16, 18 తేదీల్లో ప్రీ పీహెచ్డీ పరీక్షలు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో ప్రీ పీహెచ్డీ పరీక్షలు ఈనెల 16, 18వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.పురుషోత్తం, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ వి.రాంచంద్రం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. హ్యూమనిటీస్ భవనంలో మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని, అభ్యర్థులు గమనించాలని వారు సూచించారు.