breaking news
Petra Laszlo
-
రాతిపై చెక్కిన అద్భుతం..!
జోర్డాన్లోని పెట్రా నగరం– పర్యాటకుల్ని ఆకర్షించే పురాతన, చారిత్రక ప్రాంతం! దీనిని నబేటియన్ తెగవారు సుమారు 2 వేల సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ నగరం మొత్తం ఎర్రటి ఇసుకరాతి పర్వతాలను తొలిచి నిర్మించడంతో ఈ ప్రదేశమంతా చాలా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. పెట్రా ప్రధాన మార్గంలో ఉండే ‘అల్–ఖజ్నే’ అనేది ఇక్కడున్న అతిపెద్ద కట్టడాల్లో ఒకటి. ఇక్కడున్న సిక్ అనే పొడవైన, ఇరుకైన లోయ గుండా వెళితేనే పెట్రా నగరంలోకి ప్రవేశించగలం. అలాగే ఇక్కడ కొన్ని భారీ రాతి సమాధులు ఉంటాయి. వాటిని ‘రాయల్ టూంబ్స్’ అంటారు. అవి నబేటియన్ల కళా నైపుణ్యానికి నిదర్శనం. భూకంపాలు, వర్తక మార్గాల మార్పులతో ఈ నగరం దాదాపు వెయ్యి సంవత్సరాలు మరుగునపడింది. తిరిగి 1812లో దీనిని కనుగొన్నారు. ఈ అద్భుతమైన నగరం ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది.ప్రతిభకు సంబరాలు! హెల్సింకీ ఫెస్టివల్ – ఇది ఫిలండ్లోని అతిపెద్ద మల్టీ–ఆర్ట్ ఫెస్టివల్! ఇది హెల్సింకీ నగరంలో జరుగుతుంది. ఈ నెల 15 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలను సెప్టెంబర్ 1 వరకు నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్లో సంగీతం, డ్యాన్స్, విజువల్ ఆర్ట్స్, సినిమా వంటి వివిధ కళా రూపాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి దేశీయ, అంతర్జాతీయ కళాకారులను, ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఈ ఫెస్టివల్లో ప్రతి ఒక్కరికీ నచ్చేలా అనేక కార్యక్రమాలు ఉంటాయి. క్లాసికల్ సంగీతం దగ్గర నుంచి పాప్, రాక్ వంటి ఆధునిక సంగీతం వరకు వివిధ శైలులలో ప్రదర్శనలు జరుగుతాయి.అంతర్జాతీయంగా పేరు పొందిన ప్రముఖ బ్యాండ్లు ఈ ఫెస్టివల్లో పాల్గొంటాయి. థియేటర్ ప్రదర్శనలు, నత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అంతర్జాతీయ బందాలు తమ అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరిస్తాయి. ఫెస్టివల్లో భాగంగా నగరంలోని వివిధ గ్యాలరీలలో విజువల్ ఆర్ట్స్ ప్రదర్శనలు జరుగుతాయి. ఇది స్థానిక, అంతర్జాతీయ కళాకారులకు తమ సజనాత్మకతను ప్రదర్శించడానికి మంచి అవకాశం.ఓపెన్–ఎయిర్ సినిమా ప్రదర్శనలు, సాహిత్యం ఈ ఫెస్టివల్లో భాగంగా ఉంటాయి. హెల్సింకీ ఫెస్టివల్లో అత్యంత ముఖ్యమైన, విశేషమైన భాగం నైట్ ఆఫ్ ది ఆర్ట్స్. ఇది ఈ పదిహేను రోజుల్లో ఒకే రోజు జరుగుతుంది. ఆ రోజున హెల్సింకీ నగరం కళల వెలుగులతో నిండిపోతుంది. మ్యూజియమ్లు, గ్యాలరీలు, థియేటర్లు, బుక్షాప్లు రాత్రి పొడవునా తెరిచి ఉంటాయి. ప్రజలు వీథుల్లో కళా ప్రదర్శనలను, ప్రత్యక్ష సంగీత కచేరీలను ఉచితంగా ఆస్వాదిస్తారు.(చదవండి: స్క్రీన్ అడిక్షన్ హద్దుల్లేకుంటే ఇక్కట్లు తప్పవు) -
ఆ మహిళా జర్నలిస్టుపై వేటు
-
ఆ మహిళా జర్నలిస్టుపై వేటు
