O. Panneer selvam
-
రేపు తమిళనాడు సీఎంగా పన్నీరు సెల్వం ప్రమాణం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పన్నీరు సెల్వంను శాసనసభపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్ రోశయ్యను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు పన్నీరు సెల్వంను రోశయ్య ఆహ్వానించారు. తమ పార్టీ అధినేత్రి జయలలిత ఆదేశాల మేరకు పన్నీరు సెల్వంను నాయకుడిగా ఎన్నుకున్నామని అన్నాడీఎంకే నేతలు వెల్లడించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు జైలు శిక్షపడటంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో జయలలిత తనకు అత్యంత నమ్మకస్తుడైన పన్నీరు సెల్వంను తన వారసుడిగా ఎంపిక చేశారు. పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఇది రెండోసారి. పన్నీరు సెల్వం జీవిత విశేషాలు: 1951లో జననం 1996లో రాజకీయాల్లో ప్రవేశం 2001 నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక 2001లో సీఎంగా ప్రమాణం ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు -
పన్నీరు సెల్వంకు రోశయ్య ఆహ్వానం
-
పన్నీరు సెల్వంకు రోశయ్య ఆహ్వానం
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు ఓ. పన్నీరు సెల్వంను గవర్నర్ కె. రోశయ్య ఆహ్వానించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అంతకుముందు పన్నీరు సెల్వంను శాసనసభపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమ పార్టీ అధినేత్రి జయలలిత ఆదేశాల మేరకు ఆయనను నాయకుడిగా ఎన్నుకున్నామని అన్నాడీఎంకే నేతలు వెల్లడించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు జయలలిత సీల్డ్ కవర్ లో పంపించినట్టు వార్తలు వచ్చాయి. పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఇది రెండోసారి. రేపు ఆయన ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. -
తమిళనాడు సీఎంగా పన్నీరు సెల్వం
-
పన్నీరు సెల్వంకే పట్టం
చెన్నై: జయలలిత తన అనుంగు అనుచరుడు ఓ. పన్నీరు సెల్వంపై మరోసారి నమ్మకముంచారు. ముఖ్యమంత్రిగా ఆయనకు మళ్లీ పట్టం కట్టారు. 'అమ్మ' ఆదేశాల మేరకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆయనను శాసనసభపక్ష నేతగా ఎన్నుకున్నారు. సీఎం పదవికి పలువురు పేర్లు వినిపించినా 'విశ్వాసపాత్రుడు'వైపే పురచ్చితలైవి మొగ్గుచూపారు. గతంలో జైలుకు వెళ్లినప్పుడు కూడా పన్నీరు సెల్వంకే ఆమె ముఖ్యమంత్రి పదవి అప్పగించిన సంగతి తెలిసిందే. రెండోసారి కూడా ఆయనకే అవకాశం దక్కడం గమనార్హం. పన్నీరు సెల్వం రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది.