Palle Nidra
-
పల్లెనిద్ర కార్యక్రమంలో మంత్రి రోజా
-
పల్లె నిద్రలో మంత్రి రోజా
-
సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు :రోజా
-
20,21 తేదీల్లో బీజేపీ పల్లె నిద్ర
సాక్షి, అమరావతి: ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రాజకీయంగా టీడీపీ బలహీనంగా ఉందని, ఈ నేపథ్యంలో ఆ పార్టీ మండల నేతలను స్వయంగా కలిసి బీజేపీలోకి ఆహ్వానించాలని ఆ పార్టీ నిర్ణయించింది. మంగళవారం రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. టీడీపీ నేతలను ఆకర్షించాలనే ప్రణాళికలో భాగంగానే ఈ నెల 20, 21 తేదీల్లో పార్టీ నేతల ఆధ్వర్యంలో కనీసం 500 గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. 18,19 తేదీల్లో తిరుపతి, విజయవాడలో సభలు.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లేందుకు ఈనెల 18,19 తేదీల్లో తిరుపతి, విజయవాడలో రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి కిషన్ రెడ్డి ఆ సభలలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. 29వ తేదీ నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తెలుగు భాష పరిరక్షణ కోసం సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి సోమవారం ’స్పందన’లో ప్రజల సమస్యలను పార్టీ పరంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. నేతలు సునీల్ థియోధర్, మధుకర్జీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి గ్రామానికి సేవ చేస్తా
టేకుమట్ల: పల్లెల అభివృద్ధే నా ఎజెండా.. ప్రతీ పల్లె అభివృద్ధి చెందేవరకూ విశ్రమించనని స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని వెంకట్రావుపల్లి(బి) గ్రామంలో పల్లె ప్రగతి నిద్ర ముగింపు సందర్భంగా ప్రతి వాడలో తిరుగుతూ ప్రజల అవసరాల ను తెలుకున్నారు. శనివారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు భరోసానిచ్చారు. గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన బండి రాజు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎవరూ చేయలేని అభివృద్ధి పనులను చేశానని, అందుకు ప్రజలే సాక్ష్యమన్నారు. కరీంనగర్ నుంచి టేకుమట్ల మండలం మీదుగా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి జాతీయ రహదారి, ఓడేడు మానేరుపై అంతర్జిల్లా వంతెనతో గోదావరిఖని నుంచి హన్మకొండకు డబుల్ రోడ్డుతో ప్రయాణికుల రవాణాను త్వరలో మెరుగుపర్చే కార్యక్రమం ముందుకు సాగుతుందన్నారు. రైతుల సాగు నీటికి ఇబ్బంది కలుగకుండా భారీ బడ్జెట్తో మానేరులో చెక్డ్యామ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశానన్నారు. చెరువు శిఖం భూమిని కొందరు అక్రమంగా కబ్జా చేస్తున్న తీరును గ్రామస్తులు స్పీకర్కు తెలపడంతో స్పందించిన ఆయన వెంట నే తహసీల్దార్తో మాట్లాడి అక్రమార్కుల నుంచి భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట నాయకులు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కత్తి సంపత్, మండల ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, ఏకు మల్లేష్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఒరంగంటి సధాకర్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కూర సురేందర్రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు నేరేళ్ల శ్రీనివాస్గౌడ్, నాయకులు కొలిపాక రాజయ్య, వంగ కుమారస్వామి, రాంరెడ్డి, డాక్టర్ ఏకు నవీన్, సంగి రవి, కమురోద్ధిన్, పైడిపెల్లి సతీష్, మామిండ్ల ఎల్లస్వామి, వర్థాచారి, బందెల శ్రీనివాస్ యువజన నాయకులు అభిరాజు, తోట సాగర్, అందె కుమార్, బీనవేని ప్రభాకర్గౌడ్, దొడ్ల కోటి, బండమీది అశోక్, గునిగంటి మహేందర్, మల్లికార్జున్, శ్రీపతి రాకేష్, నాంపెల్లి వీరేశం, బొజ్జపెల్లి తిరుపతి, గంధం సురేష్, కిష్టస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
నాకు అవసరం లేదు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్ సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి మరోమారు ప్రభుత్వం కేటాయించిన గన్మెన్లను నిరాకరించారు. మూడున్నర ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజే పోలీసు భద్రతా విభాగం ఇద్దరు గన్మెన్లను ఆయనకు కేటాయించింది. తనకు అవసరం లేదంటూ అప్పట్లోనే జిల్లా ఎస్పీకి లేఖద్వారా తెలిపారు. తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలను అనుసరించి మరో రెండుసార్లు గన్మెన్లను ప్రభుత్వం కేటాయించగా తిప్పి పంపారు. తాజాగా సోమవారం మళ్లీ ఇద్దరు గన్మెన్లను కేటాయించగా.. ఈసారీ వెనక్కి పంపారు. పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో భద్రత తప్పనిసరి అని, అందుకే పంపామని పోలీస్ అధికారులు ఎమ్మెల్యే కోటంరెడ్డికి స్పష్టం చేశారు. అయితే, తనకు ఎలాంటి భద్రత అవసరం లేదంటూ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి డీజీపీ, ఇంటిలిజెన్స్ డీజీ, జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. తనకు భద్రత వద్దని, పార్టీ కార్యకర్తలు, ప్రజలే తనకు కొండంత అండ అని తెలిపారు. -
ప్రజలతో మమేకం
సాక్షి, తిరుపతి: జిల్లాలోని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుం టూ ముందుకు సాగుతున్నారు. ఆదివారం మదనపల్లె, పూతలపట్టు, చిత్తూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు, గంగాధరనెల్లూరు నియోజకర్గాల్లో రచ్చబండ, పల్లెనిద్ర చేపట్టారు. మదనపల్లె మండలం కోటవారిపల్లెలో ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్తిప్పారెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు పరిధిలోని గుడిపాల మండలం చీలాపల్లె పం చాయతీ రాసనిపల్లెలో పార్లమెంటరీ ఇన్చార్జ్ జంగాలపల్లె శ్రీనివాసులు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తి పరిధిలోని తొట్టంబేడు మండలం పొయ్యిగ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్రెడ్డి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. గంగాధరనెల్లూరు పరిధిలోని పాతగుంటలో ఎమ్మెల్యే నారాయణస్వామి రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పూతలపట్టు నియోజక వర్గం బంగారుపాళెం మండలం జంబుగానిపల్లెలో ఎమ్మెల్యే సునీల్కుమార్ రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించా రు. సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలంలో ఎంజీనగర్, అరుంధతివాడ, సిద్ధాపురం, అంబికాపురం గ్రామాల్లో రచ్చబం డ నిర్వహించారు. ఎంజీనగర్ గిరిజన కాలనీ లో కోనేటి ఆదిమూలం పల్లెనిద్ర చేపట్టారు. -
నేతన్నల బతుకుల్లో జగన్ వెలుగు నింపుతారు
-
’పల్లెనిద్ర’ చేసిన ఎమ్మెల్యే నాని