Advertisement
Moharam festival
-
ఆకాంక్షలే ఆలంబనగా రొట్టెల పండగ
అక్కడకు తరలి వచ్చేవారివి చిన్న చిన్న కోరికలే. చదువు రావాలి, ఉద్యోగం రావాలి, వివాహం జరగాలి, సంతానం కలగాలి అనే... జీవితంలో ఆకాంక్షలు ఉండాలి. ఆ ఆకాంక్షలు నెరవేరతాయనే ఆశ ఉండాలి. అలాంటి వారికి అభయమిచ్చే ఆధ్యాత్మిక వేడుకలు ఎన్నో. అలాంటి వాటిలో ఒకటి ‘రొట్టెల పండగ’ నెల్లూరులో జరిగే ఈ పండగలో స్త్రీలు విశేషంగా ΄ాల్గొంటారు. ప్రతి సంవత్సరం మొహరం పండగ వేళలో నెల్లూరు వీధులు ΄ోటెత్తుతాయి. దేశ విదేశాల నుంచి జనం నెల్లూరులోని బారా షహీద్ దర్గా దగ్గరకు చేరుకుంటారు. కులం, మతం, భాష, ్ర΄ాంతం... తేడా లేకుండా అక్కడి స్వర్ణాల చెరువులో మొక్కు మొక్కుకుంటారు. లేదా తీర్చుకుంటారు. మొక్కు తీరిన వారు రొట్టె పంచుతారు. మొక్కుకునే వారు ఆ రొట్టెను స్వీకరిస్తారు. తరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం చెక్కు చెదరడం లేదు. ప్రతి సంవత్సరం ఐదు రోజుల ΄ాటు జరిగే ఈ వేడుక నిన్నటి నుంచి çఘనంగా జరుగుతోంది. ఇది ప్రధానంగా స్త్రీల పండగ.ఎవరు ఈ బారా షహీద్?మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడంలో భాగంగా టర్కీ నుంచి సుమారు 300 ఏళ్ల క్రితం 12 మంది మతబోధకులు భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కొడవలూరు మండలంలోని గండవరంలో తమిళనాడు వాల్జారాజులకు, బీజాపూర్ సుల్తాన్లకు మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ 12 మంది వీరమరణం ΄÷ందారు. వీరి తలలు గండవరంలో తెగిపడగా మొండాలను గుర్రాలు నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు తీసుకు వచ్చాయి. ఈ 12 మంది నెల్లూరు ఖ్వాజీకి కలలో కనపడి తమను అక్కడే సమాధి చేయాలని కోరడంతో అక్కడే సమాధులు నిర్మించారు. 12ను ఉర్దూలో బారా, వీర మరణం ΄÷ందిన అమరులను షహీద్లుగా పిలుస్తారు. అందుకే ఈ దర్గాకు బారా షహీద్ అనే పేరొచ్చింది. రొట్టెల ఆనవాయితీతమిళనాడు నుంచి నెల్లూరు వరకు ఆర్కాట్ నవాబుల ఏలుబడిలో ఉన్నప్పుడు నవాబు భార్య జబ్బు పడితే ఆమెకు నయం అయ్యే మార్గం కోసం నవాబు ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో బారా షహీద్ దర్గా దగ్గర బట్టలు ఉతుకుతున్న రజకునికి ఆ రాత్రి బారా షహీద్లు కనబడి మా సమాధుల దగ్గరి మట్టి తీసుకుని నవాబు భార్య నుదుటికి రాస్తే నయం అవుతుందని చె΄్పారు. ఆ సంగతి రజకుడు ఊరి వారికి తెలుపగా వారు నవాబుకు తెలియచేశారు. మట్టి తెప్పించిన నవాబు దానిని తన భార్య నుదుటికి రాయగా 24 గంటల్లో ఆమెకు నయం అయ్యింది. దాంతో అతడు అంత దూరం నుంచి బారా షహీద్ దర్గాను చూడటానికి వచ్చాడు. దర్శనం అయ్యాక అక్కడ ఉన్న పేదలకు రొట్టెలు పంచాడు. మొక్కు తీరాక ఇలా రొట్టెలు పంచడం ఆనవాయితీ అయ్యింది. ఈ నెల 21 వరకు రొట్టెల పండగ జరుగుతుంది.వివాహం రొట్టె.. సంతాన రొట్టెనెల్లూరు బారా షహీద్ దర్గాలో మొక్కు రొట్టెతో ముడిపడి ఉంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు ఉద్యోగం, ప్రమోషన్, సౌభాగ్యం, సంతానం, విద్య, స్వగృహం, వ్యా΄ారం... ఈ కోరికలు నెరవేరాలని మొక్కుకునేందుకు వస్తారు. గతంలో మొక్కిన మొక్కులు తీరిన వారు రొట్టెలతో వస్తారు. వారి నుంచి రొట్టె తీసుకోవాలి. అంటే గతంలో వివాహ మొక్కు మొక్కుకుని వివాహం జరిగిన వారు రొట్టెలతో వస్తారు. వివాహం కావలసిన వారు వారి దగ్గర నుంచి రొట్టె స్వీకరించి తినాలి. మొక్కు తీరాక వాళ్లు ఇలాగే రొట్టెను తెచ్చి ఇవ్వాలి. బారా షహీద్ దర్గా పక్కనే ఉన్న స్వర్ణాల చెరువులో మోకాళ్ల లోతుకు దిగి స్త్రీలు ఈ రొట్టెల బదలాయింపు చేసుకుంటారు. బాకీ తీరాలనే రొట్టె, స్థలం కొనాలనే రొట్టె, ర్యాంకుల రొట్టె... ఇవన్నీ అదృష్టాన్ని బట్టి దొరుకుతాయి. అన్నింటి కంటే ఎక్కువగా ఆరోగ్య రొట్టె కోసం వస్తారు. – కొండా సుబ్రహ్మణ్యం, సాక్షి, నెల్లూరు -
అనంతపురంలో మొహరం పండుగ వేడుకలు (ఫొటోలు)
-
అగ్నిగుండంలో పడి వ్యక్తి సజీవదహనం
అవుకు: కర్నూలు జిల్లా అవుకు మండలంలో మొహర్రం వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. సుంకేసులలో గురువారం రాత్రి ఓ వ్యక్తి మద్యం మత్తులో అగ్నిగుండంలోపడి సజీవ దహనమయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక దస్తగిరిస్వామి పీర్ల చావిడి వద్ద మొహర్రం వేడుకల సందర్భంగా అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశారు. పెద్దసరిగెత్తు సందర్భంగా పెద్ద ఎత్తున మంటలు వేశారు. వేడుకలను తిలకించేందుకు భక్తులు భారీగా వచ్చారు. పక్క గ్రామమైన కాశీపురానికి చెందిన చమురు వెంకటసుబ్బయ్య (48) దస్తగిరిస్వామి చావిడిలోని పీర్లను దర్శించుకున్నారు. అనంతరం మద్యం తాగి మత్తులో పక్కనే ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో పడిపోయాడు. గమనించిన ప్రజలు రక్షించేలోపే పూర్తిగా కాలిపోయి మృతిచెందాడు. దీంతో సుంకేసుల, కాశీపురం గ్రామాల్లో విషాదం నెలకొంది. -
ఉదండాపూర్లో ఉద్రిక్తత..
జడ్చర్ల(మహబూబ్నగర్ జిల్లా): జడ్చర్ల మండల పరిధిలోని ఉదండాపూర్లో బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొహర్రం పండుగ సందర్భంగా పీర్ల చావిడి దగ్గర ఆలావ్ ఆడుతున్న సమయంలో దళితులు, ఇతర కులాలకు మధ్య ఘర్షణ జరిగిన విషయం విదితమే. దాడులకు సంబంధించి దళితులపై దాడి చేసిన 19 మందిని ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్టుచేసి జైలుకు పంపడం ఉద్రిక్తతకు దారి తీసింది. బుధవారం ఉదయం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జైలుకు వెళ్లిన వారికి మద్దతుగా ఇతర కులాలకు చెందిన వారంతా ఆటోలు, ట్రాక్టర్లలో జిల్లా కలెక్టర్ను కలిసి తమ సమస్యను విన్నవించేందుకు బయలుదేరే ప్రయత్నం చేశారు. కేవలం తమ వర్గీయులను మాత్రమే అరెస్ట్ చేసి జైలుకు పంపారని, తమపై దాడి చేసిన దళితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఈ సందర్బంగా వారు ప్రశ్నించారు. దీంతో విషయం తెలుసుకున్న జడ్చర్ల సీఐ జంగయ్య ఆధ్వర్యంలో పోలీసులు గ్రామానికి వెళ్లి గ్రామస్థులకు నచ్చజెప్పారు. బీసీ, తదితర కులాలపై దాడి జరిపిన 13 మంది దళితులను ఈ సందర్బంగా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో గ్రామంలో కొంత ఉద్రిక్తత చల్లబడింది. ఇలా ఉండగా గ్రామ శివారులో పంట చేల్లో ఉన్న దళిత మహిళ అంజమ్మపై ఇతర కులాల వారు దాడి చేసి కొట్టారని బాధితురాలు లబోదిబోమంది. దీంతో అమెను 108 అంబులెన్స్లో వైద్య చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెను ఎవరు కొట్టలేదని, కావాలనే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఇతరకులాలు వారు ఖండించారు. కాగా గ్రామంలో ఇరువర్గాల మద్య ఆగ్రహావేశాలు రగులుతున్నాయి.