హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పరిగి సమీపంలో బుధవారం జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివాహ వేడుకకు వెళ్తూ నలుగురు మృతిచెందడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా, ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి ఆరా తీశారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.
పరిగి ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి
Published Wed, Mar 30 2016 1:22 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement
Advertisement