breaking news
Parliament disruption
-
నేపాల్లో మార్చి 5న ఎన్నికలు
కాఠ్మండు: సామాజిక మాధ్యమాలపై నిషేధం, అవినీతి, వారసత్వరాజకీయాలతో పెల్లుబికిన ప్రజాగ్రహం ధాటికి దగ్దమైన పార్లమెంట్, సుప్రీంకోర్టు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపర్వం పరిసమాప్తి తర్వాత ఎట్టకేలకు పూర్తికాల ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులుపడ్డాయి. వచ్చే ఏడాది మార్చి నెల ఐదో తేదీన పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ శనివారం ప్రకటన చేశారు. ‘‘ దేశం అత్యంత క్లిష్టమైన, భయానక దశను చవిచూసింది. ఇప్పుడు అంతా సద్దుమణిగింది. రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థలే మనల్ని కాపాడాయి. సమైక్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ముందుకు సాగుదాం. ఆరు నెలల్లోపు పార్లమెంట్ దిగువసభకు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించుకుని ప్రగతిశీల ప్రజాస్వామ్య పథంలో పయనించే అవకాశాన్ని ప్రజలకు కలి్పస్తున్నాం. సుస్థిరపాలనే లక్ష్యంగా తదుపరి ప్రభుత్వ ఏర్పాటు కోసం మార్చి ఐదో తేదీన ఎన్నికలు నిర్వహించబోతున్నాం. శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలి. విపక్ష పార్టీలు మొదలు విద్యారి్థలోకం, పౌరసమాజం అంతా ఈ ఎన్నికల క్రతువుకు తమ వంతు సాయం అందించాలి’’ అని శనివారం విడుదలచేసిన ఒక ప్రకటనలో అధ్యక్షుడు పౌడెల్ కోరారు. శుక్రవారం దేశ తాత్కాలిక మహిళా ప్రధానిగా పగ్గాలు చేపట్టిన వెంటనే సుశీల కర్కీ చేసిన సిఫార్సు మేరకు పార్లమెంట్ను రద్దుచేశారు. అవినీతి మురికికూపంలో పొర్లాడుతున్న ప్రభుత్వంపై విద్యార్థుల్లో గూడుకట్టుకున్న ఆగ్రహం.. హఠాత్తుగా సోషల్మీడియా యాప్ల నిషేధంతో కట్టలుతెంచుకున్న విషయం విదితమే. 24 శాఖలు ఆమె వద్దే ఆదివారం ప్రధా«ని కర్కీ తన తొలి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. శనివారం కర్ఫ్యూ ఎత్తివేశాక దేశవ్యాప్తంగా తాజా శాంతిభద్రతల పరిస్థితిపై ఆమె సమీక్ష జరిపే వీలుంది. పలువురు మంత్రులతో ఆమె దేశ, విదేశాంగ విధానాలపై చర్చించే అవకాశముంది. హోం శాఖ, విదేశీ వ్యవహారాలు, రక్షణశాఖ వంటి కీలక 24 శాఖలను ఆమె తన వద్దే అట్టిపెట్టుకోనున్నట్లు సమాచారం. కాఠ్మండులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలుండే సింగ్దర్బార్ కాంప్లెక్స్లో కొత్తగా నిర్మించిన హోం మంత్రిత్వ శాఖ భవనాన్ని ప్రస్తుతానికి ప్రధాని కార్యాలయంగా మార్చనున్నారు. ప్రధాని కార్యాలయాన్ని ఇటీవల ఆందోళనల్లో విద్యార్థి నిరసనకారులు తగలబెట్టడంతో కొత్త భవనంలోకి ఆఫీస్ను మార్చాల్సి వస్తోంది. మరోవైపు హింసాత్మక ఘటనల్లో గాయపడిన వారిని ప్రధాని పరామర్శించారు. కాఠ్మండులోని బనేశ్వర్లోని పౌర ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులతో ఆమె స్వయంగా మాట్లాడారు. తగు సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. పార్లమెంట్ ప్రస్తుత కాలపరిమితిని రద్దుచేసి ఎన్నికలు నిర్వహించాలన్న అధ్యక్షుడు నిర్ణయాన్ని ప్రధాన రాజకీయపార్టీలన్నీ తప్పుబట్టాయి. నేపాల్కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(యునిఫైడ్ మార్కిస్ట్ లెనినిస్ట్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(మావోయిస్ట్ సెంటర్)లు ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. రాజ్యాంగ విరుద్ధంగా కాలావధిని కాలరాయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని అన్నాయి. ఈ మేరకు దిగువసభలోని పార్టీల చీఫ్ విప్లు ఒక సంయుక్త ప్రకటనను విడుదలచేశాయి. దేశాధ్యక్షుడి చర్యలను తప్పుబట్టాయి.జస్టిస్ సుశీలకు మోదీ అభినందనలు ఇంఫాల్: నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సుశీల కరీ్కకి భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అభినందనలు తెలియజేశారు. ఆమె నియామకం మహిళా సాధికారతకు ఉజ్వలమైన ఉదాహరణ అని ప్రశంసించారు. మోదీ శనివారం మణిపూర్ సభలో మాట్లాడుతూ.. భారత్–నేపాల్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఇరుదేశాలు చరిత్ర, విశ్వాసం, సాంస్కృతి సంబంధాలను పంచుకుంటున్నాయని వివరించారు. -
