national channel
-
మరోసారి ‘రామాయణ్’
న్యూఢిల్లీ: హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని జీవితగాథ ఆధారంగా తీసిన రామాయణ్ ధారావాహిక మరోసారి దేశవ్యాప్తంగా ప్రజలను అలరించనుంది. ఈ సీరియల్ను ఈనెల 28వ తేదీ నుంచి దూరదర్శన్ డీడీ నేషనల్ చానెల్లో ప్రసారం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. దేశమంతా కరోనా లాక్డౌన్లో ఉన్న నేపథ్యంలో ప్రజల కోరిక మేరకు ఈ ఆధ్యాత్మిక సీరియల్ను మరోసారి ప్రసారం చేయాలని నిర్ణయించామన్నారు. శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఒక ఎపిసోడ్, తిరిగి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు మరో ఎపిసోడ్ను దూరదర్శన్లో చూడొచ్చని శుక్రవారం ట్విట్టర్లో ప్రకటించారు. 1987లో మొదటిసారిగా దూరదర్శన్లో రామాయణ్ ప్రసారమైంది. -
కాస్ట్ కటింగ్ సెగ : ఆకాశవాణి జాతీయ ఛానెల్ మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ : ఆలిండియా రేడియో జాతీయ చానల్కు కాస్ట్ కటింగ్ సెగ తాకింది. ఆకాశవాణి జాతీయ ఛానల్ ప్రసారాలు హేతుబద్దీకరణ, నిర్వహణ వ్యయం తగ్గింపులో భాగంగా ఆల్ ఇండియా రేడియో (ఎఐఆర్) జాతీయ ఛానల్ను మూసివేయాలని ప్రభుత్వ రంగ ప్రసార సంస్థ ప్రసార భారతి నిర్ణయించింది. ఈ మేరకు ప్రసారభారతి తన నిర్ణయాన్నిడిసెంబరు 24న ఎఐఆర్ డైరెక్టరేట్కు తెలిపింది. ఇందుకోసం గత ఏడాది పలుమార్లు సంప్రదింపులు, చర్చలు జరిపిన అనంతరం తుది నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని వెంటనే అమలు చేయాలని ఆలిండియా రేడియోను ఆదేశించింది. అలాగే అకాడమీస్ ఆఫ్ బ్రాడ్ కాస్టింగ్ అండ్ మల్టీ మీడియాను కూడా మూసివేయాలని నిర్ణయించింది. అలాగే ఐదు నగరాలు, అహ్మదాబాద్ హైదరాబాద్, లక్నో, షిల్లాంగ్, తిరువనంతపురంలోని ప్రాంతీయ శిక్షణా అకాడెమీలను రద్దు చేయనుంది. ఇది తక్షణమే అమల్లోకి రానుంది. తోడాపూర్, నాగపూర్ సహా ఇతర నగరాల్లోని సిబ్బందిని వేరే ప్రదేశాలకు సర్దుబాటు చేయనుంది. జాతీయ చానెల్ ద్వారా భద్రపరిచే కార్యక్రమాల ఆర్కైవ్స్ను, డిజిటలైజేషన్కోసం ఢిల్లీలోని సెంట్రల్ ఆర్కైవ్స్ సెంటర్కు పంపించాలని జనవరి 3, 2019 తేదీన ఇచ్చిన ఉత్తర్వులో పేర్కొంది. జాతీయ ఛానల్కు సంబంధించిన ట్రాన్స్మీటర్లు బలహీనంగా ఉండటం కూడా మూసివేతకు కారణమని ఏఐఆర్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. నాగపూర్లో ఉన్న ఒకే ఒక ట్రాన్స్మీటరు మాత్రమే ఒక మెగావాట్ సామర్థ్యాన్ని కలిగి ఉందనీ, ప్రస్తుత డిజిటల్ రేడియో యుగంలో ఇది సరిపోదని వ్యాఖ్యానించారు. అలాగే పటిష్టమైన శ్రోతల ప్రాతిపదిక లేని ఛానల్లో పెట్టుబడులు పెట్టడం సరైంది కాదని సీనియర్ నిర్వాహకులు భావించారని ఆయన వివరించారు. అంతేకాదు ప్రస్తుతం కొన్ని ఏఐఆర్ కార్యక్రమాలను అవుట్సోర్స్ ద్వారా నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా ఏఐఆర్ వెబ్సైట్ను ప్రైవేటు వ్యక్తుల ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏఐఆర్లోని కొన్ని విభాగాలు ఈ నిర్ణయంపై విచారాన్ని వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ ఛానల్ ప్రసారాలు చాలా ముఖ్యమైన భాగమని, మొత్తంగా దాన్ని మూసివేయడం కంటే ఖర్చులను తగ్గించుకునేందుకు ఇతర మార్గాలను అన్వేషించాలని కోరుతున్నాయి కాగా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటలకు జాతీయ ప్రసారాలు ప్రసారమయ్యే నేషనల్ చానల్ 1987లో ప్రారంభమైంది. 31 సంవత్సరాలకుపైగా జాతీయ వార్తలను, కీలక అంశాలను ప్రజలకు చేరవేయడంలో చురుకైన కీలక పాత్ర పోషించింది. -
'నా భార్య మరణంపై దాచిందేం లేదు'
తిరువనంతరపురం: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ మంగళవారం మీడియాపై ఎదురుదాడి చేశారు. తన భార్య సునంద పుష్కర్ హత్యకు గురయ్యారని ఓ జాతీయ టీవీ చానెల్ వేసిన కథనంపై ఆయన స్పందించారు. పుష్కర్ మరణం గురించి తాను దాచిందేం లేదని అన్నారు. 2014 జనవరి 17వ తేదీన దక్షిణ ఢిల్లీలోని లీలా హోటల్లో పుష్కర్ చనిపోయి కనిపించారు. పుష్కర్ మరణంపై తాజాగా ఓ కథనం వేసిన జాతీయ చానెల్.. ఆమె మరణం వెనుక శశిథరూర్ హస్తం ఉందని పేర్కొంది. దీంతో షాక్కు గురైన శశిథరూర్.. మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగా మీడియా రంగంలోకి వచ్చిన చానెల్ గుర్తింపు కోసం తనపై బురద జల్లుతోందని ఆరోపించారు. వ్యవస్ధలో మీడియాకు చాలా ముఖ్య పాత్ర ఉన్నా.. ఓ జడ్జికి రాజ్యాంగా పరంగా లభించిన హక్కు దానికి లేదని అన్నారు. పుష్కర్ మృతిపై పోలీసులతో తన వద్ద ఉన్న సమాచారం మొత్తం చెప్పానని తెలిపారు. గత మూడేళ్లుగా పోలీసుల విచారణలో ఉన్న అంశాలనే చానెల్ కూడా చూపించిందని చెప్పారు. సునంద మరణం హత్యో.. కాదో.. పోలీసులు ఇంకా నిర్ధారణకు రాలేదని చెప్పారు. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో ఎయిమ్స్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పుష్కర్ మరణం విష ప్రయోగం వల్ల సంభవించిదని పేర్కొన్న విషయం తెలిసిందే. చానెల్ కథనం ఏంటి? పుష్కర్ మరణం అనంతరం లీలా హోటల్లో ఆమెను ఉన్న గది నుంచి మరో గదికి మార్చినట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించి శశిథరూర్కు సన్నిహితుడైన ఓ వ్యక్తికి.. చానెల్ న్యూస్ కరస్పాడెంట్కు మధ్య జరిగిన 19 కాల్ల సంభాషణలను వినిపించింది. పోలీసులు హోటల్కు చేరుకునే లోపు పుష్కర్ బాడీని హోటల్లోని రూం నెంబర్ 307 నుంచి రూం నెంబర్ 345కు మార్చారని పేర్కొంది. ఆ సమయంలో హత్యను ఆత్మహత్యగా చిత్రికరించేందుకు యత్నించినట్లు చెప్పింది. పుష్కర్ మరణానికి ముందు భర్త శశిథరూర్తో వాగ్వాదం జరిగిందని పేర్కొంది. అంతకుముందు రోజు పాకిస్తానీ జర్నలిస్టు మెహర్ తరార్ను ఉద్దేశించి పుష్కర్ ట్వీట్ చేసినట్లు వెల్లడించింది. థరూర్, తరార్ల మధ్య ఉన్న సంబంధంపై ఆమె ట్వీట్లో పేర్కొన్నట్లు తెలిపింది. పుష్కర్ ట్వీట్ను తరార్ థరూర్కు పంపినట్లు పేర్కొంది. పోస్టుమార్టం రిపోర్టులో పుష్కర్ ఎక్కువ స్లీపింగ్ పిల్స్ను తీసుకోవడం వల్ల మరణించిందని ఉందని చెప్పింది. పుష్కర్ హత్యకు గురయ్యారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? అనే విషయం ధ్రువీకరించలేకపోతున్నట్లు రిపోర్టులో ఉందని సదరు చానెల్ వివరించింది. -
బాంబు పేలుళ్ల నిందుతుడు మెమన్ ఇంటర్వ్యూ!