condolence
-
వైవీ సుబ్బారెడ్డి తల్లి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న యర్రం పిచ్చమ్మ(85) ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. మాతృమూర్తి మృతి వార్త తెలియడంతో వైవీ సుబ్బారెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయలుదేరారు. కాగా, పార్లమెంట్ సమావేశాల కోసం సుబ్బారెడ్డి నిన్ననే ఢిల్లీకి వెళ్లారు. నేడు ఒంగోలులోనే సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ పార్థివదేహం ఉండనుంది. రేపు ఉదయం 10:30 గంటలకు మేదరమెట్లలో ఆమె అంత్యక్రియల జరగనున్నాయి. పిచ్చమ్మ పార్థివదేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించనున్నారు. -
భారతీయ చిత్రసీమలో ఆయనొక లెజెండ్ : వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగళ్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆయనొక సందేశం ఉంచారు. ‘‘భారతీయ చిత్రసీమలో ఒక లెజెండ్ శ్యామ్ బెనగల్(Shyam Benegal). చిత్ర నిర్మాణానికి ఆయన చేసిన కృషి లక్షలాది మంది దర్శకులకు స్ఫూర్తినిస్తూనే ఉంది. శ్యామ్ బెనగల్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని తన సందేశంలో వైఎస్ జగన్ పేర్కొన్నారు.Deeply saddened by the passing of Shyam Benegal Ji, a legend in Indian cinema. His contributions to filmmaking continue to inspire millions of directors. May his soul rest in peace. pic.twitter.com/mw92JPkZFV— YS Jagan Mohan Reddy (@ysjagan) December 24, 2024హైదరాబాద్లో జన్మించిన శ్యామ్ బెనెగల్.. ఎన్నో కళాత్మకచిత్రాలను(Art Films) తెరకెక్కించారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన.. నిన్న(డిసెంబర్ 23, 2024) సాయంత్రం 6గంటల 38నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. బెనెగల్ మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సహా సినీ, రాజకీయ ప్రముఖలు సంతాపం తెలిపారు. ప్రభుత్వ లాంఛనాల నడుమ.శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు ఇవాళ ముంబైలో పూర్తయ్యాయి. -
జాకీర్ హుస్సేన్ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ తుదిశ్వాస విడిచారు. జాకీర్ హుస్సేన్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.జాకీర్ హుస్సేన్ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్ మరణించటం బాధ కలిగించింది. సంగీత విద్వాంసుడు అయిన జాకీర్ హుస్సేన్ భారతీయ శాస్త్రీయ సంగీతంలో చెరగని ముద్ర వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. జాకీర్ హుస్సేన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. -
రతన్ టాటా మృతికి మంత్రిమండలి నివాళి
సాక్షి, అమరావతి: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతికి ఏపీ మంత్రి మండలి సంతాపం తెలిపింది. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమైంది. రతన్ టాటా చిత్రపటానికి ముఖ్యమంత్రి, మంత్రులు పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పారిశ్రామికవేత్తగానే కాకుండా గొప్ప దాతృత్వ సేవలు అందించడంతో కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్తో రతన్ టాటాను సత్కరించిందని కొనియాడారు. విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్ను సృష్టించారన్నారు. రతన్ టాటా మృతి నేపథ్యంలో మంత్రి మండలి సమావేశంలో చర్చించాల్సిన అజెండాను వాయిదా వేశారు. అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ముంబై బయలుదేరి వెళ్లారు. దేశానికి తీరని లోటు: పరిశ్రమల శాఖ దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ ఘన నివాళి అర్పించింది. మంగళగిరిలోని పరిశ్రమల శాఖ ప్రధాన కార్యాలయంతోపాటు ప్రతి జిల్లాలోనూ పరిశ్రమల శాఖ కార్యాలయాల్లో రతన్ టాటాకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ రతన్ టాటా తన జీవితం చివరి వరకు విలువలు పాటించి ఎంతో సాధారణ జీవితం గడిపారన్నారు. రతన్ టాటా మరణం భారతదేశానికి తీరని లోటు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ అడిషనల్ ఏవీ పటేల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
విప్లవ వీరుడు రావికి కుటుంబ సభ్యుల నివాళి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సేనాని, పద్మ విభూషణ్ రావి నారాయణరెడ్డికి ఘన నివాళి అర్పించారు. ఆయన స్వగ్రామం బొల్లేపల్లి, బంజారాహిల్స్లోని రావి నారాయణరెడ్డి భవన్తో పాటు ఆయన నివాసంలో ఆయన కోడలు రావి ఊర్మిల, మనుమరాలు రావి ప్రతిభా రెడ్డిలు నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ప్రతిభా రెడ్డి మాట్లాడుతూ..‘రావి నారాయణరెడ్డి స్వయంగా తన భూమిని దానం చేయటంతో పాటు అదే భూమి, భుక్తి, విముక్తి కోసం తెలంగాణ భూమి కోసం రైతాంగ పోరాటాన్ని నడిపిన తీరును జ్ఞాపకం చేసుకున్నారు. రావి నారాయణరెడ్డి, తెలంగాణ సాయుధ పోరాట గాధలను ఈ తరానికి తెలియచెప్పే దిశగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. -
‘లద్దాఖ్’లో జవాన్ల మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి,తాడేపల్లి : లద్దాఖ్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన ఏపీ జవాన్ల కుటుంబాలకు కోటి చొప్పున ఆర్థిక సహాయం చేయాలని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం(జులై1) ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. లద్దాఖ్లో యుద్ధట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు జవాన్లు మరణించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. దేశ రక్షణలో జవాన్ల సేవలు చిరస్మరణీయమని గుర్తుచేశారు. లడఖ్లో యుద్ధ ట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు వీరమరణం పొందడం తీవ్రంగా కలిచివేసింది. దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరువలేనివి. వీరమరణం పొందిన జవాన్లలో కృష్ణా జిల్లాకి చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లాకి చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లాకి చెందిన…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 1, 2024వారి త్యాగాలు మరువలేనివని కీర్తించారు. ‘కృష్ణాజిల్లా పెడన మండలం చేవెండ్రకు చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి (జేసీవో) ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్ కు చెందిన సుభాన్ ఖాన్ల కుటుంబాలకు నా సంతాపం. రాష్ట్ర ప్రభుత్వం ఆయా కుటుంబాలను ఆదుకోవాలి. మరణించిన జవాన్ల కుటుంబానికి కోటి రూపాయల చొప్పున ఆర్థికసాయం చేయాలి. ఆయా నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు జవాన్ల అంత్యక్రియల్లో పాల్గొని వారి కుటుంబాలకు బాసటగా నిలవాలి’అని వైఎస్ జగన్ కోరారు. -
ధర్మపురి శ్రీనివాస్కు ప్రముఖుల నివాళి (ఫొటోలు)
-
ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం
ధర్మపురి శ్రీనివాస్కు ప్రముఖుల సంతాపం లైవ్ అప్డేట్స్.. కేసీఆర్ సంతాపం..👉ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.కేటీఆర్ సంతాపం..👉రాజకీయాల్లో అజాత శత్రువు ధర్మపురి శ్రీనివాస్. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన చనిపోవటం బాధాకరమైన విషయం. శ్రీనివాస్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన కేటీఆర్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి👉ధర్మపురి శ్రీనివాస్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే దానం నాగేందర్సీఎం రేవంత్ సంతాపం.. 👉ధర్మపురి శ్రీనివాస్ పట్ల సీఎం రేవంత్ సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పని చేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్ రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారని స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారని గుర్తు చేసుకున్నారు. ధర్మపురి శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం..👉 ఈరోజు చాలా బాధాకరమైన రోజు. శ్రీనివాస్కు కాంగ్రెస్ అంటే ప్రాణం. మాలాంటి ఎంతోమంది ఎదుగుదలకి ధర్మపురి శ్రీనివాసే కారణం. డీఎస్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తన్నాం. 👉కాంగ్రెస్ నేతల నివాళులు..కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపజేసిన కీలక నేతల్లో డి.శ్రీనివాస్ ఒకరని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. డీఎస్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడిగా డీఎస్ సేవలు గుర్తు చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, వారి కుటుంబసభ్యులకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వీరితో పాటు డీఎస్ మృతిపట్ల మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, వి.హనుమంతరావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. డీఎస్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు.శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డి.శ్రీనివాస్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, డీఎస్ గొప్ప నాయకునిగా ఎదిగారని కొనియాడారు. సామాన్య స్థాయి నుంచి పీసీసీ అధ్యక్షుడు, మంత్రిగా పని చేసే స్థాయికి ఆయన ఎదిగారని గుర్తు చేశారు. డీఎస్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్టిస్తున్నట్లు సుఖేందర్ రెడ్డి తెలిపారు.👉కిషన్ రెడ్డి సంతాపం..ధర్మపురి శ్రీనివాస్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారు. 2004-2009లో అసెంబ్లీలో వారందించిన ప్రోత్సాహం మరువలేనిది.శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బీజేపీ ఎంపీ అరవింద్, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.👉డీఎస్ మృతి బాధాకరం: డీకే అరుణడీఎస్ తనయుడు ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, వారి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి ఓదార్చిన డీకే అరుణ. మంత్రిగా, పీసీసీ చీఫ్గా, ఎంపీగా డీఎస్ చేసిన సేవలు మరువలేనివి. శ్రీనివాస్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను. 👉డీ శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అలాగే, నారా లోకేష్ కూడా సంతాపం ప్రకటించారు. 👉తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుండెపోటుతో చనిపోయారు. -
రామోజీరావు అస్తమయంపై ప్రముఖుల సంతాపం
సాక్షి, హైదరాబాద్: రామోజీరావు మరణం పట్ల రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోదీతో పాటు రేవంత్రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి, వెంకయ్యనాయుడు, కిషన్రెడ్డి తదితరులు తమ సంతాపం తెలియజేశారు. ప్రస్తుతం ఫిల్మ్సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. రేపు ఉదయం అంత్యక్రియలు జరగనున్నాయి.వెంకయ్యనాయడు.. చేపట్టిన ప్రతీ పనిలో రామోజీరావు విజయంసాధించారుప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా గర్వపడేలా చేశారుఆయన సేవలు చరిత్రలో నిలిచిపోతాయిరామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాకేటీఆర్జర్నలిజానికి గుర్తింపుగా చిరకాలం నిలిచారుఫిిల్మ్సిటీ నిర్మాణం రామోజీరావుకే సాధ్యమైందిఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతినటుడు రజినీకాంత్నా గురువు, నా శ్రేయోభిలాషి రామోజీరావు ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురయ్యాపాత్రికేయ రంగంలో, సినిమాల్లో చరిత్ర సృష్టించిన వ్యక్తి రామోజీ రావురాజకీయాల్లో గొప్ప కింగ్ మేకర్ అనిపించుకున్నారునా జీవితంలో రామోజీరావుకు ప్రత్యేక స్థానం ఉందిఆయన నాకు మార్గదర్శకుడు, నాకు స్ఫూర్తి ప్రదాతఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాచంద్రబాబురామోజీరావు మరణం పట్ల చంద్రబాబు సంతాపంఫిల్మ్సిటీలో రామోజీరావు పార్థివదేహానికి నివాళులురామోజీ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారురామోజీరావు మరణం చాలా బాధాకరం: చంద్రబాబురామోజీరావు ఒక వ్యక్తి కాదు.. వ్యవస్థతెలుగు జాతి కోసం అహర్నిశలు కృషిచేశారుప్రజల్ని చైతన్యవంతం చేసేందుకు కృషి చేసేవారుఎప్పుడూ ప్రజల పక్షంగానే నిలబడతానని ఎప్పుడూ స్పష్టంగా చెప్పేవారుఆయన సమాజహితం కోసం పని చేశారుచిత్రపరిశ్రమకు కూడా ఎనలేని సేవలు అందించారురామోజీరావు లాంటి వ్యక్తిని పొగొట్టుకోవడం బాధగా ఉందిమరోవైపు.. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి రామోజీ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్కు సీఎస్ ద్వారా సీఎం ఆదేశాలు జారీ చేశారు.1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను 1974 ఆగస్టు 10న విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈనాడుతో పాటు ‘సితార’ సినీ పత్రిక నడిపారు. హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ సిటీని నిర్మించారు. 2016లో భారత ప్రభుత్వం రామోజీని పద్మవిభూషణ్తో సత్కరించింది.రామోజీరావుకు సినీ ప్రముఖులు సంతాపంఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు(88) మృతి పట్ల సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ‘ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది. ‘ఓం శాంతి’. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ఎక్స్ వేదికగా చిరంజీవి తన సంతాపాన్ని ప్రకటించారు. రజనీకాంత్, మహేశ్బాబు, ఎన్టీఆర్, వెంకటేశ్తో పాటు పలువురు స్టార్ హీరోలు ఎక్స్ వేదికగా రామోజీరావుకి సంతాపం తెలిపారు. ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం .. దివి కేగింది 🙏💔 🙏 ఓం శాంతి 🙏 pic.twitter.com/a8H8t9Tzvf— Chiranjeevi Konidela (@KChiruTweets) June 8, 2024I am deeply saddened on hearing the demise of my mentor and well wisher Shri Ramoji Rao Garu. The man who created history in Journalism, Cinema and a great kingmaker in Politics. He was my guide and inspiration in my life. May his soul rest in peace. @Ramoji_FilmCity— Rajinikanth (@rajinikanth) June 8, 2024శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం… pic.twitter.com/ly5qy3nVUm— Jr NTR (@tarak9999) June 8, 2024Deeply saddened by the passing of Ramoji Rao Garu, a visionary always ahead of his time. Ramoji Film City is a testament to his brilliance and passion for cinema. His legacy will continue to inspire us all. My thoughts and prayers are with the family and loved ones. May his soul…— Mahesh Babu (@urstrulyMahesh) June 8, 2024Ramoji Rao garu was a true visionary whose revolutionary work in Indian media has left an unforgettable legacy. His contributions to journalism and cinema have inspired so many. He will be missed dearly. Heartfelt condolences to his loved ones. May his soul rest in peace 🙏🏻 pic.twitter.com/YKEDaEHeCT— Venkatesh Daggubati (@VenkyMama) June 8, 2024 -
విజయకాంత్ మృతిపై ఏపీ సీఎం జగన్ సంతాపం
గుంటూరు, సాక్షి: ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఒక సంతాప ప్రకటన విడుదల చేసింది. విజయకాంత్ కుటుంబసభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు తన ప్రగాఢ సానుభూతిని సదరు ప్రకటనలో తెలిపారు సీఎం జగన్. యాక్షన్ హీరోగా తమిళ చలన చిత్ర పరిశ్రమలోనే కాదు.. అక్కడి రాజకీయాల్లోనూ ఆయన చెరగని ముద్ర వేసింది తెలిసిందే. ఇదిలా ఉంటే.. 71 ఏళ్ల విజయ్కాంత్ ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఈమధ్యే కోలుకున్నట్లు వైద్యులు ప్రకటించడంతో ఆయన అభిమానులు సంతోషించారు. అయితే కరోనా బారినపడ్డాక ఆయన పరిస్థితి మరింత విషమించింది. దీంతో ఈ ఉదయం ఆయన కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఇదీ చదవండి: తమిళ రాజకీయాల్లో కెప్టెన్ ఓ సంచలనం -
ఎమ్మెల్సీ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
-
ఎమ్మెల్సీ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం జగన్ దిగ్భ్రాంతి చెందారు. ఈ మేరకు షేక్ సాబ్జీ మృతి పట్ల కేబినెట్ సైతం సంతాపం తెలిపింది. కేబినెట్ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. శుక్రవారం రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. ఉండి మండలం చెరుకువాడలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీ మృతి చెందారు. సాబ్జీ కారు డ్రైవర్, గన్మెన్, పీఏకి తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చదవండి: AP: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం -
చంద్రమోహన్ మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: సినీ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూయడం బాధాకరం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూయడం బాధాకరం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యుల… pic.twitter.com/XklbQ0l1o5 — YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2023 ప్రముఖ నటుడు చంద్రమోహన్ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. తరచూ డయాలసిస్ చేయించుకుంటున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (నవంబర్ 11న) తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లో సోమవారం అంత్యక్రియలు జరగనున్నాయి. చంద్రశేఖర్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న జన్మించారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. ఈయన దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్కి దగ్గరి బంధువు. చంద్ర మోహన్ భార్య పేరు జలంధర్. ఈమె రచయిత్రి. వీరికి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్గా అమెరికాలో స్థిరడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు. చదవండి: టాలీవుడ్ సినీ దిగ్గజం చంద్రమోహన్ చివరి సినిమా ఇదే! -
జర్నలిస్ట్ ఆనంద్ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, గుంటూరు: సీనియర్ జర్నలిస్ట్ ఆనంద్ కుమార్ ఆకస్మిక మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆనంద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆనంద్ ఢిల్లీలో గత 35 ఏళ్లుగా వివిధ మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా పనిచేశారని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వ సలహాదారు (నేషనల్ మీడియా) కార్యాలయంలో మీడియా కోఆర్డినేటర్ ఆనంద్ కుమార్ పని చేశారు. అంతకు ముందు దాదాపు నాలుగు దశాబ్దాలపాటు తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో పని చేశారాయన. తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అనారోగ్యంతో ఢిల్లీలోని సర్దార్ పటేల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. మరోవైపు ఆనంద్ మృతి పట్ల జర్నలిస్ట్ యూనియన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. -
జాహ్నవి మృతికి సంతాపంగా అమెరికాలో క్యాండిల్ ర్యాలీ
అమెరికా సియాటెల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల మృతి చెందిన సంగతి తెలిసిందే.అమెరికాలో పోలీసుల నిర్లక్ష్యంతో జరిగిన కారు ప్రమాదానికి బలైపోవడమే గాక మరణానంతరం కూడా వాళ్ల చేతుల్లో జాత్యహంకార హేళనకు గురైన తెలుగు యువతి జాహ్నవి కందుల ఉదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. జాహ్నవి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్(AIA), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA), బే ఏరియా తెలుగు అసోసియేషన్ సంస్థ(BATA) ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు.జాహ్నవి జ్ఞాపకార్థం కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో నిర్వహించిన ఈ క్యాండిల్ ర్యాలీలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాహ్నవి చిత్రపటానికి నివాళులు అర్పించి.. ఒక నిముషం పాటు మౌనం పాటించారు. సియాటెల్ పోలీసు అధికారి కారు ఢీకొని ప్రమాదంలో మరణించిన జాహ్నవికి న్యాయం జరగాలని ఈ సందర్భంగా నినదించారు. ఆమె మృతికి కారణమైన పోలీసు అధికారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమె అకాల మరణంపట్ల ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు ప్రముఖులు, నాయకులు సంతాపం తెలిపారు.జాహ్నవి కుటుంబానికి మద్దతుగా ఉంటామని వారు పేర్కొన్నారు. ఏపీ కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) ఈ ఏడాది జనవరి 23న రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందింది. దీనిపై పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ మైక్ సోలన్కు ప్రమాదం గురించి సమాచారం అందిస్తూ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ అడెరెర్.. చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయ్యింది. -
తాడి సన్యాసినాయుడు మృతిపట్ల సభ సంతాపం
-
సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు కన్నుమూత
సాక్షి, అమరావతి: సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్వీఎం కృష్ణారావు(64) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణారావు గురువారం కన్నుమూశారు. కాగా, అనలిస్ట్గా నిక్కచ్చిగా వ్యవహరించారు కృష్ణారావు. ఆయన రాజకీయ వర్గాల్లో ‘బాబాయ్’గా సుపరిచితులు. చిర్రావురి వెంకట మాణిక్య కృష్ణారావు 1959లో ఏలూరు జన్మించారు. 1975లో ఒక స్ట్రింగర్గా నిరాడంబరమైన తన జర్నలిజం ప్రస్థానాన్ని ప్రారంభించి.. తన ప్రతిభతో అతి తక్కువ కాలంలో ఉన్నతస్థాయికి ఎదిగారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ సహా ఆయన పలు తెలుగు, తెలుగు దినపత్రికల్లో పనిచేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. డెక్కన్ క్రానికల్లో న్యూస్ బ్యూరో చీఫ్గా సుదీర్ఘకాలం ప్రయాణం సాగించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సీఎం జగన్ సంతాపం సీహెచ్వీఎం కృష్ణారావు మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘ తెలుగు, ఇంగ్లీషు జర్నలిజంలో కృష్ణారావు మంచి ప్రావీణ్యం పొందారు. కిందిస్థాయి నుండి మంచి జర్నలిస్టుగా ఉన్నతస్థాయికి ఎదిగిన వ్యక్తి కృష్ణారావు. కృష్ణారావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని సీఎం జగన్ సంతాపం తెలిపారు. ఏపీ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్.. కృష్ణారావు మృతికి సంతాపం తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ కృష్ణారావు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాల కోణంలో వారు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా ఉండేవని సీఎం తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటని సీఎం అన్నారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ► సన్నిహితులు ప్రేమగా ‘బాబాయ్’ అని పిలుచుకునే ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ సంపాదకులు కృష్ణారావుమృతి బాధాకరం. కృష్ణారావు 47 ఏళ్లుగా పత్రిక రంగంలో వివిధ హోదాల్లో పనిచేసి, జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. - తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు. ► ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రగాఢ సానుభూతి ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ సంపాదకులు సిహెచ్ విఎం కృష్ణారావు గారి మృతి పట్ల ఏపీ బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘ దాదాపు 5 దశాబ్దాలుగా పత్రిక రంగంలో, రాజకీయ విశ్లేషణలో తనదైన ముద్ర వేసిన కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరని లోటు. 18 ఏళ్ల పాటు డెక్కన్ క్రానికల్ దిన పత్రికలో బ్యూరో చీఫ్ గా ఆయన సేవలు ఎనలేనివి.. ఆయన ప్రతిభ అసామాన్యమైనది’ అని తన సానుభూతి తెలిపారు. ప్రత్యేకంగా టీవీ డిబేట్లలో నిర్మాణాత్మక రాజకీయ విశ్లేషణలు చేయడంలో ఆయనకు ఆయనే సాటని, ఎందరో యువ జర్నలిస్టులకు కృష్ణారావు జీవితం ఆదర్శణీయమన్నారు. ► కృష్ణారావు మరణం అత్యంత బాధాకరం. తెలుగు రాష్ట్రాలలో కృష్ణారావు గారు సీనియర్ జర్నలిస్టుగా వారికున్న అవగాహన , పలు అంశాల్లో వారు చర్చలలో పాల్గోన్న తీరు, పలు అంశాల్లో విశ్లేషణలు, టీవీ చర్చలు వారి అభిప్రాయాలు అద్భుతం . నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా :::ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్దన్రెడ్డి ► ఢిల్లీ: సీనియర్ పాత్రికేయులు గా కృష్ణారావు సేవలు చిరస్మరణీయం. రాజకీయ, సామాజిక అంశాలపై ఎంతో అవగాహనతో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కృష్ణారావు చేసిన విశ్లేషణలు, టీవీ మాద్యమాల్లో జరిపిన చర్చలు ఎంతో ప్రేరణ కలిగించాయి. నిరాడంబరంగా, నిజాయితీగా సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు సాగించిన పాత్రికేయ జీవితం ఎంతో ఆదర్శప్రాయం. నాకు ఎంతో కాలంగా అత్యంత సన్నిహితుడైన జర్నలిస్ట్ సోదరుడు కృష్ణారావు మరణం నన్ను కలిచివేసింది. ఆయన మరణం పత్రికా రంగానికి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను. :::మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సంతాపం ► పాత్రికేయ రంగంలో నేల కొరిగిన ధృవతార. సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ కృష్ణారావు ఇక లేరన్న విషయం అత్యంత బాధాకరం .సిహెచ్ ఎం వి కృష్ణారావు గారు సీనియర్ జర్నలిస్టుగా పలు అంశాల్లో విశ్లేషణలు, టీవీ చర్చల్లో నిష్పక్షపాతంగా ఆయన వెలుబుచ్చిన అభిప్రాయాలు అద్భుతం . పాత్రికేయు రంగం లో నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను . ::: శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇది కూడా చదవండి: చంద్రబాబు కొత్త డ్రామా.. సానుభూతి కోసం ఇంతకు దిగజారాలా? -
గద్దర్ మరణంపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
అందరినీ ఆకట్టుకునే రచనలవి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ప్రముఖ కథా రచయిత, పాత్రికేయుడు శ్రీరమణ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలియజేశారు. శ్రీరమణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ఒక ప్రకటనలో తెలిపారాయన. ఆయన మానవత్వం, వ్యంగ్య రచనలు అందరినీ ఆకట్టుకున్నాయని, మిథునం లాంటి మంచి సినిమాకు రచయితగానే కాకుండా.. అనేక కథలతో అందర్నీ అలరించారని గుర్తు చేశారు సీఎం జగన్. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ రమణ.. మంగళవారం వేకువ ఝామున కన్నమూసిన సంగతి తెలిసిందే. శ్రీరమణ స్వస్థలం గుంటూరు జిల్లా, వేమూరు మండలం వరహాపురం అగ్రహారం. పేరడీ రచనలకు పేరుగాంచిన కామరాజ రామారావు(శ్రీరమణ).. బాపు-రమణ(ముళ్ళపూడి వెంకటరమణ)లతో కలిసి పని చేశారు. పలు పత్రికలకు కాలమిస్ట్గా, సంపాదకుడిగా, నవలా రచయిత, సినీ రచయితగానూ ఆయన సాహిత్య రంగానికి సేవలందించారు. శ్రీ రమణ తన హస్య రచనకు గానూ 2014లో తెలుగు యూనివర్సిటీ నుంచి కీర్తి పురస్కారం స్వీకరించారు. ఇదీ చదవండి: మిథునం రచయిత శ్రీరమణ కన్నుమూత -
రాకేశ్ మాస్టర్ కోసం ఆ ప్రయత్నం ఎవరూ చేయలేదు: పరుచూరి గోపాలకృష్ణ
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ఒక్కసారిగా టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఎంతోమంది మాస్టర్లను తయారు చేసిన ఆయన అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. తాజాగా ఆయన మృతిపట్ల ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆయన పడిన కష్టాలను వివరిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ అంత్యక్రియలు.. డ్యాన్స్ చేస్తూ వీడ్కోలు!) పరుచూరి మాట్లాడుతూ..' రాకేశ్ మాస్టర్తో ఎక్కువగా పనిచేయలేదు. ఆయన గురువైన ముక్కురాజుతో నేను ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేశా. రాకేశ్ మాస్టర్ ఇక లేరంటూ టీవీలో చూడగానే షాకయ్యాను. తాజాగా వాళ్ల అబ్బాయి మా నాన్న గురించి మాట్లాడుకోవడం ఇకనైనా ఆపేయండి అని చెప్పగానే నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి.' అంటూ విచారం వ్యక్తం చేశారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 'రాకేశ్ మాస్టర్ సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. ఇండస్ట్రీలో ఆయన అద్భుతాలు సృష్టించాడు. దాదాపు 1500 పాటలకు కొరియోగ్రఫీ చేశారు. శేఖర్ , జానీ అనే ఇద్దరు అద్భుతమైన మాస్టర్లను తీర్చిదిద్దాడు. వాళ్లంతా వచ్చి ఆయన మృతదేహం దగ్గర కన్నీరు పెట్టుకుంటుంటే అందరికీ బాధేసింది. ఆయన ఆవేదనను ఎవరైనా పట్టించుకుని ఉంటే ఆయన జీవితం ఇంకో రకంగా ఉండేది. కానీ ఎవరూ ఆయన్ని దగ్గరకు తీసుకొని ఆయన జీవితానికి మంచి మార్గాన్నిచ్చే ప్రయత్నం చేయలేదు.' అని అన్నారు. అలా జరిగి ఉంటే.. పరుచూరి మాట్లాడుతూ.. 'టాలీవుడ్లో ప్రస్తుతమున్న అప్కమింగ్ హీరోలు, అప్ కమింగ్ దర్శకులో ఎవరో ఒకరు మళ్లీ సినిమాల్లోకి తీసుకొచ్చి ఉంటే ఆయన జీవితం మరోలా ఉండేదని నా అభిప్రాయం. ఆయన షో చూస్తే నాకు అనుక్షణం ఆవేదనే కనిపించేది. ఎంతలా ఆవేదన అనుభవించాడో. మిత్రులారా.. ఆయన జీవితాన్ని ఉదాహరణగా తీసుకోండి. మనకు భగవంతుడు ఓ ఛాన్స్ ఇచ్చాడు. మన జీవితంలో జరిగే స్ట్రగుల్స్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆయన ఆత్మ పరమాత్మను చేరుకుని.. శివుడి కూడా ఆయన లయ, విన్యాసాలు చూడాలని ఆశిస్తున్నా.' అని అన్నారు. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం!) -
కేతు విశ్వనాథరెడ్డి కన్నుమూత.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, వైఎస్సార్/ ప్రకాశం: తెలుగు సాహిత్యంలో కురువృద్దులు.. రాయలసీమ కథకు చిరునామా కేతు విశ్వనాథరెడ్డి(84) గారు ఇకలేరు. సోమవారం వేకువ ఝామున గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. ఒంగోలులోని ఓ ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్ మీద చికిత్స అందించే యత్నం చేసినా ఫలితం దక్కలేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేతు విశ్వనాధ రెడ్డి మృతికి పలువురు వక్తలు, రచయితలు సంతాపం చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కేతు విశ్వనాథరెడ్డి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆధునిక తెలుగు సాహితీ రంగానికి విశ్వనాథరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. సామాజిక సంస్కరణలను అవశ్యకతను చెబుతూ విశ్వనాథరెడ్డి రాసిన కథలు పలువురికి స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు. ఆయన సేవలను గుర్తించి 2021లో వైయస్సార్ లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డుతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని సత్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తుచేశారు. విశ్వనాథ్రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కేతు విశ్వనాథరెడ్డి (84).. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం రంగశాయిపురం స్వస్థలం. సాహితీ, విద్యావేత్తగా కేతు విశ్వనాథరెడ్డి పేరొందారు. రాయలసీమ మాండలికానికి సాహితీ గౌరవం తీసుకొచ్చిన ఘనత దక్కించుకున్నారు. కేతు విశ్వనాథరెడ్డి కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కడప జిల్లా గ్రామనామాలపై పరిశోధనకు ఆయన డాక్టరేట్ పొందారు. జర్నలిస్టుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డైరెక్టర్గా పదవీ విరమణ చేశారు. కడప, తిరుపతి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో అధ్యాపకుడిగా విశిష్ట సేవలందించారు. ఒకప్పుడు కడప కేంద్రంగా సుప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) ప్రియ శిష్యునిగా సాహిత్యంలో మెలకువలు నేర్చుకున్నారు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఎస్సీఈఆర్టీ సంపాదకుడిగా, పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయస్థాయి పలు పాఠ్యపుస్తకాలకు సంపాదకత్వం వహించారు. పాఠ్యప్రణాళికలను రూపొందించాడు. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించారు. అరసం (అభ్యుదయ రచయితల సంఘం) అధ్యక్షుడిగా కొంత కాలం ఉన్నారు. జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003) కథా సంపుటాలు, వేర్లు, బోధి అనే నవలలు వెలువరించారు. రాయలసీమ మాండలికంలో సాగిన ఈయన రచనలు మట్టి పరిమళాన్ని వెదజల్లాయి. ఈయన రాసిన అనేక కథలు హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్ భాషల్లోకి అనువాదం అయ్యాయి. ఉద్యోగ విరమణ అనంతరం పుట్టిన గడ్డపై మమకారంతో కడపకు చేరుకున్నారు. కడప నగరంలో భార్యతో కలిసి సింగపూర్ టౌన్షిప్లో ఉంటున్న ఆయన.. రెండు రోజుల క్రితం ఒంగోలులో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లారు. ఈ ఉదయం గుండెపోటురాగా.. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. -
శరత్బాబుకు సంతాపం తెలిపిన కమల్హాసన్.. కాసేపటికే ట్వీట్ డిలీట్
సీనియర్ నటుడు శరత్బాబు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన మరణించారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆరోగ్యం విషమించడంతో శరత్బాబు కన్నుమూశారంటూ ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై శరత్బాబు సోదరి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: సీనియర్ నటుడు శరత్ బాబుపై అసత్య వార్తలు.. సోదరి క్లారిటీ శరత్బాబు బతికే ఉన్నారని, ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దంటూ విఙ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని ఆమె పేర్కొంది. అయితే అప్పటికే శరత్బాబు చనిపోయాడంటూ వార్తలు బాగా వైరల్ కావడంతో పలువురు ఆయనకు సంతాపం కూడా వ్యక్తం చేశారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా ఇలాగే తప్పులో కాలేశారు. శరత్బాబుకు నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. 'నా ప్రియమైన పెద్దన్నయ్య శరత్బాబు నాకు మంచి స్నేహితుడు. మంచి మనసున్న వ్యక్తి. ఆయన్ని కోల్పోవడం దురదృష్టకరం'.. అంటూ ట్వీట్ చేసి కాసేపటికే డిలీట్ చేశారు. అయితే అప్పటికే కమల్ చేసిన ఆ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. చదవండి: హీరోయిన్ మెహ్రీన్కు ఏమైంది? ఇలా మారిపోయిందేంటి? -
ఆయన గొప్ప నాయకుడు: ప్రధాని మోదీ సంతాపం
చండీగఢ్/న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్ అగ్రనేత ప్రకాశ్సింగ్ బాదల్ (95) ఇక లేరు. చాలారోజులుగా మొహాలీలోని ఓ ఫోరి్టస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన ఏడాది జనవరిలో కరోనా బారినపడి కోలుకున్నారు. గ్యాస్రై్టటిస్, బ్రాంకియల్ ఆస్తా్మతో బాధపడుతూ గత ఏడాది జూన్లో మళ్లీ చికిత్స పొందారు. బాదల్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగా నష్టమన్నారు. దేశ రాజకీయాల్లో ఆయన గొప్ప నాయకుడు, ఉన్నత రాజనీతిజ్ఞుడు అని కీర్తించారు. పంజాబ్ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని ప్రశంసించారు. ఎన్నో సంక్షోభాల నుంచి పంజాబ్ను గట్టెక్కించారంటూ మోదీ ట్వీట్ చేశారు. బాదల్ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు బాదల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఐదుసార్లు పంజాబ్ సీఎం 👉 బాదల్ 1927 డిసెంబర్ 8న పంజాబ్లోని అబుల్ ఖురానా గ్రామంలో జాట్ సిక్కు కుటుంబంలో జన్మించారు. 👉 లాహోర్లోని ఫార్మన్ క్రిస్టియన్ కాలేజీలో చదివారు. 1947లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 👉 గ్రామ సర్పంచ్గా, బ్లాక్ సమితి చైర్మన్గా మొదలై 1957లో కాంగ్రెస్ టికెట్పై ఎమ్మెల్యే అయ్యారు. 👉 1969లో శిరోమణి అకాలీ దళ్ టికెట్పై మళ్లీ గెలిచారు. 👉 1986లో శిరోమణి అకాలీ దళ్ (బాదల్) పార్టీని స్థాపించారు. 👉 1970–71, 1977–80, 1997–2002, 2007–2012, 2012–2017 ఇలా ఐదుసార్లు పంజాబ్ సీఎంగా చేశారు. 👉 గతేడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో 13వసారి పోటీ చేశారు. దేశంలోనే అత్యంత వృద్ధ అభ్యర్థిగా రికార్డుకెక్కినా.. ఓటమి పాలయ్యారు. ఏడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయనకిది రెండో ఓటమి. 👉ఎంపీగా కూడా నెగ్గిన ఆయన కేంద్ర వ్యవసాయ, సాగునీటి పారుదల మంత్రిగా పనిచేశారు. 👉 ఆయన భార్య సురీందర్ కౌర్ 2011లో మరణించారు. కుమారుడు సుఖ్బీర్సింగ్ బాదల్ పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా చేశారు. (Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ రెండో ఛార్జ్షీట్.. మనీష్ సిసోడియా పేరు..) -
రవ్వా శ్రీహరి కన్నుమూతపై సీఎం జగన్ సంతాపం
సాక్షి, గుంటూరు: ప్రముఖ సాహితీవేత్త ఆచార్య రవ్వా శ్రీహరి(80) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, సంస్కృత భాషల్లో పండితుడు, సాహితీవేత్త అయిన రవ్వా శ్రీహరి మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు సీఎం జగన్. మరోవైపు రవ్వా శ్రీహరి మృతిపట్ల పలువురు సాహితీవేత్తలు, రచయితలు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం సంస్కృతాంధ్ర భాషలకు తీరని లోటు అని సాహితీవేత్తలు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు, ద్రావిడ యూనివర్సిటీ వీసీగా పని చేశారు ఆచార్య రవ్వా శ్రీహరి. టీటీడీలోనూ ఆయన కొంతకాలం పని చేశారు. తెలంగాణ నల్లగొండ జిల్లా వెల్వర్తిలో ఒక సామాన్య చేనేత కుటుంబంలో జన్మించారు శ్రీహరి. 2011లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ఎడిటర్-ఇన్-ఛార్జ్గా పనిచేశాడు. హైదరాబాద్ మలకపేట యశోద ఆసుపత్రి ఎదురుగా వున్న జడ్జెస్ కాలనీలోని రుక్మిణి అపార్టుమెంట్లో ఆయన నివాసం ఉంది. ఆదివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
ఎమ్మెల్యే సాయన్న మృతి.. కేసీఆర్, కిషన్రెడ్డి సహా పలువురి సంతాపం
సాక్షి, హైదరాబాద్: కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న ఆదివారం ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా, సాయన్న మృతి పట్ల సీఎం కేసీఆర్ సహా, పలు రాజకీయ పార్టీల నేతలు సంతాపం తెలుపుతున్నారు. - సాయన్న మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ సందర్బంగా ఐదు సార్లు ఎమ్మెల్యే గా, పలు పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజా సేవను.. తనతో వారికున్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. సాయన్న కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. - మంత్రి కేటీఆర్ కూడా సాయన్న మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన మరణం చాలా బాదాకరమని అన్నారు. ఈ సందర్బంగా సాయన్న కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. - మంత్రి తలసాని కూడా సాయన్న మృతికి సంతాపం తెలిపారు. - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాయన్న మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సాయన్న అందరితోనూ సౌమ్యంగా, ఆత్మీయంగా మాట్లాడేవారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సాయన్న కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు చెప్పారు. -
కళాతపస్వికి తెలుగులో నివాళులు అర్పించిన ఇళయరాజా, వీడియో రిలీజ్..
కళాతపస్వి కె విశ్వనాథ్ మృతితో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. గురువారం రాత్రి అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడాచారు. దీంతో ఆయన మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ శకం ముగిసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలనాటి హీరో, సీనియర్ నటుడు చంద్రమోహన్ ఆయన పార్థివ దేహం వద్ద బోరున విలపించిన దృశ్యం అందరిని కలిచివేసింది. ఇక ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వాపోయారు. చదవండి: అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే.. అలా సినీ పరిశ్రమలోని సీనియర్ హీరోల నుంచి ఇప్పటి యంగ్ హీరోల వరకు సోషల్ మీడియాలో కళాతపస్వికి నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా మ్యూజికల్ మ్యాస్ట్రో, ఎంపీ ఇళయరాజా తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. ఇందులో ఇళయరాజా తెలుగులో మాట్లాడుతూ విశ్వనాథ్కు సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో వీడియో పోస్ట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియన్ ఫిలిం హిస్టరీలో చాలా ముఖ్యమైన, ప్రధాన స్థానంలో ఉన్న, చాలా ముఖ్యమైన దర్శకుడు కె విశ్వనాథ్ గారు దేవుడు పాదాల వద్దకు వెళ్లారని తెలిసి నాకు చాలా బాధ కలిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడుని కోరుకుంటున్నా’ అంటూ నివాళులు అర్పించారు. చదవండి: లవ్టుడే హీరోపై రజనీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం! pic.twitter.com/blfTwMxHWW — Ilaiyaraaja (@ilaiyaraaja) February 3, 2023 -
తెలుగు సినిమా గొప్పదనం మీరు.. కె.విశ్వనాథ్కు ప్రముఖుల నివాళులు
మరో సినీ దిగ్గజం నేలకొరిగింది. కళా తపస్వి శకం ముగిసింది. లెజెండరీ డైరెక్టర్ కె. విశ్వనాథ్ మరణం చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గతరాత్రి తీవ్ర అస్వస్థతకు గురికాగా హుటాహుటిన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 11గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగు చిత్రపరిశ్రమకు గొప్ప గౌరవాన్ని, గుర్తింపు తీసుకొచ్చిన విశ్వనాథ్ 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.విశ్వనాథ్ మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయిందంటూ ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. Deeply grieved to hear of the demise of renowned film director, Sri K. Viswanath. As a film-maker he brought depth & dignity to the medium earning global recognition for his movies with a message. May his atma attain sadgati! Om shanti! pic.twitter.com/snX4RVsIVJ — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) February 3, 2023 Shocked beyond words! Shri K Viswanath ‘s loss is an irreplaceable void to Indian / Telugu Cinema and to me personally! Man of numerous iconic, timeless films! The Legend Will Live on! Om Shanti !! 🙏🙏 pic.twitter.com/3JzLrCCs6z — Chiranjeevi Konidela (@KChiruTweets) February 3, 2023 ప్రపంచంలో ఎవ్వరైనా మీ తెలుగు సినిమా గొప్పదనం ఏంటి అని అడిగితే మాకు K. విశ్వనాధ్ గారు ఉన్నారు అని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం. Your signature on Telugu Cinema &art in general will shine brightly forever. సినిమా గ్రామర్ లో మీరు నేర్పిన పాత్రలకు ఆజన్మాన్తo రుణపడి ఉంటాము sir🙏🏻 — rajamouli ss (@ssrajamouli) February 3, 2023 Rest in peace Vishwanath garu … thank u for everything🙏🏻🙏🏻🙏🏻.. u Continue to live in our hearts 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 #RipLegend pic.twitter.com/QfjPIYAfsx — Anushka Shetty (@MsAnushkaShetty) February 3, 2023 Sad to hear about the passing of India’s 1st auteur director #KVishwanath ..He is gone , but his films will live forever 💐💐💐 — Ram Gopal Varma (@RGVzoomin) February 3, 2023 Deeply saddened by the passing of legendary director K. Vishwanath Garu. His urge n passion for storytelling and his commitment to excellence have inspired many filmmakers like me to strive for the best in our own work. We all will miss him dearly... #RIPVishwanathGaru 🙏🏻 pic.twitter.com/PFvbOEuaFd — Krish Jagarlamudi (@DirKrish) February 3, 2023 Disheartening to know about the tragic news of #KVishwanath garu. Words may not suffice to express his loss. His contribution to Telugu Cinema will live on in our memories forever. My sincere condolences to his entire family & dear ones. OM SHANTI 🙏 — Ravi Teja (@RaviTeja_offl) February 3, 2023 We have lost another gem! What a legend! #KVishwanath gaaru will be remembered forever for his art, his passion and understanding of films. Never got an opportunity to work with him, but been a great admirer of his work. Will be missed. RIP #KVishwanathgaru Om Shanti 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/HNxvrELJnt — KhushbuSundar (@khushsundar) February 3, 2023 Rest in peace the legendary #KVishwanath sir .. You will remembered forever in our hearts , you always live through ur great films 🙏 Om shanti#RipLegend #RIPVishwanathGaru pic.twitter.com/XZE6aYUvP8 — Director Maruthi (@DirectorMaruthi) February 3, 2023 Ulaganayagan @ikamalhaasan posted a hand-written letter bidding goodbye to the Legendary director #KVishwanath garu. 💔#KViswanathGaru pic.twitter.com/5IMs70O8Hu — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 3, 2023 తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాధ్ గారిది ఉన్నతమైన స్థానం. శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాలని అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనుకుంటున్నాను. pic.twitter.com/3Ub8BwZQ88 — Jr NTR (@tarak9999) February 2, 2023 Cinema is above Boxoffice. Cinema is above Stars. Cinema is above any individual. Who taught us this ? The greatest of greatest #KViswanathGaaru మీ రుణం …వీడుకోలు 🙏🏼🙏🏼🙏🏼 — Nani (@NameisNani) February 3, 2023 నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన .. ఆ రెంటి నట్టనడుమ తన తపన సాగించి , తపస్సు కావించి, తనువు చాలించిన ఋషి 🙏🙏🙏 వెండితెరకి ఇకపై దొరకునా అటువంటి సేవ ! — mmkeeravaani (@mmkeeravaani) February 2, 2023 -
కె. విశ్వనాథ్ కడసారి చూపు కోసం తరలి వచ్చిన సినీ ప్రముఖులు
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఐదు దశాబ్దాల పాటు తెలుగు పరిశ్రమలో తనదైన ముద్రవేసిన విశ్వనాథ్ ఇక లేరన్న వార్త తెలుసుకొని చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. కె. విశ్వనాథ్ చివరి చూపు కోసం సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లోని ఆయన నివాసానికి వెంకటేశ్, మణిశర్మ, గుణశేఖర్, పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, సాయికుమార్ వంటి పలువురు సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా కె. విశ్వనాథ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ►విశ్వనాథ్ గారు లేరనే వార్త నన్ను బాధకు గురిచేసింది నాకు పితృసమానులు. విశ్వనాథ్ చిత్రాలు పండితుల నుంచి పామరుల వరకు అలరించాయి జనరంజకం చేస్తూ బ్లాక్ బస్టర్ చేయడం అనేది ఆయన కృషికి నిదర్శనం.తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనుడు ఆయన దర్శకత్వంలో నేను నటించడం అదృష్టం. మా లాంటి నటులకు విశ్వనాథ్ ఓ గ్రంథాలయం. ఆయన చేత్తో అన్నం తినిపించిన గొప్ప వ్యక్తి. 'ఇంద్ర' సమయంలో వారణాసికి పిలవడంతో వచ్చారు ఆయన ప్రేమ వాత్సల్యం పొందిన నేను తండ్రిని పొగొట్టుకున్నంత బాధగా ఉంది- చిరంజీవి ► కె. విశ్వనాథ్ గారి మరణం చాలా బాధాకరం.ఆయన సినిమాలంటే నాకు చాలా ఇష్టం.ఆయన తెలుగు సినిమాకు మూలస్తంభం. తన సినిమాల ద్వారా సంస్కృతిని తెలియజేశారు. విశ్వనాథ్ గారి మరణం సినిమా రంగానికి తీరని లోటు అంటూ పపన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ► విశ్వనాథ్ గారు ఈరోజు లేరనే వార్త చాలా షాకింగ్గా, బాధగా అనిపిస్తుంది. దేశంలోని అత్యత్తుమ డైరెక్టర్లలో ఆయన ఒకరు. పాత తరమే కాదు, ఈనాటి జనరేషన్ కూడా ఆయన చేసిన సేవల్ని గుర్తుచేసుకుంటాయి - విక్టరీ వెంకటేశ్ ► పుట్టినప్రతివాడికి మరణం తప్పదు. కానీ విశ్వనాథ్ గారి మరణం చాలా గొప్పది. - ఆయాన సినిమాల్లో నేను నటించాను. - ఎప్పుడు ఆప్యాయంగా పలకరించేవారు. - ఆయన కుటుంబంతో గడిపిన క్షణాలు మర్చిపోలేను. - ఆయన లేడు అనేది చాలా బాధాకరం. - భారతీయ చలన చిత్రాలలో విరబూసిన కమలం ఆయన - బ్రహ్మానందం ► కళా తపస్వి అన్న పేరుకు ఆయనే నిలువెత్తు సాక్ష్యం. ఆయన కుటుంబంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. అలాంటి మనిషి ఈరోజు లేరన్నది నిజం. కానీ ఇప్పుడు ఆయన్ను చూస్తుంటే యోగ నిద్రలో ఉన్నట్లున్నారు. ఒక భీష్మాచార్యుడిలాగా కనిపించారు. ఆయన ఆశీస్సులు మన అందరికి ఉండాలి. తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నో సినిమాలు తీయాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి - సాయికుమార్ ► దర్శకత్వపు ప్రాథమిక సూత్రాలు ఆయన సినిమాల్లో కనిపిస్తాయి. ఆయన సినిమాలు మాలాంటి వాళ్లు ఎంతోమందిని ప్రభావితం చేశాయి. కాబట్టి ఆయన ఎప్పుడూ సజీవంగానే ఉంటారు. పాతతరమే కాదు యువతరం కూడా ఆయన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి - గుణశేఖర్ ►కె. విశ్వనాథ్ గారు గొప్ప మనిషి. ఆయనతో పనిచేసిన రోజుల్ని మర్చిపోలేను. ఈమధ్యే ఆయన్ను కలిశాను. ఈరోజు మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్లిపోయింది. కానీ దానికి పునాదులు వేసింది మాత్రం కె. విశ్వనాథ్ గారే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి - సినీ నటి రాధిక ► ఒక తరం కదిలి వెళ్లిపోయినంత బాధగా ఉంది. అద్భుతమైన కళాఖండాలను చిత్ర పరిశ్రమకు అందించిన గొప్పవాళ్లలో కె. విశ్వనాథ్ది అగ్రతాంబూలం - పరచూరి గోపాలకృష్ణ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కె. విశ్వనాథ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన బాలకృష్ణ
కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు కన్నుమూయడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు.. భారతీయ సంస్కృతీ, సంప్రదాయలు మరీ ముఖ్యంగా మన తెలుగుదనాన్ని అణువణువున ప్రతిబింబించేలా ఆయన తీసిన అత్యద్భుత చిత్రాలు తెలుగు సినిమాకే గర్వ కారణము.. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చి ప్రతి తెలుగు వాడు గర్వించేలా చేసిన దిగ్గజ దర్శకుడి మరణం తీవ్రవిచారానికి గురిచేసింది. కళా తపస్వి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.. - నందమూరి బాలకృష్ణ కాగా విశ్వనాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ఏకైక చిత్రం జననీ జన్మభూమి(1984). కానీ, ఆ చిత్రం ఆడలేదు. అయితే.. నరసింహానాయుడు, సీమ సింహం, లక్ష్మీ నరసింహా, పాండు రంగడు చిత్రాల్లో బాలకృష్ణ తండ్రి పాత్రలో అలరించారు కళాతపస్వి. -
వట్టి వసంతకుమార్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
తాడేపల్లి: మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వసంత్ కుమార్ ఆదివారం తెల్లవారు జామున వైజాగ్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూళ్ళ గ్రామం. ఆది నుంచి వసంత్కుమార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2004, 2009లో ఉంగుటూరు నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ కేబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత రోశయ్య కేబినెట్లోనూ అదే శాఖా మంత్రిగా పని చేశారు. ఇక కిరణ్కుమార్ రెడ్డి కేబినెట్లో పర్యాటక శాఖ మంత్రి విధులు నిర్వర్తించారు. 2018లో టీడీపీ-కాంగ్రెస్ కలయిక తర్వాత ఆయన పార్టీకి దూరమయ్యారు. 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న వసంత్కుమార్ విశాఖలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. చదవండి: లోకేష్ యాత్రలో టీడీపీ కార్యకర్తల షాక్ -
పద్మభూషణ్ బాలకృష్ణ దోషి కన్నుమూత.. ప్రధాని సంతాపం
ఢిల్లీ: దశాబ్దాల పనితనంతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న ప్రముఖ ఆర్కిటెక్ట్ నిపుణులు, పద్మ భూషణ్ బాలకృష్ణ దోషి(95) ఇక లేరు. మంగళవారం అహ్మదాబాద్లోని తన స్వగృహంలో ఆయన అనారోగ్యంతో కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. లె కార్బూజియెగా(ఛార్లెస్ ఎడ్వర్డ్ జెనరెట్), లూయిస్ కాన్ లాంటి విదేశీ ఆర్కిటెక్ట్లతో కలిసి పని చేసిన అనుభవం ఆయనది. అహ్మదాబాద్ ఐఎంఎంతో పాటు పలు ప్రతిష్టాత్మక భవనాల నిర్మాణంలో ఆయన పాలు పంచుకున్నారు. దోషి మృతిపై పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. డాక్టర్ బివి దోషి జి ఒక తెలివైన వాస్తుశిల్పి. గొప్ప సంస్థకు నిర్మాత. ఆయన మృతి బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి... అని ట్వీట్ ద్వారా సంతాపం తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోదీ. Dr. BV Doshi Ji was a brilliant architect and a remarkable institution builder. The coming generations will get glimpses of his greatness by admiring his rich work across India. His passing away is saddening. Condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/LLdrZOCcQZ — Narendra Modi (@narendramodi) January 24, 2023 1927 పూణే(మహారాష్ట్ర)లో జన్మించిన బాలకృష్ణ విఠల్దాస్ దోషి.. బెంగళూరు ఐఐఎంతో పాటు అహ్మదాబాద్లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండాలజీ, సీఈపీటీ యూనివర్సిటీ, కార్నియా సెంటర్లను డిజైన్ చేశారు. వీటితో పాటు మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని అరణ్య లో కాస్ట్ హౌజింగ్ టౌన్షిప్నకు రూపకల్పన చేయగా.. అది ప్రతిష్టాత్మక అగాఖాన్ అవార్డును 1995లో దక్కించుకుంది. ఇక వాస్తుశిల్ప పేరుతో సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకుని అహ్మదాబాద్లో ఆయన సెటిల్ అయ్యారు. ఆయన కుటుంబంలో చాలామంది ఆర్కిటెక్ట్లు ఉన్నారు. 2018లో ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ అవార్డు(ఈ ఘనత సాధించిన తొలి ఆర్కిటెక్ట్) అందుకున్నారు. పద్మశ్రీతో పాటు 2020లో భారత ప్రభుత్వం ఆయన చేసిన కృషికిగానూ పద్మ భూషణ్ పురస్కారం అందించింది. ఇక 2022లో దోషి రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ నుంచి రాయల్ గోల్డ్ మెడల్ పురస్కారం అందుకున్నారు. మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన ఓ కాదల్ కన్మణి, షాద్ అలీ ఓకే జాను చిత్రాల్లోనూ బాలకృష్ణ దోషి ఒక చిన్న పాత్రలో మెరిశారు. తన ప్రాజెక్టులు దాదాపుగా అహ్మదాబాద్తో ముడిపడి ఉండడంతో శేషజీవితాన్ని అక్కడే గడిపారాయన. -
నేపాల్ విమాన ప్రమాదం.. మృతుల కుటుంబాలకు సంతాపం
న్యూఢిల్లీ: నేపాల్లో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఐదుగురు భారతీయులు సహా 72 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాదం తనను బాధించిందని, ఎన్నో విలువైన ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భగవంతుడు వాళ్లకు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు. Pained by the tragic air crash in Nepal in which precious lives have been lost, including Indian nationals. In this hour of grief, my thoughts and prayers are with the bereaved families. @cmprachanda @PM_nepal_ — Narendra Modi (@narendramodi) January 15, 2023 ఈ ఘటనలో చనిపోయిన ఐదుగరు భారతీయుల్లో నలుగురిని ఉత్తర్ప్రదేశ్ గాజియాబాద్కు చెందిన విశాల్ శర్మ, సోను జైశ్వాల్, అనిల్ రాజ్భర్, అభిశేస్ కుశ్వాహాగా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. సీఎం యోగి ఆదేశాలు.. మృతులు యూపీ వాసులు కావడంతో వారి పార్థీవ దేహాలను రాష్ట్రానికి తీసుకురావాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. విదేశీ వ్యవహరాల శాఖతో సమన్వయం చేసుకుని త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు. नेपाल में हुई विमान दुर्घटना अत्यंत दुःखद है। इसमें भारतीय नागरिकों समेत काल-कवलित हुए सभी लोगों के प्रति विनम्र श्रद्धांजलि! मेरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं। प्रभु श्री राम दिवंगत आत्माओं को अपने श्री चरणों में स्थान व घायलों को शीघ्र स्वास्थ्य लाभ प्रदान करें। — Yogi Adityanath (@myogiadityanath) January 15, 2023 చదవండి: నేపాల్ విమాన దుర్ఘటన.. అయ్యో దేవుడా! ఏ ఒక్కరిని ప్రాణాలతో గుర్తించలేదు.. -
చావు ఇంటికి వెళ్లి నవ్వుతావా? ఇదేం పద్ధతి? రాహుల్పై బీజేపీ ఫైర్..
