breaking news
Murshidabad district
-
మాట మార్చేసిన ఎమ్మెల్యే
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ మాట మార్చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోనని ప్రకటించారు. నియోజకవర్గ ప్రజల విజ్ఞప్తి మేరకు తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నానని మీడియాతో చెప్పారు. ముర్షిదాబాద్ జిల్లాలోని భరత్పూర్ శాసనసభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు."ఇప్పుడు నా రాజీనామా ప్రశ్నే లేదు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదు. ప్రజలు నన్ను తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. నేను రాజీనామా చేయాలని వారు కోరుకోవడం లేదు. వారి ఆకాంక్షలను గౌరవిస్తూ, నా రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాను" అని కబీర్ అన్నారు. డిసెంబర్ 17న కోల్కతాలో జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరైన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ఇంతకుముందు ప్రకటించారు.ముర్షీదాబాద్లో ఈనెల 6న బాబ్రీ మసీదు తరహా మసీదు (Babri-style mosque) నిర్మాణాన్ని ప్రారంభిస్తానని ప్రకటించడంతో టీఎంసీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో డిసెంబర్ 22న కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని, రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 135 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీ చేయిస్తానని ఆయన ప్రకటించారు. అన్నట్టుగానే ముర్షిదాబాద్లోని రెజినగర్లో మసీదుకు శనివారం కేంద్ర, రాష్ట్ర బలగాల భారీ భద్రత మధ్య శంకుస్థాపన చేశారు. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు.. డిసెంబర్ 6ను శంకుస్థాపనకు ఎంచుకున్నారు.బెంగాల్ ‘బాబ్రీ’ మసీదుకు రూ.1.30 కోట్ల విరాళాలుపశ్చిమ బెంగాల్లో మసీదు నిర్మాణానికి ఇప్పటివరకు రూ.1.30 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయని టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ సన్నిహిత నాయకులు తెలిపారు. నాలుగు విరాళాల బాక్సులు, ఒక సంచి నుంచి రూ37.33 లక్షల నగదు, ఆన్లైన్లో రూ.93 లక్షలు వచ్చాయని ప్రకటించారు. మరో ఏడు బాక్సులు ఇంకా లెక్కించాల్సి ఉందన్నారు. సభా వేదిక వద్ద విరాళాలకోసం 11 బాక్సులను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.చదవండి: 'మీరు ఫ్యూర్ వెజిటేరియనా.. ఏదో మిస్సవుతున్నారు'గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న హుమాయున్ కబీర్ (Humayun Kabir) 2012లో తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. తరువాత కొంతకాలం బీజేపీకి వెళ్లి 2020లో అధికార పార్టీలోకి తిరిగొచ్చారు. టీఎంసీ నాయకత్వంతో నిత్యం ఘర్షణ పడుతూనే ఉన్నారు. తాజాగా పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. -
బాబ్రీ మాదిరి మసీదుకు పునాది
బహరాంపూర్: పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా రెజినగర్లో శనివారం టీఎంసీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ పునాది రాయి వేశారు. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా చోటుచేసుకున్న ఈ పరిణామం రాజకీయ వేడిని రగిలి్చంది. రెజినగర్లో ఏర్పాటు చేసిన భారీ స్టేజీపై ఏర్పాటు చేసిన రిబ్బన్ను సౌదీ నుంచి వచి్చన ఇస్లామిక్ పెద్దలతోపాటు కబీర్ కట్ చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే, మసీదు నిర్మాణం తలపెట్టిన స్థలం అక్కడికి కిలోమీటరు దూరంలో ఉంది. ఈ సందర్భంగా తరలివచి్చన వేలాది మంది ‘నారా–ఇ– తక్బీర్, అల్లాహూ అక్బర్’అంటూ చేసిన నినాదాలు ఆ ప్రాంతంలో మారుమోగాయి. మసీదు నిర్మాణానికంటూ తలా ఒక ఇటుకను నెత్తిపై ఉంచుకుని ఉదయం నుంచి అక్కడికి వారంతా చేరుకున్నారు. ఆ ఇటుకలతో వలంటీర్లు ఇమారతి ఖైరత్ మాదిరి నిర్మాణం చేశారు. 1992లో అయోధ్యలోని బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన రోజును పురస్కరించుకుని కబీర్ ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. పెద్ద ఎత్తున జనం తరలిరావచ్చని, అవాంఛనీయ ఘటనలు జరగవచ్చని భావించిన అధికారులు ముందు జాగ్రత్తగా రెజినగర్తోపాటు బెల్దంగ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మత రాజకీయాలు చేస్తున్నారంటూ కబీర్ను అధికార టీఎంసీ సస్పెండ్ చేయడం తెల్సిందే. అయినప్పటికీ మసీదు నిర్మాణం విషయంలో వెనుకడుగు వేసేది లేదని ఆయన ప్రకటించారు. ఆ్రస్టేలియాకు చెందిన ఒక వ్యక్తి మసీదు కోసం రూ.80 కోట్లు ఇస్తామంటూ ముందుకు వచ్చారన్నారు. నిధుల కొరత లేనే లేదని చెప్పారు. మసీదు సముదాయం సుమారు 15 ఎకరాల్లో విస్తరించి ఉంటుందని, మొత్తం అంచనా వ్యయం రూ.300 కోట్లని చెప్పారు. ఇందులో ఒక ఆస్పత్రి, వైద్య కళాశాల, యూనివర్సిటీ, హోటల్, హెలిప్యాడ్ ఉంటాయన్నారు. స్థానిక వైద్యుడొకరు ఇప్పటికే రూ.కోటి విరాళం అందజేశారని చెప్పారు. ఈ ప్రాజెక్టు కేవలం మత పరమైందే కాదు, ఉద్వేగాలకు సంబంధించినదని కబీర్ ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. దేశంలో 40 కోట్ల మంది ఉండగా, బెంగాల్లో 4కోట్ల మంది ముస్లింలున్నారంటూ ఆయన, ఇక్కడో మసీదును కూడా నిర్మించుకోలేమా అని ప్రశ్నించారు. -
‘బాబ్రీ’ శంకుస్థాపనలో జోక్యం చేసుకోలేం.. హైకోర్టు వ్యాఖ్య
కోల్కతా: టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ తలపెట్టిన బాబ్రీ తరహా మసీదు విషయంలో తాము కలుగజేసుకోబోమని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్డంగాలో బాబ్రీ మసీదు కూల్చివేత రోజైన డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ వంటి మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు హుమాయూన్ కబీర్ ఇటీవల ప్రకటించడం తెల్సిందే.అక్కడ మత ఘర్షణలు చోటుచేసుకునే ప్రమాదమున్నందున శంకుస్థాపన కార్యక్రమాన్ని నిలువరించాలంటూ దాఖలైన పిల్పై హైకోర్టు విచారణ చేపట్టింది. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా తగినన్ని పోలీసు బలగాలను అక్కడుంచామని రాష్ట్ర ప్రభుత్వం, 19 కంపెనీల సాయుధ పోలీసు బలగాలను అక్కడ మోహరించినట్లు కేంద్రం తెలిపాయి. అవసరమైతే అదనంగా బలగాలను తరలిస్తామని కూడా పేర్కొన్నాయి. దీంతో, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పౌల్ సారథ్యంలోని డివిజన్ బెంచ్ పై విషయం స్పష్టం చేసింది. -
ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ సస్పెన్షన్
బహరాంపూర్: పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్లో బాబ్రీ మసీదు వంటి మసీదు నిర్మాణాన్ని ఈ నెల 6వ తేదీన ప్రారంభిస్తానంటూ టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ చేసిన ప్రకటన సంచలనం రేపింది. బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన డిసెంబర్ 6వ తేదీని పురస్కరించుకుని దీని నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొనడాన్ని అధికార టీఎంసీ సీరియస్గా తీసుకుంది. ఆయన్ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. అయితే, కబీర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, త్వరలోనే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. తనను అరెస్ట్ చేయాలని చూసినా తలపెట్టిన కార్యక్రమాన్ని కొనసాగించి తీరుతానన్నారు. టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ కబీర్ పేరును నేరుగా ప్రస్తావించకుండా తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని మత విద్వేషాలను రెచ్చగొడుతున్న ద్రోహిగా అభివరి్ణంచారు. ప్రతి మతంలోనూ ద్రోహులున్నారు. ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు సృష్టించడమే వీరి పని అని పేర్కొన్నారు. ఈ పరిణామాలపై సీనియర్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ మీడియాతో మాట్లాడారు. మత రాజకీయాలకు పాల్పడుతున్న కబీర్పై టీఎంసీ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఇక నుంచి ఆయనతో టీఎంసీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. మసీదును ఎవరైనా నిర్మించొచ్చు. అదే సమయంలో మత పరంగా రెచ్చగొట్టడం తగదు. బాధ్యతాయుతంగా వ్యవహరించే మా పార్టీ ఇటువంటి వాటిని ప్రోత్సహించదు’అని ఆయన తెలిపారు. -
అన్ని విధాలుగా అండగా నిలుస్తాం
కోల్కతా: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్లో జరిగిన అల్లర్ల బాధితులను గవర్నర్ ఆనందబోస్ పరామర్శించారు. సాధ్యమైనంత మేర అన్ని విధాలుగా అండగా నిలుస్తామని వారికి హామీ ఇచ్చారు. అల్లర్ల సమయంలో దుండగులు షంషేర్గంజ్ ప్రాంతం జఫ్రాబాద్లో ఓ ఇంట్లో ఉన్న తండ్రి హర గోవింద్ దాస్, అతని కుమారుడు చందన్ దాస్లను కత్తితో పొడిచి చంపారు. వీరి కుటుంబీకులు శనివారం తమ ఇంటికి వచ్చిన గవర్నర్ కాళ్లపై పడి, న్యాయం చేయాలని వేడుకున్నారు. ‘వీరి అభ్యర్థనలను పరిశీలిస్తాం. బాధితుల నుంచి మూడు, నాలుగు సూచనలందాయి. స్థానికంగా బీఎస్ఎఫ్ పోస్టులను ఏర్పాటు చేయడం ఇందులో ఒకటి. ఈ అంశాన్ని సంబంధిత యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తా. సానుకూల చర్యలను కచ్చితంగా తీసుకుంటాం. రాజ్భవన్లో అందుబాటులోకి తెచ్చిన హెల్ప్లైన్ నంబర్ను వారికి అందజేశా’అని గవర్నర్ మీడియాకు తెలిపారు. అనంతరం ధులియన్ బజార్ ప్రాంతంలో బాధితులను కలుసుకున్నారు. బాధితులు కోరిన ప్రకారం న్యాయం దక్కేలా చూస్తామన్నారు. జఫ్రాబాద్లోని బెట్బోనా గ్రామం వద్ద స్థానికులు రోడ్డుపై అడ్డంకులు ఏర్పాటు చేయగా గవర్నర్ ఆగి, వారిని శాంతపరిచారు. అంతకుముందు, ఫరక్కాలోని అతిథి గృహం వద్ద కూడా గవర్నర్ అల్లర్ల బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు జరిగిన అల్లర్లలో తండ్రి, కుమారుడు సహా ముగ్గురు చనిపోవడంతోపాటు భారీగా ఆస్తినష్టం సంభవించిన ఘటనలపై పోలీసులు 274 మందిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం గవర్నర్ ఆనందబోస్ మాల్డా జిల్లాలో తాత్కాలిక శిబిరంలో తలదాచుకుంటున్న అల్లర్ల బాధిత ముర్షిదాబాద్ వాసులను పరామర్శించడం తెల్సిందే. బాధితుల గోడు విన్న మహిళా కమిషన్ జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్ విజయా రాహత్కర్ శనివారం బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ధులియన్ తదితర వక్ఫ్ అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బెట్బోనా గ్రామంలో దుండగులు తమను భయభ్రాంతులకు గురి చేశారంటూ మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలి, బీఎస్ఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలి, దాడులపై ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలి అంటూ వారు ప్లకార్డులు ప్రదర్శించారు. హింసాత్మక ఘటనల తీవ్రత అనూహ్య స్థాయిలో ఉందని తెలిసిందని అనంతరం రాహత్కర్ మీడియాకు తెలిపారు. బాధితుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని వారికి హామీ ఇచ్చామన్నారు. ఇక్కడి బాధిత మహిళల డిమాండ్లపై హోం మంత్రి అమిత్ షాకు నివేదిక అందజేస్తామని ఎన్సీడబ్ల్యూ సభ్యురాలు అర్చనా మజుందార్ తెలిపారు. శుక్రవారం మాల్డాలో అల్లర్ల బాధితులను రాహత్కర్ సారథ్యంలోని బృందం కలుసుకోవడం తెల్సిందే. రాష్ట్రపతి పాలన విధించాలి: వీహెచ్పీ వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్లో చోటుచేసుకున్న అల్లర్లను నిరసిస్తూ శనివారం విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆందోళనలను నిర్వహించింది. బెంగాల్లో శాంతి భద్రతలు క్షీణించాయని, తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసింది. బెంగాల్లో హిందువులకు రక్షణ కలి్పంచాలని, ముర్షిదాబాద్ అల్లర్ల బాధితులకు తగు పరిహారం అందజేయాలని కోరింది. బెంగాల్లో బంగ్లాదేశీ–రొహింగ్యా చొరబాటుదార్లను గుర్తించి, వెళ్లగొట్టాలంది. సోమవారం కూడా నిరసనలు తెలుపుతామని తెలిపింది. -
బెంగాల్లో ‘వక్ఫ్’ ఉద్రిక్తతలు
కోల్కతా: వివాదాస్పద వక్ఫ్ చట్టానికి నిరసనగా పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శుక్రవారం కొందరు నిమ్టియా స్టేషన్లో నిలిపి ఉన్న రైలుపై రాళ్లతో దాడికి దిగారు. రైల్వే స్టేషన్ ఆస్తులను ధ్వంసం చేశారు. కనీసం పది మంది పోలీసులు సైతం ఈ దాడిలో గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు బీఎస్ఎఫ్ను రంగంలోకి దించారు. ఘటన నేపథ్యంలో రెండు రైళ్లను రద్దు చేశామని, మరో ఐదు రైళ్లను దారి మళ్లించామని అధికారులు తెలిపారు. రాళ్ల దాడిలో ప్రయాణికులు సైతం గాయపడ్డారని చెప్పారు. వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ ముర్షిదాబాద్లో ఆందోళనకారులు నిరసనకు దిగారు. అడ్డుకున్న పోలీసులతో తలపడ్డారు. కొన్ని వాహనాలకు నిప్పుపెట్టారు. సుటి, సంసేర్గంజ్, జంగీపూర్లలో పరిస్థితి నియంత్రణలోనే ఉందని పోలీసులు తెలిపారు. పోలీస్స్టేషన్పై దాడికి దిగిన వారిని చెదరగొట్టామన్నారు. జాతీయ రహదారిపై రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయన్నారు. కోల్కతాలోని అలియా వర్సిటీ విద్యార్థులు వక్ఫ్ చట్టంపై నిరసన ర్యాలీ నిర్వహించారు. కాగా, ముర్షిదాబాద్, నార్త్ 24 పరగణాల జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులపై గవర్నర్ సీవీ ఆనంద బోస్ స్పందించారు. హింసకు పాల్పడే వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. పరిస్థితులపై సీఎం మమతా బెనర్జీతో ఫోన్లో మాట్లాడారు. హోం మంత్రి అమిత్ షాకు పరిస్థితులను వివరించారు. సీఎం మమత ఈ నెల 16న కోల్కతాలో ఇమామ్లతో సమావేశం ఏర్పాటు చేశారని టీఎంసీ నేత కునాల్ ఘోష్ చెప్పారు. ముర్షిదాబాద్ జిల్లాలో మంగళవారం కూడా ఆందోళనల కారణంగా ఉద్రిక్తతలు తలెత్తాయి. -
శోభాయాత్రపై రాళ్ల దాడి.. సీఎం మమతపై బీజేపీ ఆగ్రహం!