శరణార్థుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన హంగేరీ మహిళా వీడియో జర్నలిస్టు పెట్రా లాజ్లోపై వేటు పడింది. ఆమెపై కోర్టు మూడేళ్ల ప్రొబెషన్ బాన్ విధించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన జెజెడ్ పట్టణ న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. శరణార్థుల పట్ల పెట్రా లాజ్లో ఉద్దేశపూర్వకంగా అవమానవీయంగా ప్రవర్తించిందని కోర్టు తేల్చింది. వీడియో లింకు ద్వారా ఆమె తన వాదనలను కోర్టుకు వినిపించారు. అయితే శరణార్థులపై పెట్రా లాజ్లో జాతివివక్షతో దాడి చేయాలని ఆమె తరపు న్యాయవాదులు వాదించారు. సెర్బియా-హంగరీ సరిహద్దులోని రోజ్కే గ్రామంలో 2015, సెప్టెంబర్ లో శరణార్థుల పట్ల పెట్రా లాజ్లో ప్రవర్తించిన తీరు లోకానికి వెల్లడికావడంతో ఆమె తీవ్ర విమర్శలకు గురయ్యారు. మధ్యదరా సముద్రాన్ని దాటి సెర్బియా గుండా హంగరీలోకి ప్రవేశించిన శరణార్థులకు కాళ్లు అడ్డంపెట్టి పడేసింది. వీరిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. శరణార్థులను హింసించిన దృశ్యాలు బయటకు రావడంతో ఎన్1 టీవీ యాజమాన్యం ఆమెను డిస్మిస్ చేసింది. ఉద్యోగ బాధ్యతలు వదిలిపెట్టి జాత్యంహకారంతో ప్రవర్తించినందుకు ఆమె కోర్టు విచారణ ఎదుర్కొవాల్సి వచ్చింది. కోర్టు తీర్పును అప్పీలు చేస్తానని పెట్రా లాజ్లో తెలిపింది. -
మహిళా జర్నలిస్ట్ పైశాచికం
-
మహిళా జర్నలిస్ట్ పైశాచికం
మానవత్వం: నిలుఫర్ డెమిర్.. అలలపై నిద్రిస్తున్నట్లుగా చనిపోయిన అయలన్ కుర్దీ పొటోను తీసి, శరణార్థుల సంక్షోభాన్ని తాత్కాలికంగానైనా నిరోధించిన ధీరోదాత్త మహిళా జర్నలిస్ట్ కమ్ ఫొటోగ్రాఫర్. పైశాచికం: పెట్రా లాజ్లో.. ఎన్1 టీవీ అనే ఛానెల్ లో వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్న ఈమె.. కుర్దీ చావుతో తెరుచుకున్న యూరప్ మార్గాల గుండా కొత్త లోకంలోకి ప్రవేశిస్తున్న.. దాదాపు కుర్దీ వయసే ఉన్న చిన్నారులపై తన పైశాచికాన్ని ప్రదర్శించింది. భయంతో పరుగుపెట్టిన పిల్లలకు కాళ్లు అడ్డంగా పెట్టి కిందపడేలా చేసింది. బ్యాగ్రౌండ్: అది సెర్బియా- హంగరీ సరిహద్దులోని రోజ్కే గ్రామం. మధ్యదరా సముద్రాన్ని దాటి సెర్బియా గుండా హంగరీలోకి ప్రవేశించే సిరియా శరణార్థులను తనిఖీ చేసే ప్రదేశం. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తనిఖీల కోసం బిలబిలమంటూ శరణార్థులు పరుగుపెట్టారు. వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అలా పరుగెడుతూ తన దగ్గర్నుంచి వెళుతున్న వారికి కాళ్లు అడ్డంపెట్టి పడేసింది పెట్రా లాజ్లో. నిజానికి ఆమె అక్కడికొచ్చింది శరణార్థుల బాధలు షూట్ చేయడానికి! టీవీల్లో ప్రసారం: అలా పెట్రా శరణార్థులను హింసించిన దృశ్యాలు వేరొక ఛానెల్ కు చెందిన కెమెరాకు చిక్కాయి. గత మంగళవారం ప్రసారమైన కార్యక్రమంలో పెట్రా పైశాచికాన్ని ప్రపంచమంతా వీక్షించింది. దీంతో ఆమెను డిస్మిస్ చేయక తప్పలేదు.. ఎన్1 టీవీ యాజమాన్యానికి.