో ప్రభుత్వం నుంచి డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. అధికారంలోకి రాగానే 150 సీట్లు 15 వేలకే అందిస్తామని లోకేష్ నాయుడు చెప్పాడు. కానీ, అసలు కాలేజీలనే నడపలేనని ప్రైవేటు వాళ్లకు అప్పగించేస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మేం శాంతియుతంగా నిరసనకు పిలుపునిచ్చాం. నిరసనకు పర్మిషన్ అడిగాం ఇవ్వనన్నారు. మెడికల్ కాలేజీ వద్దకు వెళ్తే లోపలేస్తామన్నారు. ప్రజల తరపున ప్రతిపక్షంగా పోరాడటం మా బాధ్యత. అందుకే ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం చేపట్టాం.జనసేన, టీడీపీ సంగతేంటి?రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 400 మందిపై కేసులు పెట్టారు. 10 సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్ల కింద కేసు పెట్టారని చెబుతున్నారు. ప్రజల కోసం మేము పోరాడుతున్నాం.. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి. మంత్రి కొల్లు రవీంద్ర, చంద్రబాబుకు నచ్చింది చేసుకోనివ్వండి. హత్యలు చేసి దొరికిపోయిన వాళ్లే నామోషిగా ఫీలవ్వడం లేదు. ఇలాంటి కేసులకు మేమెందుకు బాధపడాలి. ప్రజల కోసం పోరాడాం.. నెలకాకపోతే రెండు నెలలు జైల్లో పెట్టండి. జిల్లా ఎస్పీ మాపై కేసులు పెట్టడాన్ని మేము తప్పు పట్టడం లేదు. ఎస్పీ చర్యలను స్వాగతిస్తున్నాం. కృష్ణాజిల్లాలో జనసేన, టీడీపీ నేతల అరాచకాలపై ఇలాగే కొరడా ఝుళిపించాలని కోరుకుంటున్నాం.ఎస్పీకి సూచన..గత ఎస్పీ కారణంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు రాజకీయ వ్యవస్థకు తలొగ్గారు. ఏకపక్షంగా వ్యవహరించడానికి అలవాటైపోయారు. గాడి తప్పిన పోలీసులను గాడిలో పెట్టండి. పాత అలవాట్లను వదిలించండి. స్టేషన్ ఆఫీసర్లు పేకాటను నడిపిస్తున్నారు. మర్డర్లు చేసే వారికి కొమ్ము కాస్తున్నారు. మరో స్టేషన్ ఆఫీసర్ పెద్ద ఎత్తున డీజిల్ మాఫియా నడిపిస్తున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర కనుసన్నల్లో ఆయన నడుచుకుంటారు. మంత్రి గారి అనుచరులు తప్ప మరొకరు డీజిల్ అమ్మితే ఆయన ఊరుకోరు. నెలకు పది నుంచి 12 లారీల డీజిల్ అమ్ముకుంటున్నారు. పోర్టు దగ్గర్లో భూమిలో రెండు ట్యాంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులకు తెలిసే ఇంతలా బరితెగించారు. బందరు వాళ్లను కాకుండా బయట నుంచి ఆఫీసర్లను పంపించండి మీకే తెలుస్తుంది. మీ చుట్టూ గాడి చెప్పిన వ్యవస్థను సరిదిద్దండి. తప్పు చేసిన వాడు ఏ పార్టీ అయినా శిక్షించండి’ అని డిమాండ్ చేశారు. -
ప్రైవేటీకరణపై ప్రజా యుద్ధం.. బాబుకు YS జగన్ వార్నింగ్
-
ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జనాగ్రహం... చంద్రబాబు కూటమి సర్కార్ నిర్ణయంపై వెల్లువెత్తిన నిరసన
-
మెడికల్ కాలేజీలపై ‘మండలి’లో ఆందోళన
సాక్షి, అమరావతి: పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను చంద్రబాబు ప్రభుత్వం వెంటనే రద్దుచేయాలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శుక్రవారం శాసనమండలి సమావేశంలో పట్టుబట్టారు. సమావేశాలు జరుగుతున్నంతసేపూ వారు పోడియం ముందే నిలబడి పెద్దఎత్తున నినాదాలు, ఆందోళన చేశారు. దీంతో శుక్రవారం గంటపాటు కూడా సభ జరగలేదు. వీరి ఆందోళనల మధ్యే ‘మండలి’ చైర్మన్ మోషేన్రాజు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు యత్నించారు. మధ్యలో రెండుసార్లు సభను తాత్కాలికంగా వాయిదా వేసి గందరగోళ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయినా, పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. వాయిదా తీర్మానం, తిరస్కరణ..అంతకుముందు.. ఉదయం సభ ప్రారంభం కాగానే ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ–పీపీపీ విధానం’ గురించి చర్చించేందుకు వైఎస్సార్సీపీ సభ్యులు మొండితోక అరుణ్కుమార్, సిపాయి సుబ్రమణ్యం, కుంభా రవిబాబు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినట్లు చైర్మన్ మోషేన్రాజు ప్రకటించారు.ఇందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం తెలుపుతూ, ఈ అంశంపై సభలో చర్చ చేపట్టాలంటూ పోడియం వద్దకు చేరుకుని ‘ప్రజారోగ్యం ప్రైవేటీకరణా.. పేదలు చదువుకునే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సిగ్గుసిగ్గు’.. వంటి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు ఉపక్రమించారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య విద్యా శాఖకు సంబంధించిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ బదులిచ్చారు. బీఏసీలో చర్చించి ఈ అంశంపై నిర్ణయం తీసుకుందాం.. అప్పటివరకు సభ్యులు సహకరించాలని చైర్మన్ సూచించినప్పటికీ సభ్యులు శాంతించలేదు. దీంతో, ఆయన సభను కొద్దిసేపు వాయిదా వేశారు.మళ్లీ అదే సీన్..అనంతరం.. ఉ.10.44కు సభ తిరిగి ప్రారంభమయ్యాక మండలి చైర్మన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తిరిగి పోడియం వద్దకు చేరుకుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు కొనసాగించారు. ఇంతలో మరో రెండు ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో చైర్మన్ మోషేన్రాజు 11 గంటలకు మళ్లీ వాయిదా వేశారు. మండలి బీఏసీ సమావేశానంతరం సభ తిరిగి కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.టీడీపీ వర్సెస్ వైఎస్సార్సీపీ..సభ తిరిగి మ.12.38కు ప్రారంభం కాగానే వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పోడియం వద్ద మళ్లీ తమ ఆందోళన కొనసాగించారు. మెడికల్ కాలేజీ అంశంపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం బీఏసీ సమావేశంలో అంగీకరించిందని.. సభ్యులు తమ సీట్లలోకి వెళ్లి కూర్చోవాలంటూ విజ్ఞప్తి చేసినా వారు అక్కడే ఉండిపోయారు. దీంతో ప్రశ్నోత్తరాల అజెండాల్లో ఉన్న అన్ని ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు ఉంచాలంటూ చెప్పి ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసినట్లు చైర్మన్ ప్రకటించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నోత్తరాలు కొనసాగించాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ పోడియం వద్దకు చేరుకోవడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. కొద్దిసేపటికి టీడీపీ సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లగా, వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన కొనసాగిస్తూ పోడియం ముందే ఉండిపోయారు. ఈ సమయంలో జీఎస్టీపై ప్రభుత్వ ప్రకటన చేసేందుకు మంత్రి పయ్యావుల కేశవ్ యత్నించగా.. సభలో పరిస్థితులు చూసి సోమవారం ప్రకటన చేస్తానంటూ చెప్పారు. దీంతో.. మ.ఒంటిగంట ప్రాంతంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. -
మెడికల్ కాలేజీలను అమ్మేస్తుంటే ప్రశ్నించకూడదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా? అంటూ చంద్రబాబు సర్కార్పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘ఛలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేయటంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రజల తరఫున నిరసన తెలిపే రాజ్యాంగ పరమైన హక్కులను కాలరాస్తారా? అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.‘‘చంద్రబాబూ.. ప్రజారోగ్య రంగాన్ని, పేదల ఆరోగ్య భద్రతను కాపాడుకునేందుకు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ప్రజల తరఫున, వారి గొంతును గట్టిగా వినిపిస్తూ, వారితో కలిసి వైఎస్సార్సీపీ యూత్, స్టూడెంట్ విభాగాల నేతృత్వంలో చేపట్టిన శాంతియుత ఆందోళనలు, ర్యాలీలను ఎందుకు పాశవికంగా అడ్డుకోవాలనుకున్నారు? లాఠీచార్జ్లు ఎందుకు చేశారు? గృహనిర్బంధాలు, అరెస్టులు ఎందుకు చేశారు?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘మీరు స్కాములు చేస్తూ తరతరాల ప్రజల ఆస్తులైన గవర్నమెంటు మెడికల్ కాలేజీలను మీ అనుయాయులకు అమ్మేస్తుంటే వాటిని ప్రశ్నించకూడదా? ప్రజల తరఫున గొంతెత్తితే అణచివేస్తారా? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇటు అసెంబ్లీ వెలుపలకూడా మా పార్టీ ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతుంటే పోలీసులచేత దౌర్జన్యం చేయించడం మీ బరితెగింపు కాదా? ఇది కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులకు దిగుతారా? ఏమిటీ రాక్షసత్వం...మీరింతగా తెగబడినా ప్రజాప్రయోజనాల పరిరక్షణ కోసం మా పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు, వీరితో పాటు యువతీయువకులు, స్టూడెంట్లు తెగింపు చూపారు. ప్రజల పక్షాన నిలిచి అటు శాసన మండలిలోనూ, ఇటు మెడికల్ కాలేజీల ఆవరణలోనూ విజయవంతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. పేదల ఆరోగ్య భద్రత, పేద విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ కోసం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ పోరాటాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతాయి’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు..@ncbn గారూ.. ప్రజారోగ్య రంగాన్ని, పేదల ఆరోగ్య భద్రతను కాపాడుకునేందుకు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ప్రజల తరఫున, వారి గొంతును గట్టిగా వినిపిస్తూ, వారితో కలిసి వైయస్సార్సీపీ యూత్, స్టూడెంట్ విభాగాల నేతృత్వంలో చేపట్టిన శాంతియుత ఆందోళనలు, ర్యాలీలను ఎందుకు… pic.twitter.com/EkqzMcG9cW— YS Jagan Mohan Reddy (@ysjagan) September 19, 2025 -
'ఛలో మెడికల్ కాలేజ్' విజయవంతం: విడదల రజిని
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు నిర్వహించిన ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం విజయవంతం అయిందని మాజీ మంత్రి విడదల రజని అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ ఇచ్చిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం స్పందించకుంటే దిగొచ్చేదాకా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని రజని హెచ్చరించారు. పోలీసులను ప్రయోగించి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా పార్టీ శ్రేణులు, విద్యార్థులు, యువత, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారని వివరించారు. మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదని కూటమి నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఆయా మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి ఫొటోలు, వీడియోలు ప్రదర్శించారని ఆమె మీడియాకు వివరించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిధుల కొరత లేదువైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఛలో మెడికల్ కాలేజీల కార్యక్రమం విజయవంతమైంది. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రూ.8,500 కోట్ల వ్యయంతో వైఎస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి 5 కాలేజీలను పూర్తి చేశారు. వాటిల్లో అడ్మిషన్లు పూర్తయ్యి క్లాసులు జరుగుతున్నాయి. ఎన్నికల నాటికి పూర్తయిన పాడేరు మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రారంభించింది.