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో శ్రీరామ నవమి శోభాయాత్రపై రాళ్ల దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ముర్షిదాబాద్ జిల్లాలోని రెజినగర్లోని శక్తిపూర్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా, కొందరు గాయపడినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో పోలీసులు లాఠీచార్జి చేశారని, రెజీనగర్లో ఒక వర్గాన్ని టార్గెట్ చేశారని బీజేపీ ఆరోపించింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బుధవారం సాయంత్రం శక్తిపూర్లో శ్రీరామనవమి ఊరేగింపులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళ గాయపడింది. బాధితురాలిని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించామని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. Mamata Banerjee is a blot on West Bengal. She, once again, failed to protect Ramanavami Shobha Yatras. Hindu devotees targeted in Rejinagar, Murshidabad. Hindus are a minority in this area. Just pointing it out, so that she doesn’t blame the Hindus for the attack on themselves… pic.twitter.com/pzvJt0aZ4x — Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) April 17, 2024 శ్రీరామ నవమి పండుగ సందర్భంగా పోలీసులు ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకున్నారని బీజేపీ నేత అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. శ్రీరామ నవమి ఊరేగింపునకు రక్షణ కల్పించడంలో సీఎం మమతా బెనర్జీ మరోసారి విఫలమయ్యారని ఆరోపించారు. శోభా యాత్రపై దాడికి మమతా బెనర్జీ మతపరమైన రెచ్చగొట్టే ప్రసంగాలే కారణమని అమిత్ మాల్వియా పేర్కొన్నారు. ముర్షిదాబాద్లో అల్లర్ల అనంతరం మేదినిపూర్లోని ఎగ్రాలో ఒక వర్గంపై దాడి జరిగింది. ఈ నేపధ్యంలో బీజేపీ కార్యకర్తలు ఎగ్రా పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టారు. ఈ ఘటనలకు బెంగాల్ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలంటూ నినాదాలు చేశారు. -
TMC MP: టీఎంసీ ఎంపీ కారు ఢీకొని ఏడేళ్ల బాలుడు..
కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఘోర ప్రమాదం జరిగింది. టీఎంసీ ఎంపీ అబు తాహెర్ ఖాన్ కారు ఢీకొట్టి ఏడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన ముర్షీదాబాద్ జిల్లాలో జరిగింది. ఘటన సమయంలో టీఎంసీ ఎంపీ కారులోనే ఉన్నారు. బాలుడు తన తల్లితో కలిసి సమీపంలోని బ్యాంకుకు వెళ్తూ రోడ్డు దాటే క్రమంలో కారు ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. సదరు ఎంపీ బాలుడ్ని వెంటనే తన కారులోనే సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే తలకు తీవ్రగాయాలు కావడం వల్ల బాలుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అబు తాహెర్ ఖాన్ టీఎంసీ తరఫున ముర్షీదాబాద్ నుంచే ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చదవండి: ఢిల్లీ హత్యోదంతం.. ఆ ఒక్క అబద్దమే అతడ్ని పట్టించింది.. -
పిల్లలపై ఒమిక్రాన్ పడగ; 7 ఏళ్ల బాలుడికి పాజిటివ్
