విజయవాడ: కృష్ణా జిల్లాలోని విజయవాడలో చోరీ కేసులో నిందితుడైన రమేష్ అనే వ్యక్తి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చోరీ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకునేందుకు పెనమలూరు పోలీసులు యత్నించగా రమేష్ ఈ బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
అయితే పోలీస్ స్టేషన్లోనే రమేష్ మృతిచెందడంటూ అతని తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. అతడి మృతికి నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు వారు ఆందోళనకు దిగినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
చోరీ కేసులో నిందితుడి ఆత్మహత్య
Published Wed, Feb 11 2015 9:29 AM | Last Updated on Sat, Aug 11 2018 6:04 PM
Advertisement
Advertisement