వైఎస్ జగన్ మీద కక్షతో పులివెందుల మెడికల్ కాలేజీని మాత్రం ప్రారంభించకుండా ఎన్ఎంసీ సీట్లు కేటాయించినా వద్దని లేఖరాసిన నీచుడు చంద్రబాబు. వీటితో పాటు రెండో దశలో ప్రారంభంకావాల్సిన మరో 3 మెడికల్ కాలేజీలు 90 శాతం పనులు పూర్తయినా, కూటమి ప్రభుత్వం వచ్చాక 15 నెలలుగా పెండింగ్ పనులను పూర్తి చేయకుండా పక్కనపెట్టేశారు. మూడో దశలో పూర్తి చేయాల్సిన కాలేజీలు సైతం పిల్లర్ల దశలో ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి కూడా పనులన్నీ ప్రణాళిక ప్రకారం శరవేగంగా జరుగుతుండేవి. మెడికల్ కాలేజీలు పూర్తయితే వైఎస్ జగన్కి మంచి పేరు వస్తోందన్న కుట్రతో ప్రారంభించకుండా సేఫ్ క్లోజర్ పేరుతో మూసేసిన నీచ చరిత్ర చంద్రబాబుది.పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలని కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. కాలేజీల నిర్మాణం నిధుల కొరత కారణంగా ఆగిపోకూడదన్న ఉద్దేశంతో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, నాబార్డు నిధులు వచ్చేలా టైఅప్ చేసుకున్నారు. పేదల వైద్యం ప్రభుత్వ బాధ్యతగా భావించి వైయస్ జగన్ అంత గొప్పగా ఆలోచించి ముందుచూపుతో వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు వాటిని పీపీపీ పేరుతో పప్పు బెల్లాలకు తన వారికి కట్టబెట్టేందుకు సిద్దమయ్యారు.10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు, ప్రభుత్వ ఆస్తులను దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ప్రజారోగ్యం గురించి ఆలోచించకుండా, మెడిసిన్ చదివి డాక్టర్ కావాలని కలలు కంటున్న పేద విద్యార్థుల ఆశలను చిదిమేస్తూ దోపిడీయే ధ్యేయంగా సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నాడు.పోలీసుల వేధింపులకు లెక్క చేయకుండా వచ్చారుప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. వైఎస్సార్సీపీ వాదనకు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలపై సమాధానం చెప్పుకోలేని కూటమి ప్రభుత్వం, కాలేజీల నిర్మాణమే జరగలేదని విష ప్రచారం మొదలు పెట్టింది. కాలేజీల నిర్మాణం పూర్తయి క్లాసులు జరుగుతున్నప్పటికీ పిల్లర్ల దశలో ఉన్న భవనాల పొటోలు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రకు తెరలేపారు. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని విద్యార్థులు, యువజన విభాగాల ఆధ్వర్యంలో `ఛలో మెడికల్ కాలేజీ`ల కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నిర్వహించింది. కేసులు పెడతామని బెదిరించినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా 17 కొత్త మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి కాలేజీ నిర్మాణాల పరిస్థితిని ప్రజలకు వివరించాం. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి కూడా విశేషమైన స్పందన లభించింది. ఏ కాలేజీ ఏయే స్థితిలో ఉందో మా కార్యకర్తలు నేరుగా ఆయా భవనాల వద్దకు వెళ్లి వీడియోలు, ఫొటోల ద్వారా వివరించడం జరిగింది.హౌస్ అరెస్టులు, అక్రమ కేసులతో అడ్డుకోవాలని ఎంత ప్రయత్నించినా అడ్డంకులన్నీ దాటుకుని వైయస్సార్సీపీ నాయకులతో పాటు విద్యార్థులు, సామాన్య ప్రజలు ఈ ఆందోళన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపైనే చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై యవతలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. సోషల్ మీడియాలో సైతం స్వచ్ఛందంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని వైయస్సార్సీపీ చేస్తున్న ఆందోళనలకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రైవేటీకరణ జీవోను వెనక్కి తీసుకోవాలివైఎస్సార్సీపీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారనే భయంతో ఎక్కడికక్కడ నాయకులను హౌస్ అరెస్టులు చేసినా, అరెస్టులు, కేసుల పేరుతో భయపెట్టినా వైఎస్సార్సీపీ శ్రేణులు వెనకడుగు వేయలేదు. పల్నాడు జిల్లా పరిధిలో నిరసన కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకుని తీరాలన్న లక్ష్యంతో ప్రత్యేక దృష్టి పెట్టారు. నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా నన్ను హౌస్ అరెస్టు చేశారు.మా నాయకులు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డిని పక్క రాష్ట్రం మిర్యాలగూడలో అడ్డుకుని కార్యక్రమంలో పాల్గొనకుండా చూశారు. పోలీసులను ప్రయోగించి అక్కడక్కడా వైయస్సార్సీపీ నాయకులను అడ్డుకుని ఉండొచ్చేమో కానీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా వైఎస్సార్సీపీ పోరాటం ఆపడం జరగదని స్పష్టంగా చెబుతున్నాము. ఎంత ఆపుదామని ప్రయత్నిస్తే అంతగా రెట్టింపు ఉత్సాహంతో వైయస్సార్సీపీ పోరాడుతుంది. ప్రైవేటీకరణ పేరుతో ఇచ్చిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం మేల్కొనేదాకా మా పోరాటం ఆగదు. -
Kurnool: విద్య, వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం పట్ల ఆగ్రహం
-
Vidadala: కూటమి ప్రభుత్వం వల్ల సర్కార్ వైద్యం ప్రజలకు దూరమవుతుంది
-
Perni Nani: పీపీపీ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మెడికల్ కాలేజీలు
-
ప్రభుత్వం దిగి వచ్చేవరకు ఆందోళనలు ఆగవని YSRCP హెచ్చరిక
-
రూ.6 వేల కోట్లు ఇవ్వడానికి చేతులు పడిపోయినాయా బాబూ..
-
ఎవరి సొమ్ము.. ఎవరి సొత్తు.. బాబును రఫ్ఫాడించిన పేర్ని కిట్టు
-
భయపడ్డ చంద్రబాబు.. ఇంత మంది పోలీసులా..
-
KSR Live Show: ప్రభుత్వ మెడికల్ కాలేజీల చరిత్రలో చీకటి రోజు
-
మెడికల్ కాలేజీలు పేదల కోసం.. బినామీలకు ఇస్తానంటే ఊరుకోము
-
Watch Live: ఛలో మెడికల్ కాలేజ్
-
17 మెడికల్ కాలేజీల వద్ద నేడు YSRCP పోరుబాట
-
YSRCP: పోలీసుల అడ్డంకులు దాటుకుని ఛలో మెడికల్ కాలేజీ
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న చంద్రబాబు సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఇవాళ ఆందోళన కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. ఛలో మెడికల్ కాలేజీ పేరిట.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల ఎదుట ధర్నా నిర్వహించబోంది. అయితే ఈ ధర్నాను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ నేతలపైకి కూటమి ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తోంది.చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదువైఎస్ జగన్కి మంచి పేరు వస్తుందని ప్రైవేట్కు అప్పగించాలని నిర్ణయించడం దారుణంప్రైవేటైజేషన్ విధానాన్ని తీవ్రంగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు వ్యతిరేకించాయిప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తయితే జగన్కు మంచి పేరు వస్తుందని తట్టుకోలేకపోతున్నారుకూటమి నేతలు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా?చంద్రబాబు మంత్రులు నాతో వస్తే మెడికల్ కాలేజీ పరిస్థితి ఏంటో చూపిస్తావిజనరీ నాయకుడు అని చెప్పుకునే చంద్రబాబు 5వేల కోట్లు మెడికల్ కాలేజీలకు ఇవ్వలేరా?చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో చరిత్ర హీనుడిగా మిగిలిపోతున్నాడుఅనిత ఇంఛార్జ్గా ఉన్న విజయనగరం, పాడేరు, నర్సీపట్నం కాలేజీలు నాతో అనిత వస్తే చూపిస్తాను15నెలల్లో మెడికల్ కాలేజీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదుమంత్రి సవిత మెడికల్ కాలేజేల వద్ద కామెడి స్కిట్స్ చేస్తున్నారుబీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి రూ. 50 కోట్లు కూడా విడుదల చేయించుకోలేకపోయారు.చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం మెడికల్ కాలేజీల్ని ప్రైవేటుపరం చేస్తుంది.- వరదు కళ్యాణి పార్వతీపురం మన్యం జిల్లారాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గ చర్యఆరోగ్య శ్రీ తొలగిస్తామంటే పేదలకు అందని ద్రాక్షాలా వైద్యం వైఎస్ జగన్ ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు:మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర కామెంట్స్పల్నాడు జిల్లా:ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు నుంచి పిడుగురాళ్ల వస్తున్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని మిర్యాలగూడలో అరెస్ట్ చేసిన ఆంధ్ర పోలీసులుపక్క రాష్ట్రానికి వచ్చి మరి పోలీసులు అక్రమ అరెస్టు చేస్తున్నారుఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కట్టిన మెడికల్ కాలేజీలను అమ్మేసుకుంటున్నాడుచంద్రబాబు అనుచరులకు చెంచా గాళ్ళకు మెడికల్ కాలేజీలు కట్ట పెట్టాలని చూస్తున్నారుమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభుత్వం వెనక్కి తీసుకునే అంతవరకు మా పోరాటం ఆగదుప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయ పోరాటం చేస్తాం-కాసు మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బాపట్లచంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న వైఎస్సార్సీపీవైఎస్సార్సీపీ విద్యార్థి,యువజన విభాగం ఆధ్వర్యంలో ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంకార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల జిల్లా అధ్యక్షుడు మెరుగు నాగార్జున, అద్దంకి సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్, పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదే మధుసూదన్ రెడ్డి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు.పార్వతీపురం మన్యం జిల్లాప్రజలకు సంబంధించిన ఆస్తి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి. దీనిని ప్రైవేట్ చేస్తుంటే చూస్తూ ఊరుకోం.ఎస్టీ లకు సంబంధించిన జిల్లాలో కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ ఆస్పత్రిని కబ్జా చేసి ప్రైవేట్కు అప్పగిస్తున్నారు.గిరిజన విద్యను ప్రైవేట్ చేయడంని గిరిజన మంత్రి స్పందించరా.కొండపల్లి శ్రీనివాస్ ఎలా మంత్రివి అయ్యావుజగన్ తీసుకొచ్చిన కాలేజీలను కేంద్రం తెచ్చింది అని అబద్ధాలు చెప్తావు.స్టేట్ ఫండ్, నాబార్డ్ ఫండ్ గురుంచి తెలియకుండా ఎలా మాట్లాడుతారు.మంత్రి పదవులు కాపాడుకోవడానికి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు.చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముడు పోయారు.ప్రైవేటీకరణ జిఓలను ఉపసంహరించుకోవాలి.