7 Year Old Boy Tested Omicron Positive: భారత్లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పిల్లలు సైతం కొత్త వేరియంట్ కాటుకు గురవుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్లో మొదటి ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైంది. ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ఏడేళ్ల బాలుడికి ఒమిక్రాన్ సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణయింది. ఈ చిన్నారి తల్లిదండ్రులతో కలిసి అబుదాబి నుంచి డిసెంబర్ 10న హైదరాబాద్ మీదుగా బెంగాల్కు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆర్టీ- పీసీఆర్ పరీక్ష కోసం నమూనాలు సేకరించారు. బాలుడి నుంచి సేకరించిన నమూనాలో జీనోమ్ సీక్వెన్సింగ్ ఓమిక్రాన్ వేరియంట్ను చూపించింది. బాలుడి తల్లిదండ్రులకు ఒమిక్రాన్ సోకలేదని, వైద్య పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు వారికి సమాచారం అందించారు. దీంతో బాలుడిని ముర్షిదాబాద్ జిల్లాలో స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు ఒమిక్రాన్ బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ సర్కారు ముందుస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఇండియాలో ఒమిక్రాన్ కేసులు 40 దాటాయని వార్తలు వస్తున్నాయి. (చదవండి: చిన్నారులపై ఒమిక్రాన్ ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు) -
మమతకు జై కొట్టిన ‘కాంగ్రెస్’ జిల్లాలు
కోల్కతా: కాంగ్రెస్ కుంచుకోటలుగా ఉన్న ముస్లిం ఆధిక్య జిల్లాలైన మాల్దా, ముర్షీదాబాద్లు ఈసారి తృణమూల్కు జై కొట్టాయి. ఫలితంగా మమతా బెనర్జీ అద్వితీయ విజయం సాధ్యమైంది. ఈ రెండు జిల్లాల్లో టీఎంసీకి పెద్దగా పట్టులేదు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మాల్దా జిలాల్లోని 12 సీట్లలో టీఎంసీ ఒక్క సీటూ గెలువలేదు. ముర్షీదాబాద్లోని 22 స్థానాల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. ఈ రెండు జిల్లాల్లోని 34 స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 21 స్థానాల్లో (మాల్దాలో 7, ముర్షీదాబాద్లో– 14) నెగ్గింది. 2011 ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలో కాంగ్రెసే విజయ ఢంకా మోగించింది. 2021 ఎన్నికల నాటికి పరిస్థితి తారుమారైంది. ఈ ప్రాంతంలో అనూహ్యంగా తృణమూల్ పుంజుకుంది. రెండు జిల్లాల్లోని 32 స్థానాల్లో 24 సీట్లలో టీఎంసీ విజయం సాధించింది. పోటీలో ఉన్న వారిలో ఇద్దరు అభ్యర్థులు మరణించడంతో శంషేర్గంజ్, జంగీపూర్ స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 8 సీట్లలో విజయం సాధించి బీజేపీ కూడా ఈ ప్రాంతంలో గణనీయ స్థాయిలో బలపడింది. ముస్లిం జనాభా మెజారిటీగా ఉన్న ఈ ప్రాంతంలో కాంగ్రెస్, లెఫ్ట్, ఐఎస్ఎఫ్ కూటమి ఈ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానంలోనూ విజయం సాధించకపోవడం గమనార్హం. మార్పునకు కారణమేంటి? ఈ రెండు ముస్లిం ఆధిపత్య జిల్లాలు. మాల్దాలో 51% జనాభా, ముర్షీదాబాద్లో 66% జనాభా ముస్లింలే. చాన్నాళ్లుగా వీరు కాంగ్రెస్కు గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. కానీ, ఈ ఎన్నికల్లో, మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ముస్లింలు అత్యంత వ్యూహాత్మకంగా ఓట్లు వేసినట్లు స్పష్టమవుతోంది. తృణమూల్, బీజేపీ, కాంగ్రెస్ కూటమిల త్రిముఖ పోరులో, బీజేపీ వ్యతిరేక పార్టీల మధ్య తమ ఓట్లు చీలితే, అది అంతిమంగా బీజేపీకి లాభిస్తుందని వారు గుర్తించారు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలోనూ నార్త్ మాల్దా స్థానంలో చోటు చేసుకున్న త్రిముఖ పోరు వల్ల బీజేపీ లాభపడిన విషయాన్ని వారు మర్చిపోలేదు. దాంతో, కీలకమైన ఈ ఎన్నికల్లో ఆ తప్పు చేయవద్దని, తృణమూల్, కాంగ్రెస్ల మధ్య తమ ఓట్లు చీలకూడదని నిర్ణయించుకున్నారు. మూకుమ్మడిగా తృణమూల్కు మద్దతిచ్చారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత, వివాదాస్పద ఎన్నార్సీ, సీఏఏలను మమత గట్టిగా వ్యతిరేకించడం ముస్లింలకు ఆమెపై విశ్వాసం పెరగడానికి కారణమైంది. బీజేపీ గెలిస్తే సీఏఏ, ఎన్నార్సీలను అమలు చేస్తారన్న భయం కూడా ముస్లింలను మమతకు దగ్గర చేసింది. బీజేపీ గెలుపును అడ్డుకునేలా, ఈ రెండు జిల్లాల్లో ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్ సరళి తృణమూల్ ఘనవిజయానికి బాటలు వేసింది. -
ఫత్వా: టీవీ చూసినా, పాటలు విన్నా శిక్ష
కోల్కతా: ముర్షిదాబాద్ జిల్లాలోని మైనారిటీ ఆధిపత్య గ్రామానికి చెందిన అధిపతులు టెలివిజన్ చూడటం, క్యారమ్ ఆడటం, మద్యం లేదా లాటరీ టిక్కెట్లు కొనడం, అమ్మడం, సెల్ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా సంగీతం వినడం వంటి ఇతర కార్యకలాపాలపై నిషేధం విధించారు. సామాజిక సంస్కరణల కమిటీ రూపొందించిన ఈ ఫత్వా ఆగస్టు 9న జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి చెవులు పట్టుకొని క్షమాపణలు చెప్పడం, గుండు చేయించడం, గుంజిళ్లు తీయించడం వంటి శిక్షలతో పాటు రూ .500 నుంచి రూ .7000 వరకు జరిమానాలు విధించనున్నట్లు ఆ ఫత్వాలో పేర్కొన్నారు. ఈ కమిటీ సూచించిన శిక్షల జాబితా: టీవీ చూడటం, సంగీతం వినడానికి మొబైల్ ఫోన్లు లేదా కంప్యూటర్ ఉపయోగించడం: రూ. 1,000 జరిమానా క్యారమ్ బోర్డు ఆడటం: రూ. 500 జరిమానా లాటరీ కొనుగోలు: రూ. 2,000 జరిమానా మద్యం అమ్మకం: రూ. 7,000తో పాటు గుండు చేసి గ్రామంలో ఊరేగిస్తారు. లాటరీ టికెట్లను అమ్మడం: రూ. 7,000 జరిమానా మద్యం సేవించడం: రూ. 2,000 జరిమానా, 10 గుంజిళ్లు గంజాయి కొనుగోలు: రూ. 7,000 జరిమానా అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారి గురించి తెలియజేసేవారికి నేరం స్వభావాన్ని బట్టి 200 నుంచి 2,000 రూపాయల వరకు రివార్డును కూడా కమిటీ ప్రకటించింది. యువ తరం నైతిక, సాంస్కృతిక పద్దతులను తప్పి చెడు మార్గాలలో వెళ్లకుండా ఆపడానికి వీటిపై నిషేధం విధించినట్లు కమిటీ పేర్కొంది. చదవండి: కారంపొడి కొట్టి మరీ దొరికిపోయాడు -
‘ట్రంప్ను సంతోషపెట్టేందుకు నానా తిప్పలు’
