Radio Mirchi
-
దిగ్గజ ఎఫ్ఎమ్ సంస్థను కొనుగోలు చేయనున్న కంపెనీలు ఇవేనా..
ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ ఇండియా లిమిటెడ్ (ఈఎన్ఐఎల్)లో భాగంగా ఉన్న రేడియో మిర్చితో పాటు రేడియో ఆరెంజ్... బిగ్ ఎఫ్ఎమ్ రేడియో నెట్వర్క్ను కొనుగోలు చేసేందుకు రూ.251 కోట్ల చొప్పున బిడ్ వేశాయని సమాచారం. దివాలా ప్రక్రియలో ఉన్న బిగ్ ఎఫ్ఎమ్ రేసులో హర్యానాకు చెందిన సఫైర్ ఎఫ్ఎమ్ కూడా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సఫైర్ ఎఫ్ఎమ్ కూడా బిగ్ ఎఫ్ఎమ్ కోసం రూ.251 కోట్ల రూపాయల బిడ్ వేసింది. రేడియో మిర్చి, ఆరెంజ్ ఎఫ్ఎమ్ , సఫైర్ ఎఫ్ఎమ్ల బిడ్ మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లిస్తామని ప్రకటించాయి. తమ బిడ్ల విలువను మరింత పెంచాలని లెండర్లు అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కంపెనీ ఖాతాల్లో ఉన్న రూ.60 కోట్ల నగదు కూడా లెండర్లకే వెళ్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బిగ్ ఎఫ్ఎం ఖాతాల్లోని నగదును లెక్కలోకి తీసుకున్న తర్వాత, లెండర్లకు ఇంకా రూ. 578 కోట్లు రావాలి. ఇది దేశంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్. 1,200 పట్టణాలకు, 50 వేలకుపైగా గ్రామాలకు ప్రసారాలను అందిస్తోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు దివాలా ప్రక్రియకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఇంకా బిగ్ఎఫ్ఎమ్ సంస్థ ఈ అంశంపై స్పందించాల్సి ఉంది. -
మత్ ఆవో ఇండియా.. మిర్చిపై గుస్సా!
సాక్షి, న్యూఢిల్లీ : రేడియో మిర్చి ఎఫ్ఎం రేడియో ఛానెల్ ఈ మధ్య నిర్వహించిన మత్ ఆవో ఇండియా ప్రచారంపై కేంద్ర సమాచార శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఛానెల్ యాజమాన్యానికి నోటీసులు పంపింది. స్విస్ జంటపై దాడి అనంతరం భారత్కు రావొద్దని విదేశీ పర్యాటకులకు సూచిస్తూ మత్ ఆవో ఇండియా పేరిట సోషల్ మీడియాలో రేడియో మిర్చి ప్రచారం నిర్వహించింది. తొలుత కాస్త మంచి స్పందన వచ్చినట్లు కనిపించినప్పటికీ.. రాను రాను తీవ్ర విమర్శలు చెలరేగాయి. దేశ గౌరవాన్ని కించపరిచేలా ఉందంటూ రేడియో మిర్చిపై మండిపడ్డారు. వెనక్కితగ్గి చివరకు క్షమాపణలు కూడా తెలియజేసింది. అయినప్పటికీ కేంద్రం మాత్రం కనికరించలేదు. ప్రసారాల చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించటం.. దేశ ఖ్యాతికి భంగం కలిగించటంతోపాటు విదేశీ టూరిస్టులను నిరుత్సాహపరిచేలా ఈ ఉద్యమం నిర్వహించారంటూ పేర్కొంది. పదిహేను రోజుల్లోగా స్పందించాలంటూ నోటీసుల్లో పేర్కొంది. వివరణ స్పష్టంగా లేకపోతే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ నోటీసులు అక్టోబర్ 27నే అందినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఆగ్రహంతో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో అమీర్ ఖాన్ అతిథి దేవోభవ విషయంలో కూడా ఇంచు మించు ఇలాంటి విమర్శలే వినిపించిన విషయం తెలిసిందే. రేడియో మిర్చి మత్ ఆవో ఇండియా సారాంశం (ఆంగ్లంలో)... -
'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' సాంగ్ లాంచ్
-
ముసిముసి నవ్వుల ముమైత్..
