Rajasthan Road Accident Today: 6 Devotees Died And Many Injured In Road Incident - Sakshi
Sakshi News home page

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. ట్రాక్టర్‌-ట్రక్కు ఢీ.. భక్తుల దుర్మరణం.. ప్రధాని సంతాపం

Aug 20 2022 7:20 AM | Updated on Aug 20 2022 9:14 AM

Road Accident In Rajasthan PM Expresses Grief - Sakshi

ఆలయ దర్శనానికి ట్రాక్టర్‌లో వెళ్తు‍న్న భక్తులను ట్రక్కు రూపంలో మృత్యువు..

జైపూర్‌: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ట్రక్కు ఢీ కొట్టడంతో పలువురు మృతి చెందారు. జైసల్మేర్‌ రామ్‌దేవ్ర ఆలయానికి వెళ్తున్న క్రమంలో.. వేగంగా వస్తున్న ట్రక్కు.. ట్రాక్టర్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది.  

శుక్రవారం రాత్రి పాలి జిల్లా సుమేర్‌పూర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 25 మంది గాయపడ్డారు. గాయపడిన వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, కొన్ని ఆంబులెన్స్‌లు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఘటనపై ఉపరాష్ట్రపతి జగ్దీప్‌ ధన్‌కర్‌, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేస్తూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్లు చేశారు.

ఇదీ చదవండి: చిల్లర మాయం కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement