విజయవాడ: ఓ బాల కార్మికుడిపై వైన్ షాపు యజమానితోపాటు పోలీసులు కూడా దాష్టీకం ప్రదర్శించారు. కంకిపాడులోని వైన్ షాపులో ఓ బాల కార్మికుడు పని చేస్తున్నాడు. ఆ షాపులో 50 వేల రూపాయలు ఎవరో చోరీ చేశారు. షాపు నిర్వాహకుడు నాగేశ్వర రావు బాల కార్మికుడిని అనుమానించాడు. చిన్న పిల్లవాడని కూడా చూడకుండా దారుణంగా చితకబాదాడు.
ఆ తరువాత ఆ బాల కార్మికుడిని నాగేశ్వర రావు పెనమలూరు పోలీసులకు అప్పగించాడు. చివరకు పోలీసులు కూడా దయా దాక్షిణ్యం లేకుండా ఆ బాలుడిని చితకబాదారు. బాలుడి తల్లిదండ్రులు లేబర్ కమిషన్ను ఆశ్రయించారు. వాళ్లు ఏం చేస్తారో చూడాలి.
**
బాల కార్మికుడిపై దాష్టీకం!
Published Thu, Oct 30 2014 2:43 PM | Last Updated on Sat, Sep 2 2017 3:37 PM
Advertisement
Advertisement