-
కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్ర బృందం సందడి
విశాఖ-కల్చరల్: కృష్ణగాడి వీరప్రేమ గాధ టీమ్ రేడియో మిర్చిలో సందడి చేశారు. ఈ చిత్రం విజయోత్సవ యాత్రని పురస్కరించుకొని మంగళవారం నగరంలో యూనిట్ బృందం పర్యటించారు. హీరో నాని ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని డెరైక్టర్ హాను చాలా బాగా తీశారని, ప్రతి ఒక్క అంశంలో తన శైలిలో ప్రత్యేకత కనిపించే విధంగా చిత్రీకరించారని తెలిపారు. ఈ సినిమా విజయానికి ఆయనే ప్రధాన కారణమని చెప్పారు. విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని, విశాఖవాసులు తన సినిమాను తప్పక ఆదరిస్తారనిధీమావ్యక్తంచేశారు.అనంతరం శ్రోతలతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో చిత్ర బృందంతోపాటు మయగాడు ఫేమ్ కావ్య, అవిలు పాల్గొన్నారు. -
జైలులో..భలే మంచి రోజు
హీరో సుధీర్ బాబు, దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, హాస్య నటుడు వేణులను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి తోశారు. అయ్యో అంత పని ఏం చేశారు వాళ్లు అనుకుంటున్నారా..? అసలు విషయమేమిటంటే.. అనాథ పిల్లలు న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలనే సదుద్దేశంతో ఎఫ్ఎం రేడియో మిర్చి శనివారం కూకట్పల్లిలోని మంజీరా మాల్లో ‘ఫండ్ రైజింగ్’ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన జైలు లాంటి సెట్లో ఆర్జే సమీర్ బందీ అయ్యారు. సదుద్దేశంతో అతను చేసిన ఈ సత్కార్యానికి తమ వంతు సహకారమందించాలని ‘భలే మంచి రోజు’ చిత్ర బృందం భావించింది. అందుకే సుధీర్బాబు, శ్రీరామ్ ఆదిత్య, వేణు మంజీరా మాల్కు వచ్చారు. జైలు లాంటి ఆ సెట్లో తమను తాము బంధించుకున్నారు. అనాథ పిల్లలకు అవసరమయ్యే ఫండ్ సమకూరే వరకూ బందీలుగానే ఉన్నారు. ‘ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించి, మానవత్వాన్ని చాటుకోవాల’ని సుధీర్బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జే హేమంత్, ప్రోగ్రామింగ్ హెడ్ సాయి తదితరులు పాల్గొన్నారు. -
టీవీ టుడే ఓయే ఎఫ్ఎం
స్టేషన్ల విక్రయం న్యూఢిల్లీ: టీవీ టుడేకు చెందిన ఏడు ఓయే ఎఫ్ఎం రేడియో స్టేషన్లను ప్రముఖ ఎఫ్ఎం రేడియో సంస్థ, రేడియో మిర్చి కొనుగోలు చేసింది. అయితే ఈ డీల్కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఇరు కంపెనీలు వెల్లడించలేదు. బెనెట్ కోల్మన్, అండ్ కంపెనీ ప్రమోట్ చేసిన ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ఇండియా(ఈఎన్ఐఎల్) రేడియో మిర్చిని నిర్వహిస్తోంది. బెనెట్ కోల్మన్ సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్, నవభారత్ టైమ్స్ వంటి పత్రికలను, టైమ్స్ నౌ, ఈటీ నౌ తదితర టీవీ చానెళ్లను నిర్వహిస్తోంది. ఓయే ఎఫ్ఎం రేడియో స్టేషన్లను ఇండియా టుడే గ్రూప్ నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఓయే ఎఫ్ఎం స్టేషన్లను ముంబై, ఢిల్లీ, కోల్కత, అమృత్సర్, జోధ్పూర్, పాటియాల, సిమ్లాల్లో నడుపుతోంది. రేడియో మిర్చి ఎఫ్ఎం రేడియో సర్వీసులు ముంబై, ఢిల్లీ, కోల్కత వంటి 32 నగరాల్లో నడుస్తున్నాయి. రేడియో స్టేషన్లను విక్రయించడం ఇండియా టుడే గ్రూప్కు ఇది రెండోసారి. 2006లో రెడ్ ఎఫ్ఎం రేడియో స్టేషన్లను ఎన్డీటీవీకి విక్రయించింది. -
రేడియో మిర్చి కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్
-
మారదామనే అనుకున్నాను కానీ...
సన్నని గొంతుతో, విచిత్రమైన డైలాగ్ డెలివరీతో అందరినీ హాయిగా నవ్వించేస్తాడు చంటి. అయితే ఆ కామెడీ అంతా తెర వరకే పరిమితం. తెర వెనుక అతడి మాటల్లో ఆవేశం ఉప్పొంగుతుంది. ఆవేదన కదలాడుతుంది. తన కామెడీతో కడుపుబ్బ నవ్వించే చంటిలో ఉన్న మరో కోణమిది... కళారంగంవైపు ఎలా వచ్చారు? నా అసలు పేరు వినయ్ మోహన్. మాది హైదరాబాద్. చిన్నప్పట్నుంచీ కళల పట్ల మక్కువ ఎక్కువ. కల్చరల్ యాక్టివిటీస్ అంటే చాలు... ముందుండేవాణ్ని. ముందుండి నడిపించేవాణ్ని. ఏడో తరగతి చదువుతున్నప్పుడు మా స్కూల్ యాన్యువల్ డేకి నటి ఊహ అతిథిగా వచ్చారు. ఆవిడ స్టేజి మీదికి వచ్చేవరకూ అందరూ నేను చెప్పినట్టే విన్నారు. కానీ ఊహ స్టేజి ఎక్కగానే నన్ను పట్టించుకోవడమే మానేశారు. అప్పుడర్థమైంది... స్టేజిమీదికి వెళ్లేవారికి ఉండే గౌరవం ఏమిటో. నేనూ స్టేజి ఎక్కాలి, అందరి దృష్టీ నామీదే ఉండాలి. అలా జరగాలంటే ఊహగారిలాగా నేను కూడా సినిమాల్లోకి వెళ్లాలి అనుకున్నాను. అప్పుడు మొదలైంది తపన! వెంటనే ప్రయత్నాలు మొదలెట్టారా? అనుకోగానే అన్నీ చేసెయ్యలేం కదా! చదువుకుంటూనే మిమిక్రీ ప్రోగ్రాములు చేస్తుండేవాడిని. కానీ డిగ్రీకి వచ్చాక ఇక చదువు ఎక్కదని అర్థమైపోయింది. అందుకే ఫుల్స్టాప్ పెట్టేశాను. రకరకాల పనులు చేసి చివరకు ఓ గెస్ట్ హౌస్కి మేనేజర్గా చేరాను. అక్కడికి ఓసారి కొందరు వచ్చారు. వాళ్ల మాటల ద్వారా హైదరాబాద్లో రేడియో మిర్చిని ప్రారంభించబోతున్నారని తెలిసింది. నాకూ అవకాశమివ్వమని అడిగాను. ఆడిషన్లూ అయ్యీ అయ్యాక... యతిరాతి భూపాల్గారని, రచయిత... ఆయన ‘చంటి-బంటి’ షోలో చంటిగా నన్ను ఎంపిక చేశారు. ఇంతకీ సినిమాల్లోకి ఎలా వచ్చారు? అదీ భూపాల్గారి చలవే. తాను రచన చేసిన ‘జల్లు’ అనే సినిమాలో నాకో చాన్స్ ఇప్పించారాయన. ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత ‘భీమిలి కబడ్డీ జట్టు’లో చాన్స్ వచ్చింది. అది హిట్ అవడంతో నా గురించి అందరికీ తెలిసింది. కానీ తక్కువ సినిమాలే చేసినట్టున్నారు? అవును. అవకాశాలు రావట్లేదు. ఒకప్పుడు అదృష్టం ఉంటే వచ్చేవి. తర్వాత లాటరీ కొట్టినట్టు అనుకోకుండా వచ్చేవి. ఇప్పుడు పరిచయాలు ఉంటే వస్తున్నాయి. టీవీ షోల వల్ల నేను పాపులరయ్యాను.కాస్త డబ్బులు సంపాదించుకున్నాను. కానీ ఇలాంటి కార్యక్రమాల వల్ల చెడూ జరుగుతుంది. ఎంతోమంది నటీనటులు వచ్చేస్తున్నారు. స్టేజి ఎక్కిన ప్రతి ఒక్కరూ గొప్ప నటులమే అనుకుంటున్నారు. ఆప్షన్స్ ఎక్కు వైనప్పుడు ఆఫర్ చేసేవాడు కూడా కన్ఫ్యూజ్ అవుతాడు. ఎవడు తక్కువకొస్తే వాడినే తీసుకుంటాడు. దానివల్ల నిజంగా ప్రతిభ ఉన్నవాళ్లు నష్టపోతున్నారు. అంటే మీకు