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, జేయూయూ నేత శరద్ యాదవ్ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ సందర్భంలో నవ్వుతూ కన్పించారు. ఈ పొటోను షేర్ చేసిన బీజేపీ అధికార ప్రతినిధి షహ్జాద్ పూనావాలా రాహుల్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓ వైపు శరద్ యాదవ్ కుటుంబసభ్యులు తీవ్ర దుఃఖంలో ఉంటే, వాళ్ల మధ్యన కూర్చున్న నీకు ఎలా నవ్వు వస్తుందని ధ్వజమెత్తారు. ఓ తపస్విగా చెప్పుకునే రాహుల్ ఇలా ప్రవర్తించడం సరికాదని సెటైర్లు వేశారు. అంతేకాదు 2018లో కర్ణాటక మాజీ సీఎం ఎన్ ధారం సింగ్ సంతాప సభలోనూ రాహుల్ నవ్వుతూ కన్పించారని షెహ్జాద్ పూనావాలా పేర్కొన్నారు. పుల్వామా అమరులకు శ్రద్ధాంజలి ఘటించే సమయంలోనూ రాహుల్ ఫోన్ చూసుకుంటూ ఉన్నారని ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు. Rahul Gandhi smiling while Sharad Yadav’s family is in tears- certainly not how a Tapasvi would behave Sensitivity demands one acts maturely but then in 2018 Rahul was laughing during Dharam Singh's condolence meet; was busy in phone during Pulwama Shraddhanjali Some tapasvi! pic.twitter.com/axj2CwS4fR — Shehzad Jai Hind (@Shehzad_Ind) January 13, 2023 చదవండి: యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం -
మోదీ తల్లి హీరాబెన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన చిరంజీవి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్లలి హీరాబెన్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని తల్లి శ్రీమతి హీరాబెన్ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆమె అసాధారణమైన జీవితాన్ని గడిపింది. స్వర్గలోకానికి వెళ్లిన ఆమె ఆత్మకు నా నివాళులు. నరేంద్ర మోదీ జీకి నా హృదయపూర్వక సానుభూతి! ఓం శాంతి!....అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మోదీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కాగా రెండురోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మోదీ తల్లి హీరాబెన్ అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఇటీవలె ఆమె వందో పుట్టినరోజును జరుపుకున్నారు. Deeply saddened by the demise of Smt.Heeraba Modi ji , beloved mother of our Hon’ble Prime Minister. She lived an extraordinary life. My tributes to the divine soul who left for the heavenly abode. My heartfelt condolences to Shri @narendramodi ji ! Om Shanti! 🙏🙏 — Chiranjeevi Konidela (@KChiruTweets) December 30, 2022 -
కైకాల సత్యనారాయణ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
-
భగీరథరెడ్డి చురుకైన నేత.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి (46) అకాల మరణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భగీరథరెడ్డి ఎంతో చురుకైన నేత. మంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన మృతి తీరని లోటు. చల్లా కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా అని ఒక ప్రకటనలో సీఎం జగన్ పేర్కొన్నారు. సంబంధిత వార్త: ఏపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూత -
ఘోర ప్రమాదం.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ముంబై: ప్రమాదం జరిగిందని సాయం అందించేందుకు కార్లు దిగిన కొందరిని.. మృత్యువు అతివేగం రూపంలో కబళించేసింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ కారు.. ఆంబులెన్స్ను, మూడు కార్లను ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ముంబైలోని బాంద్రా-వర్లి సీ లింక్ మీద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం 3గం. ప్రాంతంలో బాంద్రా-వర్లి సీ లింక్ 76-78 పోల్స్ మధ్య ఈ ఘటన జరిగింది. దక్షిణ ముంబై వర్లి-పశ్చిమ సబర్బ్స్ను కలుపుతూ ఉండే ఈ వారధిపై ప్రమాదం జరిగిందని, ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారని, మరో ఎనిమిది మంది చికిత్స పొందుతున్నట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. తొలుత ఓ కారు డివైడర్ను ఢీ కొట్టి బోల్తా పడింది. క్షతగాత్రులకు సాయం అందించేందుకు అక్కడికి చేరుకుంది ఆంబులెన్స్. ఈ క్రమంలో కార్లలో వెళ్తున్న కొందరు ఆగారు. ఇద్దరు కార్ల నుంచి దిగి.. ఆంబులెన్స్ సిబ్బందికి సాయం చేయబోయారు. ఆ సమయంలోనే వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. కార్లను, ఆంబులెన్స్లను బలంగా ఢీ కొట్టింది. దీంతో అంతా చెల్లాచెదురై పడిపోయారు. BREAKING : Five people died after a speeding car rammed into an accident site on the Bandra-Worli sea link in Mumbai.#Mumbai #Bandra #Worli #Accident #ViralVideo pic.twitter.com/m32mH7LYWb — Sangpu Changsan (@_sangpuchangsan) October 5, 2022 ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు.. క్షతగాత్రులను స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే మార్గాన్ని మూసేశారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఘటన బాధించిందని, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారాయన. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదీ చదవండి: అప్పటిదాకా సంతోషం.. అంతలోనే ఊహించని విషాదం -
మహేశ్ బాబు, కృష్ణలను పరామర్శించిన చిరంజీవి
సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబులను తాజాగా మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. గురువారం వారి ఇంటికి వెళ్లి మహేశ్, కృష్ణలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణ సతీమణి, మహేశ్ తల్లి ఇందిరా దేవి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు చిరు సంతాపం తెలిపారు. కాగా బుధవారం(సెప్టెంబర్ 28న) మహేశ్ తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. చదవండి: మిస్ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్ పోస్ట్ సినీ, రాజకీయ ప్రముఖులు నిన్న మహేశ్ ఇంటికి వెళ్లి ఇందిరా దేవి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఇక ఆమె అంత్యక్రియల్లో విక్టర్ వెంకటేశ్, నాగార్జున అక్కినేని, మోహన్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్తో పాటు పలువురు హీరోలు, దర్శకులు పాల్గొన్నారు. అయితే చిరు తాజా చిత్రం గాడ్ ఫాదర్ ట్రైలర్ ఈవెంట్ నిన్న అనంతపురంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం నేపథ్యంలో బుధవారం ఇందిరా దేవి అంత్యక్రియల్లో ఆయన పాల్గొన లేకపోయారు. -
Indira Devi: మహేశ్ బాబు తల్లి మృతి.. చిరంజీవి సంతాపం
సూపర్ స్టార్ మహేశ్ ఇంట త్రీవ విషాదం నెలకొంది. ఆయన తల్లి, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి బుధవారం ఉదయం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఇందిరా దేవి మరణం మహేశ్ బాబు, ఇతర కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టింది. దీంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు, హీరోలు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా ఆమె మృతికి సంతాపం ప్రకటించారు. మహేశ్ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. చదవండి: సూపర్స్టార్ మహేశ్బాబుకు మాతృవియోగం అలాగే మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ ఇందిరా దేవికి నివాళులు అర్పించారు. ‘శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబుకి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’ అని చిరు ట్వీట్ చేశారు. శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ 🙏, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబు కి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. — Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2022 సూపర్ స్టార్ కృష్ణ గారి అర్ధాంగి మహేష్ బాబు మదర్ శ్రీమతి ఇందిరాదేవి గారు ఈరోజు ఉదయం కన్నమూశారు. pic.twitter.com/0Wzu0IcygE — Suresh Kondeti (@santoshamsuresh) September 28, 2022 I was devastated by the tragedies in Super Star Krishna garu's family and the demise of Srimathi Indiramma garu struck me very hard. I have great admiration for this affectionate family and highest respect for Indiramma garu. — Sreenu Vaitla (@SreenuVaitla) September 28, 2022 ఇందిరమ్మ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ 🙏 pic.twitter.com/Dgkiorz6Yh — BANDLA GANESH. (@ganeshbandla) September 28, 2022 Superstar @urstrulyMahesh's mother Indira Devi garu passed away. May her soul Rest In Peace 🙏🙏 Our Deepest Condolences to #Krishna garu, #MaheshBabu garu and the whole family.. pic.twitter.com/ZM74sfdYf7 — SVCC (@SVCCofficial) September 28, 2022 మీకెంతో ఇష్టమైన ప్రాణానికి ప్రాణమైన అమ్మగారు వెళిపోయారన్న వార్త చాలా బాధాకరం @urstrulyMahesh గారు . వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను🙏🙏🙏 pic.twitter.com/5MtnZsPRQA — RamajogaiahSastry (@ramjowrites) September 28, 2022 Superstar @urstrulyMahesh's mother #IndiraDevi garu is no more. May her soul Rest In Peace 🙏🙏 Our Deepest Condolences to #Krishna garu,#MaheshBabu garu and the whole family. pic.twitter.com/ocS5RxgsOy — Kona Film Corporation (@KonaFilmCorp) September 28, 2022 It's very unfortunate to hear the sudden demise of @urstrulyMahesh's mother Indira Devi garu 🙏💐. Our Deepest condolences to #Krishna garu and the whole family. Om Shanti 🙏 pic.twitter.com/Sg67IAI5kw — UV Creations (@UV_Creations) September 28, 2022 -
'పెద్దదిక్కును కోల్పోయాను'.. కన్నీటిపర్యంతమైన ప్రభాస్
పెదనాన్న కృష్ణంరాజు మృతితో ప్రభాస్ కన్నీటి పర్యంతమయ్యాడు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళి అర్పంచి ప్రభాస్ను పరామర్శించగా తాను పెద్దదిక్కును కోల్పోయానంటూ పెదనాన్నను గుర్తుచేసుకుంటూ ప్రభాస్ కన్నీటి పర్యంతమయ్యాడు. దీంతో మంత్రి తలసాని ప్రభాస్ను ఓదార్చారు. కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పాపులారిటీని దక్కించుకున్నాడు. నటుడిగా ప్రభాస్ ఇంత ఎత్తుకు ఎదగడం తనకు ఎంతో సంతోషమని కృష్ణంరాజు పలు సందర్భాల్లో చెబుతుండేవారాయన. ఆర్టిస్టుగా ప్రభాస్ని చూసి కొన్ని తాను నేర్చుకునే పరిస్థితి వచ్చిందని గతంలో కృష్ణంరాజు మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. ప్రభాస్ను ఇలా చూస్తుంటే గుండె తురక్కుపోతుందని, స్టే స్ట్రాంగ్ ప్రభాస్ అంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా కొన్నాళ్లుగా అనారోగ్యంగా బాధపడుతున్న కృష్ణంరాజు పోస్ట్ కోవిడ్ సమస్యలతో తొలుత ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో శనివారం అర్థరాత్రి గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. చదవండి: పెదనాన్న కృష్ణంరాజు అంటే ప్రభాస్కు ఎంత ప్రేమో.. వీడియో వైరల్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Never in my wildest dreams, I thought I would see him like this 😭 This feels so personal 💔 Stay strong #Prabhas anna 🥺😭 pic.twitter.com/k1Jgy82947 — SALAAR 🏹 (@bhanurockz45) September 11, 2022 We all are with you Aanaya #Prabhas ❤️ your man should continue our Raju gari leagancy God support whole Family recovery speed Miss u Raju Garu 😍🥹 https://t.co/lunKRQPR4e — Koppolu.jaswanth (@JaswanthKoppolu) September 11, 2022 Pedhha dude ika leru #KrishnamRaju garu 😭 💔 May your soul Rest in Peace sir 😭🙏#OmShanti Stay strong #Prabhas More power to you darling 🙏🙏#RIPKrishnamRaju gaaru 😔 pic.twitter.com/cXUhn2VbxO — NareshVarma REBEL⭐FAN (@NareshVTweet) September 11, 2022 -
ఘోర ప్రమాదం: ట్రాక్టర్-ట్రక్కు ఢీ.. భక్తుల దుర్మరణం
జైపూర్: రాజస్థాన్లో ఘోర ప్రమాదం సంభవించింది. భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ను ట్రక్కు ఢీ కొట్టడంతో పలువురు మృతి చెందారు. జైసల్మేర్ రామ్దేవ్ర ఆలయానికి వెళ్తున్న క్రమంలో.. వేగంగా వస్తున్న ట్రక్కు.. ట్రాక్టర్ను ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి పాలి జిల్లా సుమేర్పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 25 మంది గాయపడ్డారు. గాయపడిన వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, కొన్ని ఆంబులెన్స్లు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఘటనపై ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేస్తూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్లు చేశారు. The accident in Pali, Rajasthan is saddening. In this hour of grief, my thoughts are with the bereaved families. I pray for a speedy recovery of those injured: PM @narendramodi — PMO India (@PMOIndia) August 19, 2022 Anguished by the loss of lives in a road accident in Pali, Rajasthan. My heartfelt condolences to the bereaved families and prayers for the speedy recovery of the injured. — Vice President of India (@VPSecretariat) August 19, 2022 ఇదీ చదవండి: చిల్లర మాయం కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం -
పింగళి కుమార్తె సీతామహాలక్ష్మి కన్నుమూత.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, పల్నాడు: జాతీయ జెండా రూపకర్త దివంగత పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతా మహాలక్ష్మి (100) కన్నుమూశారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని ప్రియదర్శిని కాలనీలో ఉంటున్న ఆమె కుమారుడు జీవీ నరసింహారావు ఇంట్లో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. చాలా రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతు న్నారు. గత ఏడాది ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా మాచర్లకు వచ్చి ఆమెను సత్కరించి రూ.75 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆమెతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. కాగా, పింగళి సీతామహాలక్ష్మీ మృతి పట్ల ఏపీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. -
ఆయన మరణం మనసును కలిచివేసింది: మోహన్ బాబు
Mohan Babu Condolence On Editor Gowtham Raju Death: సినిమాల్లో ఎడిటర్గా గౌతమ్రాజు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న గౌతంరాజు (68) బుధవారం (జులై 6) కన్నుమూసిన విషయంతెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. అయితే అర్ధరాత్రి ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో 1:30 నిమిషాలకు గౌతంరాజు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతూ గౌతమ్ రాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మృతిపట్ల డైలాగ్ కింగ్ మోహన్ బాబు, పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. 'ఎడిటర్ గౌతమ్రాజు నాకు అత్యంత ఆత్మీయుడు.. నా సొంత బ్యానర్లో ఎన్నో సినిమాలకు ఎడిటర్గా పనిచేశారు. అతను మంచి మనిషి. అతని బిడ్డలు కూడా మన స్కూల్లో చదువుకున్నారు. వాళ్లిద్దరూ క్షేమంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ అతని మరణ వార్త వినగానే నా మనసును కలిచివేసింది. తన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. కానీ అతని మరణ వార్త వినగానే నా మనసు కలిచివేసింది. తన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. — Mohan Babu M (@themohanbabu) July 6, 2022 అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎడిటర్గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందిన గౌతమ్ రాజు కన్నుమూయడం విచారకరమని పవన్ కల్యాణ్ పేర్కొన్నాడు. ఎడిటర్గా వందల చిత్రాలకు పని చేసిన అనుభవశాలి అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. -
ఆ విమర్శలతో నా నటనలో మార్పు వచ్చింది: చిరంజీవి
Chiranjeevi Condolence To Gudipudi Srihari: ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి (88) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఆయన మంగళవారం (జులై 5) హైదరాబాద్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. గుడిపూడి శ్రీహరి మరణం పట్ల పలువురు సినీ తారలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన మరణం సినీ పాత్రికేయ రంగానికి తీరని లోటని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. 'గుడిపూడి శ్రీహరి గారు ఓ నిఖార్సయిన నిబద్ధత కలిగిన సినీ విమర్శకుడు. నా ఎన్నో చిత్రాలపై ఆయన రాసిన ఆరోగ్యకరమైన విమర్శలు.. నటుడిగా నన్ను నేను ఎప్పటికప్పుడు మెరుగ్గా మలుచుకోవడానికి ఎంతో ఉపకరించాయి. ఆయన మరణం సినీ పాత్రికేయ రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను' అని చిరు ట్విట్ చేశారు. అలాగే మరోవైపు ఇటీవల ఓ కార్యక్రమంలో గుడిపూడి శ్రీహరి గురించి చిరంజీవి మాట్లాడిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోను నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ శ్రీహరికి నివాళి అర్పిస్తున్నారు. గుడిపూడి శ్రీహరి గారు ఓనిఖార్సయిన నిబద్ధత కలిగిన సినీవిమర్శకుడు.నా ఎన్నో చిత్రాలపై ఆయన రాసిన ఆరోగ్యకరమైన విమర్శలు,నటుడిగా నన్నునేను ఎప్పటికప్పుడు మెరుగ్గా మలుచుకోడానికి ఎంతో ఉపకరించాయి.ఆయన మరణం సినీ పాత్రికేయరంగానికి తీరనిలోటు.ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను pic.twitter.com/wCTFIrQby3 — Chiranjeevi Konidela (@KChiruTweets) July 5, 2022 ఈ వీడియోలో ''నా నట జీవితాన్ని సరైన మార్గంలో పెట్టిన వారిలో గుడిపూడి శ్రీహరి, పీఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి, నందగోపాల్ తదితర జర్నలిస్ట్లు ఉన్నారు. నా సినిమా సెట్లో వారితో చర్చించి ఎన్నో విషయాలు నేర్చుకునేవాడిని. ఆరోగ్యకరం జర్నలిజం అంటే ఏంటో వారి దగ్గర తెలుసుకున్నా. ఒకప్పుడు గుడిపూడి శ్రీహరి 'సితార'లో సినిమా రివ్యూలు రాశేవారు. ఆయన పదజాలం కొంచెం హార్ష్గా అనిపించినా ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి చెబుతున్నట్లు ఉండేది. నేను బాగా నటిస్తున్నాని, పోరాటాలు, డ్యాన్సులు అన్నింటిల్లో వేగం పెంచానని ప్రశంసిస్తూనే డైలాగ్లు చాలా వేగంగా చెబుతున్నానని విమర్శించారు. 'నటనలో స్పీడ్ ఉండాలి గానీ మాటల్లో కాదు. మనం చెప్పే మాట ముందు మన చెవికి వినపడాలి. తర్వాత ఇతరులకు వినపడాలి' అని చెప్పి నాలో మార్పు తీసుకొచ్చారు'' అని చిరంజీవి పేర్కొన్నారు. -
విషాదం: కేన్సర్తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్ నటుడు మృతి
Assamese Actor Kishor Das Dies At Age 30 After Battle With Cancer: సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అస్సామీ నటుడు కిశోర్ దాస్ శనివారం (జులై 2) కన్నుమూశారు. 30 ఏళ్ల కిశోర్ దాస్ కేన్సర్తో పోరాడి తుదిశ్వాస విడిచాడు. ఈ ఏడాది మార్చి నుంచి చెన్నై ఆస్పత్రిలో కేన్సర్ చికిత్స పొందుతున్న కిశోర్ దాస్కు కరోనా సోకినట్లు వైద్య నివేదికలో వెల్లడైంది. కేన్సర్తో పోరాడుతున్న అతనికి కరోనా సోకడంతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కిశోర్ దాస్ అంత్యక్రియలను చెన్నైలోనే నిర్వహించనున్నారు. కొవిడ్-19 ప్రొటోకాల్ కారణంగా అతని మృతదేహాన్ని అస్సాంలోని కామ్రూప్లో ఉన్న స్వస్థలానికి పంపించట్లేదు. అస్సామీ వినోద పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో కిశోర్ దాస్ ఒకరు. బంధున్, బిధాత, నేదేఖ ఫాగున్ వంటి తదితర అనేక పాపులర్ టీవీ సీరియల్స్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. సీరియల్స్లోనే కాకుండా 300కుపైగా మ్యూజిక్ ఆల్బమ్స్లో నటించి సంగీత ప్రియులకు అభిమాన నటుడిగా మారాడు. 'తురుట్ తురుట్' సాంగ్తో ఓవర్నైట్ స్టార్గా ఎదిగాడు. కిశోర్ చివరిసారిగా జూన్ 24న విడుదలైన 'దాదా తుమీ డస్తో బోర్' చిత్రంలో నటించాడు. కిశోర్ దాస్ 2019లో క్యాండిడ్ యంగ్ అచీవ్మెంట్ అవార్డును కూడా పొందాడు. చదవండి: బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్ వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ..! కిశోర్ మృతితో అస్సామీ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. కిశోర్ అకాల మరణంపై అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి కేశబ్ మహంత ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. అలాగే అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా 'తీరని లోటు' అంటూ నివాళులు అర్పిస్తున్నారు. చదవండి: అందుకు నాకు అర్హత లేదు: మహేశ్ బాబు Deeply saddened by the news of young Assamese actor, model and dancer Kishore Das' demise. He lost the battle to Cancer after giving a tough fight. My condolences to the bereaved family. May his soul rest in eternal peace. Om Shanti! pic.twitter.com/CIG1x3FJ6f — Keshab Mahanta (@keshab_mahanta) July 2, 2022 Deeply Saddened to hear about the death of Kishor Das, a very popular actor from Assam. The untimely demise of the actor of such talent is a huge loss to the cultural arena. I extend my deepest condolences to his bereaved family and fans. May his soul rest in Peace. Om shanti! pic.twitter.com/BvoMqejfQ3 — Ajanta Neog (@AjantaNeog) July 2, 2022 -
పద్యశిఖరం ఒరిగిపోయింది!
పద్యం తెలుగువారి ఆస్తి. ఆ ఆస్తిని మరింత పెంచిన కొల్లా శ్రీకృష్ణారావు సోమవారం గుంటూరులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 94 ఏళ్ల జీవితాన్ని సాహితీ సృజనలో గడిపిన కవితా తపస్వి మృతితో తెలుగు సాహిత్య లోకం... మరో పద్య కవితా శిఖరాన్ని కోల్పోయింది. గుంటూరు జిల్లా పెదకూరపాడులో మహాలక్ష్మి– సూరయ్య రైతు దంపతులకు జన్మించారు శ్రీకృష్ణారావు. బాల్యం నుండి కవిత్వం పట్ల మక్కువ ఉన్న కృష్ణారావు మహా కవులు గుర్రం జాషువా, ఏటుకూరి వెంకట నరసయ్యలను కవితా గురువులుగా ఎంచుకున్నారు. వారి నుంచి తెలుగు పద్యంలోని మెలకువలు గ్రహించారు. ‘విశ్వశాంతి’ కోసం పద్య ‘శంఖారావం’ పూరించారు. ‘రారాజు’ను తెలుగు పద్య సింహాసనంపై కూర్చో బెట్టి పద్యానికి పట్టాభిషేకం చేశారు. పద్యాల ‘పూదోట’లో విహరించారు. విలువైన పద్య కావ్యాలు రాసి పచ్చి పసుపులు పండించారు. ‘కవి బ్రహ్మ’ ఏటుకూరి వారి స్ఫూర్తితో పల్నాటి ‘పౌరుష జ్యోతి’ని వెలిగించారు. రైతు పక్షపాతిగా కర్షక సాహిత్యం వెలయించారు. జాషువాను గుండెలకు హత్తుకుని ‘మన కవి జాషువా’ పేరుతో విలువైన వ్యాస సంపుటిని రచించారు. ‘మఱుగు పడిన మహాకవి తురగా వెంకమరాజు’ అనే వీరి పరిశోధనాత్మక గ్రంథం తెలుగు సాహిత్య చరిత్రకు ఎంతో పనికొచ్చే పుస్తకం. (క్లిక్: నిష్కర్ష విమర్శకుడు!) ‘కవిబ్రహ్మ ఏటుకూరి’ పేరుతో గురువుకు అక్షర దక్షిణ సమ ర్పించారు. ‘నా సాహితీ యాత్ర’ పేరుతో స్వీయ చరిత్రను పాఠక లోకా నికి బహుకరించారు. ఛందో బద్ధ పద్యంలాగే నడకలోనూ, నడతలోనూ... వడీ, వంకా లేని నిరాడంబర జీవనం గడిపారు. ఆయన ఐదు దశాబ్దాలకు పైగా పత్రికా రంగంతో మమేకమయ్యారు. స్వీయ సంపాదకత్వంలో ‘స్వతంత్ర వాణి’, ‘భావ వీణ’ పత్రికలను నడిపారు. అవిశ్రాంత అక్షర తపస్వికి నిండు మనస్సుతో నివాళులు. – డాక్టర్ బీరం సుందరరావు, చీరాల -
ఆయన పాటలు అనేక భావోద్వేగాలను పలికించేవి: ప్రధాని మోదీ
PM Narendra Modi Akshay Kumar Condolence On Singer KK Death: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. పాపులర్ ప్లేబ్యాక్ సింగర్ కేకే (కృష్ణకుమార్ కున్నత్) హఠాన్మరణం చెందారు. కోల్కతాలో ఓ స్టేజ్ షోలో పాల్గొన్న అనంతరం కేకే తాను బస చేస్తున్న హోటల్ గదిలో కుప్పకూలి మరణించినట్లు సమాచారం. కేకే తన ఆఖరి ప్రోగ్రాంకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 53 ఏళ్ల కేకే గత మూడు దశాబ్దాల్లో హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో అనేక హిట్ గీతాలను ఆలపించారు. కేకే హఠాన్మరణం మరణం పట్ల ప్రధాని మోదీతోపాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. #WATCH | Singer KK died hours after a concert in Kolkata on May 31st. The auditorium shares visuals of the event held some hours ago. KK was known for songs like 'Pal' and 'Yaaron'. He was brought dead to the CMRI, the hospital told. Video source: Najrul Manch FB page pic.twitter.com/YiG64Cs9nP — ANI (@ANI) May 31, 2022 'కేకేగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన పాటలు అన్ని రకాల వయసుల వారికి అనేక రకాల భావోద్వేగాలను ప్రతిబింబించేలా చేశాయి. కేకే పాటలు మనకు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి.' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 'కేకే హఠాన్మరణం వార్త విని చాలా షాక్కు గురయ్యాను. చాలా బాధగా ఉంది. తీరని లోటు ఇది. ఓం శాంతి.' అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. వీరితోపాటు దర్శక నిర్మాత కరణ్ జోహార్, సింగర్స్ ప్రీతమ్, జుబిన్ నటియాల్, ఆర్మాన్ మాలిక్, శ్రేయ ఘోషల్ విచారం వ్యక్తం చేశారు. చదవండి: సింగర్ కేకే హఠాన్మరణం: విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టి.. Saddened by the untimely demise of noted singer Krishnakumar Kunnath popularly known as KK. His songs reflected a wide range of emotions as struck a chord with people of all age groups. We will always remember him through his songs. Condolences to his family and fans. Om Shanti. — Narendra Modi (@narendramodi) May 31, 2022 Extremely sad and shocked to know of the sad demise of KK. What a loss! Om Shanti 🙏🏻 — Akshay Kumar (@akshaykumar) May 31, 2022 Heartbreaking news on the sudden passing away of such an incredible talent…. RIP KK…💔 the entertainment world has lost a true artist today….Om Shanti 🙏 pic.twitter.com/SiKQutPJVO — Karan Johar (@karanjohar) May 31, 2022 In utter shock. Just heard about KK . Someone please tell me it's not true — Pritam (@ipritamofficial) May 31, 2022 Black year for Indian music. Lata didi, bappi da, sidhu paaji and now KK sir. These losses.. all of them feel so personal. — ARMAAN MALIK (@ArmaanMalik22) May 31, 2022 One and only . KK 😔 . — Jubin Nautiyal (@JubinNautiyal) May 31, 2022 My deepest sincerest condolences. His golden, soulful voice echoes in all our hearts. Rest in peace dear #KK🙏🏻💔 — Shreya Ghoshal (@shreyaghoshal) May 31, 2022 Singer KK never smoked or drank! Led the most simple non controversial non media hyped life. Complete family man. Jab bhi mujhe mile he met with so much of love & kindness. God! Too unfair! OM SHANTI. — RAHUL VAIDYA RKV (@rahulvaidya23) May 31, 2022 -
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. బొజ్జల కుటుంబసభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనారోగ్యం కారణంగా బొజ్జల.. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్రీకాళహస్తి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. ఆయన స్వగ్రామం శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా బొజ్జల పనిచేశారు. చదవండి: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత -
మల్లు స్వరాజ్యం కన్నుమూత.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మల్లు కుటుంబ సభ్యులకు ఆయన ఓ ప్రకటనలో ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. స్వాతంత్య్ర సమరయోధురాలుగానే కాక సామాజిక, రాజకీయ సమస్యలపై అనేక పోరాటాలు చేసిన ఉద్యమకారిణి మల్లు స్వరాజ్యం అని జగన్ గుర్తు చేసుకున్నారు. తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణ, విలువలతో ఆమె జీవితకాలం మొత్తం జీవించారని కొనియాడారు. చదవండి: అరుణ కిరణం అస్తమించింది ఎర్ర మందారం నేల రాలింది. అస్థిత్వం కోసం.. వెట్టి, బానిసత్వం విముక్తి కోసం బరిసెలు ఎత్తి, బాకుల్ అందుకొని, బందూకుల్ పట్టిన ధీర నింగికెగిశారు. జీవితాంతం సుత్తికొడవలి, చుక్క గుర్తుతోనే సాగిన పోరు చుక్క.. తారల్లో కలిశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం యోధు రాలు మల్లు స్వరాజ్యం(91) కన్నుమూశారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 8 గంటలకు తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా మూత్రపిండాల సమస్యతో బాధ పడుతున్న ఆమెకు ఈనెల 1వ తేదీన ఊపిరితిత్తుల్లోనూ ఇన్ఫెక్షన్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. 2వ తేదీ మధ్యాహ్నానికి నిమోనియాతో పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను వెంటిలేటర్పై ఉంచారు. ఆరోగ్యం కాస్త మెరుగు కావడంతో ప్రత్యేక గదికి తరలించి వైద్య సేవలందించారు. అంతా బాగుందనుకున్నా శుక్రవారం మళ్లీ ఆరోగ్యం దెబ్బతింది. దీంతో మళ్లీ ఐసీయూకు తరలించారు. వెంటిలేటర్పై ఉంచి చికిత్స అంది స్తుండగానే శరీరంలోని అన్ని అవయవాలూ ఫెయిల్ కావడంతో పరిస్థితి విషమించి శనివారం రాత్రి కన్నుమూశారు. -
నమ్మలేకపోతున్నాం: ఏపీ మంత్రులు
సాక్షి, అమరావతి: మంత్రి గౌతమ్రెడ్డి మన మధ్యలేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘తోటి సహచరుడు ఎప్పుడూ సంతోషంగా ఉండే మనిషి. రాష్ట్ర అభివృద్ధి కోసం దుబాయ్ కూడా వెళ్లి పెట్టుబడుల మీటింగ్లో పాల్గొన్నారు. రేపు.. సీఎంతో గౌతమ్ రెడ్డి మీటింగ్ ఉంది. ఈలోపే ఇలా జరగటం బాధాకరం. ఆయన మాట్లాడే తీరు చూస్తే.. ముఖ్యమంత్రి కరెక్టు పర్సన్కే ఐటీ మంత్రి ఇచ్చారని అనుకునేవారమని కన్నబాబు అన్నారు. ఇలా దూరం అవుతారనుకోలేదు.. మంత్రి గౌతమ్రెడ్డి మరణ వార్త వినగానే షాక్ తిన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పల్స్ డౌన్ అవటం వల్ల ఆస్పత్రికి తీసుకుని వెళ్లారనుకున్నాం. కానీ ఇలా దూరం అవుతారనుకోలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్కి వెన్నంటి ఉన్న ఫ్యామిలీ మేకపాటి వారిది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు పలు రకాలుగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు. ఆయన లేని లోటు పార్టీకి తీర్చలేనిదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జీర్ణించుకోలేకపోతున్నాం.. ఏదైనా పని ఉందంటే వెంటనే స్పందించే గుణం గౌతమ్రెడ్డిదని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. ఏదైనా పని ఉందంటే వెంటనే స్పందించే గుణం గౌతమ్రెడ్డిది. అలాంటి వ్యక్తి ఇప్పుడు దూరం కావడం జీర్ణించుకోలేకపోతున్నామని మేరుగ నాగార్జున అన్నారు. -
Bappi Lahiri: 'ఆయన మరణం ఎంతగానో కలచివేస్తుంది.. చాలా దురదృష్టకరం'
