Members of the Legislative Council
-
మీ ఒత్తిడితోనే వీసీల రాజీనామా
సాక్షి, అమరావతి: ‘మీ ఒత్తిడితోనే యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్లు రాజీనామా చేశారు.. ఆధారాలు ఇవిగో.. ఏమాత్రం నిజాయితీ ఉన్నా న్యాయబద్ధంగా విచారణ చేయించాలి. లేదా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి’ అంటూ ‘ఎక్స్’ వేదికగా వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ రాజీనామా లేఖను ట్యాగ్ చేస్తూ మంగళవారం ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేసింది.‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ద్వారా విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్లను రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆధారాలివిగో.. నారా లోకేశ్ ఆదేశాలతో చైర్మన్ స్వయంగా వీసీలను పిలిచి రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఒక వీసీ తన రాజీనామా లేఖలో మంత్రి లోకేశ్ బెదిరించినట్లు స్పష్టంగా రాశారు’ అంటూ వైఎస్సార్సీపీ ఎత్తి చూపింది. ‘వీసీలపై రాజీనామా చేయాలంటూ ఎందుకు ఒత్తిడి తెచ్చారని మంత్రి నారా లోకేశ్ను శాసన మండలిలో వైఎస్సార్సీపీ ప్రశ్నించింది.వీసీలను బెదిరించినట్లు ఆధారాలు చూపితే విచారణకు ఆదేశిస్తామన్నారు. వైస్ ఛాన్స్లర్లు గవర్నర్ అధికారం కిందకు వస్తారని లోకేశ్ బుకాయించారు. ‘ఇదిగో.. ఇప్పుడు నారా లోకేశ్ ఒత్తిడితోనే వీసీలు రాజీనామా చేసినట్లు ఆధారాలను బయట పెడుతున్నాం. ఏమాత్రం నిజాయితీ ఉన్నా ఈ విషయమై న్యాయబద్ధంగా విచారణ చేయించాలి. లేదా నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేశ్ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేసింది. అప్పుడే వాస్తవాలు బయటికి వస్తాయని, న్యాయం గెలుస్తుందని స్పష్టం చేసింది. -
అసెంబ్లీ కమిటీలూ ముఖ్యమైనవే
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో చట్ట సభల తరహాలోనే శాసనసభ కమిటీలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ప్రభుత్వరంగ సంస్థల పనితీరును సమగ్రంగా పర్యవేక్షించడం కమిటీ ప్రధాన విధి అని స్పీకర్ పేర్కొన్నారు. బుధ వారం అసెంబ్లీ ఆవరణలో 2019–20 సంవత్సరపు ప్రభు త్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ) తొలి సమావేశం కమిటీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి అధ్యక్షతన జరిగింది. స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. ప్రభుత్వ సంస్థల పనితీరుకు సంబంధించిన నివేదికలు, లెక్కలను భారత కంపోŠట్రలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలను కమిటీ పరిశీ లిస్తుందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు, ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్థికంగా పరిపుష్టం అయ్యేలా చూడాల్సిన బాధ్యత కమిటీపై ఉంటుందని శాసన మండ లి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు, అకౌంట్స్ విషయంలో అకౌంటెంట్ జనరల్ ఇచ్చే నివేదికల్లో లోటుపాట్లను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని కమిటీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రకటించారు. సమావేశంలో సభ్యులు విద్యాసాగర్రావు, ప్రకాశ్గౌడ్, అబ్రహం, శంకర్నాయక్, దామోదర్రెడ్డి, భాస్కర్రావు, పాషా ఖాద్రీ, కోరుకంటి చందర్, నారదాసు లక్ష్మణ్రావు, పురాణం సతీష్ పాల్గొన్నారు. హామీల అమలు బాధ్యత ఆ కమిటీదే.. శాసన మండలి సభ్యులు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చే సందర్భంలో సీఎం, మంత్రులిచ్చే హామీలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత హామీల అమలు కమిటీపై ఉంటుందని మండలి చైర్మన్ సుఖేందర్రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలో హామీల అమలు కమిటీ చైర్మన్ గంగాధర్గౌడ్ అధ్యక్షతన జరిగిన 2019–20 హామీల అమలు కమిటీ తొలి సమావేశంలో గుత్తా పాల్గొన్నారు. -