లేదంటే మరింత పోరాటం చేస్తాం -మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు ప్రకాశంచంద్రబాబుకి పేదలంటే అసహ్యంఅందుకే వైద్యం విద్య దూరం చేస్తున్నాడుమార్కాపురం కాలేజీ పూర్తి కాలేదు అంటున్న. కూటమి నాయకులు కళ్లు తెరుచుకొని చూడాలిఅమరావతి మీద ఉన్న శ్రద్ద మెడికల్ కాలేజీల మీదలేదుఅమరావతి కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుందిమెడికల్ కాలేజీ అందరికీ ఉపయోగపడుతుంది - మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కామెంట్స్కూటమి నేతలు కళ్లున్న కబోదిల్లా వ్యవహరిస్తున్నారుమార్కాపురం మెడికల్ కాలేజీ పూర్తి అయినా కాలేదో తెలుస్తుందిపదహారు సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం నేతలకు వెనకబడిన ప్రాంతం కనపడలేదుపేదవాళ్ల ఉసురు చంద్రబాబుకి తప్పదుకూటమి నేతలు కృరమృగాలులా ప్రవర్తిస్తున్నారు..ఎవడబ్బ సొత్తు అని ప్రయివేటు పరం చేస్తావ్ఒక్కొక్క మెడికల్ కాలేజీకి మూడువందల కోట్లు ఖర్చుపెట్టలేని మీరు మీ విలాసాలకు మూడు హెలికాప్టర్స్ కావాలా?దోచుకోవడమే పనిగా పెట్టుకొని అన్నీ ప్రయివేటు పరం చేస్తున్నాడుఇంజన్ లేని ప్రభుత్వాన్ని నడుపుతూ మట్టి నుండి ఆకాశం వరకూ దోచుకుంటున్నారు-యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ నంద్యాల జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణకు నిరసనగా ఛలో మెడికల్ కాలేజీకి పిలుపునిచ్చిన వైఎస్సార్సీపీఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి అడుగడుగున ఆంక్షలు విధించిన పోలీసులు30 పోలిస్ యాక్ట్ అమలులో ఉందంటూ వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులుప్రైవేటీకరణ దారుణమంటూ ఆందోళనకు వచ్చిన వారిని బలవంతంగా పోలీసుల జీపుల్లో , లారీల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలింపుమెడికల్ కళాశాలలే కట్టలేదు అని చెప్పే కూటమి ప్రభుత్వానికి ఎందుకు అంత భయంఅరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరంటూ హెచ్చరించిన వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగంవైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్,సర్పంచ్ సుజిత్తో పాటు, మహిళలను, విద్యార్థులను,వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులుమడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిపార్వతీపురం మన్యం జిల్లా:రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గ చర్యఆరోగ్య శ్రీ తొలగిస్తామంటే పేదలకు అందని ద్రాక్షాలా వైద్యం వైఎస్ జగన్ ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు:మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర పల్నాడు జిల్లా:ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు నుంచి పిడుగురాళ్ల వస్తున్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని మిర్యాలగూడలో అరెస్ట్ చేసిన ఆంధ్ర పోలీసులుపక్క రాష్ట్రానికి వచ్చి మరి పోలీసులు అక్రమ అరెస్టు చేస్తున్నారుఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కట్టిన మెడికల్ కాలేజీలను అమ్మేసుకుంటున్నాడుచంద్రబాబు అనుచరులకు చెంచా గాళ్ళకు మెడికల్ కాలేజీలు కట్ట పెట్టాలని చూస్తున్నారుమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభుత్వం వెనక్కి తీసుకునే అంతవరకు మా పోరాటం ఆగదుప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయ పోరాటం చేస్తాం-కాసు మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బాపట్ల:చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న వైఎస్సార్సీపీవైఎస్సార్సీపీ విద్యార్థి,యువజన విభాగం ఆధ్వర్యంలో ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంకార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల జిల్లా అధ్యక్షుడు మెరుగు నాగార్జున, అద్దంకి సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్, పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదే మధుసూదన్ రెడ్డి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు.పార్వతీపురం మన్యం జిల్లాప్రజలకు సంబంధించిన ఆస్తి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి. దీనిని ప్రైవేట్ చేస్తుంటే చూస్తూ ఊరుకోం.ఎస్టీ లకు సంబంధించిన జిల్లాలో కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ ఆస్పత్రిని కబ్జా చేసి ప్రైవేట్కు అప్పగిస్తున్నారు.గిరిజన విద్యను ప్రైవేట్ చేయడంని గిరిజన మంత్రి స్పందించరా.కొండపల్లి శ్రీనివాస్ ఎలా మంత్రివి అయ్యావుజగన్ తీసుకొచ్చిన కాలేజీలను కేంద్రం తెచ్చింది అని అబద్ధాలు చెప్తావు.స్టేట్ ఫండ్, నాబార్డ్ ఫండ్ గురుంచి తెలియకుండా ఎలా మాట్లాడుతారు.మంత్రి పదవులు కాపాడుకోవడానికి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు.చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముడు పోయారు.ప్రైవేటీకరణ జిఓలను ఉపసంహరించుకోవాలి.లేదంటే మరింత పోరాటం చేస్తాం-మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు అన్నమయ్యమదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదుట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రవేతీకరణకు నిరసనగా వైఎస్సార్సీపీ ఛలో మెడికల్ కాలేజీకి పిలుపు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి,తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే లు శ్రీకాంత్ రెడ్డి, తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, తిరుపతి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి , మదనపల్లి మున్సిపల్ చైర్మన్ మనోజ రెడ్డి, షమీం అష్లాంఏలూరు జిల్లాకూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి నిరసిస్తూ..వైఎస్సార్సీపీ ఛలో మెడికల్ కాలేజ్ నిరసనకు పిలుపుఏలూరులో వైఎస్సార్సీపీ నేతల నిరసనను అడ్డుకున్న పోలీసులుజిల్లా పార్టీ కార్యాలయం నుండి మెడికల్ కాలేజీకి వెళ్తుండగా నిలిపివేసిన పోలీసులురోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులునిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరావు, పీఏసీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఏలూరు ఇంచార్జ్ జయప్రకాష్, చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు, వైఎస్సార్సీపీ శ్రేణులుశ్రీ సత్యసాయి జిల్లా:పెనుకొండ మెడికల్ కాలేజీ ని పరిశీలించిన మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జక్కంపూడి రాజా, హిందూపురం సమన్వయకర్త దీపిక, కదిరి సమన్వయకర్త మక్బూల్, అనంతపురం జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, మేయర్ మహమ్మద్ వాసీంవైఎస్సార్ జిల్లా:పులివెందుల మెడికల్ కాలేజీ వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగపు నాయకులుఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన విద్యార్థులు మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలని,పీపీపీ పద్ధతిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్పేదలకు వైద్య విద్యా, వైద్యాన్ని దూరం చేసేందుకు పీపీపీ పద్ధతిని ప్రభుత్వం అనుసరిస్తుందిడౌన్ డౌన్ సీఎం వుయ్ వాంట్ జస్టిస్ అనే నినాదాలు చేస్తూ మెడికల్ కాలేజ్ వద్ద నిరసననల్గొండ జిల్లామిర్యాలగూడ వద్ద గురజాల మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులుగుంటూరులో మెడికల్ కాలేజీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యేకర్నూలు జిల్లా...ఆదోని మెడికల్ కాలేజ్ ప్రవేటికరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి,యువజన విభాగం ఆధ్వర్యంలో ఛలో మెడికల్ కాలేజ్ అంటూ నిరసన ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన సంఘం నాయకులుమెడికల్ కాలేజ్ ప్రవేటికరణకు వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తు విద్యార్థులు,వైఎస్సార్సీపీ నాయకులు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్న విద్యార్థులు, విద్యార్ది సంఘాలుప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న విద్యార్దులుఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ బుట్టారేణుకా , మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి,రాష్ట్ర నాయకురాలు ఎస్వీ విజయమనోహరి,విద్యార్ది ,యువజన నాయకులు విశాఖ :జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద aisf ధర్నా..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్..విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి..ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం..మంత్రి లోకేష్ విద్యా రంగంలోని సమస్యలను గాలికి వదిలేసారు..యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..లోకేష్కి చేతనైతే మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ప్రభుత్వ రంగంలో నడపాలి..లేనిపక్షంలో చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చెయ్యాలి.. అనకాపల్లి నర్సీపట్నంనర్సీపట్నం ఛలో మెడికల్ కాలేజీపై పోలీసుల ఆంక్షలునర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శించకుండా భారీ కేడ్లు ఏర్పాటుమెడికల్ కాలేజీకి వస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకుంటున్న వైనంఛలో మెడికల్ కాలేజీకి అనుమతి లేదంటున్న పోలీసులు..పోలీసులు తీరుపై మండిపడుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులు..మచిలీపట్నంలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలుఛలో మెడికల్ కాలేజీ నిరసనకు వెళ్లకుండా వైఎస్సార్సీపీ నేతలు,శ్రేణులపై ఆంక్షలుమచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్లో వైఎస్సార్సీపీ నేతలు దేవినేని అవినాష్ , మొండితోక జగన్మోహన్ రావు , దేవభక్తుని చక్రవర్తి , వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం నేతలను అడ్డుకున్న పోలీసులుతమ వాహనాలను అడ్డుకోవడంతో వాహనాలను అక్కడే వదిలేసి నడుచుకుంటూ వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలుతూర్పుగోదావరి జిల్లా...ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎంపీ భరత్, వైఎస్ఆర్సీపీ శ్రేణులుమార్గాన్ని భరత్ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులుతూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలో వైఎస్సార్సీపీ తలపెట్టిన ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమంమాజీ మంత్రి వేణుగోపాల కృష్ణ,జక్కంపూడి గణేష్ మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గూడూరు శ్రీనివాసులను అడ్డుకున్న పోలీసులు జక్కంపూడి రాజా ఇంటి వద్ద బైఠాయించిన నేతలు ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నినాదాలు చంద్రబాబు ఎంత దుర్మార్గుడు అంటే మెడికల్ కాలేజీ సీటు కోటి రూపాయల పైన పలుకుతోందిఒక డాక్టర్ బయటకు రావాలంటే కనీసం ఐదు కోట్లు ఖర్చు అవుతోందిఇంత ఖర్చుతో పేద, మధ్య తరగతి విద్యార్థులు చదవగలరా?అందుకే జగన్ 17 మెడికల్ కాలేజీలు తెచ్చారుఅలాంటి కాలేజీలను ప్రైవేటీకరణతో చంద్రబాబు పేదల ఆశలను నీరు గార్చారుమెడికల్ సీట్లు వద్దంటూ లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబుమెడికల్ కాలేజీలను తిరిగి ప్రభుత్వ పరంచేసే వరకు ఆందోళనలు చేస్తాం - శివరామిరెడ్డి, ఎమ్మెల్సీపెత్తందార్ల చేతిలో చంద్రబాబు మెడికల్ కాలేజీలను పెడుతున్నారు వైఎస్సార్ కుటుంబం పేదల కోసం పాటు పడిందివైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పేరుతో ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారువైఎస్ జగన్ మెడికల్ కాలేజీలతో సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారుఅలాంటి వాటిని ప్రైవేటీకరణ సరికాదుపెత్తందార్ల చేతిలో చంద్రబాబు మెడికల్ కాలేజీలను పెడుతున్నారుపేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలేయటం సబబు కాదుపీపీపీ విధానాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం చేస్తాం -బొమ్ము ఇజ్రాయిల్, ఎమ్మెల్సీచంద్రబాబు పేదల మీద కక్ష కట్టారుఅందుకే మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేస్తున్నారుదీన్ని మేము వ్యతిరేకిస్తున్నాంప్రభుత్వ మెడలు వంచేదాకా పోరాటం చేస్తాం- సిపాయి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను యధావిధిగా కొనసాగించాలి.మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదుచంద్రబాబు ఆలోచన స్వార్ధ పూరితమైనది.చంద్రబాబు ప్రభుత్వం వారి బినామీలకు మేలు చేసే ప్రయత్నం చేస్తోంది.తమ సొంత జేబులు నింపుకునే ప్రయత్నం చేయడం సరికాదు.ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తాం.వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకువస్తాం -విక్రాంత్, ఎమ్మెల్సీ విడుదల రజినిని అడ్డుకున్న పోలీసులుచిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజిని ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపుచలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో భాగంగా పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి బయలుదేరిన మాజీ మంత్రి విడదల రజినిఅడ్డుకున్న పోలీసులుమాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసులు ఏపీలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఛలో మెడికల్ కాలేజీగుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం లో విద్యార్థి ,యువజన విభాగాల కార్యకర్తలుపిడుగురాళ్ల, బాపట్ల మెడికల్ కాలేజీలకు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థి యువజన విభాగాల కార్యకర్తలుఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి వెళ్ళకూడదు అంటూ అంబటి రాంబాబుకు నోటీసులుపల్నాడులో మాజీ మంత్రి విడదల రజిని, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నంబూరు శంకర్రావు ఇళ్ల దగ్గర పోలీసుల మోహరింపుపిడుగురాళ్ల మెడికల్ కాలేజీ కాంపౌండ్లోకి వైఎస్సార్సీపీ శ్రేణుల్ని వెళ్లనివ్వకుండా బారికేడ్లు ఏర్పాటుఇంత నీచంగా దుర్మార్గంగా ఏ ప్రభుత్వం ఆలోచించలేదుప్రజారోగ్యానికి వ్యతిరేకమైన ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాందోపిడీ, అవినీతి కోసం ఈ విధానాన్ని తీసుకువస్తున్నారుఇప్పటికే పార్టీ తరఫున పోరాటం చేస్తున్నాంగతంలో ఏ ప్రభుత్వం ఇలా ఆలోచించలేదుప్రజలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, వైద్యశాలలు రావాలని కోరుకుంటారుఇంత నీచంగా దుర్మార్గంగా ఏ ప్రభుత్వం ఆలోచించలేదుప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆస్పత్రులను దోచుకోవాలని నీచమైన ఆలోచన రావటం దురదృష్టకరంఈ విషయంలో ఎంతవరకైనా పోరాటం చేస్తాంకళ్ళుండి చూడలేకపోతున్న కూటమి ప్రభుత్వంఇప్పటివరకు అమరావతి లో ఏం చేశారు.. ఎంత ఖర్చు పెట్టారు..మేం ఎంత ఖర్చు చేశామో వాళ్ళే చెప్తున్నారుపీపీ అంటే దోపిడీ నా.. పేదలకు ఆరోగ్యం దొరుకుతుందా..ఎవరు చెప్పారు ఇది.. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు..చేతకాకపోతే ఏదీ కాదు..ప్రజల కోసం ఏమైనా చేయాలనే తపన ఉండాలి..- శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ చరిత్ర హీనుడిగా చంద్రబాబు..చంద్రబాబు నిర్ణయం ప్రజల ఆరోగ్య భద్రతకు ముప్పుపేదలకు వైద్య విద్య దూరం చేసే కుట్రలుమూడుసార్లు సీఎంగా చేసిన వ్యక్తి ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చారా?జగన్ చరిత్ర సృష్టిస్తే.. బాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోయారు:::ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పేదవాడిపై బాబు సర్కార్ కక్ష కట్టిందిపేదవాడికి న్యాయం చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదుఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంపై ఆంక్షలు విధించారుబాబు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చాడా?::: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అల్లూరి జిల్లా.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు చలో మెడికల్ కాలేజీ కు వైయస్సార్సీపి పిలుపు.పాడేరు మెడికల్ కాలేజీను కాసేపట్లో సందర్శించనున్న వైయస్సార్సీపీ నేతలు..పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా పాడేరు మెడికల్ కాలేజీకి వైఎస్సార్సీపీ నాయకులు.500 కోట్లతో 35 ఎకరాల్లో వైయస్ జగన్ హయాంలో మెడికల్ కాలేజీ నిర్మాణం ప్రారంభం.ఇప్పటికే ప్రారంభమైన మెడికల్ కాలేజీ తరగతులు..చంద్రబాబు నిర్లక్ష్యం వలన 150 ఎంబీబీఎస్ సీట్లు, 50 సీట్లకు కుదింపువైయస్ జగన్ పాలనలో 70 శాతానికి పైగా పూర్తయిన మెడికల్ కాలేజీ నిర్మాణంకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నత్త నడకన మెడికల్ కాలేజీ నిర్మాణ పనులుతూర్పుగోదావరి జిల్లా..వైఎస్సార్సీపీ తలపెట్టిన ఛలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి అడ్డంకులు సృష్టిస్తున్న ప్రభుత్వంవైఎస్సార్సీపీ నేతల ఇళ్ళ వద్ద పోలీస్ కాపలానేతలను హౌస్ చేసిన పోలీసులు.. నోటీసులు అందజేతమాజీ ఎంపీ మార్గాన్ని భరత్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇళ్ల వద్ద భారీగా పోలీసుల మోహరింపుఅమరావతిమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వాయిదా తీర్మానంశాసన మండలిలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానంమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చించాలని తీర్మానంమరోవైపు.. వైఎస్సార్సీపీ ఛలో మెడికల్ కాలేజీ నిర్వహణఅనంతపురం జిల్లా..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై నిరసన జ్వాలలునేడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజీశ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మెడికల్ కాలేజీ వద్ద కార్యక్రమంపెద్దసంఖ్యలో తరలివస్తున్న విద్యార్థులు, యువకులుచంద్రబాబు కు వ్యతిరేకంగా నినాదాలుహాజరుకానున్న వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు.. మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిప్రకాశం జిల్లా ..మార్కాపురం లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీను ప్రవేటికరణ చేయడం పై నిరసన తెలుపునున్నా వైయస్సార్సీపీ నాయకులుఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతి లేదని ముందస్తు నోటీసులు జారీ చేసిన మార్కాపురం పోలీసులుచీమకుర్తిలోని బూచేపల్లి నివాసంలో దర్శి ఎమ్మెల్యే, జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన చీమకుర్తి ఎస్ఐ కృష్ణయ్యతూర్పుగోదావరి జిల్లా.ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ ఛలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ ఆధ్వర్యంలో క్వారీ సెంటర్ నుండి మెడికల్ కాలేజ్ వరకు శాంతియుత ర్యాలీకర్నూలు జిల్లా ..ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని అడుగడుగున అడ్డుకుంటున్న పోలీసులు,మెడికల్ కాలేజ్ ప్రవేటికరణ చేసిన చంద్రబాబు తీరు మార్చుకోవాలని అన్ని మెడికల్ కాలేజ్ ల వద్ద శాంతియుత నిరసనకు వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపు,శాంతియుత నిరసన తెలపడానికి నంద్యాల మెడికల్ కాలేజ్ కి వెళ్తున్న రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ని కర్నూలులోని ఆయన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు,ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లను ప్రవేటికరణ కార్యకమాన్ని శాంతి యుతంగా చేస్తాం అంటే మీరు ఎలా అడ్డుకుంటారని పోలీసులను ప్రశించిన బైరెడ్డి సిద్దార్థ రెడ్డి,సిద్ధార్థ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన ఇంటి వద్దకి చేరుకుంటున్న వైసీపీ శ్రేణులు,సిద్దార్థ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు...డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా...అమలాపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమంహాజరుకానున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, నేతలు, కార్యకర్తలుగత వైఎస్సార్సీపీ హయాంలో పేద, మధ్య తరగతి ప్రజల మేలు కోసం 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారు వైఎస్ జగన్ మోహన్రెడ్డి. తద్వారా అతి తక్కువ ఖర్చుకే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలని ఆయన ఆశించారు. ఈ క్రమంలో కొన్ని కాలేజీల్లో తరగతులూ ప్రారంభం అయ్యాయి కూడా. అయితే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిర్మాణంలో ఉన్న కాలేజీలనూ పట్టించుకోలేదు. పైగా.. ఇప్పుడు పీపీపీ పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల విలువ చేసే కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. ఈ క్రమంలో మంత్రులతో తప్పుడు ప్రచారం సైతం చేయించారు. మెడికల్ కాలేజీలను తన బినామీలకు దోచి పెడుతున్న చంద్రబాబు చర్యలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చింది. పార్టీ యువత, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టబోతోంది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత దాకా ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరిస్తోంది కూడా.తాడేపల్లి.ఈనెల 19న వైయస్సార్సీపీ ‘ఛలో మెడికల్ కాలేజీ’పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో కార్యక్రమంతాడేపల్లి:తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 10 కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈనెల 19న ‘ఛలో మెడికల్ కాలేజీ’… pic.twitter.com/kE5cjf0dqE— YSR Congress Party (@YSRCParty) September 18, 2025