ప్రముఖ గాయకుడు, బాలీవుడ్ సంగీత దిగ్గజం బప్పి లహిరి(69) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల బాలీవుడ్, టాలీవుడ్కు చెందిన సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదవండి: ప్రముఖ గాయకుడు బప్పి లహిరి కన్నుమూత ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘బప్పి లహరితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నా కోసం అనేక చార్ట్బస్టర్ సాంగ్లను అందించారు, అవి నా చిత్రాల ప్రజాదరణకు ఎంతో దోహదపడింది. ఆయన సంగీతంలో ప్రతిబింబించే తన ప్రత్యేకమైన శైలి, జీవితం పట్ల చూపించే ఉత్సాహంతో ఆయన ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు’ అంటూ చిరు రాసుకొచ్చారు. Rest in Peace Bappi da! #BappiLahiri pic.twitter.com/67QT9U7lgv — Chiranjeevi Konidela (@KChiruTweets) February 16, 2022 ఆయనతో నాకు సుధీర్ఘ అనుబంధం: మోహన్ బాబు బప్పి లహరి మరణంపై మంచు మోహన్ బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతదేశపు లెజెండరీ సంగీత దర్శకుల్లో ఒకరైన బప్పీలహరి మరణం విచారకరం. ఆయన పాటలు కీలక పాత్ర పోషించిన 3సూపర్హిట్ చిత్రాల్లో ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం దక్కింది. ఆయనతో నాకు సుధీర్ఘ అనుబంధం ఉంది. బప్పీలహరి కుటుంబానికి దేవుడు దైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ మోహన్బాబు ట్వీట్లో పేర్కొన్నారు. Saddened to hear the demise of Shri Bappi Lahiri, one of the Legendary Music Composers of India, had the honor of working with him for 3 super hit movies in which his songs played a crucial role. Had a long association with him. I pray for his family's strength. Om Shanti! pic.twitter.com/09QZRyLh5q — Mohan Babu M (@themohanbabu) February 16, 2022 బప్పిలహరి మరణంపై నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త నన్నెంగానో కలచివేసింది. 'నేను నటించిన 'రౌడి ఇన్స్పెక్టర్', 'నిప్పురవ్వ' వంటి చిత్రాలకు బప్పి లహరి సంగీతం అందించారు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అంటూ బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: తొలిసారి కాస్టింగ్ కౌచ్పై నోరు విప్పిన స్వీటీ, అవకాశాల కోసం అలా చేయాల్సిందే.. -
గుండె బద్ధలయ్యింది.. నమ్మలేకపోతున్నా: హర్నాజ్ సంధు
రంగుల ప్రపంచంలో మరో ధృవతార నేలరాలింది. మిస్ యూఎస్ఏ 2019 విజేత చెస్లై క్రిస్ట్ హఠాన్మరణం.. ఫ్యాషన్ ప్రపంచంలో విషాదం నింపింది. బ్యూటీ క్వీన్గా మాత్రమే కాదు.. ఫ్యాషన్ బ్లాగర్గా, లాయర్, ఉద్యమకారిణిగా 30 ఏళ్ల చెస్లై క్రిస్ట్ పేరు సంపాదించుకున్నారు. ఆదివారం ఉదయం క్రిస్ట్ న్యూయార్క్లోని తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమె హఠాన్మరణంతో షాక్ తిన్న మోడలింగ్ ప్రపంచం నివాళులర్పిస్తోంది. భారతీయ మోడల్, మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధుతో ఆమెతో కలిసి ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుని భావోద్వేగానికి లోనైంది. ‘నువ్వు ఎంతో మందికి స్ఫూర్తి. నమ్మకలేకపోతున్నా. గుండెబద్ధలైంది. రెస్ట్ ఇన్ పీస్ చెస్లై’ అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది హర్నాజ్. ఇదిలా ఉండగా.. న్యూయార్క్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 60 అంతస్థుల ఆ బిల్డింగ్లో 9వ ఫ్లోర్లో ఆమె నివాసం ఉంటోంది. ఆమెది ఆత్మహత్యేనా? కారణాలేంటన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. 1991లో మిచ్గాన్, జాక్సన్లో జన్మించిన క్రిస్ట్.. సౌత్ కరోలీనాలో పెరిగింది. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలీనా నుంచి గ్రాడ్యుయేషన్, వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి న్యాయ పట్టా తీసుకుంది. నార్త్ కరోలీనాలోనే సివిల్ లిటిగేటర్గా విధులు నిర్వహించి.. ఆపై వైట్కాలర్ గ్లామర్ పేరుతో ఫ్యాషన్ బ్లాగ్ను నిర్వహించారు. 2019లో మిస్ నార్త్ కరోలీనాగా, అదే ఏడాది మిస్ యూఎస్ఏ టైటిల్ను గెల్చుకుంది. పలు అంశాలపై కూడా ఆమె వ్యతిరేక గళం వినిపించి ఉద్యమకారిణిగానూ పేరు సంపాదించుకుంది. -
పీసీ రెడ్డి మృతికి ఆచార్య సీఎంకే రెడ్డి సంతాపం
సాక్షి, చెన్నై: ప్రఖ్యాత సినీ దర్శకుడు పి.చంద్రశేఖర రెడ్డి మృతికి అఖిల భారత తెలుగు సమాఖ్య తరపున ఆ సమాఖ్య అధ్యక్షుడు ఆచార్య చిల్లకూరు ముద్దుకృష్ణారెడ్డి(ఆచార్య సీఎంకే రెడ్డి) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ‘‘నెల్లూరు జిల్లాలో జన్మించి పలు సందేశాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించిన మేధావి చంద్రశేఖరరెడ్డి. ఈయన దర్శకత్వం వహించిన 93 చిత్రాల్లో 55 చిత్రాలు కృష్ణగారితోనే తీయడం విశేషం. ఆయన ఆత్మకు శాంతి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
అత్యంత ఆప్తుడిని కోల్పోయా: సూపర్ స్టార్ కృష్ణ
Supers Star Krishna Condolence To Director Death: ప్రముఖ దర్శకుడు పీసీ రెడ్డి (పి. చంద్రశేఖరరెడ్డి) సోమవారం చెన్నైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి సూపర్ స్టార్ కృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. అంతేకాదు పీసీ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా కలిసిపోయే ఆప్తులు పీసీ రెడ్డి. అటువంటి వ్యక్తిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది’ అని అన్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. ‘‘దర్శకులు పి. చంద్రశేఖర్ రెడ్డిగారు నాకు వ్యక్తిగతంగా మరియు మా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా కలిసిపోయే ఆప్తులు, ఆయన దర్శత్వంలో వచ్చిన తొలిచిత్రం అత్తలు-కోడళ్లు’లో హీరోగా నేను నటించాను. రెండవ చిత్రం ‘అనురాధ’లో కూడా నేనే హీరో. మా ఇద్దరి కాంబినేషన్లో 23 చిత్రాలు వచ్చాయి. వాటిలో ‘ఇల్లు ఇల్లాలు, కొత్త కాపురం, పాడిపంటలు, నా పిలుపే ప్రభంజనం’ మంచి హిట్స్. మా పద్మాలయ అనుబంధ సంస్థలో ఆయన డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. మేము చాలా ఆప్తులైన వ్యక్తిని కోల్పోయాం, వారి కుటుంబానికి మా సానుభూతి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము’’ అని పేర్కొన్నారు. అలాగే నిర్మాత శాఖమూరి మల్లికార్జునరావు కూడా పీసీ రెడ్డి మృతికి సంతాపం ప్రకటించారు. ‘నా బాల్యం నుంచి చూసిన దర్శకుడు పిసీ రెడ్డిగారు. పద్మాలయ సంస్థలో ఆయనతో కలిసి పని చేసిన అనుభవం మరవలేదనిది. సాక్షి దినపత్రిక అంటే పీసీ రెడ్డికి ఎంతో ఇష్టం’ అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. సుమారు 80కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన పి. చంద్రశేఖర్ రెడ్డి(86) సోమవారం చెన్నైలో ఉదయం 8:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయనతో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులు పీసీ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నివాళులు అర్పించారు. -
బిపిన్ రావత్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: బిపిన్ రావత్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ తమిళనాడులో కుప్పకూలిన సంఘటన పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హెలికాప్టర్ ప్రమాద ఘటన వార్తతో కలత చెందానన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి: Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాద మృతుల్లో తెలుగు సైనికుడు.. -
Rosaiah Last Rites : మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు
-
రోశయ్య కుమారుడిని ఫోన్లో పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: మాజీ సీఎం రోశయ్య కుమారుడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. రోశయ్యది ఆదర్శప్రాయమైన జీవితమన్నారు. రోశయ్య మృతికి సంతాప సూచకంగా ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 4 నుంచి 6 వరకు సంతాప దినాలను ప్రకటించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ(ప్రొటోకాల్) శనివారం ఉత్తర్వులిచ్చింది. చదవండి: రోశయ్యకు నివాళులర్పించిన ఏపీ మంత్రులు ‘‘పెద్దలు రోశయ్య గారి మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా.. సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య గారి మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని’’ సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
ముగిసిన మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు
Live Updates ► మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. కొంపల్లి రోశయ్య ఫాంహౌస్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. గౌరవ సూచకంగా పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి రోశయ్య పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం రోశయ్య చితికి పెద్ద కుమారుడు శివ సుబ్బారావు నిప్పంటించారు. ►ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చితి వద్దకు మాజీ సీఎం రోశయ్య పార్థివదేహాన్ని తీసుకువచ్చారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. కడసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ►అధికారిక లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కడసారి చూసేందుకు నేతలు భారీగా తరలివచ్చారు. ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. ►గాంధీభవన్ నుంచి ప్రారంభమైన రోశయ్య అంతిమయాత్ర కొనసాగుతోంది. కాసేపట్లో హైదరాబాద్ శివార్లోని దేవరయాంజాల్లోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ►రోశయ్య పార్థివదేహం గాంధీభవన్కు చేరుకుంది. కాసేపట్లో దేవరయాంజాల్ ఫాంహౌస్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రోశయ్య పార్థివదేహానికి పలువురు నేతలు నివాళులర్పించారు. రోశయ్యతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం రోశయ్య పార్థివదేహానికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్,పేర్ని నాని, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు, సినీనటుడు చిరంజీవి నివాళులర్పించారు. రోశయ్య అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరుకానున్నారు. మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలను మధ్యాహ్నం ఒంటిగంటకు అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. రోశయ్య పార్థవదేహాన్ని ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలమైన గాంధీభవన్కు తీసుకెళ్లనున్నారు. సందర్శన తర్వాత హైదరాబాద్ శివార్లోని దేవరయాంజాల్లోని వ్యవసాయ క్షేత్రానికి తరలించనున్నారు. మధ్యాహం అక్కడ రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రోశయ్య మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘పెద్దలు రోశయ్య గారి మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా... సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య గారి మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని’’ సీఎం జగన్ ట్వీట్ చేశారు. అటు తర్వాత రోశయ్య కుమారుడిని ఫోన్లో సీఎం జగన్ పరామర్శించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కొణిజేటి రోశయ్య శనివారం ఉదయం (88) కన్నుమూశారు. బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చదవండి: Konijeti Rosaiah: రాజకీయాల్లో రోశయ్య ప్రస్థానమిలా.. పెద్దలు రోశయ్య గారి మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా... సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య గారి మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) December 4, 2021 -
మనసుకు బాధగా ఉంది మిత్రమా: ఇళయరాజా భావోద్వేగం
Ilayaraja Condolence To Sirivennela Sitarama Sastry: సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి హఠాన్మరణం దేశవ్యాప్తంగా ఉన్న సాహితీప్రియులను, చలన చిత్ర పరిశ్రమలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. పండితుల నుంచి సామాన్యుల వరకు సిరివెన్నెల సాహిత్యం ప్రభావితం చేయగా.. ఆయన మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయా ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. కాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సిరివెన్నెల మృతిపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. చదవండి: సిరివెన్నెలను వరించిన 11 నంది అవార్డులు.. ఆ పాటలు ఇవే.. కాగా ఇళయరాజా, సిరివెన్నెలు దశాబ్దాల పాటు పనిచేశారు. ఇళయరాజా స్వరాలకు సిరివెన్నెల సాహిత్యం తోడై అద్భుతం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీంతో ఇళయరాజా మిత్రుడు సిరి వెన్నెలకు పదాలతో నీరాజనం తెలిపారు. ‘మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయని చెప్పారు. ఆయన పాటల పదముద్రలు తన హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయని తెలిపారు. సినిమా పాటల్లో సైతం కవితాత్మని, కళాత్మకతని అందించి తనదైన ముద్రతో అర్థవంతమైన, సమర్థవంతమైన పాటలను అందించారని చెప్పారు. శ్రీ వేటూరి సహాయకుడిగా వచ్చి...అతి తక్కువ కాలంలో..శిఖర స్థాయికి చేరుకున్న సరస్వతీ పుత్రుడు... చదవండి: కళావెన్నెల, కళాతపస్విల బంధం.. వారి అంతరంగం మీకోసం సీతారాముడు పాటతో ప్రయాణం చేస్తాడు.. పాటతో అంతర్యుద్ధం చేస్తాడు.. పాటలో అంతర్మథనం చెందుతాడు.. పాటని ప్రేమిస్తాడు.. పాటతో రమిస్తాడు.. పాటని శాసిస్తాడు.. పాటని పాలిస్తాడు.. పాట నిస్తాడు.... ‘మన భావుకతకి భాషను అద్ది. మనకు తెల్సిన పాటలా చెవుల్లోకి ఒంపుతాడు... అందుకే సీతారాముడి పాటలు ఎప్పటికీ గుర్తుంటాయి.. తన సాహిత్యం నాతో ఆనంద తాండవం చేయించాయి. నాతో శివ తాండవం చేయించాయి.. ‘వేటూరి’ నాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే... ‘సీతారాముడు’ నాకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచాడు.. ధన్యోస్మి మిత్రమా..! ఇంత త్వరగా సెలవంటూ శివైక్యం చెందడం మనస్సుకు బాధగా ఉంది.. పాటకోసమే బ్రతికావు,బ్రతికినంత కాలం పాటలే రాశావు....ఆ ఈశ్వరుడు నీకు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అంటూ ఇళయరాజా సిరివెన్నెలకు అంతిమ వీడ్కోలు తెలిపారు. కాగా మహాప్రస్థానంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ఈ రోజు(బుధవారం) మధ్యాహ్నం 2:26 గంటలకు ముగిశాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం వేద పండితులు అంతక్రియల పక్రియ జరిపారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహా ప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. అంతిమ యాత్రలో పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సహా అభిమానులు పాల్గొన్నారు. -
‘సిరివెన్నెల’కు ప్రముఖుల నివాళి
Sirivennela Sitaramasastri: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిశాయి. బుధవారం మధ్యాహ్నం 2:26 గంటల సమయంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం వేద పండితులు అంతక్రియల పక్రియ జరిపారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహా ప్రస్థానం వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగగా..ఈ యాత్రలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సహా అభిమానులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. కాగా నవంబర్ 3న సిరివెన్నెల లంగ్ క్యాన్సర్తో మృతి చెందిన సంగతి తెలిసందే. అంతనం అభిమానుల సందర్శనార్థం సిరివెన్నెల భౌతిక కాయాన్ని కడసారి చూపు కోసం ఫిల్మ్ ఛాంబర్లో ఉంచారు. ఈ రోజపు మధ్యాహ్నం 1 గంటలకు సిరివెన్నెల అంతిమయాత్ర ప్రారంభం కాగా. మహాప్రస్థానంలో అంత్యక్రియలు ముగిశాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
డాక్టర్ వాసుదేవ ప్రసాద్ అట్లూరి కుటుంబానికి నాట్స్ సంతాపం
అమెరికాలో వైద్య రంగంలో ముప్పై ఐదేళ్లుగా సేవలు అందించిన డాక్టర్ వాసుదేవ ప్రసాద్ అట్లూరి ఆకస్మిక మరణం పట్ల నార్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాట్స్) సంతాపం వ్యక్తం చేసింది. ముప్పై ఐదేళ్ల కిందట ఎంఎస్ చేయడానికి వచ్చిన వాసుదేవ ప్రసాద్ అరిజోనా యూనివర్సిటీ నుంచి ఎంఎస్తో పాటు పీహెచ్డీ పూర్తి చేశారు. అమెరికాలోనే స్థిరపడి ఎంతో మందికి సేవలు అందించారు. అనేక తెలుగు సంఘాల్లో క్రీయశీల పాత్ర పోషించారు. అరిజోనాలోని ఫోనిక్స్లో నవంబరు 28న ఆయన ఆకస్మికంగా మరణించారు. ఆయన కుటుంబానికి నాట్స్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు నాట్స్ పేర్కొంది. -
శివశంకర్ మాస్టర్ సేవలు మరువలేనివి : హీరో కార్తి
Hero Karthi Condolences To Late Shivashankar Master: నృత్య దర్శకుడు, నటుడు శివ శంకర్ భారతీయ సినిమాకు చేసిన సేవలు అపారమని నటుడు కార్తీ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్లో కన్నుమూసిన శివ శంకర్ మాస్టర్ భౌతిక కాయానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతి యావత్ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ‘శివశంకర్ భారతీయ సినిమాకు చేసిన సేవలు అపారం..ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం’ అని సోమవారం ట్వీట్ చేశారు. అదేవిధంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ శివశంకర్ మాస్టర్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాస్టర్తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పలు చిత్రాలకు శివశంకర్ మాస్టర్తో కలిసి పని చేసే అవకాశం తనకు కలిగిందని పేర్కొన్నారు. ఆయన మరణం భారతీయ సినిమాకు తీరని లోటు అని అన్నారు. My heartfelt condolences to the family and friends of Shivashankar master. A man of immense talent and decades of contribution to Indian cinema. pic.twitter.com/rsG45Dbwy0 — Actor Karthi (@Karthi_Offl) November 29, 2021 -
డాలర్ శేషాద్రి మృతి పట్ల సీఎం వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శేషాద్రి కుటుంబ సభ్యులకు సీఎం తాన ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం చెందారు. విశాఖపట్నంలో కార్తీక దిపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. వేకువజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు తుది శ్వాస విడిచారు. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో ఉన్నారు. 2007లో రిటైర్ అయినా.. శేషాద్రి సేవలు తప్పనిసరికావడంతో ఓఎస్డీగా టీటీడీ కొనసాగించింది. మరణించే చివరి క్షణం వరకు ఆయన స్వామి సేవలో తరించారు. చదవండి: డాలర్ శేషాద్రి మృతి పట్ల వైవీ సుబ్బారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి -
కరీమున్నిసా భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: గుండెపోటుతో మరణించిన కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతపురం కరీమున్నిసా కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. హోం మంత్రి సుచరిత, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు కూడా ఎమ్మెల్సీ కరీమున్నిసా భౌతికకాయానికి నివాళులర్పించారు. కాగా, కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నిసా గుండెపోటుతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందారు. శాసనమండలి సమావేశానంతరం ఇంటికి వచ్చిన ఆమె రాత్రి 11.30 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రెండు హాస్పటల్స్కు తరలించినా ఫలితం లేకపోయింది. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి కరీమున్నీసా పార్టీకోసం నిరంతరం శ్రమించారు. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఆమెకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. శుక్రవారం ఉదయం శాసనమండలిలో ఆమె సీఎం జగన్, శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును కలిశారు. కరీమున్నీసాకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మృతి పట్ల గవర్నర్ సంతాపం విజయవాడ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మైనారిటీ వర్గానికి చెందిన నాయకురాలిగా కరీమున్నీసా తన రాజకీయ జీవితాన్ని కార్పొరేటర్గా ప్రారంభించి ఎమ్మెల్సీ స్థానానికి ఎదిగారన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి: (వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కన్నుమూత) -
ప్రముఖ చరిత్రకారుడు, రచయిత, బాబాసాహెబ్ పురందరే మృతి
-
మాటలకందని బాధను అనుభవిస్తున్నాను: మోదీ
న్యూఢిల్లీ: ప్రముఖ చరిత్రకారుడు, రచయిత, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత బాబాసాహెబ్ పురందరే(99) సోమవారం ఉదయం మరణించారు. పురందరే మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. పురందరే మరణం తనకు మాటలకు అందని బాధను కలిగించిందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మోదీ తన అధికారిక ట్విటర్లో ‘‘మాటలకందని బాధను అనుభవిస్తున్నాను. శివషాహీర్ బాబాసాహెబ్ పురందరే మరణం చరిత్ర,సాంస్కృతిక ప్రపంచంలో అతి పెద్ద శూన్యతను మిగిల్చింది. రానున్న తరాలు ఛత్రపతి శివాజీ మహారాజ్తో మరింత కనెక్ట్ అయ్యేలా చేసేందుకు గాను పురందరే చేసిన కృషికి కృతజ్ఞతలు. ఆయన ఇతర రచనలు కూడా గుర్తుండిపోతాయి’’ అని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. (చదవండి: పద్మ విభూషణ్ వెనక్కి ఇస్తున్న: మాజీ సీఎం) I am pained beyond words. The demise of Shivshahir Babasaheb Purandare leaves a major void in the world of history and culture. It is thanks to him that the coming generations will get further connected to Chhatrapati Shivaji Maharaj. His other works will also be remembered. pic.twitter.com/Ehu4NapPSL — Narendra Modi (@narendramodi) November 15, 2021 అంతేకాక ‘‘పురందరే చాలా చమత్కారంగా మాట్లాడే వ్యక్తి మాత్రమే కాక భారతదేశ చరిత్ర గురించి ఆయనకు అపార జ్ఞానం ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగిన ఘనత నాకు లభించింది. కొన్ని నెలల క్రితం, ఆయన శతాబ్ది సంవత్సరపు కార్యక్రమంలో ప్రసంగించాను’’ అని మోదీ మరో ట్వీట్లో తెలిపారు. (చదవండి: 4 గంటల పర్యటన.. రూ.23 కోట్లకు పైగా ఖర్చు) Shivshahir Babasaheb Purandare was witty, wise and had rich knowledge of Indian history. I had the honour of interacting with him very closely over the years. A few months back, had addressed his centenary year programme. https://t.co/EC01NsO1jc — Narendra Modi (@narendramodi) November 15, 2021 బాబాసాహెబ్గా ప్రసిద్ధి చెందిన బల్వంత్ మోరేశ్వర్ పురందరే సోమవారం ఉదయం 5 గంటలకు పూణే (మహారాష్ట్ర)లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చేరారు. బాబాసాహెబ్ పురందరేను కేంద్ర ప్రభుత్వం 2019లో భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్తో.. 2015లో రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర భూషణ్ అవార్డుతో సత్కరించింది. పురందరే ఛత్రపతి శివాజీ మహారాజ్పై వివిధ పుస్తకాలను కూడా రాశారు. చరిత్ర పరిశోధనలకు తన జీవితాన్ని అంకితం చేశారు. (చదవండి: నిజమా! అంతా బాగుందా?) బాబాసాహెబ్ "జాంత రాజా" అనే నాటకాన్ని కూడా వ్రాసి దర్శకత్వం వహించారు, దీనిని 200 మంది కళాకారులు ప్రదర్శించారు. ఐదు భాషలలో అనువదించారు. మరోవైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా పురందరే మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో బాసాహెబ్ పురందరేకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. చదవండి: దీటైన హామీ! కానీ విధానమే ప్రశ్నార్థకం! -
పునీత్ మృతికి రజనీ సంతాపం, కన్నింగ్ ఫెలో అంటూ విమర్శలు
Rajinikanth Slammed By Puneeth Rajkumar Fans: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ మరణం ప్రతి ఒక్కరిని తీవ్రంగా బాధిస్తోంది. ఆయన కన్నుమూసి 12 రోజులు గడుస్తున్నా ఆయన లేరనే చేదు నిజాన్ని కన్నడిగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆయన అంత్యక్రియలకు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. ఆయన మరణ వార్త విని భారత సినీ పరిశ్రమ షాక్కు గురైంది. దీంతో శాండల్వుడ్, టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. అయితే స్టార్ హీరో, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం చాలా ఆలస్యంగా పునీత్కు సంతాపం తెలిపారు. చదవండి: రజనీకాంత్ ఎమోషనల్.. పునీత్ మరణాన్ని తట్టుకోలేక పోతున్నా.. అయితే దానికి కారణం లేకపోలేదు. పునీత్ మరణించిన రోజే ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోజే డిశ్చార్జ్ అయిన రజనీ అప్పటి నుంచి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పునీత్ మరణించిన 12 రోజుల తర్వాత ఆయన సోషల్ మీడియా వేదికగా పునీత్కు నివాళులు అర్పించారు. అది కూడా ఆయన కూతురు, సినీ దర్శకురాలు సౌందర్య కొత్తగా ప్రారంభించిన హూట్ అనే యాప్ ద్వారా సంతాపం తెలిపారు. చదవండి: హీరోయిన్ పూర్ణతో రవిబాబు ఎఫైర్ అంటూ వార్తలు, స్పందించిన నటుడు పునీత్తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘నువ్వు లేవన్న విషయాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను పునీత్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా నాన్నా’ అంటూ చేసిన ట్వీట్ను హూట్ యాప్లో తన ఆడియో సందేశ లింకును జత చేశారు. అయితే, ఆయన ఇచ్చిన సందేశంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. హుట్ యాప్ ద్వారా ఆయన సందేశం ఇవ్వడంతో.. ఇది పునీత్ మరణానికి చలించినట్టు లేదని, తన కూతురు యాప్ను ప్రమోట్ చేయడానికి ఆయన మృతిని ఉపయోగించుకున్నట్టు కనిపిస్తోందంటూ పునీత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Rajini became 100% viyabaari (businessman ) — Shattia Nathan (@Shattianathan1) November 10, 2021 దీంతో ఓ అభిమాని రజనీ చేసిన ట్వీట్కు రీట్వీట్ చేస్తూ ‘కన్నింగ్ ఫెలో’ అంటూ విమర్శ వ్యాఖ్యలు చేశాడు. ‘మీ లాంటి గొప్ప నటులు యాప్ ప్రమోషన్ కోసం మరణ సందేశాలను ఇవ్వడం షాక్కు గురి చేసింది’ అని మరో అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఇక హూట్ యాప్ను సంతాపాల కోసమూ వాడుకోవచ్చన్నమాట’ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘మీరు సంతాపం తెలియజేస్తున్నారా? లేదంటే యాప్ను ప్రమోట్ చేసుకుంటున్నారా?' అంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఇంత చెత్త పద్ధతిలో యాప్ను ప్రమోట్ చేయడం ఆపేయండంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. మరీ ఇంత నీచానికి దిగజారిపోతారా? అంటూ నెటిజనల్లు రజనీపై మండిపడుతున్నారు. So cunning fellow. Puneeth died ten days before now only u giving condolence words. Am ashame of your behaviour. U given speech reg daughters new project. U will get best lesson from God am sure. — Bhaskar (@baaskarnamitha) November 10, 2021 Shocked.. Legend like you should not use grievance message for App Promotion😡😡 — Wasim raja (@wasimrajam) November 10, 2021 Now condolence also in Hoote App. Ithu ungalukkey overaa illaya Sir. Or @soundaryaarajni whoever is handling this id. 🙆♂️ — Anees H (@Anees_Offl) November 10, 2021 How to get it thalaiva ? ...its a condolence or app promotion?🙂 — i m -sarju (@SarjethSs) November 10, 2021 Whoever using this id please stop promoting the app in such a worst manner.. Promoting the app through condolences is such a low for this Legend superstar @rajinikanth 😌 — Ctrl C + Ctrl V (@thalapathy_modi) November 10, 2021 -
కేసీఆర్ స్పందించే వరకు నిరాహార దీక్ష
సాక్షి, సైదాబాద్ (హైదరాబాద్): ఆరేళ్ల గిరిజన బాలిక హత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించే వరకు నిరాహారదీక్ష చేస్తానని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి భద్రత కల్పించాలని, వారికి ఏం నష్టపరిహారం చెల్లిస్తారో సీఎం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని వారి ఇంటి వద్దే దీక్షకు దిగారు. బుధవారం సింగరేణి కాలనీకి చేరుకున్న షర్మిల బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తన ఇంట్లో కుక్కకు ఇచ్చే విలువ మనుషులకు ఇవ్వటం లేదని అన్నారు. గిరిజనుల ప్రాణాలంటే లెక్కలేదా అని సీఎంను ప్రశ్నించారు. ఫామ్హౌస్లో ఉండి పాలన చేసే సీఎం, ఉపఎన్నికలు వస్తేనే బయటకు వస్తారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి రాష్ట్రంలో మహిళల రక్షణ విషయంలో పట్టింపు లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలంగాణలో మహిళలపై లైంగిక వేధింపుల కేసులు మూడురెట్లు పెరిగాయన్నారు. రాష్ట్రాన్ని అప్పులు, ఆత్మహత్యలు, బీరుల తెలంగాణగా మార్చారని దుయ్యబట్టారు. చిన్నారిని చిదిమేసిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా కఠిన శిక్ష వేయించాలని అన్నారు. బాధిత కుటుంబానికి రూ.10 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దత్తత కాలనీపై పట్టింపేది కేటీఆర్..! మున్సిపల్ ఎన్నికల సమయంలో సింగరేణి కాలనీని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని ప్రకటించిన మంత్రి కేటీఆర్, తర్వాత ఎందుకు పట్టించుకోవడంలేదని షర్మిల ప్రశ్నించారు. ఈ కాలనీలో బాలికపై దుర్మార్గపు చర్య చోటుచేసుకున్నా కేటీఆర్ ఎందుకు బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని నిలదీశారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలి బాలిక ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని షర్మిల అన్నారు. నిందితుడిపై బాధిత కుటుంబం అనుమానం వ్యక్తం చేసినా పట్టించుకోలేదన్నారు. బాధ్యత లేకుండా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. కాగా, అర్థరాత్రి దాటాక కూడా షర్మిల దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. షర్మిలకు మద్దతుగా విజయమ్మ బాలిక హత్యాచార ఘటనపై వైఎస్ షర్మిల చేపట్టిన దీక్షకు ఆమె తల్లి విజయమ్మ మద్దతు ప్రకటించారు. బుధవారం సాయంత్రం సింగరేణి కాలనీకి చేరుకున్న విజయమ్మ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారికి మద్దతుగా దీక్ష చేస్తున్న షర్మిలను కలిశారు. దీక్షా శిబిరంలో కూర్చొని సంఘీభావం తెలిపారు. -
బాధిత కుటుంబానికి రూ.10 కోట్ల పరిహారం ఇవ్వాలి: వైఎస్ షర్మిల
-
చిన్నారి చైత్ర కుటుంబసభ్యులను పరామర్శించిన వైఎస్ షర్మిల
-
సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ చిన్నారి కుటుంబ సభ్యులను బుధవారం వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) అధినేత్రి వైఎస్ షర్మిల పరామర్శించారు. బాధతురాలి ఇంటి వద్ద వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. సీఎం కేసీఆర్ స్పందించేంతవరకు నిరాహార దీక్ష చేస్తానని పేర్కొన్నారు. ఆమెతోపాటు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ విజయమ్మ కూడా దీక్షలో కూర్చున్నారు. బాధిత కుటుంబానికి రూ.10కోట్ల పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ హయాంలో మహిళలపై లైంగికదాడులు అధికమైయ్యాయని మండిపడ్డారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. -
క్రీడా దిగ్గజం కన్నుమూత: విషాదంలో అథ్లెటిక్స్ ప్రపంచం
