parigi accident
-
ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య
రంగారెడ్డి జిల్లా పరిగి సమీపంలో డీసీఎం బోల్తాపడిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. బుధవారం పరిగి సమీపంలో పెళ్లి బృందంతో వెళుతున్న డీసీఎం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అదే రోజు ఏడుగురు ప్రాణాలు కోల్పోగా 25 మంది వరకు గాయాలపాలై హైదరాబాద్లోని పలు ఆస్పత్రుల్లో చేరారు. వారిలో మర్పల్లి మండలం మొగిలిగుండ్లకు చెందిన ఎస్.అంజయ్య(38) శుక్రవారం మృతి చెందాడు. మరో 15 మంది వరకు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుండగా... సుమారు పది మంది వరకు డిశ్చార్జ్ అయ్యారు. మద్యం మత్తులో ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ పరారు కాగా, అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
ఏడుకు పెరిగిన పరిగి మృతుల సంఖ్య
పరిగి: రంగారెడ్డి జిల్లా పరిగి సమీపంలో రుకుంపల్లి గేట్ వద్ద బుధవారం ఉదయం పెళ్లి బృందం వ్యాను బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. సంఘటనా స్థలంలో నలుగురు మృతి చెందగా..15 మందికి పైగా తీవ్రంగా గాయపడడంతో వారిని హైదరాబాద్లోని షాదాన్, ఉస్మానియా ఆస్పత్రులకు తరలించారు. షాదాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతులను నవీన్, సంతోష్, శరణ్య, అనసూయ, లక్ష్మి, బుచ్చయ్య, మానయ్యలుగా గుర్తించారు. -
పరిగి ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పరిగి సమీపంలో బుధవారం జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివాహ వేడుకకు వెళ్తూ నలుగురు మృతిచెందడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా, ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి ఆరా తీశారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.