ఫిరాయింపుదారులతో ఆశావహులకు గండి
ఎమ్మెల్యే టికెట్లు దక్కని చాలామందికి ‘మండలి’ హామీలు టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలతో వారికి నిరాశ 2015లో రిటైర్ కానున్న17 మంది.. ప్రస్తుత ఖాళీలు 4 హైదరాబాద్: శాసనమండలి సభ్యులుగా అవకాశం కోసం చూస్తున్న అనేకమంది టీఆర్ఎస్ పాతకాపుల్లో ఇప్పుడు ఆందోళన వ్యక్తం అవుతోంది. తెలంగాణ శాసనమండలిలో 40 మంది సభ్యులకుగాను ప్రస్తుతం 36 మందే ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల కోటా నుండి 4 ఖాళీలు ఉన్నాయి. 2015లో 17 మంది రిటైర్ కానున్నారు. అంటే 2015లోగా మొత్తం 21 మంది శాసనమండలికి ఎన్నిక కావాల్సి ఉంది. వీటికోసం వివిధ జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ముఖ్యనాయకులు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించిన అనేక సంఘాల నేతలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. కాగా, 2015లో రిటైర్ కావాల్సిన కాంగ్రెస్ ఎమ్మెల్సీల్లో కొందరు టీఆర్ఎస్లో చేరారు. దీంతో వీరివల్ల తమ అవకాశాలకు గండిపడుతుందేమోనని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. ఖాళీల వివరాలివీ.... స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నుండి ఖాళీలున్నాయి. అదే కోటా నుండి మరో రెండు నియోజకవర్గాలను కొత్తగా ఏర్పాటుచేయడానికి ఎన్నికల సంఘం కసరత్తును చేస్తోంది. ఈ ప్రక్రియ కూడా కొలిక్కి వస్తే మొత్త 4 స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. 2015లో మరో 17 మంది రిటైర్ కాబోతున్నారు. ఎమ్మెల్యేల కోటా నుండి 29 మార్చి 2015లో కె.ఆర్.ఆమోస్, డి.శ్రీనివాస్, ఎన్.రాజలింగం, పీర్ షబ్చీర్ అహ్మద్, బాలసాని లక్ష్మీనారాయణ, బోడకుంటి వెంకటేశ్వర్లు, కె.యాదవ రెడ్డి రిటైర్ అవుతున్నారు. పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీలుగా ఉన్న డాక్టర్ కె.నాగేశ్వర్, కె.దిలీప్కుమార్ రిటైర్ అవుతున్నారు. గవర్నర్ కోటా నుండి బి.వెంకటరావు రిటైర్ అవుతున్నారు. స్థానికసంస్థల నుండి మండలిలో పాతినిధ్యం వహిస్తున్న నేతి విద్యాసాగర్, వి.భూపాల్ రెడ్డి, ఎ.నర్సారెడ్డి, పొట్లనాగేశ్వర్ రావు, టి.భానుప్రసాద్రావు, ఎస్.జగదీశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి తదితరులు మే 1న రిటైర్ అవుతున్నారు. దీంతో 2015లో రిటైరయ్యేవారు 17 మంది అవుతున్నారు. 2015లో రిటైర్ కాబోతున్న సభ్యులు టీఆర్ఎస్లో ఇటీవల చాలామంది చేరారు. వీరంతా ఎమ్మెల్సీలుగా మళ్లీ ఇవ్వాలని అడిగే అవకాశముంది. వీరిలో అధికులకు సీఎం హామీ కూడా ఇచ్చారని సమాచారం. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసిన నేతలకు అవకాశం లేకుండాచేసి చివరిక్షణంలో వచ్చినవారు తమ అవకాశాలను తన్నుకుపోతారా దిగులుపడుతున్నారు. గత ఎన్నికల్లో టికెట్ అవకాశం రాని దాదాపు 50 మందికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానంటూ కేసీఆర్ హామీ ఇచ్చారు.