తిరువనంతపురం: పరుగుల రాణి పీటీ ఉష గురువు, అథ్లెటిక్స్ దిగ్గజం ఓమ్ నంబియార్ (89) గురువారం కన్నుమూశారు. తనకు శిక్షణనిచ్చిన గురువు కన్నుమూయడంతో ఆమె దిగ్ర్భాంతి చెందారు. ఈ విషయాన్ని చెబుతూ ఆమె ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గురువుతో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నారు. కేరళకు చెందిన నంబియార్ 1980- 90 కాలంలో పీటీ ఉషకు శిక్షణ ఇచ్చారు. ఆయన శిక్షణలోనే పీటీ ఉష రాటుదేలారు. 1985లో ఆయనకు ద్రోణాచార్య అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది పద్మశ్రీతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ( చదవండి: పసిపాప కోసం ‘ఒలింపిక్ మెడల్’ వేలానికి ) కోచ్ కాక ముందు నంబియార్ 1955-70 మధ్య భారత వాయుసేనలో పని చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ క్రీడా సంస్థలో కోచింగ్ కోర్సు పూర్తి చేశారు. అనంతరం కేరళ క్రీడా మండలిలో చేరారు. తిరువనంతపురంలో తొలిసారిగా పీటీ ఉష నంబియార్ను కలిసింది. పీటీ ఉషతో పాటు షైనీ విల్సన్, వందనా రావు అంతర్జాతీయ పతకాలు సాధించడంలో నంబియార్ పాత్ర మరువలేనిది. గురువు మృతిపై పీటీ ఉష ట్వీట్ చేశారు. ‘నా గురువు, శిక్షకుడు, మార్గదర్శిని కోల్పోవడం తీరని లోటు. నా జీవితానికి ఆయన చేసిన మేలు మాటల్లో చెప్పలేనిది. మిమ్మల్ని మిస్సవుతున్నాం నంబియార్ సార్. మీ ఆత్మకు శాంతి చేకూరుగాక’ అని చెబుతూ పోస్టు చేశారు. ఈ సందర్భంగా గురువు నంబియార్తో ఉన్న ఫొటోలను ఉష పంచుకుంది. The passing of my guru, my coach, my guiding light is going to leave a void that can never be filled. Words cannot express his contribution to my life. Anguished by the grief. Will miss you OM Nambiar sir. RIP 🙏🏽 pic.twitter.com/01ia2KRWHO — P.T. USHA (@PTUshaOfficial) August 19, 2021 నంబియార్ మృతిపై భారత అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఏఎఫ్ఐ) అధ్యక్షుడు అడిలి జె. సుమారివల్ల సంతాపం ప్రకటించారు. భారత అథ్లెటిక్స్ నంబియార్ సేవలను మరువలేరని పేర్కొన్నారు. 1984 లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్లో పీటీ ఉష నంబియార్ సారథ్యంలోనే సత్తా చాటింది. అథ్లెటిక్స్ తరఫున వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని తెలిపారు. Sad to inform that Dronacharya Awardee coach OM Nambiar sir passed away a while back. He was coach of @PTUshaOfficial RIP Nambiar Sir, You gave us the Golden Girl. Your contribution to sports in India has been tremendous. Our condolences to the family- AFI President @Adille1 pic.twitter.com/VBVNqBPhzT — Athletics Federation of India (@afiindia) August 19, 2021 చదవండి: తనయుడి గిఫ్ట్కు తన్మయత్వంతో కన్నీళ్లు రాల్చిన తల్లి -
నా తప్పే.. క్షమించండి: హర్భజన్ సింగ్
వాట్సాప్లో వచ్చిన ఫార్వార్డ్ మెసేజ్. చూడకుండా పోస్టు పెట్టా... సారీ!... అంటూ టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్షమాపణలు కోరుతున్నాడు. ఖలీస్తాన్ వేర్పాటువాది బింద్రన్వాలేను అమరవీరుడిగా పేర్కొంటూ భజ్జీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టడంపై ఇంటర్నెట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయ్యింది. దీంతో క్షమాపణలు చెప్పాడు టర్బోనేటర్. ఢిల్లీ: ఖలిస్తాన్ తీవ్రవాది బింద్రన్వాలేని అమరవీరుడిగా పేర్కొంటూ హర్భజన్ సింగ్ నివాళులు అర్పిస్తూ చేసిన పోస్టుపై తీవ్ర దుమారం చెలరేగింది. ఆపరేషన్ బ్లూస్టార్కు 37 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్వర్ణ దేవాలయంలో చంపబడ్డ సిక్కు అమరవీరులకు నివాళులర్పిస్తూ భజ్జీ నిన్న(జూన్ 6న) ఒక పోస్ట్ చేశాడు. అయితే అందులో జర్నెయిల్ సింగ్ బింద్రన్వాలే ఫొటో కూడా ఉంది. దీంతో ఒక తీవ్రవాదిని అమరవీరుడిగా ఎలా అభివర్ణిస్తావంటూ హర్భజన్ సింగ్ను చాలామంది ట్రోల్ చేశారు. జరిగిన పొరపాటును గుర్తించానని చెబుతూ.. ఈరోజు ట్విట్టర్లో మరో పోస్ట్ చేశాడు భజ్జీ. అది కేవలం వాట్సాప్లో వచ్చిన ఫార్వార్డ్ మెసేజ్ అని, తానుచూసుకోకుండా పోస్ట్ చేశానని ట్వీట్ చేశాడు. My heartfelt apology to my people..🙏🙏 pic.twitter.com/S44cszY7lh — Harbhajan Turbanator (@harbhajan_singh) June 7, 2021 ‘‘ఇన్స్టాగ్రామ్లో నిన్న చేసిన పోస్టుకి క్షమాపణలు. అది వాట్సాప్లో ఫార్వర్డ్ అయిన మెసేజ్. కంటెంట్ను అర్థం చేసుకోకుండా.. సరిగ్గా చూడకుండా పోస్ట్ చేశా. కానీ, అందులో ఉన్న ఉద్దేశం నేను గ్రహించలేకపోయా. ఇది ముమ్మాటికీ నా తప్పే. అంగీకరిస్తున్నా. ఆ ఫొటోలోని వ్యక్తుల సిద్ధాంతాలకు నేను కట్టుబడి లేను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి మద్ధతు ఇవ్వను. నేను సిక్కును. భారతీయుడను. దేశం కోసం పోరాడుతా. వ్యతిరేకంగా కాదు. ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా. నా దేశ ప్రజలకు హాని చేసే ఏ విద్రోహ శక్తులకు నేను సహకరించలేదు. సహకరించను కూడా’’ అని చెప్పుకొచ్చాడు హర్బజన్ సింగ్. అయితే నెటిజన్స్ మాత్రం శాంతించడం లేదు. గతంలో షాహిద్ అఫ్రిదీ కోసం డొనేషన్లు సేకరించిన భజ్జీ.. ఇప్పుడు మరోసారి దేశ వ్యతిరేక బుద్ధిని చాటుకున్నాడంటూ విరుచుకుపడుతున్నారు. ఈ మేరకు హర్భజన్ సింగ్ పేరు ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది కూడా. చదవండి: సెలబ్రిటీలకు మాత్రమే రిప్లైలా? -
కరోనాతో ప్రముఖ రచయిత కన్నుమూత: ప్రధాని దిగ్భ్రాంతి
దిస్పూర్: సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అస్సాం ప్రముఖ రచయిత హోమెన్ బర్గోహెయిన్ (88) కరోనాతో బాధపడుతూ కన్నుమూశారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆయన మృతితో అసోం సాహిత్య లోకం మూగబోయింది. అతడి మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంతాపం ప్రకటించారు. అధికారికంగా అంత్యక్రియలు జరిపించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అసోంకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అస్సాంలోని లక్ష్మీపూర్ జిల్లా దుకువాఖానాలో డిసెంబర్ 7, 1932న హోమెన్ జన్మించారు. అస్సామీలో రచించిన ‘పిటా పుత్రా’ అనే రచనకు 1978లో కేంద్ర సాహిత్య అకాడమీ వరించింది. అయితే 2015లో జరిగిన నిరసనలకు వ్యతిరేకంగా ఆయన ఆ అవార్డు తిరిగి వెనక్కి ఇచ్చేశారు. ‘సౌదర్ నవ్ మెలీ జయ్’, ‘హల్దోయా సొరయే బౌదన్ ఖాయ్’, ‘అస్తరాగ్’, ‘తిమిర్ తీర్థ’, ‘మత్స్యగంధ’, ‘సుబాల’, ‘నిసంగట’, ‘ఆత్మాన్సుకందన్’, ‘గద్యర్ సాధన’, ‘ప్రొగ్యర్ సాధన’ తదితర రచనలు చేశారు. అస్సాం భాషలో ఎంతో సాహిత్య సేవ చేశారు. హోమెన్ భార్య నిరుపమ తములీ కూడా ప్రముఖ రచయిత్రి. ఆమె కూడా ఎన్నో రచనలు చేశారు. హోమెన్ పాత్రికేయుడిగా కూడా పని చేశారు. అసోం సాహిత్య సభకు 2001లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కొన్నాళ్లు అసోం సివిల్స్ సర్వీస్ అధికారిగా కూడా పని చేశారు. చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ చదవండి: కరోనా భయంతో వర్ధమాన గాయని ఆత్మహత్య Shri Homen Borgohain will be remembered for his rich contributions to Assamese literature and journalism. His works reflected diverse aspects of Assamese life and culture. Saddened by his passing away. Condolences to his family and admirers. Om Shanti. — Narendra Modi (@narendramodi) May 12, 2021 একশৰণ নামধৰ্মৰ বিশিষ্ট প্ৰৱৰ্তক মহাপুৰুষ শ্ৰীশ্ৰী দামোদৰদেৱ আছিল অসমৰ নৱবৈষ্ণৱ আন্দোলনৰ এগৰাকী অন্যতম বাটকটীয়া। আজি সেই পুণ্যাত্মাৰ পৱিত্ৰ তিৰোভাৱ তিথিত মোৰ সশ্ৰদ্ধ প্ৰণিপাত জনাইছোঁ। — Himanta Biswa Sarma (@himantabiswa) May 12, 2021 -
మూగబోయిన ‘ఆనంద’ గానం
చెన్నై : ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు జి.ఆనంద్ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ముఖ్యంగా చెన్నైలోని సంగీత కళాకారులు, సంగీత అభిమానులు జీర్ణించుకోలేని బాధాకరమైన సంఘటన. జి.ఆనంద్ గానం అమృతం. మనసు సున్నితం. సౌమ్యం, నిడారంబరమే ఆయనకు ఆభరణాలు. ఆయన మృతిపై చెన్నైలోని తెలుగు ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆనంద్ మరణవార్త చాలా బాధాకరం. కొన్ని సభల్లో అతిథులుగా పాల్గొన్న పరిచయం. స్వర మాధురి పేరుతో సంస్థని స్థాపించి 7,500 సంగీత కార్యక్రమాలు నిర్వహించిన రికార్డు సృష్టించిన గాయకుడు ఆయన. 20 సార్లు అమెరికాలోని తానా సభల్లో పాల్గొన్నారు. కచేరీల్లో ఘంటసాల గారి పాటలు పాడుతూ ఉన్నత స్థితికి చేరుకున్నానని గర్వంగా చెప్పుకున్న మంచి మనిషి జి.ఆనంద్. విశాల హృదయం గల మహా మనిషి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. –గుడిమెట్ల చెన్నయ్య, జనని కార్యదర్శి, చెన్నై ఎందరో యువ కళాకారులను ప్రోత్సహించారు గాయకుడు, సంగీత దర్శకుడు, స్వరమాధురి వ్యవస్థాపకుడు జి.ఆనంద్ ఆకస్మిక మృతికి అఖిల భారత తెలుగు సమాఖ్య ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. 2014లో నెహ్రూ స్టేడియంలో జరిగిన ముప్పెరుం మహాసభలో జి.ఆనంద్ మాకు మంచి సంగీతాన్ని సమకూర్చారు. మితభాషి, స్నేహశీలి, ఎందరో కళాకారులను ప్రోత్సహించిన జి.ఆనంద్ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం. –సీఎంకే రెడ్డి, అఖిల భారత తెలుగు సమాఖ్య ఉదారస్వభావుడు మనందరికీ ఆయన దూరం కావడం చాలా బాధాకరం. ఆంధ్ర కల్చరల్ అండ్ సోషల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాటలకు ఆనంద్, నాట్యానికి నేను చాలా ఏళ్లుగా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించాం. ఆ సమయంలో ఆయన ఉదార స్వభావం, సౌశీల్యం, గాత్రాన్ని చాలా దగ్గరగా చూసే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాను, ఆనంద్ శారీరకంగా మన మధ్య లేకున్నా ఆయన గాత్రం ఎల్లప్పుడూ మన మధ్యే ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. –ఏవీ శివకుమార్, చెన్నై -
ఎమ్మెస్సార్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
-
ఎమ్మెస్సార్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. ఎమ్మెస్సార్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎం.సత్యనారాయణరావుకు ఇటీవల కరోనా సోకడంతో చికిత్స కోసం నిమ్స్లో చేరారు. చికిత్స పొందుతూ ఆయన మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, మూడు పర్యాయాలు ఎంపీగా, 2004లో వైఎస్సార్ కేబినెట్లో మంత్రిగా ఎమ్మెస్సార్ పనిచేశారు. అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్గా, పీసీసీ అధ్యక్షులుగా ఆయన సేవలు అందించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్కు అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర ఆయన స్వగ్రామం. ఎమ్మెస్సార్ మృతితో వెదిర గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే మల్లాది విష్ణు దిగ్భ్రాంతి.. విజయవాడ: కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణ మృతి పట్ల ఎమ్మెల్యే మల్లాది విష్ణు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెస్సార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దివంగత నేత వైఎస్సార్ పాదయాత్రలో ఎమ్మెస్సార్ వెన్నంటే ఉన్నారని మల్లాది విష్ణు అన్నారు. చదవండి: కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు కన్నుమూత కోవిడ్ కట్టడికి త్రిముఖ వ్యూహం -
సీతారాం ఏచూరి కొడుకు మృతి: ప్రముఖుల సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ: సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి అకాల మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘సీతారాం ఏచూరి కుమారుడు మృతి చెందడం విచారకరం. సీతారాం ఏచూరికి, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇటీవల ఆశిష్కు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన్ని చికిత్స కోసం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం ఆశిష్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీతారాం ఏచూరి ట్విటర్లో పేర్కొన్నారు. Condolences to Shri Sitaram Yechury Ji and his family on the tragic and untimely demise of his son, Ashish. Om Shanti. — Narendra Modi (@narendramodi) April 22, 2021 ప్రముఖల సంతాపం ► సీపీఎం నేత సీతారాం ఏచూరి పెద్దకుమారుడి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి కుటుంబానికి సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి గారి కుమారుడి మరణ వార్త నన్ను కలిచివేసింది. వారికి, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2021 ► ఆశిష్ ఏచూరి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. ‘డియర్ కామ్రేడ్ సీతారాం, మీ నుంచి ఆశిష్ దూరమైనందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం. ఈ క్లిష్టమైన సమయంలో మా ఆలోచనలు మీకు, మీ కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటాయి’అని ఆయన ట్వీట్ చేశారు. ► కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ సీపీఎం నేత సీతారాం ఏచూరి పెద్దకుమారుడి మృతి పట్ల సంతాపం వ్యక్తంచేశారు. ‘ఈ వార్త వినటం చాలా విచారకరం.తల్లిదండ్రులకు ఇంత కంటే పెద్ద నష్టం మరోటి ఉండదు.ఈ నష్టం పూడ్చలేనిది. దు:ఖాన్ని తట్టుకునే శక్తిని కలిగిఉండండి. ఈ బాధకరమైన సమయంలో నా హృదయం బరువెక్కింది’ అని ఆయన ట్వీట్ చేశారు. ► ఆశిష్ ఏచూరి మృతి పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్టు-లెనినిస్టు) నేత కవితా కృష్ణన్ విచారం వ్యక్తం చేశారు. ‘డియర్ కామ్రేడ్, ఈ విషాదం గురించి విని షాక్కు గురయ్యాము. మీకు, మీకు కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ఆమె ట్వీట్ చేశారు. ► ఆశిష్ ఏచూరి మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. సంతాపం వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరికి, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియాజేశారు. -
ఆరుగురి దుర్మరణం: ప్రధాని, సీఎం దిగ్భ్రాంతి
లక్నో: ఉత్తరప్రదేశ్లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరి అంత్యక్రియలకు వెళ్లొస్తూ ఆరుగురు అనంతలోకాలకు చేరారు. ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో వారి పరిస్థితి విషమంగా ఉండగా మిగతా 8 మంది స్వల్ప గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ట్రక్కు, వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు యూపీలోని జౌన్పూర్ జిల్లా ఖ్వాజ్ పోలీస్స్టేషన్ పరిధిలోని జలాల్పూర్ నివాసి థన్దేయి, స్వజోఖన్ యాదవ్ భార్యాభర్తలు. థన్దేయికి 112 ఏళ్లు ఉంటాయి. అయితే ఆయన భార్య స్వజోఖన్ యాదవ్ మృతి చెందింది. వారికి కుమారులు లేకపోవడంతో వారి అల్లుడు లక్ష్మీశంకర్ యాదవ్ వచ్చి వారణాసిలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడానికి వచ్చాడు. అయితే వచ్చేప్పుడు తన గ్రామంలోని 17 మందిని వ్యాన్లోకి ఎక్కించుకుని తీసుకువచ్చాడు. వారణాసిలో దహన సంస్కారాలు పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. జౌన్పూర్- వారణాసి రహదారిలో జలాల్పూర్కు చేరుకోగానే ట్రక్కు, ఈ వ్యాన్ రెండూ ఢీకొన్నాయి. దీంతో వ్యాన్లోని ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ వ్యాన్లో మొత్తం 17 మంది ప్రయాణిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ కూడా సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. उत्तर प्रदेश में वाराणसी-जौनपुर सीमा के पास हुए एक सड़क हादसे में लोगों की मौत का दुखद समाचार मिला है। मैं इन सभी लोगों के परिजनों के प्रति अपनी गहरी संवेदना व्यक्त करता हूं, साथ ही इस दुर्घटना में घायल लोगों के जल्द से जल्द स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi — PMO India (@PMOIndia) February 9, 2021 -
ధర్మేగౌడ మృతి.. దర్యాప్తుకు ఆదేశం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇటీవల సొంతింటి నిర్మాణానికి పూజ చేసిన ఆయన ఆకస్మికంగా మృతి చెందడంపై పలువురు రాజకీయ నేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సైతం ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. (చదవండి: ఆ..వేదనే అంతు చూసిందా? ) ధర్మేగౌడ మృతి దురదృష్టకమరమని, ఆయన మరణ వార్త తనను ఎంతగానో బాధించిందంటూ ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా మండలిలో ధర్మేగౌడకు జరిగిన అవమానం ప్రజాస్వామ్యమంపై దాడి అన్నారు. చట్టసభల హుందాతనం, స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. అనంతరం ఆయన మృతి కేసును ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆయన ప్రకటించారు. చదవండి: కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ఆత్మహత్య -
వామపక్ష రచయిత
ఇక్కడ తటస్థ గాడిద అంటూ ఎవరూ లేరు, అని విస్పష్టంగా తన రాజకీయ దృక్పథాన్ని ప్రకటించుకున్న స్వీడిష్ రచయిత యాన్ మిర్డాల్(1927 – 2020) అక్టోబర్ 30న మరణించారు. 1950 నుంచీ ఆయనకు భారత్తో అనుబంధం ఉంది. ఇక్కడ పాత్రికేయుడిగా పనిచేశారు. వివిధ దేశాల మీద, తన అనుభవసారంతో సుమారు 30 పుస్తకాలు రాశారు. ఎడ్గార్ స్నో ‘రెడ్స్టార్ ఓవర్ చైనా’ స్ఫూర్తితో దండకారణ్యంలో రెండు వారాలు తిరిగి ‘రెడ్స్టార్ ఓవర్ ఇండియా’ రాశారు. దాన్ని ‘భారత్పై అరుణతార’ పేరుతో ‘మలుపు’ తెలుగులోకి తెచ్చింది. ఎన్.వేణుగోపాల్ అనువదించిన ఈ పుస్తకంలో పారిస్ కమ్యూన్ నుంచి జనతన సర్కార్ దాకా సాగుతున్న ప్రత్యామ్నాయ ప్రయత్నాలనూ, ప్రజా సంస్కృతి వికాసాన్నీ విశ్లేషించారు. శ్రీశ్రీ, చెరబండరాజు మొదలుకొని అంగడి చెన్నయ్య లాంటివాళ్లు రాసిన ‘అన్న అమరుడురా మన రామనరసయ్య’ లాంటి గేయాల ఉటంకింపులు ఇందులో ఉన్నాయి. ‘వృద్ధాప్యం అనేది భారతదేశంలోనూ, స్వీడన్లోనూ ఒకటి కాదు. అది ఒక కొస అయితే, ఇది మరొక కొస’ అని చెబుతూ స్వీడన్లో ఒకప్పుడు పనికిరారని వృద్ధులను ఎలా కొండ మీదినుంచి తోసేసేవారో చెబుతారు. ‘వామపక్ష రచయితలు అనబడేవాళ్ళు’ రాయని ఎన్నో సున్నితమైన శారీరక ఇబ్బందులను సైతం ప్రస్తావించారు. అందువల్లే ‘చైనా ఇవాళ అంతర్జాతీయంగా ఆర్థిక అగ్రరాజ్యంగా మారిపోయింది. కానీ ధనికులకు, పేదలకు మధ్య అత్యంత దారుణమైన ఆర్థిక రాజకీయ విభేదాలు ఉన్నాయి’ అనగలిగారు. సరిగ్గా అదే కారణంగానే దేశీయ రచయితలకు భిన్నంగా ఒక రచయిత తను పెరిగిన సంస్కృతికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలో చెప్పగలిగారు. ఆ భాగం ఇక్కడ: ‘‘మార్క్స్, ఏంగెల్స్ అయినా, నేనయినా చాలా సహజంగా మా సంస్కృతి సంప్రదాయంలో నుంచే మమ్మల్ని మేము వ్యక్తీకరించుకుంటాం. అయితే ఇది సాధారణ సిద్ధాంతాలకు వ్యతిరేకం కాదు. మావో సే టుంగ్ తన కోడలితో మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా ఈ విషయమే ప్రస్తావించాడు. ‘వాంగ్ హై జుంగ్తో సంభాషణలు 21 డిసెంబర్ 1970’ అనే ఈ ప్రచురిత ప్రతిని« చైనాలో సాంస్కృతిక విప్లవ కాలంలో విస్తృతంగా పంపిణీ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అధ్యయన పత్రాలలో భాగంగా ఉంది. ‘‘మావో: మీరు మీ పాఠ్యాంశాలలో భాగంగా పవిత్ర బైబిల్నూ, బౌద్ధ సూత్రాలనూ అధ్యయనం చేయవలసి ఉంటుందా? హై జుంగ్: లేదు. అవన్నీ మేమెందుకు చదవాలి? మావో: మరి బైబిల్ గానీ, బౌద్ధ సూత్రాలు గానీ చదవకుండా మీరు విదేశీ పుస్తకాలను అనువదించాలన్నా, విదేశీ వ్యవహారాలు నిర్వహించాలన్నా ఎలా చేయగలరు? అంతేకాదు, మావో ఆమెను తూఫూ రాసిన ప్రాచీన చైనా పౌరాణిక కావ్యాలను, ‘డ్రీమ్ ఆఫ్ ద రెడ్ చాంబర్’ వంటి నవలలను చదవమని ప్రోత్సహించాడు. అవి మాత్రమే కాదు, లియావో చాయి వంటి కవులను, ప్రాచీన మింగ్ కింగ్ రాజవంశాల సాహిత్యాలను, పూ సాంగ్ లింగ్ రాసిన దయ్యాల, భూతాల, నక్కల కథలు చదవమని కోరాడు. లియావో చాయి రాసిన కథల్లో నక్కల ఆత్మలు చాలా దయనీయమైనవి. అవి మానవజాతికి స్వచ్ఛందంగా సహకరిస్తూ ఉంటాయి అని ఆయన చెప్పాడు. అదేవిధంగా ఆయన జర్మన్ అయివుంటే సరిగ్గా ఇదేవిధంగా గ్రిమ్మెల్ షాసెన్, గెథే, గ్రిమ్ సోదరులు వంటి రచయితలను సిఫారసు చేసి ఉండేవాడే.’’ -
కేశూభాయ్ పటేల్ కన్నుమూత
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అత్యంత సీనియర్ నేత కేశూభాయ్ పటేల్(92) కన్ను మూశారు. కోవిడ్–19 బారిన పడి ఇటీవలే కోలుకున్న పటేల్ గురువారం ఉదయం గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. గుజరాత్లో బీజేపీ ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహించిన కేశూభాయ్ 1995, 1998–2001 సంవత్సరాల్లో రాష్ట్ర సీఎంగా పనిచేశారు. ఆయన తర్వాత గుజరాత్లో నాడు సీఎంగా మోదీ పగ్గాలు చేపట్టారు. కేశూభాయ్ మృతికి రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్య క్రియలు జరుగుతాయని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తెలిపారు. కరోనా బారిన పడి కోలుకున్నప్పటికీ తన తండ్రి ఆరోగ్యం కొంతకాలంగా క్షీణిస్తోందని కేశూభాయ్ కుమారుడు భరత్ పటేల్ తెలిపారు. గురువారం ఉదయం రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, పల్స్ రేటు పడిపోవడంతో ఆస్పత్రికి తరలించామన్నా రు. కేశూభాయ్ గుండెపోటుతో చనిపో యారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర పర్యటనలో ఉన్న రూపానీ తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. గాంధీనగర్ చేరుకుని స్వగృహంలో ఉంచిన కేశూభాయ్ మృతదేహానికి నివాళుల ర్పించారు. జునాగఢ్ జిల్లా విసవదార్ పట్టణంలో 1928లో జన్మించిన కేశూభాయ్ 1945లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో ప్రచారక్గా చేరారు. జన్సంఘ్లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రఖ్యాత సోమ్నాథ్ ఆలయ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు. రాష్ట్ర శాసనసభకు ఆయన 6 పర్యాయాలు ఎన్నికయ్యారు. 2012లో బీజేపీ నుంచి వైదొలిగి గుజరాత్ పరివర్తన్ పేరిట పార్టీని స్థాపించారు. 2014లో తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. -
ఈసీ గంగిరెడ్డి మృతికి ఆళ్ల నాని సంతాపం
సాక్షి, పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి పట్ల డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎలాంటి ఫీజు తీసుకోకుండా ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించి పేదల డాక్టర్గా మంచి గుర్తింపు పొందారని తెలిపారు. కడప జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతానికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేసి ఆ ప్రాంతంలో పార్టీకి పెద్దదిక్కుగా నిలిచారన్నారు. గంగిరెడ్డి మరణం తీరని లోటన్నారు. కరోనా కష్టకాలంలో కూడా వైద్య సేవలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారని తెలిపారు. నిత్యం అందుబాటులో ఉండి పేదలకు అండగా ఉండేవారని మంత్రి ఆళ్ల నాని అన్నారు. పేదల వైద్యుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి మరణం చాలా బాధాకరమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గంగిరెడ్డి రాయలసీమ పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. గంగిరెడ్డి మరణం తీరని లోటు: ఎమ్మెల్యే తోపుదుర్తి పులివెందుల పేదల డాక్టర్ ఈసీ గంగిరెడ్డి మరణం పట్ల అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంతాపం తెలిపారు. పులివెందుల వచ్చిన ఆయన ఈసీ గంగిరెడ్డి మరణం తీరని లోటని స్పష్టం చేశారు. ఓవైపు పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూనే రైతుల సమస్యలపై ఈసీ గంగిరెడ్డి పోరాటాలు చేశారని చెప్పారు. (సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి) -
జశ్వంత్ సింగ్ మృతికి సీఎం వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: కేంద్ర మాజీమంత్రి జశ్వంత్ సింగ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తొలుత సైనికుడిగా దేశానికి వివిధ హోదాల్లో సేవలందించిన ఆయన తరువాత రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా జశ్వంత్సింగ్ ఎన్నికయ్యారని తెలిపారు.దేశ రాజకీయాలలో జశ్వంత్ సింగ్ కీలక పాత్ర పోషించారని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర మాజీమంత్రి జశ్వంత్ సింగ్ మృతి పట్ల వైఎస్సార్ సీపీ నేత సీ. రామచంద్రయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జశ్వంత్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జశ్వంత్ సింగ్ గొప్ప దేశభక్తుడని, ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. -
పాట కోసమే ఆయన పుట్టారు..
సాక్షి, విశాఖపట్నం: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం పట్ల విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన శివైక్యం పొందడం బాధాకరమన్నారు. బాలు మృతి సంగీత ప్రపంచానికే తీరని లోటు అని.. సంగీతమే ఊపిరిగా ఆయన జీవించారని తెలిపారు. విశాఖ శారద పీఠంతో బాలుకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు. శ్రీశైలం వెళితే శారదాపీఠం ఆశ్రమంలోనే ఆయన ఉండేవారని చెప్పారు. గొప్ప ఆధ్యాత్మిక భావాలున్న సంగీత శిఖరం బాల సుబ్రహ్మణ్యం అని స్వరూపానందేంద్ర ప్రస్తుతించారు. బాలు ఆత్మ భగవంతుని పాద చరణముల వద్దకు చేరాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. (చదవండి: ‘అది అదృష్టంగా భావిస్తున్నా’) ఆయన పాట కోసమే పుట్టారు: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ: పాట కోసమే పుట్టిన మహనుభావులు ఎస్పీ బాలు అని, ఆయన లోటు మరే గాయకులు పూడ్చలేనిదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాట్లాడినా, పాట పాడిన తెలుగు భాష, తెలుగుజాతి సగర్వంగా చెప్పుకునే ఎస్పీ బాలు భౌతికంగా దూరమైనా 'పాట'లో మనతో మనలోనే శాశ్వతంగా ఉంటారన్నారు. ఈ సందర్భంగా నగరంతో ఎస్పీ బాలుకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. -
‘బాలు ఎప్పుడూ మాతోనే ఉన్నారు.. ఉంటారు’
టాలీవుడ్లో చోటుచేసుకుంటున్న వరుస విషాదాలు సినీ ఇండస్ట్రీని చీకట్లోకి నెట్టేస్టున్నాయి. సెలబ్రిటీల ఆకస్మిక మరణాలు అభిమానులను శోక సంద్రంలో ముంచేస్తున్నాయి. తాజాగా గాన గందర్వుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ప్రాణాలు విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే బాలుని కొలిచే అనేక హృదయాలు షాక్కు గురయ్యాయి. ఎప్పటికైనా పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని ఇన్ని రోజులుగా ఎదురు చూసిన వారికి బాలు మరణం తీరని శోకాన్ని మిగిల్చింది. (బ్రేకింగ్ : ఎస్పీ బాలు కన్నుమూత) తన గాత్రంతో లక్షల పాటలను పలికిన ఆ స్వరం నేడు మూగబోవడంతో ఎస్పీబీకి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తన స్వరంతో కోట్లాది మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప గాయకుడికి ట్విటర్ వేదికగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. గాన గంధర్వుడు ఇక లేరని చిత్ర నిర్మాత బీఏ రాజు తెలిపారు. ‘లెజండరీ గాయకుడు ఎస్పీబీ ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం సినీ ఇంస్ట్రీకి తీరనిలోటు.. బాలు కుటుంబానికి నా సంతాపం’ అని ట్వీట్ చేశారు. ఓ శకం ముగిసింది ‘సంగీత ప్రపంచానికి చీకటి రోజు. బాలు గారి మరణంతో ఓ శకం ముగిసింది. ఆయన అందించిన పాటల కారణంగా నా ఎన్నో సినిమాలు విజయం సాధించాయి. ఎన్నో మరుపురాని పాటలను అందించారు. ఆయన స్వరంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. బాలు స్థానాన్ని ఎవరూ పూడ్చలేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. Heartbroken!! RIP SP Balu garu. pic.twitter.com/YTgZEBdvo9 — Chiranjeevi Konidela (@KChiruTweets) September 25, 2020 గాన గంధర్వుడు ఇక లేరు Legendary Singer SP Balasubrahmanyam breathed his last at 1:04 PM. Great loss to the Music World. Condolences to #SPB gari family and friends #RIPSPB pic.twitter.com/8S5hcsh6Uz — BARaju (@baraju_SuperHit) September 25, 2020 As the memories and conversations with Balu Garu come flooding back so do the tears... I still remember the call I got from him after my film Annamayya🙏He was such a unsaid integrable part of my life… దాచుకో స్వామి మా బాలుని జాగ్రత్తగా దాచుకో ! #ripspb 🙏 pic.twitter.com/pK8jYS5ONs — Nagarjuna Akkineni (@iamnagarjuna) September 25, 2020 ‘ఆగిపోయింది మీ గుండె మాత్రమే. మీ గొంతు కాదు. మీరెప్పుడు మాతోనే ఉన్నారు. ఉంటారు.’ - హరీష్ శంకర్ ‘నా కంట్లో కన్నీళ్లు ఆగడం లేదు.. మిమ్మల్ని మి్ అవుతున్నాం మామా’.. - తమన్ ‘తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ, పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రంగా కలచివేసింది. ఈ భువిలో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే.’ - జూ. ఎన్టీఆర్ నమ్మలేకపోతున్నాను బాల సుబ్రహ్మణ్యం మన మధ్య లేరు అన్న వార్తను నమ్మలేకపోతున్నాను. మీ ఆత్మకు శాంతి చేకురాలి. మీ పాటలు చిరస్మరణీయం, బాలు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. -మహేష్ బాబు వైజాగ్: గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి తీవ్ర దిగ్బ్రాంతి కలిగించింది. తెలుగు జాతి గర్వించదగ్గ గాయకుడు. నాకు మంచి సన్నిహితుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను - కేంద్ర మాజీ మంత్రి టి. సుబ్బరామిరెడ్డి Unable to process the fact that #SPBalasubramaniam garu is no more. Nothing will ever come close to that soulful voice of his. Rest in peace sir. Your legacy will live on. Heartfelt condolences and strength to the family 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) September 25, 2020 அன்னைய்யா S.P.B அவர்களின் குரலின் நிழல் பதிப்பாக பல காலம் வாழ்ந்தது எனக்கு வாய்த்த பேறு. ஏழு தலைமுறைக்கும் அவர் புகழ் வாழும். pic.twitter.com/9P4FGJSL4T — Kamal Haasan (@ikamalhaasan) September 25, 2020 #ripspb ...Devastated pic.twitter.com/EO55pd648u — A.R.Rahman (@arrahman) September 25, 2020 A voice which made us laugh,which made us cry, you’ll live with us forever, my deepest condolences to the family 🙏🏼 you’ll be missed SPB sir pic.twitter.com/iZf9TUy3FQ — Sai Dharam Tej (@IamSaiDharamTej) September 25, 2020 Shri. S. P. Balasubrahmanyam Garu is an integral part of every Indian household. His voice and his contribution to music will always remain eternal. To the legend who gave us songs for every human emotion 🙏 Rest in peace sir. You will forever be missed. pic.twitter.com/CmUNe2JoRF — Ravi Teja (@RaviTeja_offl) September 25, 2020 Rest in peace SPB sir 💔 pic.twitter.com/kEwPxr1dSx — Anupama Parameswaran (@anupamahere) September 25, 2020 🙏🙏🙏😭😭 pic.twitter.com/qSI0zntwrN — Anil Ravipudi (@AnilRavipudi) September 25, 2020 Deeply saddened & heart broken to hear that the legendary singer #SPBalasubrahmanyam garu is no more. Great loss to Indian cinema. May his soul rest in peace 🙏 My deepest condolences to his family! Sir you will always be in our hearts and souls 🙏#ripspb pic.twitter.com/EbpL0yjvki — MM*🙏🏻❤️ (@HeroManoj1) September 25, 2020 He was not just a singer. He was a performer. It felt as if he was born to entertain the world with his expressions and his music. A great loss for our industry. Gone to soon. May his soul RIP . #balasubramanyam ji — Hansika (@ihansika) September 25, 2020 Extremely sad to hear the news of SP Balasubramaniam Garu’s passing. We have lost a legend today. I’ve had the privilege to work with him in some of my best movies like Prema and Pavitra Bandham. Your legacy will live on Sir! My heartfelt condolences to the family. RIP🙏 #RIPSPB pic.twitter.com/NjjcdSg2l1 — Venkatesh Daggubati (@VenkyMama) September 25, 2020 -
ఏపీ భవన్లోని బల్లి దుర్గాప్రసాద్ సంతాప సభ
-
దుర్గాప్రసాద్ మృతి వ్యక్తిగతంగా లోటు..
సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి లోక్సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాదరావుకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నివాళులు అర్పించారు. ఏపీ భవన్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో గురువారం ఉదయం బల్లి దుర్గాప్రసాద్ సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సత్యవతి, గోరంట్ల మాధవ్, పోచ బ్రహ్మానందరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, అయోధ్య రామిరెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ , తలారి రంగయ్య, ఏపీ భవన్ ఉన్నతాధికారులు అభయ త్రిపాటి, భావన సక్సేనా, రమణారెడ్డి తదితరులు అంజలి ఘటించారు. (అజాత శత్రువుగా అందరివాడయ్యారు..) వ్యక్తిగతంగా నాకు తీరని లోటు.. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. ‘బల్లి దుర్గాప్రసాద్తో నాకు వ్యక్తిగత అనుబంధం ఉంది. ఆయన 28 ఏళ్లకే రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రతిసారి నా ఆశీస్సులు తీసుకునేవారు. ఆయన కుటుంబానికే కాదు, నాకు కూడా ఈ మరణం వ్యక్తిగతంగా లోటు. పార్లమెంట్ లో అందరితో కలివిడిగా, కలుపుగోలుగా ఉండేవారు. ఎవరు ఏ సహాయం అడిగినా వెంటనే సిద్ధంగా ఉండేవారు.’ అని తెలిపారు. (తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కన్నుమూత ) ఆయన భోళా మనిషి ‘బల్లి దుర్గాప్రసాద్ ఏదైనా భోళాగా మాట్లాడే మనిషి. నిరంతరం ప్రజల కోసం పనిచేసే వారు. ఆయన అకాల మరణం పార్టీకి ప్రజలకు తీరని లోటు’ అని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. సహచర ఎంపీ దుర్గాప్రసాద్ మరణం అందరినీ ఎంతో బాధించిందని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని అనకాపల్లి ఎంపీ సత్యవతి పేర్కొన్నారు. -
‘విలనిజంలో జేపీ కొత్త ఓరవడి సృష్టించారు’
సాక్షి, గుంటూరు: సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి భౌతికకాయాన్ని ఎమ్మెల్యే కిలారి రోశయ్య, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డిలు సందర్శించి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రోశయ్య మీడియాతో మాట్లాడుతూ.. జయప్రకాష్ రెడ్డి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని, నాటక రంగాల్లో ఆయనకంటూ పత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారని పేర్కొన్నారు. మాజీ ఎంపీ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. నాటక రంగ అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని, తన స్వంత ఖర్చుతో గుంటూరులో నాటకాలను ప్రదర్శించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు జయప్రకాష్రెడ్డి భౌతకికాయాన్ని సందర్శించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. విలనిజంలో జయప్రకాష్ కొత్త ఒరవడిని సృష్టించారని, వ్యక్తిగతంగా ఆయన చాలా సౌమ్యుడన్నారు. ఎంతో మందికి సహాయం చేసిన వ్యక్తి జయప్రకాష్ అని నాటక రంగం కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికి మరువలేవమని గిరిధర్ పేర్కొన్నారు. -
ఏఎస్పీ దక్షిణ మూర్తి మృతి బాధాకరం: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణమూర్తి మృతిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్బ్రంతీ వ్యక్తం చేశారు. దక్షిణమూర్తి మృతి చాలా బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుంటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణమూర్తి ఎస్సై స్థానం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఏఎస్పీ స్థాయికి ఎదిగారని కొనియాడారు. అంకితభావంతో పనిచేస్తూ.. పేద ప్రజలకు న్యాయం చేసేందుకు కృషిచేశారని ప్రశంసించారు. మేడారం స్పెషల్ ఆఫీసర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారని తెలిపారు. ఏఎస్సీ ఆకస్మిక మృతికి సంతాపం తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి చేకురాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. (చదవండి: కరోనాతో జగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతి) కాగా, ఇటీవల కరోనా బారిన పడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏఎస్పీ దక్షిణమూర్తి.. బుధవారం తెల్లవారుజామున కన్నమూసిన సంగతి తెలిసిందే.1989 బ్యాచ్ కు చెందిన దక్షిణ మూర్తి వరంగల్ జిల్లాలో ఎస్సై, సీఐ, డీఎస్పీగా పనిచేశారు. నక్సల్స్ ఆపరేషన్స్ తో పాటు వరంగల్ లో సంచలనం కలిగించిన యాసిడ్ దాడి కేసులో నిందితుల ఎన్ కౌంటర్ లో కూడా ఆయన కీలక అధికారిగా వ్యవహరించారు. -
కోళీకోడ్ ఘటన: ‘షాక్కు గురయ్యా’
ఢాకా: కేరళలోని కోళీకోడ్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి ఏకే మోమెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాల కొల్పోయిన మృతుల కుటుంబాలకు ఆయన శనివారం సంతాపం వ్యక్తం చేశారు. ‘కేరళలోని కోళీకోడ్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం విని షాక్కు గురయ్యా. ఈ విషాద ఘటన నన్ను తీవ్రంగా బాధిస్తోంది. ఈ విమాన ప్రమాదం ఎంతమంది విలువైన ప్రాణాలను బలికొంది. వీరి ఆత్మలు ప్రశాంతంగా ఉండాలి, మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాం తెలుపుతున్నాను. వారికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్న’ అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జైశంకర్తో ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు భారత అధికారులు పేర్కొన్నారు. (చదవండి: కోళీకోడ్ ఘటనపై స్పందించిన అశోక్) కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి చేరవేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దుబాయ్ నుంచి కేరళలోని కోళీకోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం క్యారిపూర్ విమనాశ్రయం వద్ద ల్యాండింగ్ అయ్యే సమయంలో రన్వేపై నుంచి పక్కకు జారి లోయలో పడి ప్రమాదానికి గురి అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరూ పైలేట్లతో సహా 18 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సీవీల్ ఏవియేషన్(డీజీసీఏ) వారు దర్యాప్తు జరుపుతున్నారు. (చదవండి: రక్తమోడిన దృశ్యాలు, భీతిల్లిన చిన్నారులు) -
సీనియర్ నటుడు మృతి.. చిరంజీవి సంతాపం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నటుడు, రచయిత రావి కొండలరావు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమ బహుముఖ మేధావిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమతో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. తను హీరోగా పరిచయం అయినప్పటి నుంచి ఆయనతో కలిసి పలు చిత్రాల్లో కలిసి నటించానని గుర్తుచేశారు. తమ కాంబినేషన్లో వచ్చిన చంటబ్బాయి, మంత్రిగారి వియ్యంకుడు.. వంటి చిత్రాల్లో ఆయన చాలా కీలక పాత్రలు పోషించారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.(టాలీవుడ్లో విషాదం : సీనియర్ నటుడు కన్నుమూత) ‘రావి కొండలరావు మరణంతో చిత్ర పరిశ్రమ ఒక మంచి నటుడినే కాకుండా, గొప్ప రచయితను, పాత్రికేయున్ని, ప్రయోక్తను కోల్పోయింది. నాటక, సాంస్కృతిక రంగాలకు కూడా ఆయన మరణం తీరని లోటు. రావి కొండలరావు, ఆయన సతీమణి రాధా కుమారి కలిసి జంటగా ఎన్నో చిత్రాల్లో నటించారు. చిత్ర పరిశ్రమలో ఏ వేడుక జరిగినా ఆ దంపతులు పార్వతీ పరమేశ్వరుల్లాగా వచ్చి వారి అభినందనలు, ఆశీస్సులు అందించడం చూడ ముచ్చటగా ఉండేది. అలాంటి రావి కొండలరావు మృతితో చిత్ర పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టు అయింది’ అని చిరంజీవి తెలిపారు. కాగా, బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రావి కొండలరావు.. మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు.(‘నాన్న పేరు రాయలేదు.. అంటే తెలియదా’) -
బీపీఆర్ విఠల్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, హైదరాబాద్ : మాజీ ఐఏఎస్ అధికారి, ప్రముఖ ఆర్థికవేత్త బీపీఆర్ విఠల్ (93) మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. బీపీఆర్ విఠల్ శుక్రవారం ఉదయం హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన కుటుంబసభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో అతి ఎక్కువ కాలం పాటు ఆర్థిక, ప్రణాళిక శాఖల కార్యదర్శిగా, ఏపీ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డు వైస్ చైర్మన్గా, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) సలహాదారుడిగా, పదవ ఆర్థిక కమిషన్ సభ్యుడిగా విఠల్ అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. బీపీఆర్ విఠల్కు భార్య శేషు, కుమార్తె నివేదిత కుమార్, కుమారులు సంజయ్ బారు, చైతన్య బారు ఉన్నారు. కాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సంజయ్ బారు మీడియా సలహాదారుగా వ్యవహరించారు. -
‘ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నావనుకుంటున్నా’
ముంబై: ‘సుశాంత్ సింగ్ రాజ్ఫుత్ మరణం ఆయన కుటుంబానికి, బాలీవుడ్కు తీరని లోటు. దీని నుంచి త్వరలోనే అందరూ కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ గ్లోబల్ స్టార్ ప్రియాంక చొప్రా సోషల్ మీడియాలో భావోద్యేగ పోస్టును పంచుకున్నారు. సుశాంత్ ముంబైలోని తన నివాసంలో ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మరణానికి ప్రియాంక ఇన్స్టాగ్రామ్లో సంతాపం తెలిపారు. సుశాంత్ను బ్రిలియంట్ స్టూడెంట్ అంటూ ప్రశంసిస్తూ ఆస్ట్రోఫిజిక్స్ గురించి అతడు వివరించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘నీ మరణ వార్త విని షాకయ్యాను. నువ్వు ఇంతలా మానసిక ఒత్తిడికి గురవయ్యావంటే నమ్మలేకపోతున్న. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉన్నావని నమ్ముతున్నా మై ఫ్రెండ్. సూర్యోదయంలో ఆస్ట్రోఫిజిక్స్ గురించి నువ్వు వివరించిన సందర్భాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు ఎంతో తెలివైన వ్యక్తివి. నీ ఆత్మ ఎక్కడున్న ప్రశాంతంగా ఉండాలి సుశాంత్’’ అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చారు. లాక్డౌన్లో ఒంటరిగా తన నివాసంలో ఉంటున్న సుశాంత్ తీవ్ర మానసిక వేదనతో బాధపడుతూ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఇవాళ(సోమవారం) సాయంత్రం ముంబైలోని విలే పార్లే వద్ద పవన్ హన్స్ శ్మశానవాటికలో సుశాంత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. (సుశాంత్ సింగ్ విశేషాలెన్నో!) View this post on Instagram I’m stunned. You must have been in so much pain. I hope you are at peace wherever you are my friend. Gone too soon. I’ll never forget our conversations about astrophysics at sunrise..Words cease to make sense. RIP Sushant. My condolences to the family and everyone grieving this huge loss 💔 A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Jun 14, 2020 at 10:42am PDT -
కొల్లి నాగేశ్వరరావు మరణం తీరని లోటు
సాక్షి, విజయవాడ: అఖిల భారత కిసాన్ సభ మాజీ ఉపాధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు మృతి తీరని లోటని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. మాచవరంలోని కొల్లి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను ఆయన సోమవారం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతాంగ సమస్యలపై నాగేశ్వరరావు చేసిన పోరాటాలు మరువలేనివన్నారు. జల వనరులపై అపార అనుభవం కలిగిన ఆయన చివరి నిముషం వరకు రైతు సంక్షేమానికి కృషిచేశారని కొనియాడారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తొలుత కొల్లి నాగేశ్వరరావు చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొల్లి నాగేశ్వరరావు కుమార్తె, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ప్రశాంతి, భార్య టానియా, అల్లుడు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు టి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కొల్లి నాగేశ్వరరావుకు ఉన్న అనుబంధం, ఆయన రాసిన పుస్తకాలను లక్ష్మణరెడ్డికి వివరించారు. ఆయన వెంట చైతన్య గ్రామీణ గోదావరి బ్యాంకు చీఫ్ మేనేజర్ పి.వీరారెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులున్నారు. -
కరోనా: కానిస్టేబుల్ మృతికి సీపీ సంతాపం
సాక్షి, హైదరాబాద్: కరోనాతో మృతి చెందిన కానిస్టేబుల్ దయాకర్రెడ్డి కుటుంబానికి హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ సంతాపం తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కుల్సుంపురా పోలీసు స్టేషన్ పరిధిలో పనిచేసే కానిస్టేబుల్ దయాకర్రెడ్డి మృతి బాధకరమన్నారు. ఆయన కోర్టు బీట్ చూస్తుండేవాడని.. ఒక మంచి ఆఫీసర్ను కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. (మహారాష్ట్రలో 18 మంది పోలీసులు మృతి) ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నన్నారు. ఆయన పిల్లల చదువులు మొత్తం ఓ ఎన్జీఓ చూసుకుంటుందని, ఆయన భార్యకు ఉద్యోగం కలిపిస్తామని చెప్పారు. ప్రస్తుతం మనం కరోనాతో యుద్ధం చేస్తున్నామని, ప్రతిఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. కాగా పోలీసు స్టేషన్కు పబ్లిక్ వచ్చేటప్పుడు వ్యక్తిగత దూరం పాటించాలని అధికారులకు ఆయన సూచించారు. (ఏపీలో కొత్తగా 47 కరోనా కేసులు) -
వైజాగ్ గ్యాస్ లీకేజీ: కోహ్లీ, సానియా సంతాపం
న్యూఢిల్లీ: విశాఖపట్నం ఎల్జీ గ్యాస్ లీకేజీ ఘటనపై భారత క్రికెటు జట్టు సారథి విరాట్ కోహ్లి, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విరాట్ స్పందిస్తూ.. ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిలు వెంటనే కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా అంటూ విరాట్ ట్వీట్ చేశాడు. ఇక టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా స్పందిస్తూ.. ‘‘వైజాగ్లో గురువారం ఉదయంచోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరమైనది. ఈ ఘటన బాధితుల పరిస్థితి ఎలా ఉందో తలచుకుంటే చాలా బాధగా ఉంది. వారు త్వరలోనే కోలుకోవాలని, మరణించిన వారి కుటుంబ సభ్యులలో ఆ దేవుడు ఆత్మస్థైర్యం నింపాలని పార్థిస్తున్నాను.. #prayforvizag’’ అంటూ ట్వీట్ చేశారు. (విశాఖ ఎల్జీ పాలిమర్స్లో భారీ ప్రమాదం) ఇక మహిళ క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్మన్ హర్మన్ ప్రీత్కౌర్ గురువారం ఉదయం వైజాగ్లో చోటు చేసుకున్న ఈ ఘటన విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. ఈ ఘటనపై పలు భారత క్రికెట్ దిగ్గజాలలు హార్దిక్ పాండ్యా, ఓపెనర్ శిఖర్ ధావన్, స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్లు కూడా సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. ఇక భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ‘‘వైజాగ్ గ్యాస్ ఘటన వీడియోలు చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది. వారు త్వరలోనే ఈ ఘటన నుంచి కోలుకోవాలని ఆశిస్తున్నాను’’ అని సంతాపం వ్యక్తం చేశారు. (ఏంటిదా గ్యాస్.. పీల్చితే ఏమవుతుంది?) కాగా గురువారం ఉదయం విశాఖలో చోటుచేసుకున్న ఎల్జీ పాలిమర్ కర్మాగారం నుంచి గ్యాస్ లీకైన ఘటనలో 11 మంది మృతి చెందగా... ఈ కర్మాగారం చూట్టుపక్కల సమీపంలో నివస్తిస్తున్న సుమారు 1000 మంది అస్వస్థతకు గురియ్యారు. ఇక 3 కిమీ వ్యాసార్థంలో ఉన్న సుమారు 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. -
హంద్వారా అమరులకు మహేష్ నివాళి
దేశమంతటా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ జమ్మూకశ్మీర్లో భీకర ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లో ఒక కల్నల్, ఒక మేజర్ స్థాయి అధికారి, ఇద్దరు జవాన్లతోపాటు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు నేలకొరిగారు. పౌరుల ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన జవాన్ల కుటుంబానికి పలువురు ప్రముఖులు నివాళుర్పిస్తున్నారు. తాజాగా ప్రముఖ హీరో మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. (చదవండి : కల్నల్ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం) ‘హంద్వారా దాడి.. మన దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. దేశాన్ని కాపాడటానికి మన సైనికులకు ఉన్న ధైర్యం, సంకల్పం చాలా ధ్రుడమైనవి. అది ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. విధి నిర్వహణలో మరణించిన సైనికులకుజజ నిల్చుని మౌనం పాటించి నివాళులర్పిస్తున్నాను. ఎదురుకాల్పుల్లో మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వారికి ధైర్యం, బలం ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. జై హింద్’ అని మహేష్ బాబుపేర్కొన్నారు. కాగా, మహేష్ బాబు ఇటీవల నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. -
బాలీవుడ్లో మరో విషాదం
ధర్మశాల : బాలీవుడ్ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్లను కోల్పోయిన బాలీవుడ్కు మరో షాక్ తగిలింది. ప్రముఖ నిర్మాత, టెలివిజన్ అండ్ సినిమా ప్రొడ్యూసర్ గిల్డ్ ఆఫ్ ఇండియా సీఈవో కుల్మీత్ మక్కర్(60) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుల్మీత్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. లాక్డౌన్ విధించకముందే ఇంట్లోనే గుండెపోటుకు గురైన కుల్మీత్ అప్పటినుంచి ధర్మశాలలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. (‘మీ దగ్గరికి వచ్చే దాకా మిమ్మల్ని మిస్ అవుతాను’) ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి పట్ల ట్విటర్ వేదికగా తమ నివాళి ప్రకటించారు. కాగా నివాళులు అర్పించిన వారిలో బాలీవుడ్ నటి విద్యాబాలన్, ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్, దర్శకులు హన్సల్ మెహతా, సుభాష్ గాయ్ తదితరులు ఉన్నారు. బాలీవుడ నటి విద్యాబాలన్ స్పందిస్తూ.. ' ఇది నిజంగా షాకింగ్.. ఇండస్ట్రీకి మీరు అందించిన సేవలు ఎప్పటికి గుర్తుంచుకుంటాం. మా కన్నీటితో ఇవే మీకు మా ఘన నివాళులు. నా తరపున మీ కుటుంబసభ్యులకు ప్రగాడ సానభూతి తెలియజేస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ స్పందిస్తూ.. ' ప్రొడ్యూసర్ గిల్డ్ ఆఫ్ సీఈవోగా మీరు నిస్వార్థ సేవలందించారు. పని పట్ల మీకున్న విశ్వసనీయతను ఎల్లప్పుడు గుర్తుంచుకుంటాం. అలాంటి మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లడం చాలా బాధాకరం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు. (ఆసుపత్రిలో ఆశీస్సులు అందిస్తోన్న రిషి కపూర్) 'అసలు బాలీవుడ్కు ఏమైంది.. వరుస విషాదాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి. కుల్మీత్ మక్కర్ ! మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా' అంటూ దర్శకుడు హన్సల్ మెహతా పేర్కొన్నారు. మక్కర్ మూడు దశాబ్ధాలుగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోనే ఉన్నారు. కుల్మీత్ సినిమా, టెలివిజన్ ఫీల్డ్లో ఎన్నో పదవులను స్వీకరించారు. కుల్మీత్ సారేగమా, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్లో వివిధ హోదాల్లో పని చేశారు. బిగ్ మ్యూజిక్ అండ్ హోమ్ ఎంటర్టైన్మెంట్ను స్థాపించి కొంతకాలం సీఈవోగా పనిచేశారు. ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సీఈవోగా ఉన్నారు. pic.twitter.com/Q6iw17DhRv — vidya balan (@vidya_balan) May 1, 2020 Kulmeet you were such an incredible pillar to all of us at the Producers Guild of India....relentlessly working for the industry and towards its enhancement and advancement... you left us too soon...We will miss you and always Remember you fondly.... Rest in peace my friend... pic.twitter.com/GUcapyjfMo — Karan Johar (@karanjohar) May 1, 2020 -
గొల్లపూడి మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి : ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొల్లపూడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వినూత్నమైన డైలాగ్ డెలివరీతోపాటు, రచనల్లో, నాటకాల్లో తనదైన శైలితో ఆయన అందరిని ఆకట్టుకున్నారని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గొల్లపూడి సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో గర్వించదగిన స్థానాన్ని సంపాదించారని తెలిపారు. కాగా, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు. రచయితగా, నటుడుగా, సంపాదకుడిగా, వ్యాఖ్యతగా గొల్లపూడి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. చదవండి : సీనియర్ నటుడు గొల్లపూడి కన్నుమూత -
మాజీ శాసనసభ్యుల మృతి పట్ల శాసనసభ సంతాపం
-
గోకుల్ మృతి కలచివేసింది : బాలకృష్ణ
ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ అభిమాని చిన్నారి గోకుల్ కన్నుమూశాడు. డెంగీతో బాధపడుతున్న గోకుల్ బెంగళూరులోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గోకుల్ మృతిపై బాలకృష్ణ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తమకు అభిమానుల కంటే విలువైనది మరోకటి ఉండదని బాలకృష్ణ పేర్కొన్నారు. తనంటే ప్రాణం ఇచ్చే చిన్నారి.. ఈరోజు ప్రాణాలతో లేడన్న నిజం మనసును కలచివేసిందన్నారు. గోకుల్ డైలాగ్లు చెప్పిన విధానం..హావభావాలు చూసి తనకు ఎంతో ముచ్చటేసేదని తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారి.. ఇంత చిన్న వయసులో డెంగీ వ్యాధితో లోకాన్ని విడిచి వెళ్లడం బాధ కలిగించిందని చెప్పారు. చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అలాగే గోకుల్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, బాలకృష్ణ అభిమాని అయిన గోకుల్.. ఆయనను చక్కగా అనుకరించడమే కాకుండా పవర్ఫుల్ డైలాగ్లను కూడా అలవోకగా చెప్పగలడు. గోకుల్ బాలకృష్ణ డైలాగ్లు చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. -
సత్య నాదెళ్ల తండ్రి మృతిపట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తండ్రి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. యుగంధర్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. -
సిద్ధార్థ.. వినయశీలి, మృదుభాషి
న్యూఢిల్లీ: కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ మృతిపై పారిశ్రామిక వర్గాలు సంతాపం వ్యక్తం చేశారు. ‘‘సిద్ధార్థ వినయశీలి, మృదుభాషి’’ అని బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా, ఆటోమొబైల్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తదితరులు నివాళులర్పించారు. ‘సిద్ధార్థ భార్య మాళవిక, ఆయన కుమారులు, ఎస్ఎం కృష్ణ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాలు తెలియజేస్తున్నాను‘ అని కిరణ్ షా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు, వ్యాపార వైఫల్యాలతో ఔత్సాహిక వ్యాపారవేత్తలు కుంగిపోరాదని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ‘సిద్ధార్థ స్ఫూర్తిదాయకమైన ఎంట్రప్రెన్యూర్, ఇన్వెస్టరు‘ అని ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ పేర్కొన్నారు. ప్రభుత్వ వేధింపులకి నిదర్శనం: మాల్యా సిద్ధార్థ మరణంపై దివాలా తీసిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రమోటరు విజయ్ మాల్యా స్పందించారు. ప్రభుత్వ యంత్రాంగం వేధింపులకు ఇదో నిదర్శనమని వ్యాఖ్యానించారు. రుణాలన్నీ తిరిగి పూర్తిగా కట్టేస్తానంటున్నా తనను కూడా అలాగే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 9,000 కోట్లకు పైగా బ్యాంకులకు ఎగవేసిన ఆర్థిక నేరస్థుడన్న ఆరోపణలతో మాల్యా ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. ‘నాకు వీజీ సిద్ధార్థతో పరోక్షంగా సంబంధాలు ఉన్నాయి. ఆయన మంచి వ్యక్తి. చురుకైన వ్యాపారవేత్త. ఆయన లేఖలోని అంశాలు ఎంతో కలిచివేసేవిగా ఉన్నాయి. ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకులు ఎలాంటివారినైనా దయనీయ స్థితిలోకి నెట్టేయగలవు. నేను పూర్తిగా డబ్బు కట్టేస్తానంటున్నా ఎలా వేధిస్తున్నారో కనిపిస్తూనే ఉంది. మిగతా దేశాల్లో రుణగ్రహీతలు ఏదో రకంగా రుణాలు కట్టేసేలా ప్రభుత్వం, బ్యాంకులు సహాయం అందిస్తాయి. కానీ నా కేసు విషయంలో నేను కట్టేసేందుకు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్నీ అడ్డుకుంటున్నారు‘ అని మాల్యా వ్యాఖ్యానించారు. ఫండ్స్ పెట్టుబడులు రూ. 193 కోట్లు.. సిద్ధార్థకు చెందిన కాఫీ డే నేచురల్ రిసోర్సెస్, టాంగ్లిన్ డెవలప్మెంట్స్లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు రూ. 193 కోట్ల పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కాఫీ డే నేచురల్ రిసోర్సెస్లో ఫండ్స్ పెట్టుబడులు రూ. 149 కోట్లు, టాంగ్లిన్లో రూ. 44 కోట్ల మేర ఉన్నట్లు మార్నింగ్స్టార్ సంస్థ రూపొందించిన నివేదికలో వెల్లడైంది. డీఎస్పీ క్రెడిట్ రిస్క్ ఫండ్ అత్యధికంగా కాఫీ డే నేచురల్ రిసోర్సెస్లో రూ. 132 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. మరో 20 శాతం పడిన షేరు.. తాజా పరిణామాలతో బుధవారం కూడా కాఫీ డే షేరు మరో 20 శాతం పతనమైంది. ఇంట్రాడేలో లోయర్ సర్క్యూట్ను తాకింది. బీఎస్ఈలో రూ. 123.25కి క్షీణించింది. ఇది 52 వారాల కనిష్ట స్థాయి కూడా. అటు ఎన్ఎస్ఈలో కూడా 20% పతనమై రూ. 122.75కి పడింది. రెండు రోజుల్లో సంస్థ మార్కెట్ విలువ రూ. 1,463 కోట్లు ఆవిరైపోయి.. రూ.2,604 కోట్లకు తగ్గింది. సిద్ధార్థ అదృశ్యమయ్యారన్న వార్తలతో మంగళవారం కూడా కాఫీ డే షేరు 20% పతనమైన సంగతి తెలిసిందే. -
400 మెసేజ్లు.. షాకయిన బాధితుడు
ముంబై: ఇంటర్నెట్ వాడకం పెరిగాక.. యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలు నకిలీ వార్తల ప్రచారానికి కేంద్రాలుగా మారుతున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్లో అయితే ప్రతి రోజు ఏదో ఒక సెలబ్రిటీ కుటుంబానికి చెందిన చావు వార్తలు రావడం సాధరణం అయిపోయింది. ఒక్కోసారి ఏకంగా సెలబ్రిటీల గురించే తప్పుడు వార్తలు ప్రచారం చేయడం.. ఆనక వారు మీడియా ముందుకు వచ్చి వాటిని ఖండించడం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో వాట్సాప్ కూడా ఇలాంటి ఫేక్ వార్తల ప్రచారనికి అడ్డాగా మారింది. ఈ క్రమంలో ముంబైకి చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్ షాక్ ఇచ్చింది. బతికుండగానే తన మృతికి సంతాపం తెలుపుతూ.. 400 సందేశాలు వచ్చేసరికి షాకవ్వడం అతడి వంతయ్యింది. వివరాలు.. మూడు రోజుల క్రితం మీడియా ప్రొఫెషనల్ రవీంద్ర దుసాంగే అనే వ్యక్తి చనిపోయాడంటూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశారు. దాంతో పాటు అతని ఫోటోను కూడా మెసేజ్ చేశారు. ఇంకేముంది దుసాంగే ఫోన్కు సంతాప సందేశాలు వరుస కడుతున్నాయి. తొలుత దీన్ని అంతగా పట్టించుకోని దుసాంగే.. మెసేజ్లు, ఫోన్ కాల్స్ సంఖ్య పెరుగుతుండటంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయం గురించి దుసాంగే మాట్లాడుతూ.. ‘తొలుత ఈ మెసేజ్లను అంతగా పట్టించుకోలేదు. తర్వాత నా స్నేహితులకు, బంధువులకు కూడా ఈ మెసేజ్లు రావడంతో వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం మా అమ్మకు తెలిసి తను చాలా బాధపడింది. మెసేజ్తో పాటు నా ఫోటోను కూడా షేర్ చేశారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అందుకే పోలీసులను ఆశ్రయించాను’ అని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విజయనిర్మల భౌతికకాయానికి కేసీఆర్ నివాళి
హైదరాబాద్ : అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. గురువారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశానికి హాజరైన కేసీఆర్ అక్కడి నుంచి నేరుగా నానక్రామ్గూడలోని కృష్ణా నివాసానికి చేరుకున్నారు. విజయ నిర్మల భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. భార్య మృతితో కన్నీరు మున్నీరు అవుతున్న కృష్ణను కేసీఆర్ ఓదార్చారు. కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. దాదాపు 20 నిమిషాల పాటు కేసీఆర్ అక్కడే ఉన్నారు. కేసీఆర్ వెంట వచ్చిన మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్గౌడ్, ఎంపీలు కే కేశవరావు, సంతోష్కుమార్, రంజిత్రెడ్డి విజయ నిర్మల పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. అంతకుముందు విజయనిర్మల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన కేసీఆర్.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన సేవలను ఆయన కొనియాడారు. గత కొంతకాలంగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయ నిర్మల బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
ఎస్పీవైరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన పవన్ కళ్యాణ్
-
ఆ దాడులు అనాగరికం : మోదీ
కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 166 మందికి పైగా మరణించిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొలంబో చర్చి, మూడు ఫైవ్స్టార్ హోటళ్లలో జరిగిన బాంబు పేలుళ్లను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. శ్రీలంక ప్రజలకు భారత్ బాసటగా నిలుస్తుందని చెబుతూ మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని హింసకు తెగబడటం అనాగరిక చర్యని రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ బాంబు పేలుళ్ల ఘటనను ఖండించారు. నాగరిక సమాజంలో హింసకు తావులేదని అన్నారు. -
పరీకర్ మృతి పట్ల ద్రిగ్భాంతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: గోవా సీఎం మనోహర్ పరీకర్ మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక నిజాయితీ గల నాయకుడిని కోల్పోయిందని తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్లో ఆయన తన సందేశాన్ని పోస్ట్ చేశారు. కాగా, గతకొంతకాలంగా ప్యాంక్రియాటిక్ కేన్సర్తో బాధపడుతున్న పరీకర్ ఆదివారం పణజిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దేశ రాజకీయాల్లో అజాతశత్రువు, మృదు స్వభావిగా పేరున్న పరీకర్ మృతి పట్ల రాష్ట్రపతి కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస చీఫ్ రాహుల్ గాంధీతో సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. మరోవైపు పరీకర్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు(సోమవారం) జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. Deeply saddened to hear about the demise of Sri Manohar Parrikar garu. We have lost a true leader. My heartfelt condolences to the bereaved family. — YS Jagan Mohan Reddy (@ysjagan) March 18, 2019 -
నిన్న కూడా ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా
-
డల్లాస్లో అమర జవాన్లకు శ్రద్దాంజలి
టెక్సాస్ : పుల్వామా ఘటనలో 40 మంది జవాన్లు వీర మరణం పొందడం దేశాన్ని కుదిపేసింది. అమరులైన జవాన్లకు జాతి మొత్తం నివాళులు అర్పించింది. డల్లాస్లోని ఎన్నారైలు చనిపోయిన సైనికులకు శ్రద్దాంజలిని ఘటించారు. మహాత్మా గాంధీ మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇర్వింగ్ లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద శనివారం ఫిబ్రవరి 16న ఏర్పాటు చేసిన ‘అమరవీరుల శ్రద్ధాంజలి’ కార్యక్రమం లో వందలాది మంది ప్రవాస భారతీయులు వీర జవాన్లకు పుష్పాంజలి ఘటించారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఫిబ్రవరి 14 భారత దేశ చరిత్రలో ఒక చీకటి రోజని భారత దేశ రక్షణ కోసం తమ జీవితాలని అంకితం చేసిన వీర జవాన్ల పై దొంగచాటుగా దాడి చేసి వారి ప్రాణాలను బలిగొనడం ఒక అనాగరిక పిరికిపంద చర్య అని తీవ్రంగా ఖండించారు. దాడిలో మరణించిన కుటుంబాలకు తమ ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తూ, గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దాడి జరిగిన వెంటనే అమెరికాలో ఉన్న భారత సంతతికి చెందిన అమెరికా రాజకీయ నాయకులకు మరియు స్థానిక కాంగ్రెస్ మెంబెర్స్ కు, సెనెటర్స్ కు దాడి వివరాలను ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ సలహామండలి సభ్యుడు అరుణ్ అగర్వాల్ మరియు ప్రసాద్ తోటకూర తెలియజేయగా దాదాపుగా 50 మంది అమెరికా రాజకీయ నాయకులు ఈ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించి తమ సంతాపం తెలియజేస్తూ, ఈ ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పని చేసి అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ దాడిలో మరణించిన అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిముషాలు మౌనం పాటించి, కొవ్వత్తుల ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంజిఎంఎన్ టి బోర్డు సభ్యులు రావు కల్వల, బి.ఎన్ రావు, జాన్ హమొండ్, అక్రం సయ్యద్, కమల్ కౌషల్, కమ్యూనిటీ లీడర్స్ జాక్ గద్వాని, షబ్నం మొద్గిల్, స్వాతి షా, ముజ్బర్ రెహమాన్, తన్వీర్ అర్ఫీ, బెనజీర్, హరి పాత్రో, అరుణ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
విలువైన సహచరుడిని కోల్పోయాను..
