part 3
-
'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?
'పుష్ప 2' సినిమా ఒకటి రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లే టికెట్ సేల్స్, ఫ్యాన్స్ హడావుడి గట్టిగానే ఉంది. మరోవైపు 'పుష్ప 3' ఉంటుందా లేదా అనే విషయమై చాలా సందేహాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న ఓ ఫొటో అభిమానుల్ని ఇంకాస్త కన్ఫ్యూజన్ చేస్తోంది.(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)కొన్నిరోజుల క్రితం 'పుష్ప 3' ఉండొచ్చనే రూమర్స్ వచ్చాయి. తాజాగా హైదరాబాద్లో సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ మీ హీరో మరో మూడేళ్లు ఇస్తే పార్ట్-3 చేస్తానని బన్నీ ఫ్యాన్స్తో అన్నాడు. అంటే చూచాయిగా లేదని చెప్పాడు. ఒకవేళ చేయాలన్నా సరే ఇప్పట్లో అయితే కష్టం. ఎందుకంటే సుకుమార్.. నెక్స్ట్ రామ్ చరణ్తో పనిచేస్తాడు. బన్నీ కోసం త్రివిక్రమ్ వెయిటింగ్.ఇలా మూడో పార్ట్పై ఎవరి సందేహాలు వాళ్లకు ఉన్నాయి. ఇంతలో మూవీకి సౌండ్ ఇంజినీర్గా చేసిన రసూల్ పొకుట్టి తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిన విషయాన్ని చెప్పుకొచ్చాడు. కాకపోతే వెనక స్క్రీన్పై మాత్రం 'పుష్ప 3: ద ర్యాంపేజ్' అని ఉంది. ప్రస్తుతానికి మూడో భాగం గురించి కార్డ్ అయితే వేసేస్తారు కానీ ఇప్పట్లో అయితే చేయకపోవచ్చు అని తెలుస్తోంది. ఒకవేళ చేసినా సరే మరో మూడేళ్లు అంటే కష్టమేగా!(ఇదీ చదవండి: 'బిగ్బాస్' హౌస్లో ఉండలేను.. శోభా శెట్టి కన్నీళ్లు) -
స్పైడర్ మేన్ను దాటిన డెడ్ పూల్!
హాలీవుడ్ సూపర్ హీరోస్ ఫిల్మ్స్లో ‘డెడ్ పూల్’ ఫ్రాంచైజీ ఒకటి. 2016లో వచ్చిన ‘డెడ్ పూల్’, 2018లో వచ్చిన ‘డెడ్ పూల్ 2’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. ప్రేక్షకులను అమితంగా అలరించాయి. తాజాగా ‘డెడ్ పూల్’ సిరీస్లోని మూడో భాగం ‘డెడ్ పూల్ అండ్ వోల్వరైన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ర్యాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్మెన్ ప్రధాన పాత్రల్లో, ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ కీలక పాత్రల్లో నటించారు. షాన్ లెవీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జూలై 26న ‘డెడ్ పూల్ అండ్ వోల్వరైన్’ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 365 మిలియన్ వ్యూస్ను సాధించింది. 24 గంటల్లో ఇన్ని వ్యూస్ రావడంతో ఇదే ప్రపంచ రికార్డు అని మేకర్స్ పేర్కొన్నారని హాలీవుడ్ అంటోంది. గతంలో ఈ రికార్డు 2021లో విడుదలైన ‘స్పైడర్మేన్: నో వే హోమ్’ ట్రైలర్ పేరిట ఉండేది. 24 గంటల్లో ‘స్పైడర్ మేన్: నో వే హోమ్’ ట్రైలర్ 355.5 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పుడు ‘డెడ్ పూల్ అండ్ వోల్వరైన్’ ట్రైలర్ రాకతో ‘స్పైడర్మేన్: నో వే హోమ్’ సెకండ్ ప్లేస్లోకి వెళ్లింది. - పోడూరి నాగ ఆంజనేయులు -
ఫైటర్ హీరో!
బాలీవుడ్లో యాక్షన్ సన్నివేశాల స్టాండర్డ్ను సినిమా సినిమాతో పెంచుకుంటూ వెళ్తున్న యంగ్ హీరో టైగర్ ష్రాఫ్. యాక్షన్ సన్నివేశాలే ‘భాగీ’ సిరీస్ను బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలుపుతున్నాయి అనొచ్చు. తాజాగా ఈ సిరీస్లో మూడో పార్ట్ ‘భాగీ 3’తో సిద్ధమయ్యారు టైగర్. ఈ సినిమాలో స్టంట్స్ను సొంతంగా కంపోజ్ చేసుకుంటున్నారట టైగర్. ఆల్రెడీ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో టైగర్ ష్రాఫ్కు మంచి అనుభవం ఉంది. కానీ ‘భాగీ 3’ యాక్షన్ మరింత కొత్తగా ఉండటం కోసం కుంగ్ ఫూ, కిక్ బాక్సింగ్లో శిక్షణ పొందుతున్నారట. 2020 మార్చి 6న ‘భాగీ 3’ థియేటర్స్లోకి రానుంది. -
రాజమౌళి హింట్ ఇచ్చాడు..!
బాహుబలి ప్రస్తుతం ఇడియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న భారీ చిత్రం. ఉత్తరాది సినిమాలకు కూడా షాక్ ఇస్తూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది బాహుబలి. రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సీరీస్ లో మరో భాగం ఉంటుందన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. అయితే ఈ విషయంలో యూనిట్ సభ్యులు ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఒక సమయంలో బాహుబలి కథ ముగిసిందన్న రాజమౌళి, ఏదో ఒక రూపంలో బాహుబలి కొనసాగుతుందంటూ ట్విస్ట్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం లండన్ లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న జక్కన్న, అక్కడి బ్రిటీష్ ఫిలిం ఇన్సిస్టిట్యూట్ ను సందర్శించాడు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో మాట్లాడిన రాజమౌళి మరోసారి బాహుబలి పార్ట్ 3 పై ఆశలు కలిగించాడు. బాహుబలి 3 ఉంటుందా అని విద్యార్థులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా..' బాహుబలి 3 కోసం కథ రెడీగా లేకుండా ఆడియన్స్ ను మోసం చేయలేను. అదే సమయంలో నన్ను ఎగ్జైట్ చేసే ఐడియాతో నాన్నగారు(విజయేంద్ర ప్రసాద్) కథ రెడీ చేస్తే బాహుబలి 3 గురించి ఆలొచిస్తా' అంటూ సమాధానం ఇచ్చాడు. -
’పీపుల్స్ స్టార్ ’తో ' ఇంటర్వ్యూ పార్ట్ 2
-
’పీపుల్స్ స్టార్ ’తో ఇంటర్వ్యూ పార్ట్ 3