శ్రీలంక పార్లమెంటు రద్దు
కొలంబో: శ్రీలంక పార్లమెంటును గడువు కన్నా 20 నెలల ముందుగానే పూర్తిగా రద్దు చేస్తూ ఆ దేశాధ్యక్షుడు సిరిసేన శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ప్రధానిగా విక్రమసింఘేను తప్పించి రాజపక్సను అధ్యక్షుడు నియమించడంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తడం తెల్సిందే. తర్వాత పార్లమెంటును ఈ నెల 16 వరకు తాత్కాలికంగా రద్దు చేస్తూ గతనెలలో సిరిసేన ఆదేశాలిచ్చారు. అధ్యక్షుడి తాజా నిర్ణయంతో శ్రీలంకలో జనవరి 5న ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత సంక్షోభాన్ని రూపుమాపేందుకు ప్రజాభిప్రాయాన్ని సేకరించాలన్న ప్రతిపాదనను పక్కనబెట్టిన సిరిసేన.. పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంటుకు వాస్తవానికి 2020 ఆగస్టు వరకు గడువుంది. దాదాపు 20 నెలల ముందుగానే సభ రద్దు కావడంతో జనవరి 5న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. -
ఆయన ఏం చెప్తారో చెప్పనివ్వండి!
న్యూఢిల్లీ: ఏ ఒక్కరి ఇష్టానుసారం ప్రజాస్వామ్యం పనిచేయబోదంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరోక్షంగా చేసిన విమర్శలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్పందించారు. 'ఆయన ఏం చెప్తారో చెప్పనివ్వండి' అంటూ మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుండటంతో ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొందరు తమకు ఇష్టం వచ్చింది, తోచింది చేయాలనుకుంటున్నారని, ఇలాగైతే దేశం నడుస్తుందా? అని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మోదీ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలపై సోనియా ప్రతిస్పందన వ్యక్తమైంది. ప్రతిపక్షాల నుంచి ప్రధాని ఏం కోరుకుంటున్నారో చెప్పాలని ఆమె అభిప్రాయపడ్డారు. మరాఠా రాజకీయ యోధుడు శరద్పవార్ 75వ పుట్టినరోజు వేడుకలో సోనియా, మోదీ ఒకే వేదిక పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రాహుల్తో మోదీ కరచాలనం చేశారు. సోనియాతో కూడా మర్యాదపూర్వకంగా ముచ్చటించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సోనియా ప్రతిస్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తుసేవల పన్ను (జీఎస్టీ) బిల్లును రాజ్యసభలో ఆమోదించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతును మోదీ ప్రభుత్వం కోరుతున్న సంగతి తెలిసిందే. -
ప్రధాని వ్యాఖ్యలను తప్పుపట్టిన పల్లం రాజు!
న్యూఢిల్లీ: సభా వ్యవహారాలపై ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యల్ని కేంద్ర మంత్రి పల్లం రాజు తప్పుపట్టారు. ప్రధాని వ్యాఖ్యలు సమంజసంగా లేవు అని పల్లం రాజు అన్నారు. ప్రస్తుత స్థితిలో ఉన్న బిల్లుతో ఖచ్చితంగా అన్యాయమే జరుగుతోంది. లోకసభలో బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ఎందుకు తొందరపడుతోందో అర్ధం కావడం లేదు అని పల్లం రాజు అన్నారు. తెలంగాణ బిల్లుతో సీమాంధ్రకు తీవ్రమైన అన్యాయం జరిగిందే భావన అన్నివర్గాల్లోనూ నెలకొని ఉంది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్యాయం జరుగుతుందనే కారణంతోనే రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు, కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా తుది పోరాటం చేయాల్సి వచ్చింది అని పల్లం రాజు అన్నారు. సభ సజావుగా జరిగేలా చూడాలని పలుమార్లు విజ్క్షప్తి చేసినా సభ్యులు వినిపించుకోకపోవడం చాలా దారుణం అని ప్రధాని మన్మోహన్ లోకసభలో వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తడం చాలా దురదృష్ణకరం అని ప్రధాని అన్నారు.