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుల అనంత్కుమార్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. విలువైన సహచరుడిని కోల్పోయాను: మోదీ అనంత్కుమార్ మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ప్రధాని.. విలువైన సహచరుడిని కోల్పోయానని అన్నారు. యువకుడిగా ప్రజా జీవితంలో అడుగుపెట్టిన ఆయన ఎంతో సేవ చేశారని తెలిపారు. అనంత్కుమార్ చేసిన మంచి పనులు ఆయనను చిరకాలం గుర్తుంచుకునేలా చేస్తాయని పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీ బలోపేతానికి ఆయన చాలా కష్టపడ్డారని కొనియాడారు. అనంత్కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ.. ఆయన భార్యను ఫోన్లో పరామర్శించారు. కర్ణాటక ప్రజలకు తీరనిలోటు: రామ్నాథ్ కోవింద్ అనంత్కుమార్ మృతి చాలా బాధ కలిగించిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. ఆయన మృతి దేశ ప్రజలకు, ముఖ్యంగా కర్ణాటక ప్రజలకు తీరనిలోటని తెలిపారు. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంత్కుమార్ మృతి షాక్కు గురిచేసింది: అమిత్ షా అనంత్కుమార్ మృతి షాక్ గురిచేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ఎంతో నిబద్ధతతో ఆయన దేశానికి సేవ చేశారని కొనియాడారు. కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేయడానికి ఆయన అహర్నిశలు శ్రమించాడని అన్నారు. అనంత్కుమార్ కుటుంబానికి, సహచరులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి శక్తిని ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్ అనంత్కుమార్ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చదవండి: కేంద్రమంత్రి అనంత్కుమార్ కన్నుమూత -
ఖురానా మృతికి మోదీ, అమిత్ షా సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ మాజీ సీఎం మదన్ లాల్ ఖురానా మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సుదీర్ఘ అస్వస్థత అనంతరం శనివారం రాత్రి ఖురానా మరణించారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఢిల్లీలో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు మదన్ లాల్ ఖురానా తీవ్రంగా కృషిచేశారని, ప్రజల సంక్షేమం కోసం నిత్యం పరితపించేవారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఢిల్లీలో పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని, ఈ విషాద వేళ ఆయన కుటుంబ సభ్యులను వెన్నంటి ఉంటామన్నారు. మదన్ లాల్ ఖురానా ఆదర్శ స్వయంసేవకుడిగా గుర్తింపు పొందారని, జన్సంఘ్, బీజేపీ వ్యవస్ధాపక సభ్యుల్లో ముఖ్యులని బీజేపీ చీఫ్ అమిత్ షా ట్వీట్ చేశారు. ఖురానా మృతికి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్, స్మృతీ ఇరానీ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
దర్శకురాలు బి.జయ పార్థివ దేహానికి ప్రముఖుల నివాళి
-
హరికృష్ణకి వైఎస్సార్సీపీ నివాళులు
సాక్షి, అమరావతి : రాజ్యసభ మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ మృతి పట్ల వైఎస్సార్సీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తనను షాక్కు గురుచేసిందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్సార్సీపీ ఆధ్యర్యంలో హరికృష్ణ చిత్రపటానికి నివాళులు అర్పించారు. గుడివాడ నియోజక వర్గానికి హరికృష్ణకి ఉన్న సంబంధాన్ని ఆయన అభిమానులు గుర్తుచేసుకున్నారు. హరికృష్ణ మృతి పట్ల వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబు విచారం వ్యక్తం చేశారు. హరికృష్ణ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. హరికృష్ణ మరణం నందమూరి అభిమానులకు తీరని లోటన్నారు. 1999లో హరికృష్ణ ‘అన్నాటీడీపీ’ స్థాపించి, గుడివాడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన హరికృష్ణకు రధసారధిగా వ్యవహరించానని గుర్తు చేసుకున్నారు. -
కలవాలి తమ్ముడు అన్నారు కానీ..; నాగార్జున
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి లోనయింది. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ సంతాపన్ని తెలియజేస్తున్నారు. ‘కొన్ని వారాల క్రితమే ఆయన నాతో.. నిన్ను చూసి చాలా రోజులయింది, కలవాలి తమ్ముడు అని అన్నారు. ఇప్పుడు ఆయన ఇక లేరు. మిస్ యూ అన్న’ అంటూ హీరో నాగార్జున ట్విటర్లో తన సంతాపాన్ని తెలియజేశారు. సీతారామరాజు చిత్రంలోని ఫొటోను పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో హరికృష్ణ, నాగర్జున అన్నదమ్ములుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ వార్త వినడం చాలా బాధ కలిగించింది. ఈ విషాదాన్ని అధిగమించడానికి తారక్, కళ్యాణ్తో పాటు కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు శక్తిని ప్రసాదించాలని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.- కాజల్ నందమూరి హరికృష్ణ గారి మరణవార్త షాక్కు గురిచేసింది. ఆయన చాలా గొప్ప వ్యక్తి. కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను- అల్లరి నరేష్ ఈ రోజు నిద్రలేవగానే ఇంత ఘోరమైన వార్త వినాల్సి వచ్చింది. ఇది నన్ను తీవ్రంగా కలచి వేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఈ విషాదాన్ని అధిగమించడానికి తారక్, కళ్యాణ్తోపాటు కుటుంబసభ్యులందరికి ఆ భగవంతుడు శక్తిని ప్రసాదించాలి- సుధీర్ బాబు హరికృష్ణ గారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.- సాయిధరమ్ తేజ్ ఇది నమ్మశక్యంగా లేదని డైరక్టర్ హరీశ్ శంకర్ ట్విటర్లో పేర్కొన్నారు. హరికృష్ణ గారి గురించి ఇలాంటి వార్త వినడం నమ్మలేకపోతున్నాను. చాలా గొప్ప వ్యక్తి. నాకు, నా తండ్రికి ఆయన చాలా ఆప్తుడు. ఆ భగవంతుడు కుటుంబసభ్యులకు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.- దేవీశ్రీ ప్రసాద్ ఈ వార్త నన్ను చాలా షాక్కు గురిచేసింది. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. - మంచు లక్ష్మీ ఈ వార్త వినడం చాలా బాధకరంగా ఉంది. నందమూరి కుటుంబసభ్యులకు నా సంతాపన్ని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలిని కోరుకుంటున్నాను- అల్లు శిరీష్ ఈ వార్త విని షాక్కు గురయ్యాను. నాకు మాటలు రావడం లేదు. దేవుడు కఠినమైనవాడు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను- మంచు మనోజ్ ఈ వార్త నన్న షాక్కు గురిచేసింది. ఆయన మృతి నందమూరి కుటుంబానికి తీరని లోటు. ఆయన మంచి వ్యక్తి, గొప్ప తండ్రి. నా బాధను వ్యక్తపరచడానికి మాటలు రావడం లేదు. ఇది విషాదకరమైన రోజు -కోన వెంకట్ -
మాజీ ఎంపీ మాణిక్రెడ్డి కన్నుమూత
జోగిపేట (అందోల్): మెదక్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత పి.మాణిక్రెడ్డి(77) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్లోని స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం డాకూరుకు చెందిన ఆయన నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి 1984లో మెదక్ ఎంపీగా అప్పటి కేంద్రమంత్రి శివశంకర్పై గెలుపొందారు. 2013లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. అం త్యక్రియలు ఆదివారం డాకూరులో నిర్వహించారు. సీఎం కేసీఆర్ సంతాపం.. మాణిక్రెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మంత్రి హరీశ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనకు నివాళులర్పించారు. -
ఆయనే నాకు మార్గనిర్దేశి: అఖిలేశ్
భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి మృతితో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పటికే దేశవిదేశాల నుంచి నేతలు, అభిమానులు తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు ఢిల్లీకి తరలివచ్చారు. వాజ్పేయితో తమకున్న అనుబంధాన్ని పలువురు ప్రముఖులు గుర్తుచేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వాజ్పేయితో కలిసిఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. 1999లో అఖిలేష్-డింపుల్ వివాహానికి హాజరైన వాజ్పేయి ఫోటోను ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘అటల్ బిహారి వాజ్పేయి రాజకీయాలకు సరికొత్త అర్థాన్ని చెప్పిన మహానేత, పార్టీ సిద్దాంతాలను పాటిస్తూనే వ్యక్తిత్వాన్ని మరిచిపోని గొప్పనేత వాజ్పేయి. ఆయన మాలాంటి ఎంతో మంది యువ రాజకీయ నాయకులకు మార్గనిర్దేశి. ఆయన మరణంతో ప్రపంచం గొప్ప నాయకున్ని, రచయితను, గొప్ప వక్తను కోల్పోయాం. ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అంటూ అఖిలేశ్ ట్వీట్ చేశారు. వాజ్పేయి అంత్యక్రియలు యమునానది ఒడ్డున రాష్ట్రీయ స్మృతి స్థల్లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అంతిమయాత్రలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల, బీజేపీ ఆగ్రనేతలు కాలి నడకన వాజ్పేయి అంతిమయాత్రలో పాల్గొన్నారు. स्व. अटल जी ने राजनीति को दलगत राजनीति से ऊपर उठाया, सदैव अपने दल के सिद्धांतों व अपने दर्शन पर अडिग रहना सिखाया, जब भी राजनीति भटकी उसको सही मार्ग दिखाया, विदेशों से मित्रता का पाठ पढ़ाया. अटल जी का जाना भारतीय राजनीति एवं साहित्यिक जगत के मुखरित स्वर का मौन हो जाना है. मौन नमन! pic.twitter.com/1w4EOgr9qG — Akhilesh Yadav (@yadavakhilesh) August 17, 2018 -
ఆయన సేవలు మరువలేం..
సాక్షి, న్యూఢిల్లీ : డీఎంకే అధినేత ఎం. కరుణానిధి మృతి పట్ల కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. తమిళ రాజకీయాల్లో ఆరు దశాబ్ధాల పాటు కరుణానిధి కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన మృతితో భారత్ దిగ్గజ నేతను కోల్పోయిందన్నారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు, ప్రియతమ నేతను కోల్పోయిన లక్షలాది అభిమానులకు తాను ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని రాహుల్ ట్వీట్ చేశారు. అమిత్ షా సంతాపం.. రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి మృతిపై బీజేపీ చీఫ్ అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో కరుణానిధి చేసిన సేవలను ఎవరూ మరువలేరని కొనియాడారు. సినిమా రచయితగా మొదలైన ఆయన ప్రస్ధానం తమిళనాడుకు ఐదు సార్లు సీఎంగా సేవలందించే వరకూ సాగిందన్నారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ఈ విషాదాన్ని అధిగమించే ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్టు అమిత్ షా ట్వీట్ చేశారు. -
శిఖర సమానుడు: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : డీఎంకే అధినేత ఎం. కరుణానిధి మరణం పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు అగ్ర నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాజీవితంలో విశిష్ట నేతగా పేరొందిన కరుణానిధి తమిళనాడుకు, దేశానికి విలువైన సేవలు అందించారని రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ట్వీట్ చేశారు. కరుణానిధి మరణ వార్త తనను కలిచివేసిందని అన్నారు. శిఖర సమానుడు : ప్రధాని ఇక సుదీర్ఘ రాజకీయ ప్రస్ధానంలో కరుణానిధి తన జీవితాన్ని పేదలు, అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. కరుణానిధి మరణవార్త తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన దేశంలోనే అత్యంత సీనియర్ నేతని ప్రస్తుతించారు. కరుణానిధి ప్రజాక్షేత్రంలో వేళ్లూనుకొన్న జననేత, తత్వవేత్త, ఆలోచనాపరుడు, రచయిత, శిఖరసమానుడని ప్రధాని ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో కరుణానిధి కుటుంబ సభ్యులకు, అసంఖ్యాక అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరుణానిధి మృతితో దేశం యావత్తూ, ముఖ్యంగా తమిళనాడు దిగ్గజ నేతను కోల్పోయిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. రాజకీయాల్లో చెరగని ముద్ర : వెంకయ్య డీఎంకే చీఫ్ ఎం. కరుణానిధి మృతిపై ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. రాజకీయ దిగ్గజ నేతగా దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలం సేవలందించిన నేత కరుణానిధి కన్నుమూత తనను బాధించిందని అన్నారు. ఎనిమిది దశాబ్ధాల ప్రజాజీవితంలో కరుణానిధి 56 ఏళ్ల పాటు తమిళనాడు అసెంబ్లీ సభ్యులుగా ఉన్నారని, తమిళనాడు, జాతీయ రాజకీయాల్లో ఆయన తనదైన ముద్రవేశారని కొనియాడారు. -
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు వస్వాని కన్నుమూత
పుణె : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దాదా జేపీ వస్వాని కన్నుమూశారు. సోమవారం తన 99వ ఏట పుణెలో మరణించారు. దాదా వస్వాని 1918 ఆగస్టు2న పాకిస్తాన్ సింధ్ ప్రాంతంలోని హైదరబాద్లో జన్మించారు. ఆయన పూర్తి పేరు జస్వాన్ పహ్లజ్ రాయ్ వస్వాని. శాఖాహారాన్ని, జంతు హక్కులను ప్రచారం చేయటానికి ఆయన కృషిచేశారు. ఇందుకోసం ‘‘సాధూ వస్వాని మిషన్’’ పేరిట ఓ ఆధ్యాత్మిక సంస్థను ఏర్పాటు చేశారు. ఆయన దాదాపు 150కిపైగా ఆధ్యాత్మిక పుస్తకాలను రచించారు. ప్రపంచ శాంతి కోసం ఆయన చేసిన కృషికి యూనైటెడ్ నేషన్స్ ‘‘యూ తంత్ పీస్ అవార్డ్’’ను బహుకరించింది. ఆయన పుట్టిన రోజును ‘‘గ్లోబల్ ఫర్గివ్నెస్ డే’’గా జరుపుకుంటున్నారు. వస్వాని ‘‘బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్’’ లండన్, ఆక్స్ఫర్డ్లోని ‘‘గ్లోబల్ ఫోరమ్ ఫర్ స్పిరిచువల్ లీడర్స్’’ తదితర ప్రముఖ ప్రదేశాలలో తన ప్రసంగాన్ని వినిపించారు. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోది, పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. -
ములుగులో సీఎం కేసీఆర్
ములుగు (గజ్వేల్): మండల టీఆర్ఎస్ యూత్ విభాగ అధ్యక్షుడు బట్టు అంజిరెడ్డి తల్లి వజ్రమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదివారం హాజరయ్యారు. పది రోజుల క్రితం ఆమె అనారోగ్యంతో మృతి చెందా రు. ఈ సందర్భంగా అంజిరెడ్డిని సీఎం పరామర్శించారు. అనంతరం తిరుగు ప్రయాణంలో గ్రామంలోని తన చిన్ననాటి స్నేహితుడు, ఎర్రవల్లి ఫాంహౌస్ ఇన్చార్జి, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ మహ్మద్ జహంగీర్ ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. -
నింగికేగిన‘రెడ్ స్టార్’
సాక్షి, హైదరాబాద్/ఒంగోలు కల్చరల్: వెండి తెరకు ‘ఎర్ర’రంగులద్దిన విప్లవ శంఖం మూగబోయింది. సినీ వినీలాకాశంలో ‘రెడ్ స్టార్’గా వెలుగొందిన ఎర్ర సూరీడు అస్తమించాడు. విప్లవ, అభ్యుదయ భావాలతో ఓ తరాన్ని ఉర్రూతలూగించిన ప్రముఖ నటు డు, నిర్మాత మాదాల రంగారావు (70) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్లో అనారోగ్యంతో కన్నుమూశారు. హృద్రోగ సమస్యతో బాధపడుతు న్న ఆయన్ను చికిత్స కోసం 19న స్టార్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన కుమారుడు డాక్టర్ మాదాల రవి, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేశ్ గూడపాటి పర్యవేక్షణలో చికిత్స అందించారు. ఆయన్ను బతికించేందుకు వైద్యులు శతవిధాల ప్రయత్నించినా ఫలి తం లేకపోయింది. రెండు మాసాల కిందట గుండెపోటు రావడంతో రంగారావుకు చైన్నైలో చికిత్స అం దించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమా ర్తె ఉన్నారు. సోమవారం ఫిల్మ్నగర్లోని మహాప్రస్థానంలో మాదాల అంత్యక్రియలు జరగనున్నాయి. నాటకాల నుంచి సినీరంగం వైపు.. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మైనంపాడులో 1948 మే 25న మాదాల రంగారావు భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. ఒంగోలు మున్సిపల్ హైస్కూలులో విద్యనభ్యసించారు. అనంతరం కళాకారుల పుట్టినిల్లైన సీఎస్ఆర్ శర్మ కాలేజీలో బీఏ చదివారు. నల్లూరి వెంకటేశ్వర్లు సాహచర్యంలో కళాకారుడిగా ఎదిగారు. అభ్యుదయ చిత్రాలకు నూతన ఒరవడి దిద్దిన టి.కృష్ణ, పోకూరు బాబూరావు, వందేమాతరం శ్రీనివాస్, నర్రాతోపాటు ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటివారు సినీరంగం వైపు ఆకర్షితులు కావడానికి మాదాలే స్ఫూర్తిగా నిలిచారు. సినీరంగంలోకి వచ్చే ముందు అనేక నాటకాల్లో నటించిన ఆయన మొదటిసారిగా నవతరం ప్రొడక్షన్స్ పతాకంపై 1980లో ‘యువతరం కదిలింది’ సినిమా తీశారు. ఆ చిత్రం శత దినోత్సవం జరుపుకోవడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బంగారు నంది పురస్కారం గెల్చుకుంది. వామపక్ష భావజాలం కలిగిన రంగారావు.. అవినీతి, అణచివేత లాంటి సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ అనేక సినిమాలు రూపొందించారు. ‘ఎర్రమల్లెలు’, ‘విప్లవశంఖం’, ‘స్వరాజ్యం’, ‘ఎర్ర సూర్యుడు’, ‘ఎర్ర పావురాలు’, ‘జనం మనం’, ‘ప్రజాశక్తి’తదితర చిత్రాల్లో నటించి రెడ్స్టార్గా పేరు తెచ్చుకున్నారు. 80వ దశకంలో ప్రేమకథా చిత్రాల హవా నడుస్తున్నా.. విప్లవాత్మక చిత్రాలను నిర్మించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కళ ప్రజల కోసం.. ప్రజా కళాకారుడిగా, ప్రజా నాట్యమండలి నీడన మా దాల ప్రజలను చైతన్యపరిచే చిత్రాలనే నిర్మించారు. కళ కళ కోసం కాదు ప్రజల కోసం అనే గరికిపాటి రాజారావు మార్గంలో పయనించారు. సినిమాల ద్వా రా వచ్చిన లాభాలలో కొంత భాగాన్ని కమ్యూనిస్టు పార్టీకి ఇవ్వడంతోపాటు ప్రజాసంక్షేమ కార్యక్రమాల కు, దానధర్మాలకు వెచ్చించేవారు. గతంలో సినిమాలన్నీ స్టూడియోల్లోనే రూపుదిద్దుకునేవి. ఆ సంప్రదాయాన్ని తోసిరాజని సినిమా మొత్తాన్ని ప్రజల మధ్య రూపొందించిన ఘనత మాదాలకే దక్కుతుంది. ప్రముఖుల నివాళి ఆదివారం ఉదయం మాదాల పార్థివ దేహాన్ని ఫిలింనగర్లోని ఆయన నివాసానికి తరలించారు. మంత్రి తలసానితో పాటు సినీ నటులు చిరంజీవి, శ్రీకాంత్, శివాజీరాజా, నరేశ్, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, వందేమాతరం శ్రీనివాస్, వామపక్షాల నేతలు నారాయణ, తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. పవన్ కల్యాణ్ ఆయన మృతి పట్ల ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు బాగ్ లింగంపల్లిలోని ఎస్వీకేలో అభిమానుల సందర్శనార్థం మాదాల భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. మాదాల రంగారావు పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న చిరంజీవి చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం: జగన్ మాదాల రంగారావు మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. వామపక్ష భావజాలంతో కూడిన సినిమాలతో కీర్తి గడించిన రంగారావు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును, స్థానాన్ని ఏర్పరచుకున్నారని పేర్కొన్నారు. మాదాల కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కేసీఆర్ సంతాపం మాదాల మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సామాజిక స్పృహ కలిగిన చిత్రాలు తీయడం ద్వారా మాదాల అనేక మందికి స్ఫూర్తి కలిగించారని గుర్తు చేసుకున్నారు. ఉద్యమానికి తీరనిలోటు మాదాల రంగారావు మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి, కళారంగానికి తీరని లోటు. అభ్యుదయ, వామపక్ష భావాలు కలిగిన ఎన్నో సినిమాలు నిర్మించి ఆయన ప్రజలను చైతన్యపరిచారు. – తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మాదాల రంగారావు పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న మంత్రి తలసాని, చిత్రంలో మాదాల రవి. -
నన్ను ప్రోత్సహించిన వారిలో ఆయన ఒకరు
విప్లవ నటుడు మాదాల రంగారావు ఈ రోజు ఉదయం కన్నుమూశారు. కొద్దిరోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి మాదాల రంగారావు భౌతికకాయానికి నివాళులర్పించారు. ‘రంగారావు గారు కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, కమర్షియల్ సినిమా అవకాశాలు వచ్చినా.. తను నమ్మిన సిద్ధాంతాల కోసం విప్లవాత్మక చిత్రాలు మాత్రమే చేస్తూ ప్రజలను చైతన్య పరిచిన వ్యక్తి ఆయన. ఆర్. నారాయణమూర్తి లాంటి వారికి ఆయనే స్ఫూర్తి. నేను ఒంగోలులో ఉన్నప్పుడు మాదాల రంగారావు, టి.కృష్ణ, పోకూరి బాబురావులతో మంచి సాన్నిహిత్యం ఉంది. అప్పట్లో నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్లలో మాదాల రంగారావు ఒకరు’అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు చిరంజీవి. -
దత్తాత్రేయకు మోదీ లేఖ
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. పుట్టెడు శోకంలో ఉన్న దత్తాత్రేయకు సానుభూతి తెలియజేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. ‘వైష్ణవ్ చనిపోయాడన్న విషాద వార్త నన్ను కలిచివేసింది. ఇలాంటి సమయంలో దేశం అంతా నీ బాధను పంచుకుంటుంది. మెడిసిన్ చదివి దేశ సేవ చేయాల్సిన అబ్బాయి చనిపోవడం దురదృష్టకరం. మీకు మీ కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. వైష్ణవ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని లేఖలో మోదీ పేర్కొన్నారు. -
బండారు దత్తాత్రేయకు పలువురు సంతాపం
-
దత్తాత్రేయను ఇలా కలవడం బాధాకరం..