పెద్దగా పరిచయాలు లేవా? ఉన్నా నాలాంటి వాడికి అవకాశాలు తక్కువే వస్తాయి. ఎందుకంటే నేను చాలా ముక్కుసూటి మనిషిని. తేడా ఉన్నా, తప్పు జరిగినా ముఖమ్మీదే మాట్లాడతాను. అది ఎవరికీ నచ్చదు. మాట్లాడినప్పుడు సూపర్ అంటారు. తర్వాత పక్కకు వెళ్లి నా గురించి చెడుగా మాట్లాడతారు. నాలాంటి వాడు ఇండస్ట్రీకి నచ్చడు. అది తెలిసీ ఎందుకలా ఉండటం? నేనూ మారదామనుకున్నాను. కానీ మారితే అవకాశాలు వస్తాయని గ్యారంటీ ఉందా? లేనప్పుడు నేను చేసేది కరెక్ట్ అని తెలిసీ ఎందుకు నా వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి? అవకాశాల కోసం భజనలు చేయడం, కాకా పట్టడం నేను చేయలేను. ఒకరి అవకాశాలు మరొకరికి వెళ్లడం కూడా జరుగుతుందా? జరుగుతుందనే అనిపిస్తుంటుంది. ఓ పాత్ర ఆఫర్ చేస్తారు. రెమ్యునరేషన్, డేట్లు అన్నీ మాట్లాడేసుకున్న తర్వాత కిక్కురుమనరు. ఆరాతీస్తే ఆ పాత్ర మరెవరో చేస్తున్నారని తెలుస్తుంది. దానికి వంద కారణాలు ఉండొచ్చు. నా కంటే తక్కువ రెమ్యురేషన్కి అతడు దొరికి ఉండొచ్చు, నాకంటే బాగా తెలిసినవాడై ఉండొచ్చు. కారణం ఏదైనా నాకు మాత్రం బాధే కదా! చాలా ఆవేదనతో ఉన్నట్టున్నారు...? ఆవేదన ఉండదా?! నేను నా సీనియర్లను గౌరవిస్తాను. కానీ నా జూనియర్లు నన్ను గౌరవించరు. ఎందుకంటే నా చేతిలో చాన్సుల్లేవు కాబట్టి. చాలాసార్లు అనిపిస్తుంది వెళ్లిపోదామని. కానీ నటనంటే పిచ్చి.. అందుకే వెళ్లలేకపోతున్నాను. ఇంతకీ మీకు పెళ్లయ్యిందా? ఇంకా లేదు. నేను చాలా పెద్దవాడినని అనుకుంటారంతా. కానీ నా వయసు ముప్ఫై దాటలేదు. ఆ విషయం చెప్పినా నమ్మరెందుకో. దానికితోడు కమెడియన్ అంటే అందరికీ కామెడీనే. ఓ అమ్మాయి దగ్గరకు వెళ్లి ‘మీరు నాకు చాలా నచ్చారు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉంది’ అన్నాను. ‘మీరు భలే కామెడీ చేస్తారండీ’ అంది. మేము నవ్వినా, ఏడ్చినా, ప్రేమించినా కామెడీయే అనుకుంటే ఏం చేస్తాం! అయితే అమ్మాయి దొరకలేదన్నమాట... సినిమా వాళ్లకు పిల్ల దొరకడం అంటే ఎవరెస్ట్ ఎక్కినట్టే. సినిమా టిక్కెట్లు కావలిస్తే మమ్మల్ని అడుగుతారు. తమకూ కాస్త క్రేజ్ పెరుగుతుందని పబ్బులకీ ఫంక్షన్లకీ తీసుకెళ్తారు. వాళ్ల పనులకి మేం కావాలి. కానీ వాళ్ల పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి మాత్రం మేం పనికి రాం. సినిమావాళ్లు తాగుతారు, తిరుగుతారు అంటూ చిట్టా వినిపిస్తారు. ఇంకెలా దొరుకుతుంది పిల్ల! చూద్దాం. పైవాడు ఎవర్నో రాసిపెట్టి ఉంటాడు కదా... ఆమె ఎదురుపడినప్పుడు చేసుకుంటా! సంభాషణ: సమీర నేలపూడి -
రేడియో మిర్చిలో ’ఆహా కళ్యాణం’ టీమ్
-
రేడియో మిర్చి లో ఆహా కళ్యాణం టీమ్