penamaluru police
-
చోరీ కేసులో నిందితుడి ఆత్మహత్య
-
చోరీ కేసులో నిందితుడి ఆత్మహత్య
విజయవాడ: కృష్ణా జిల్లాలోని విజయవాడలో చోరీ కేసులో నిందితుడైన రమేష్ అనే వ్యక్తి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చోరీ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకునేందుకు పెనమలూరు పోలీసులు యత్నించగా రమేష్ ఈ బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. అయితే పోలీస్ స్టేషన్లోనే రమేష్ మృతిచెందడంటూ అతని తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. అతడి మృతికి నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు వారు ఆందోళనకు దిగినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
బాల కార్మికుడిపై దాష్టీకం!
విజయవాడ: ఓ బాల కార్మికుడిపై వైన్ షాపు యజమానితోపాటు పోలీసులు కూడా దాష్టీకం ప్రదర్శించారు. కంకిపాడులోని వైన్ షాపులో ఓ బాల కార్మికుడు పని చేస్తున్నాడు. ఆ షాపులో 50 వేల రూపాయలు ఎవరో చోరీ చేశారు. షాపు నిర్వాహకుడు నాగేశ్వర రావు బాల కార్మికుడిని అనుమానించాడు. చిన్న పిల్లవాడని కూడా చూడకుండా దారుణంగా చితకబాదాడు. ఆ తరువాత ఆ బాల కార్మికుడిని నాగేశ్వర రావు పెనమలూరు పోలీసులకు అప్పగించాడు. చివరకు పోలీసులు కూడా దయా దాక్షిణ్యం లేకుండా ఆ బాలుడిని చితకబాదారు. బాలుడి తల్లిదండ్రులు లేబర్ కమిషన్ను ఆశ్రయించారు. వాళ్లు ఏం చేస్తారో చూడాలి. **