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీమంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్రాత్తేయ కుమారుడు వైష్ణవ్ ఆకస్మిక మృతి పట్లు పలువురు సంతాపం తెలిపారు. గతరాత్రి వైష్ణవ్ గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ...‘దత్తాత్రేయ ఇంటికి ఎన్నో సందర్భాలలో వచ్చాను కానీ ఈ రోజు ఈ రకంగా ఆయనను కలవడం చాలా బాధాకరం. ప్రపంచంలో అతి పెద్ద దుఃఖం పుత్రశోకం. భగవంతుడు ఆయనకు శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.’ అని తెలిపారు. మరోవైపు సినీనటుడు హరికృష్ణ...బండారు దత్తాత్రేయకు సంతాపం తెలిపారు. కాగా బండారు వైష్ణవ్ అంత్యక్రియలు సైదాబాద్లోని శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రాంనగర్లోని స్వగృహం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది. -
డీఏ సోమయాజులు మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, గోపాలపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున 3.14 గంటలకు స్వర్గస్థులయ్యారు. ఆయన మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమయాజులు మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. గత కొంత కాలంగా డీఏ సోమయాజులు శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. 1953లో ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా గద్వాల్లో సోమయాజులు జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్వొరేషన్కు డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. సోమయాజులు గతంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆర్థిక సలహాదారుగా పని చేశారు. అగ్రికల్చర్ టెక్నాలజీ డిప్యూటీ ఛైర్మన్గా కూడా ఆయన వ్యవహరించారు. -
జానకీదేవికి బీజేపీ నేతల నివాళి
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మాతృమూర్తి వారణాసి జానకీదేవి భౌతికకాయానికి పలువురు బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు...జానకీదేవి భౌతికకాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు. కాగా జానకీదేవి బుధవారం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా బీజేపీ నేత రాంమాధవ్ ..పెద్ద కుమారుడు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం స్వస్థలం కాగా, మూడేళ్లుగా జానకీదేవి ఢిల్లీలో కుమారుడు రాంమాధవ్ వద్దే ఉంటున్నారు. రెండో కుమారుడు కిషోర్ అమెరికాలో ఇంజినీరు, కుమార్తె భారతి హైదరాబాద్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. జానకీదేవి 20ఏళ్లుగా బీజేపీలో చురుకైన పాత్ర పోషించారు. మహిళా మోర్చా రాష్ట్ర విభాగంలో పలు పదవులు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఇవాళ హైదరాబాద్లో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. -
రామచంద్రారెడ్డి మృతిపై జానారెడ్డి సంతాపం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ మాజీ స్పీకర్, మాజీ మంత్రి పి.రామచంద్రారెడ్డి మృతి పట్ల ప్రతిపక్ష నేత జానారెడ్డి సంతాపం తెలిపారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయన హైదరాబాద్ ఎస్ఆర్నగర్లోని స్వగృహంలో మృతి చెందారు. రామచంద్రారెడ్డి పంచాయితీ సభ్యుడి నుంచి శాసనసభ స్పీకర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి అని జానారెడ్డి అన్నారు. ఐదు సార్లు శాసన సభ్యునిగా, మంత్రిగా, న్యాయవాదిగా పనిచేసి సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని కలిగిన వ్యక్తి అని, ఆయన మరణం తీరని లోటు అని జానారెడ్డి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
ఆనం వివేకా మృతిపట్ల వెంకయ్య సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మృతి పట్ల ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం రాష్ట్రానికి, ముఖ్యంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజలకు తీరని లోటని వెంకయ్య అభివర్ణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యునిగా, విద్యావేత్తగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఎల్లప్పుడూ చురుకుగా, చమత్కారాలతో ఆయన మాట్లాడే మాటలు ఇప్పటికీ గుర్తుకువస్తున్నాయన్నారు. ఆనం వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులకు ఆయన మరణాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని తెలిపారు. గత కొన్నిరోజులుగా ప్రొస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆనం వివేకానందరెడ్డి హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయానికి నెల్లూరులో రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
బాలాంత్రపు మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, నూజివీడు : ప్రముఖ రచయిత బాలాంత్రపు రజనీకాంతరావు మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. తెలుగు సాహిత్య, కళ రంగాలకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. తెలుగు తల్లి ముద్దు బిడ్డలో రజనీకాంతరావు అగ్రగణ్యులని వైఎస్ జగన్ అన్నారు. రేడియో జర్నలిజం ద్వారా కళల్ని, సాహిత్యాన్ని, లలిత సంగీతాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లిన బాలాంత్రపు చిరస్మరణీయులని వైఎస్ జగన్ పేర్కొన్నారు. రజనీకాంత రావు మరణం తెలుగు సాహిత్య, కళా రంగాలకు తీరని లోటు అని అన్నారు. బాలాంత్రపు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
టాలీవుడ్ తారల దిగ్భ్రాంతి
ప్రముఖ నటి శ్రీదేవి మరణం సినీరంగానికి షాక్ ఇచ్చింది. ఊహించని ఈ సంఘటనపై టాలీవుడ్ తారలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘శ్రీదేవి మరణ వార్తతో షాక్ అయ్యాను. ఓ నటిగా, ఓ మహిళగా ఆమె అందరికీ ఆదర్శం. ఎప్పటికీ ఆమే నా అభిమాన నటి. ఆమె ఆత్మకు చేకూరాలని కోరుకుంటున్నా’అంటూ ట్వీట్ చేశారు. ‘ఇప్పటికే ఈ వార్త నమ్మలేకపోతున్నా.. నిజంగా సినీ పరిశ్రమకు తీరనిలోటు’ అన్నారు రవితేజ. దర్శకధీరుడు రాజమౌళి ‘ఈ వార్త విని షాక్ అయ్యాను. తొలి లేడీ సూపర్ స్టార్. 54 నాలుగేళ్ల జీవితంలో యాబై ఏళ్లు నటిగా కొనసాగిన ప్రస్థానం. ఇలా ముగిసింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలి’ అని ట్వీట్ చేశారు. హీరోలు అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, సుధీర్ బాబు, అధర్వ, రాహుల్ రవీంద్రన్, గౌతమ్ కార్తీక్లతో పాటు హీరోయిన్లు కాజల్ అగర్వాల్, ప్రగ్యా జైస్వాల్ శ్రీయ రెడ్డి, పరుల్ యాదవ్, ఐశ్వర్య రాజేష్లు తమ సంతాపాన్ని తెలియజేశారు. Shocked to hear the sad news. The first Lady Superstar of the Country. 50 of those 54 years as an actress par excellence. What a journey..and such an unexpected end. May your soul rest in peace. Sridevi garu 🙏🙏🙏 — rajamouli ss (@ssrajamouli) 25 February 2018 Form a Child Artist to a Legendary to Movie Star!! A great journey of one of the most charismatic women in the world of cinema comes to an end. #RIPSridevi pic.twitter.com/B4BREFoXNI — Rana Daggubati (@RanaDaggubati) 25 February 2018 Shocked & disturbed with the news of #Sridevi garu's demise. She truly was the epitome of everything amazing as an actor & a woman. My all time favourite actress.. Gone too soon. Strength to her family & loved ones. May her soul Rest in Peace. — Mahesh Babu (@urstrulyMahesh) 25 February 2018 It's definitely a great loss!! Still can't believe the news that #Sridevi garu is no more !!Irreplaceable. Heartfelt condolences to her family. #RIPSridevi — Ravi Teja (@RaviTeja_offl) 25 February 2018 Shocked to Hear the Demise of Iconic actress Sridevi Garu ! Really Sad News . Condolences to Her Family , Near & dear ones . #Sridevi — Allu Arjun (@alluarjun) 25 February 2018 Extremely sad and shocked to hear about the sudden demise of my most favourite actor and role model, #Sridevi Ma'am.. this must be so difficult, my heartfelt condolences to the family🙏🏻😢 #RIPSridevi #gonetoosoon #heartbreaking pic.twitter.com/UOjhoMVKcq — Kajal Aggarwal (@MsKajalAggarwal) 25 February 2018 Shocked to hear the sudden demise of #Sridevi Its not fair god she’s too young to leave us. It’s my sis in that pic with her in Thirumala & I was shy to take a pic.I wish I had taken too.... #RIP Sridevi garu pic.twitter.com/n9QALLBAI1 — Sudheer Babu (@isudheerbabu) 25 February 2018 -
‘శ్రీదేవి ఇక లేరు అంటే నమ్మలేం’
ప్రముఖ నటి శ్రీదేవి మరణంపై టాలీవుడ్ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. భారతీయ వెండి తెరపై తనదైన ముద్రను వేసిన శ్రీదేవి గారి హఠాన్మరణం నమ్మలేనిదన్నారు. దుబాయిలో వివాహానికి వెళ్ళిన శ్రీదేవిగారు చనిపోయారని తెలియగానే దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. ఆమె మృతి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. తన సంతాపాన్ని తెలియజేస్తూ ‘అసమానమైన అభినయ ప్రతిభతో భారత ప్రేక్షక లోకం అభిమానాన్ని ఆమె చూరగొన్నారు. శ్రీదేవి గారు ఇక లేరు అనే మాట నమ్మలేనిది... కానీ ఆమె వెండి తెరపై పోషించిన భిన్నమైన పాత్రలన్నీ చిరస్మరణీయాలే. భౌతికంగా ఈ లోకాన్ని వీడినా నటిగా శ్రీదేవి ముద్ర చిత్ర సీమలో సుస్థిరం. శ్రీదేవి గారి కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకొనే మానసిక స్థైర్యాన్ని భగవంతుడు అందించాలని ప్రార్థిస్తున్నాను. బాల నటిగా, కథానాయకిగా దక్షిణ భారత సినీ రంగంలో విజయాలు అందుకొన్న శ్రీదేవి గారు అదే స్థాయిలో హిందీ ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. బడి పంతులు సినిమాలో బాల నటిగా ‘బూచాడమ్మ బూచాడు’ అనే పాటలో కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ పలికింఛిన హావభావాల్ని ప్రేక్షకులు మరచిపోలేరు. అన్నయ్యతో జగదేక వీరుడు అతిలోక సుందరిలో దేవకన్య ఇంద్రజగా కనిపించిన తీరు ‘మానవా..’ అంటూ చెప్పే సంభాషణలు కూడా అందరూ గుర్తు చేసుకొనేవే. శ్రీదేవిగారు అమాయకత్వంతో పలికించే నటన మరచిపోలేనిది. విరామం తరవాత ఇంగ్లిష్ వింగ్లీష్, మామ్ చిత్రాల్లో నటించి తన శైలిని ఈ తరానికీ చూపించారు. పెద్ద కుమార్తెని కథానాయకిగా చిత్ర సీమకి తీసుకువస్తున్న తరుణంలో ఈ లోకాన్ని వీడటం బాధాకరం’ అన్నారు. -
శ్రీదేవి అసమాన నటి : వైఎస్ జగన్
సాక్షి, ప్రకాశం : నటి శ్రీదేవి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని ఆయన అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘శ్రీదేవి మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. తన నటన, ఛరిష్మాతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి ఆమె. దక్షిణ భాషలతోపాటు బాలీవుడ్లోనూ ఆమె నటించి అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. మరచిపోలేని పాత్రలేన్నో ఆమె పోషించి మెప్పించారు. ఇంగ్లీష్ వింగ్లీష్లో గృహిణి పాత్ర శ్రీదేవి ఎంతటి అసమాన నటి అన్న విషయం తెలియజేసింది.. ఆ లెజెండరీ నటి మృతి భారతీయ చలన చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా ఆమెను అభిమానించే వారికి తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
తిరిగి స్వర్గానికి వెళ్లిపోయారు : ఎన్టీఆర్
శ్రీదేవి మృతి పట్ల టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ స్పందించారు. పలు సందర్భాల్లో శ్రీదేవి మీద తన అభిమానాన్ని చాటుకున్న ఎన్టీఆర్ అవకాశం వస్తే ఆమెతో కలిసి నటించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటానన్నారు. ‘ఆమె వచ్చింది. ఆమె చూసింది. ఆమె గెలుచుకుంది. తిరిగి తను ఏ స్వర్గం నుంచి అయితే వచ్చిందో అక్కడికే వెళ్లిపోయింది. శ్రీదేవిగారి ఆత్మకు శాంతి కలగాని కోరుకుంటున్నా. ఆమె స్థానాన్ని భర్తీ చేయలేరు’ అంటూ ట్వీట్ చేశాడు. హీరోయిన్ హన్సిక ‘నేను నమ్మలేకపోతున్నా. ఇది నిజం కాకూడదు. ఇంకా షాక్లోనే ఉన్నా. ఇది భారతీయ సినీ చరిత్రలోనే చీకటి రోజు. ఆమె లేని లోటును తెలియజేసేందుకు మాటలు సరిపోవటం లేదు’ అంటూ ట్వీట్ చేశారు. యంగ్ హీరో నిఖిల్ ‘ఆమె లేదంటే నమ్మలేకపోతున్నా.. అందం అంటే ఎప్పటికీ శ్రీదేవిగారే. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు సీనియర్ నటి ఖుష్బూ, మెహరీన్, కోన వెంకట్, హరీష్ శంకర్, సుమంత్, ప్రియమణి, హన్సిక, అనీల్ రావిపూడి,ఈషారెబ్బా తదితరులు తమ సంతాపం తెలియజేశారు. She came. She saw. She conquered. And went back to the heavens from where she came. RIP Sridevi garu.IRREPLACEABLE pic.twitter.com/NB4GozzWYi — Jr NTR (@tarak9999) 25 February 2018 Shocked ! I can’t even believe this ... this can’t be true . Still in shock . This is the darkest day in Indian cinema . A legend , A true star , an act par excellence , any amount of words will fall flat to express the demise of #sridevi ji , gone to soon . — Hansika (@ihansika) 25 February 2018 At a loss for words! RIP #Sridevi garu!💔 pic.twitter.com/Ftk3n3rSms — Sumanth (@iSumanth) 25 February 2018 Shocked and feeling so sad that one of my idols whom I have always maintained was one of my inspirations to join the film industry is no more!!! RIP my idol! Forever you will remain in all our hearts!! #Sridevi 💔 — Priyamani Raj (@priyamani6) 25 February 2018 As a mark of respect for the late legendary actor #Sridevi, i change my DP for today.. Will miss your giggle and that laughter ma. — khushbusundar (@khushsundar) 25 February 2018 Unbelievable, deeply saddened to wake up to saddest news of legendary #Sridevi ji passing away, 🙏RIP,nothing can fill void of her loss to film industry,will always be someone to look up to #NaturalActress #SuperDancer #LovelyHumanBeing pic.twitter.com/lw2wTo7eX4 — Mehreen Pirzada (@Mehreenpirzada) 25 February 2018 Shocked😥.....Goddess #Sridevi Garu no more......... — Anil Ravipudi (@AnilRavipudi) 25 February 2018 Shocked beyond words. Grew up in awe of your talent. You gave us joy love and so many movies. Gone too soon. Rest in peace #Sridevi ma’am 💔 pic.twitter.com/QSGDbqWIcG — Eesha Rebba (@YoursEesha) 25 February 2018 -
ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది..
సాక్షి, హైదరాబాద్ : హాస్యనటుడు గుండు హనుమంతరావు మృతి తీరని లోటు అని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. అనారోగ్యంతో గుండు హనుమంతరావు సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..‘తెలుగు చిత్రసీమలో ప్రతి హాస్య నటుడిదీ ఒక్కో శైలి. అలానే గుండు హనుమంతరావు సైతం తనదైన శైలితో కోట్లాది తెలుగు ప్రేక్షకులకు మూడు దశాబ్దాలుగా వినోదాన్ని అందిస్తూ వచ్చారు. ఆ మధ్య ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలిసి కలత చెందాను. నా వంతు సాయం అందించాను. పరిపూర్ణ ఆరోగ్యంతో గుండు హనుమంతరావు తిరిగి సినిమాల్లో నటిస్తారని భావించాను. కానీ ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది. గుండు హనుమంతరావు మృతితో తెలుగు సినిమా రంగం మంచి నటుడినే కాదు, చక్కని మనిషినీ కోల్పోయింది. ఆయన ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. కాగా గుండు హనుమంతరావు సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ ఎర్రగడ్డలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. 400 పైగా సినిమాల్లో హనుమంతరావు నటించారు. -
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేకి మాతృవియోగం
సాక్షి, విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రక్షణనిధికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కొక్కిలిగడ్డ సూర్యకాంతం (86) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. పలువురు వైఎస్ఆర్ సీపీ నేతలు నివాళులు... తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెంలో సూర్యకాంతమ్మ భౌతికకాయాన్ని సందర్శించిన అర్పించారు. నివాళులు అర్పించినవారిలో కృష్ణాజిల్లా ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నూజివీడు ఎమ్మెల్యే మేక ప్రతాప్ అప్పారావు, పార్టీ నేతలు కొలుసు పార్థసారధి, వెల్లంపల్లి శ్రీనివాస్, అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, మేరుగ నాగార్జున తదితరులు ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యే రక్షణనిధిని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించి, ఆయన తల్లి మృతి పట్ల సంతాపం తెలిపారు. -
గొప్ప సాహితీవేత్తను కోల్పోయాం: చంద్రబాబు
హైదరాబాద్ : ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి పార్థీవ దేహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులు అర్పించారు. సినారె భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. సినారె కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... గొప్ప సాహితీవేత్తను కోల్పోయామని, సినారె మరణం తెలుగు జాతి, దేశానికే తీరని లోటు అని అన్నారు. ఒక మహనీయుడ్ని కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు సి.నారాయణ రెడ్డి అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సులు నడుపనుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 31 జిల్లా కేంద్రాల నుండి హైదరాబాద్లోని దర్గా పరిసర మహాప్రస్థానానికి వచ్చే సినారే అభిమానుల కోసం ఏర్పాట్లు చేశారు. -
సామాన్యుడు.. అయినా చిరంజీవుడు
- సి.నారాయణరెడ్డి మరణం తెలుగుకు తీరని లోటు - దిగ్భ్రాంతి చెందిన సాహితీలోకం.. ప్రముఖుల నివాళి అవయవాలు చస్తాయి కాని ఆలోచనలు చావవు.. ‘మట్టి మనిషి ఆకాశం’ గ్రంథంలో డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి రాసిన మాటలివి. అవును. కవివర్యుడు భౌతికంగా చనిపోయారుగానీ అక్షరాల రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారు. కొంతకాలంగా అనారోగ్యంతో భాధపడుతోన్న సినారె సోమవారం ఉదయం హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. కరీంగనర్ జిల్లాలోని మారుమూల పల్లె హనుమాజీపేటలో 1931, జులై 29 జన్మించిన ఆయన.. భారతదేశం గర్వించదగిన సాహితీవేత్తగా ఎదిగిన క్రమాన్ని ఒక్కసారి పరిశీలిస్తే.. హనుమాజీపేటలో మల్లారెడ్డి-బుచ్చమ్మ దంపతులకు జన్మించారు నారాయణరెడ్డి. ప్రాథమిక విద్యాబ్యాసంమంతా సొంత ఊళ్లోనే సాగింది. మాధ్యమిక విద్య(సిరిసిల్లలో), ఉన్నత విద్య(కరీంనగర్) అభ్యసించారు. హైదరాబాద్లోని చాదర్ఘాట్ కాలేజీలో ఇంటర్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ చదివారు. మాధ్యమికం నుంచి డిగ్రీదాకా ఆయన చదివింది ఉర్దూమీడియంలోనే కావడం గమనార్హం. ఆ తర్వాత ఓయూలోనే తెలుగు సాహిత్యంలో పీజీ, పీహెచ్డీ పూర్తిచేశారు. ఉద్యోగం, సాహితీ ప్రస్థానం ప్రారంభంలో సికింద్రాబాద్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అధ్యాపకుడిగా చేసిన నారాయణరెడ్డి.. తర్వాత నిజాం కాలేజీలో, అటుపై ఉస్మానియా వర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. పొట్టిశ్రీరాములు తెలుగు యూనిర్సిటీ ఉపకులపతిగానూ ఆయన సేవలందించారు. ఉద్యోగం చేస్తూనే సాహితీసేవను కొనసాగించారు. విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే.విశ్వంభర కావ్యానికి ఆయనకి ఈ అవార్డు లభించింది. ప్రముఖంగా కవి అయినప్పటికీ పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, సినిమా పాటలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు తదితర ప్రక్రియలన్నింటిలో విశేష రచనలు చేశారు. (చదవండి: సినారె అక్షరానుబంధం) కాలేజీ రోజుల్లో ‘శోభ’ అనే పత్రికకు ఎడిటర్గా వ్యవహరించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించారు. ‘జనశక్తి’ పత్రికలో సినారె కవిత తొలిసారి అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించి సత్తా చాటుకున్నారు. 1953 లో ‘నవ్వని పువ్వు’ సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. ఇది సినారె తొలి ప్రచురణ. ఆ వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి. రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. గులేబకావళి కథతో సినిమాల్లోకి.. 1962 లో గులేబకావళి కథ చిత్రం లోని ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ..’ అనే పాటతో సినీరంగ ప్రవేశం చేశారు నారాయణరెడ్డి. అటుపై పలు సినిమాలకు 3500 పాటలు, కవితలు రాశారు. కుటుంబం.. సినారె- సుశీల దంపతులకు నలుగురు ఆడపిల్లలు. గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి. భార్య సుశీల మరణానంతరం ఆమె పేరుమీద ఔత్సాహిక సాహితీకారులకు ఏటా అవార్డులు అందిస్తున్నారు సినారె. అంతర్జాతీయ ఖ్యాతి హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడం, సంస్కృతం, లాటి భారతీయభాషల్లోనేకాక.. ఇంగ్లీషు, ఫ్రెంచ్ భాషల్లో సైతం సినారె రచనలు అనువాదం అయ్యాయి. ఆయనే స్వయంగా హిందీ, ఉర్దూ భాషల్లో కవితలల్లారు. అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్స్, రష్యా, జపాన్, కెనడా, ఇటలీ, డెన్మార్క్, థాయ్ ల్యాండ్, సింగపూర్, మలేషియా, మారిషస్, యుగోస్లోవియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలను సందర్శించారు. 1990 లో యుగోస్లేవియాలోని స్రూగాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిథిగా పాల్గొన్నారు. సినారె రచనల్లోని ఫేమస్ కొటేషన్లు.. కుత్తుకులను నరికితే కాదు, గుండెలను కలిపితే గొంతు. (మట్టి మనిషి ఆకాశం గ్రంథంలో) ఏ భాష చెణుకైనా, ఏ యాస చినుకైనా తనలోన కలుపుకొని తరలింది తెలుగు. కప్పి చెప్పేవాడు కవి. విప్పి చెప్పేవాడు విమర్శకుడు. అంటరానివారెవరో కాదు, మా వెంటరానివారే. అదృష్టమనేది మత్తకోకిలలా ఉంటుంది. అది కాలమనే మావి గుబుళ్ళలో దాగి ఉంటుంది. అంత కడువెడు పాలపై ఒక్కింత మీగడ పేరినట్లు మనకు మిగులును గతంలోపలి మంచి, అదియే సంప్రదాయం. అందరిలాగే సామాన్యుణ్ణి. అయినా చిరంజీవుణ్ణి. గతమనెడు వజ్రంపు గోడల కట్టడంపై నిట్టనిలువునా శిరసునెత్తిన స్వర్ణమయ గోపురం సుమ్ము వర్తమానమ్ము. విధి నిదురబోతుంది. విధిలిఖితం నిదురబోదు. -
పాల్వయి మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్బ్రాంతి
హైదరాబాద్: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి హఠాన్మరణం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. పాల్వాయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. మరోవైపు పాల్వయి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంతాపం తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పాల్వాయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్టాండింగ్ కమిటీ సమావేశానికి పాల్వాయితోపాటు కులుమనాలి వెళ్లిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కేసీఆర్ ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్.... పాల్వాయి గోవర్దన్ రెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి ,సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే మనస్తత్వం గల పాల్వాయి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఆయన జీవితమంతా ప్రజా సేవకు అంకితం చేసారని అన్నారు. ఎనభై ఏళ్ళ వయసులో కూడా ఎంతో చురుకుగా కార్యక్రమాలలో పాల్గొనేవారన్నారు. పాల్వాయి ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని ,వారి కుటుంబ సభ్యులకు స్వామిగౌడ్ సానుభూతి తెలిపారు. కాగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పాల్వాయి గోవర్దన్ రెడ్డి పార్దీవ దేహాన్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించింది. అక్కడ పాల్వాయి అధికార నివాసంలో కొద్దిసేపు భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అక్కడే ఏఐసీసీ నాయకులు సంతాపం ప్రకటించి నివాళులు అర్పించనున్నారు. ఇవాళ రాత్రికి హైదరాబాద్కు తరలిస్తారు. -
దాసరి మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం
హైదరాబాద్ : ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. దాసరి మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని, అన్నారు. దశాబ్దాల పాటు దాసరి తెలుగు సినీ రంగానికి పెద్ద దిక్కుగా ఉన్నారని, సినిమా రంగంలో ఆయన ఒక యుగకర్త అని పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన మహా దర్శకుడిగా మాత్రమే కాకుండా, నటుడిగా, రచయితగా, నిర్మాతగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, పత్రికాధిపతిగా, మంచి మనిషిగా దాసరి ఎప్పటికీ చిరస్మరణీయులని వైఎస్ జగన్ అన్నారు. దాసరి తెలుగు సినిమా రంగంలతో ఒక విప్లవాన్ని సృష్టించారని, కథే హీరోగా ఆయన తిరుగులేని చిత్రాలను నిర్మించారని పేర్కొన్నారు. దాసరి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. Deeply saddened to know of the demise of Dasari NarayanaRao garu, an Indian cinema legend. Heartfelt condolences to his family members. — YS Jagan Mohan Reddy (@ysjagan) 30 May 2017 -
అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం
నారాయణ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా - సాంబశివుడి కుటుంబానికీ ప్రతిపక్ష నేత పరామర్శ సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘అధికార పార్టీ హత్యా రాజకీయాలకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి పోరాడుతూ నారాయణ రెడ్డి మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే హత్య చేశారు. మీరెవ్వరూ అధైర్యపడొద్దు. అండగా మేమున్నాము’’ అని చెరుకులపాడు నారాయణరెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసానిచ్చారు. నారాయణ రెడ్డి అమర్ రహే అనే నినాదాలు, భారీ జనసందోహం మధ్య నారాయణ రెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం చెరుకులపాడులో సోమవారం జరిగాయి. అంత్యక్రియలకు హాజరైన సందర్భంగా వారి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. ‘ఏం భయపడొద్దు అమ్మా నేనున్నాను’ అని నారాయణ రెడ్డి కూతురు స్నేహా రెడ్డికి ధైర్యం చెప్పారు. అన్నా మీరే మాకు దిక్కు అని కుమారుడు మోహన్ రెడ్డి.. జగన్ను పట్టుకుని భోరున విలపించారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోమ్మా అని నారాయణ రెడ్డి భార్య శ్రీదేవికి జగన్ ధైర్యం చెప్పారు. నారాయణ రెడ్డితో పాటు హత్యకు గురైన సాంబశివుడు కుటుంబాన్ని కూడా జగన్ ఈ సందర్భంగా పరామర్శించారు. భారీగా హాజరైన జనసందోహం: నారాయణరెడ్డి, సాంబశివుడుల మృతదేహలకు కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభించి 11 గంటలకు పూర్తి చేశారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పోలీసు బందోబస్తు మధ్య స్వగ్రామానికి తరలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్దకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. మృత దేహాంతో పాటు ప్రజలు నినాదాలు చేస్తూ చెరుకులపాడుకు తరలివెళ్లారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు ముగిశాయి. -
నారాయణరెడ్డికి వైఎస్ జగన్ ఘన నివాళి
-
నారాయణరెడ్డికి వైఎస్ జగన్ ఘన నివాళి
-
అవినాష్కు ఫోన్లో వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్ : మాజీమంత్రి దేవినేని నెహ్రూ మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. నెహ్రూ కుమారుడు అవినాష్తో ఆయన సోమవారం ఫోన్లో మాట్లాడారు. ఆ కుటుంబానికి వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా దేవినేని నెహ్రూ ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నెహ్రూ మృతికి సంతాపం తెలిపారు. రేపు ఆయన అంత్యక్రియలు విజయవాడలో జరగనున్నాయి. -
ఆప్తమిత్రుడిని కోల్పోయా: మోహన్ బాబు
హైదరాబాద్ : మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని నెహ్రూ మృతి పట్ల సీనియర్ నటుడు మోహన్ బాబు, బాలకృష్ణ సంతాపం తెలిపారు. గుండెపోటుతో దేవినేని నెహ్రూ ఈ రోజు ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. నెహ్రూ తన ఆప్తమిత్రుల్లో ఒకరని, ఆయన మృతి బాధాకరమన్నారు. షిర్డీ సాయిబాబా.. నెహ్రూ కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. అలాగే మంచు మనోజ్ కూడా నెహ్రూ మృతికి సంతాపం తెలిపారు. Devineni Nehru Garu 's sad demise is an irreparable loss to the politics. I will miss him! My most sincere condolences to the family. — Manoj Manchu ❤️ -
అగర్వాల్ మృతికి వైఎస్ జగన్ సంతాపం
‘దైనిక్ భాస్కర్’ రమేశ్ అగర్వాల్ అస్తమయం అహ్మదాబాద్: దేశంలో ప్రఖ్యాతిగాంచిన దైనిక్ భాస్కర్ గ్రూప్ చైర్మన్ రమేశ్ చంద్ర అగర్వాల్(73) బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. బుధవారం అహ్మదా బాద్కు విమానంలో చేరుకున్న ఆయనకు ఎయిర్పో ర్టులోనే గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను దగ్గర్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వైద్యులు స్పష్టంచేశారు. గురువారం సాయంత్రం భోపాల్లో అంత్యక్రియలు నిర్వహిస్తారని దైనిక్ భాస్కర్ గ్రూప్ సీనియర్ ఉద్యోగి ఒకరు చెప్పారు. అగర్వాల్ మరణవార్త తెలిసి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆస్పత్రిలో ఆయనకు నివాళులర్పించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ సైతం సంతాపం తెలిపారు. అగర్వాల్ మృతివార్త తెలిసి పత్రికావర్గాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రితో కలసి భోపాల్కు: 1944 నవంబర్ 30న ఝాన్సీలో జన్మించిన అగర్వాల్.. తండ్రి ద్వారకప్రసాద్ అగర్వాల్తో కలసి భోపాల్కు తరలివచ్చారు. 1958లో దైనిక్ భాస్కర్ వార్తాపత్రికను ప్రారంభించారు. అగర్వాల్ నేతృత్వంలో దైనిక్భాస్కర్ గ్రూప్ 14 రాష్ట్రాల్లో 62 ఎడిషన్లను పబ్లిష్ చేస్తోంది. సర్క్యులే షన్పరంగా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద వార్తాపత్రికగా రికార్డుల కెక్కింది. దైనిక్ భాస్కర్ చైర్మన్ మృతికి జగన్ సంతాపం సాక్షి, హైదరాబాద్: దైనిక్ భాస్కర్ గ్రూపు చైర్మన్ రమేష్ చంద్ర అగర్వాల్ మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అగర్వాల్ కుటుంబీకులకు జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
భూమా మృతికి వెంకయ్య సంతాపం
హైదరాబాద్: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం పట్ల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూమా కర్నూలు జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడని గుర్తు చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో భూమా సతీమణి శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం, ఆ విషాదం నుంచి కోలుకునే లోపే ఈ ఆకస్మిక పరిణామం చోటు చేసుకోవడం దురదృష్టకరమని ఆవేదన వెలిబుచ్చారు. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ఆ కుటుంబానికి ఇవ్వాలని కోరుకుంటూ, వారికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.