Minister G. Jagdish Reddy
-
వారికే పగ్గాలు
పాతకాపులే టీఆర్ఎస్ సారథులు జిల్లా అధ్యక్షుడిగా తక్కళ్లపల్లి రవీందర్రావు గ్రేటర్ అధ్యక్షుడిగా నన్నపునేని నరేందర్ ఏకగ్రీవంగా టీఆర్ఎస్ ఎన్నికలు రెండు, మూడు రోజుల్లో కార్యవర్గాలు సాక్షి ప్రతినిధి, వరంగల్ : టీఆర్ఎస్ జిల్లా కమిటీల సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసింది. వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా తక్కళ్లపల్లి రవీందర్రావు, గ్రేటర్ వరంగల్ కమిటీ అధ్యక్షుడిగా నన్నపునేని నరేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ తాజాగా చేపట్టిన సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు ముందు రద్దు చేసిన పార్టీ కమిటీలకు వీరే అధ్యక్షులుగా వ్యవహరించారు. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్స్లో గురువారం టీఆర్ఎస్ జిల్లా కమిటీల ఎన్నిక ప్రక్రియ జరిగింది. రాష్ట్ర పార్టీ పరిశీలకుడిగా వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి ఎన్నికలు నిర్వహించారు. సమావేశానికి ముందు సర్క్యూట్ గెస్ట్ హోస్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు భేటీ అయ్యారు. అధ్యక్షులుగా ఎవరిని నియమించాలనే విషయంపై నాలుగు గంటలు చర్చించారు. మొదట జిల్లా కమిటీ అధ్యక్ష పదవికి, తర్వాత గ్రేటర్ వరంగల్ కమిటీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగింది. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి నామినేషన దాఖలు చేయాలని మంత్రి జగదీశ్రెడ్డి సభకు వచ్చిన వారిని కోరారు. ఎవరైనా ఒక నాయకుడి పేరును ప్రతిపాదించి, మరొకరు బలపరిచినా సరిపోతుందని సూచించారు. ఉప ముఖ్యమంత్రి శ్రీహరి.. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి తక్కళ్లపల్లి రవీందర్రావు పేరును ప్రతిపాదించగా.. గిరిజన సంక్షేమ మంత్రి చందూలాల్ బలపరిచారు. ఇంకా ఎవరినైనా ప్రతిపాదించవచ్చని జగదీశ్రెడ్డి సూచించారు. నామినేషన్లు, ప్రతిపాదనలు రాలేదు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి రవీందర్రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జగదీశ్రెడ్డి ప్రకటించారు. గ్రేటర్ ఎన్నిక ఇలా.. గ్రేటర్ వరంగల్ కమిటీ అధ్యక్ష పదవి ఎన్నిక కూడా జిల్లా కమిటీ పద్ధతిలోనే నిర్వహించారు. పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయ్భాస్కర్.. గ్రేటర్ అధ్యక్ష పదవికి నన్నపునేని నరేందర్ పేరు ప్రతిపాదించగా.. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ బలపరిచారు. ఈ పదవికి ఇతరుల పేర్లు ఏవీ ప్రతిపాదనలకు రాలేదు. నరేందర్ గ్రేటర్ టీఆర్ఎస్ కమిటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మంత్రి జగదీశ్రెడ్డి ప్రకటించారు. ఇద్దరు కొత్త అధ్యక్షులకు ఉప ముఖ్యమంత్రి శ్రీహరి, మంత్రి చందూలాల్, పార్లమెంటరీ కార్యదర్శి వినయ్భాస్కర్, జెడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు టి.రాజయ్య, కొండా సురేఖ, రెడ్యానాయక్, అరూరి రమేశ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బి.శంకర్నాయక్, ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వరరెడ్డి పార్టీ ముఖ్యనేతలు అభినందించారు. పార్టీ నాయకులు, శ్రేణులు.. కొత్త అధ్యక్షులను గజమాలతో సత్కరించారు. మూడు రోజుల్లో కార్యవర్గాలు టీఆర్ఎస్ జిల్లా కమిటీ అధ్యక్ష ఎన్నిక పూర్తయింది. కార్యవర్గాలకు గురువారమే ఎన్నిక జరుగుతుందని టీఆర్ఎస్ శ్రేణులు భావించాయి. ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో.. జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలను సంప్రదించి రెండు, మూడు రోజుల్లో కార్యవర్గాలను ప్రకటించాలని నిర్ణయించారు. ఎన్నికల పరిశీలకుడు జి.జగదీశ్రెడ్డి ఈ మేరకు కొత్త అధ్యక్షులకు సూచించారు. టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం ఒక్కో కార్యవర్గంలో 33 మంది ఉండనున్నారు. మరోవైపు టీఆర్ఎస్ జిల్లా కమిటీ ఎన్నిక ప్రక్రియకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరు కాలేదు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ధర్మారెడ్డి ఈ కార్యక్రమానికి రాకపోవడంపై సమావేశంలో శ్రేణులు చర్చించుకున్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవిని ఆశించిన నాగుర్ల వెంకటేశ్వర్లు కూడా సమావేశానికి రాలేదు. -
ప్రభుత్వ స్కూళ్లలో ఎల్కేజీ చదువులు
పరిశీలనలో ఉందన్న మంత్రి జగదీశ్ రెడ్డి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టే యోచన ఉన్నట్లు వెల్లడి హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ విద్యతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి తెలిపారు. ఆంగ్లంపై మోజుతో తల్లిదండ్రులు మూడేళ్లకే పిల్లలను కాన్వెంట్లకు పంపుతున్నారని పేర్కొన్నారు. ఐదేళ్ల లోపు విద్యార్థులను పాఠశాలల్లో చేర్చుకోరాదనే నిబంధన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్య ప్రవేశపెట్టడానికి అడ్డంకిగా మారిందని తెలిపారు. నాలుగో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరపాలన్న వాదన కూడా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సంస్కరణలపై విద్యావేత్తలు, అన్ని పక్షాల అభిప్రాయాలను స్వీకరించి ప్రస్తుత విద్యాసంవత్సరం ముగిసేలోగా నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తామని మంత్రి ప్రకటించారు. శనివారం శాసనమండలిలో ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్గౌడ్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. వేసవిలో హేతుబద్ధీకరణ మూడేళ్లుగా హేతుబద్ధీకరణ జరగకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య మధ్య తీవ్ర వ్యత్యాసం ఏర్పడిందని మంత్రి అభిప్రాయపడ్డారు. కొన్ని పాఠశాలల్లో తక్కువ మంది విద్యార్థులు, ఎక్కువ మంది ఉపాధ్యాయులంటే మరికొన్ని పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు, తక్కువ మంది ఉపాధ్యాయులున్నారన్నారు. దీన్ని సరిచేయడానికి హేతుబద్ధీకరణ ఉత్తర్వులు జారీచేశామన్నారు. ఈఏడాది నుంచి 9,10 తరగతుల సిల బస్తో పాటు పరీక్షా విధానం మారిం దన్నారు. 3.5 లక్షల మందికి లబ్ధి చేకూర్చాం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం ఆటోరిక్షాలకు రహదారి పన్నును రద్దు చేసిందని రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు గతంలో ఉన్న జీవోను సవరించామన్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3.5 లక్షలమంది ఆటో యజమానులకు లబ్ధి చేకూరింద న్నారు. ‘ఉపాధి’ కోసం తీర్మానం యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రి కె.తారకరామారావు మండలిలో తీర్మానాన్ని ప్రతిపాదించారు. కాంగ్రెస్తో పాటు ఇతర పక్షాలు మద్దతు తెలపడంతో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొం దినట్లు మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటిం చారు. కేంద్రం ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా 2,500 వెనుకబడిన బ్లాకులకే పరిమితం చేయడం ద్వారా తెలంగాణలో ఈ పథకం కేవ లం 78 మండలాలకే వర్తించనుందన్నారు. ‘ఆంధ్రజ్యోతి’ వ్యాసంపై గరంగరం శాసనమండలి సభ్యుల వేతనాలకు సంబంధించి ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో వ్యాసంపై వార్తపై అధికారపక్ష సభ్యులు మండిపడ్డారు. ‘అమరులకు అన్యాయం’ శీర్షికన ప్రచురితమైన వార్తలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వేతనాలను పెం చిన ప్రభుత్వం... అమరుల గురించి పట్టించుకోవడం లేదని రాసిన వైనాన్ని సభ్యులు తప్పపట్టారు. సభ్యుల గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి వార్తలు ప్రచురించిన సంస్థపై చర్యలు చేపట్టాలని ప్రత్యేక ప్రస్తావన కింద ఎమ్మెల్సీ భానుప్రసాద్ చైర్మన్ను కోరారు. భానుప్రసాద్ ప్రతిపాదనకు అధికార పార్టీ సభ్యులు మద్దతు తెలుపగా.. టీడీపీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి అభ్యం తరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైపు నుంచి ఏవైనా తప్పులు జరిగినట్లుగా పత్రికల్లో వార్తలు వస్తే, ప్రభుత్వం ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. అగౌరవపరిచినట్లు భావించి సభ్యులు తనకు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటానని చైర్మన్ స్వామిగౌడ్ చెప్పడంతో గందరగోళానికి తెరపడింది. తర్వాత మండలి సమావేశాలను ఈనెల 21కి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్సీ బీరవల్లి ధర్మారెడ్డి మృతికి మండలి శ్రద్ధాంజలి ఘటించింది.