Press Academy chairman Allam Narayana
-
జర్నలిస్టులందరికీ హెల్త్కార్డులు
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నిజామాబాద్ సిటీ: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బస్వాగార్డెన్లో నిర్వహించిన తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ (టీఈఎంజేయూ) జిల్లా మహాసభలో ఆయన ప్రసంగించారు. జర్నలిస్టులందరికీ హెల్త్కార్డులు వస్తాయన్నారు. రాను న్న రోజుల్లో యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించి తాను తప్పుకుంటానని, అప్పటివరకు మీ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పారు. ఎమ్మెల్సీలు వి.గంగాధర్గౌడ్, డాక్టర్ భూపతిరెడ్డి, టీఈఎం జేయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి, ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్, జమల్పూర్ గణేశ్, మధుసూదన్రావు, కోశాధికారి సాగర్, రాష్ట్ర నాయకులు శివాజీ, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బాలార్జున్గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. టీఈఎంజేయూ జిల్లా నూతన కమిటీ తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియ న్ జిల్లా కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధా న కార్యదర్శిగా రవీందర్గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా భాస్కర్, కోశాధికారిగా కిషోర్, ఉపాధ్యక్షులుగా ఆంజనేయులు, రాము, హరీశ్, రామకృష్ణ, ఆనంద్పాల్, నవీన్, యూనస్, సతీశ్, అనిల్, వజి య్, తారాచంద్, సహాయ కార్యదర్శులుగా నాందేవ్, మురళి, కృష్ణాచారి, సతీష్గౌడ్, తారాచాంద్, బస్వారాజు, సదానంద్, శ్రీనివాస్, సయ్యద్ జకీర్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా మధుసూదన్రెడ్డి, గోపాల్, సాయి, రమేశ్, నవీన్, అర్షద్, రాము, శ్రీనివాస్రెడ్డి, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా వేణు, ప్రమోద్, నవీన్, విజయ్, అఫ్సర్, శ్రీనివాస్, నవీన్, కిషోర్ నియమితులయ్యారు. -
అక్రెడిటేషన్ల కమిటీని రద్దు చేయాలి
హైకోర్టులో పిటిషన్ ప్రభుత్వానికి నోటీసులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాత్రికేయులకు అక్రెడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా, కార్డుల జారీకి నేరుగా రాష్ట్రస్థాయి మీడియా అక్రెడిటేషన్ల కమిటీ (ఎస్ఎల్ఏసీ)ని ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన హైకోర్టు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సమాచార శాఖ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘ప్రభుత్వం ఎలాంటి నిబంధనలను, మార్గదర్శకాలను రూపొందించకుండానే అక్రెడిటేషన్ల జారీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో రాష్ట్రస్థాయి మీడియా అక్రెడిటేషన్ల కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో 197 జారీ చేసింది. ఈ కమిటీ ఇష్టానుసారం అక్రెడిటేషన్లను జారీ చేస్తోంది. కాబట్టి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి’ అని పిటిషనర్ షేక్ ఖాసీం కోరారు. -
మూడు విడతల్లో అక్రెడిటేషన్ కార్డులు
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ 3 విడతల్లో అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మ న్, రాష్ట్రస్థాయి మీడియా అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. మొద టి విడతలో ఇప్పటికే అక్రెడిటేషన్ కార్డులున్న జర్నలిస్టులకు ఈ నెలాఖరులోగా అందిస్తామ న్నారు. రెండు, మూడో విడత కార్డులను త్వర లో ఇస్తామన్నారు. సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ నివేదికకు అనుగుణంగా మూడో విడతలో డెస్క్ జర్నలిస్టులకు కార్డులు ఇస్తా మన్నారు. బుధవారం సమాచార, పౌరసంబంధాల శాఖ డెరైక్టర్ వి.సుభాష్, అక్రెడిటేషన్ కమిటీ సభ్యులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.