ముర్షిదాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ను అలనాటి బాలీవుడ్ విలన్ అమ్రిష్ పురితో పోల్చారు. మిస్టర్ ఇండియా సినిమాలో అమ్రిష్ పురి క్యారెక్టర్ మొగాంబోగా వ్యాఖ్యానించారు. ఆ చిత్రంలో 'ఖుష్ హోగయా' అనే డైలాగ్ను సంతోషం వ్యక్తం చేస్తూ అమ్రిష్ పురి వాడుతుంటాడు. అదే తరహాలో ట్రంప్ను సంతోష పెట్టేందుకు భారత ప్రభుత్వం నానా అవస్థలు పడుతుందని అధీర్ రంజన్ ఎద్దేవా చేశారు. (వైరల్ : బాహుబలిగా అదరగొట్టిన ట్రంప్) ట్రంప్ను సంతోషం పెట్టేందుకు కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందని ? మురికి వాడల్లో నివసిస్తున్న పేదవారిని అంతగా దాచిపెట్టాల్సిన పని ఏంటని? మోదీ సర్కార్పై ధ్వజమెత్తారు. అభివృద్ధికి ఓ నమూనాగా గుజరాత్ను డెవలప్ చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ... అక్కడ పేదలను మాత్రం దోపిడీకి గురి చేస్తుందని మండిపడ్డారు. మొగాంబోను సంతోషం పెట్టడానికి మేం ఏదైనా చేస్తామన్న రీతిలో కేంద్రం ప్రవర్తించడం సిగ్గుచేటరన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా తాము నిరసనకు దిగుతామన్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 25 న డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం ఏర్పాటు చేస్తున్న విందు కోసం రాష్ట్రపతి భవన్ చేసిన ఆహ్వానాన్ని కూడా ఆయన తిరస్కరించారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎందుకు ఆహ్వానం ఇవ్వలేదని ప్రశ్నించారు. 'ట్రంప్ భారత్కు వస్తున్నారు. భారతదేశం ఆయన కోసం గ్రాండ్ డిన్నర్ నిర్వహించనున్నప్పటికీ ప్రతిపక్షాలను ఆహ్వానించలేదు. సోనియా గాంధీని ట్రంప్తో విందుకు ఆహ్వానం లేదు. 'హౌడీ మోడీ' కార్యక్రమంలో రిపబ్లికన్, డెమొక్రాట్లు ఇద్దరూ వేదికను పంచుకున్నారు. అయితే ఇక్కడ మోదీ మాత్రమే ట్రంప్తో ఉంటారు. ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం? ' అని చౌదరి కేంద్ర సర్కార్ను నిలదీశారు. తాను వ్యక్తిగతంగా మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశానని, నిజంగా ట్రంప్ భారతదేశానికి రావడం చాలా గొప్ప విషయమన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్న అమెరికాకు అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్ను మేము మనస్పూర్తిగానే స్వాగతిస్తున్నమని తెలిపారు.అయితే భారతదేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరికి ఉంటుందని, వాటి లక్షణాలను గౌరవించాల్సిందేనని చౌదరి పేర్కొన్నారు. (అవును నేను పాకిస్తానీనే.. బీజేపీకి సవాల్) -
బెంగాల్ లో బాంబుల మోత:ముగ్గురి మృతి
ముర్షిదాబాద్: మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా పశ్చిమ బెంగాల్ లో హింస చెలరేగింది. అయితే నిత్యం చోటుచేసుకునే తృణమూల్ కాంగ్రెస్, సీపీఎంల సంఘర్షణలా కాకుండా ఈసారి ఒకే పార్టీకి చెందిన రెండు గ్రూపులు నాటు బాంబులు విసురుకున్నాయి. ముర్షిదాబాద్ జిల్లా భరత్ పూర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఒక వర్గం లక్ష్యంగా మరొక వర్గం విసిరిన నాటుబాంబులు పేలి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు సమాచారం తెలిసిన వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో విపక్ష పార్టీ సీపీఎం సభ్యులతో తన్నులాటలకు దిగుతోన్న తృణమూల్ కాంగ్రెస్.. స్వపక్షంలో గ్రూపు తగాదాలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో పార్టీ ఆందోళనలో పడింది.


