Rajivgandhi stadium
-
హైదరాబాద్లో భారత్–ఆస్ట్రేలియా టి20
న్యూఢిల్లీ: సొంత గడ్డపై భారత జట్టు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో పరిమిత ఓవర్ల సిరీస్లలో తలపడనుంది. ఆస్ట్రేలియాతో ముందుగా 3 టి20 మ్యాచ్లు ఆడే టీమిండియా... ఆ తర్వాత సఫారీ టీమ్తో 3 టి20లు, 3 వన్డేలు ఆడుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ దాదాపుగా ఖరారు చేసింది. చాలా కాలం తర్వాత హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంకు మరో మ్యాచ్ నిర్వహణ అవకాశం లభించింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టి20 సెప్టెంబర్ 25న ఉప్పల్లో జరుగుతుంది. 2019 డిసెంబర్ 6న ఇక్కడ చివరి మ్యాచ్ (భారత్–విండీస్ టి20) జరిగింది. సిరీస్లోని తొలి రెండు మ్యాచ్లు సెప్టెంబర్ 20, 23 తేదీల్లో మొహాలి, నాగ్పూర్లలో జరుగుతాయి. దక్షిణాఫ్రికాతో సెప్టెంబర్ 28, అక్టోబర్ 1, 3 న జరిగే 3 టి20లకు వేదికలుగా త్రివేండ్రం, గువహటి, ఇండోర్ ఖరారయ్యాయి. దక్షిణాఫ్రికాతోనే జరిగే 3 వన్డేలకు అక్టోబర్ 6, 9, 11 తేదీల్లో రాంచీ, లక్నో, న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. -
మన హైదరాబాద్లో భారత తొలి డే-నైట్ టెస్ట్?
న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు ఇది కచ్చితంగా శుభవార్తే. నెలల వ్యవధిలోనే ఇక్కడ టెస్టు, వన్డే జరగనుంది. పైగా ఆ టెస్టును డేనైట్గా నిర్వహించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. హైదరాబాద్ లేదంటే రాజ్కోట్లో డేనైట్ మ్యాచ్ నిర్వహణకు బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) ఆమోదిస్తే భారత్లో తొలి డేనైట్ టెస్టుకు రంగం సిద్ధమవుతుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్వదేశంలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా సిరీస్లకు వేదికలు ఖరారు చేసింది. హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో వెస్టిండీస్తో అక్టోబర్లో ఒక టెస్టు, వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ జరుగనుంది. టెస్టులతో పాటు కొన్ని మ్యాచ్లకు సంబంధించి తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. బీసీసీఐ ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది భారత్లో కేవలం మూడు టెస్టులే జరుగనున్నాయి. అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టు మ్యాచ్ జూన్లో జరుగుతుంది. అనంతరం అక్టోబర్లో వెస్టిండీస్తో రెండు టెస్టులు హైదరాబాద్, రాజ్కోట్ల్లో జరుగుతాయి. తర్వాత నవంబర్లో ఐదు వన్డేల సిరీస్ను ముంబై, గువాహటి, కొచ్చి, ఇండోర్, పుణే వేదికల్లో నిర్వహిస్తారు. మూడు టి20లు కోల్కతా, చెన్నై, కాన్పూర్లలో జరుగుతాయి. కోల్కతా మ్యాచ్ నవంబర్ 4న జరుగుతుంది. శనివారం జరిగిన బీసీసీఐ పర్యటనల ఖరారు కమిటీ సమావేశానికి బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు గంగూలీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యాడు. దుబాయ్లో ఉన్న సీఈఓ రాహుల్ జోహ్రి, వ్యక్తిగత కారణాలతో బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా ఈ మీటింగ్కు గైర్హాజరయ్యారు. వచ్చే ఏడాది భారత్ పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా ఇక్కడ ఐదు వన్డేలు, రెండు టి20లు ఆడుతుంది. మొహాలీ (ఫిబ్రవరి 24), హైదరాబాద్ (ఫిబ్రవరి 27), నాగ్పూర్ (మార్చి 2), ఢిల్లీ (మార్చి 5), రాంచీ (మార్చి 8)లో వన్డేలు, బెంగళూరు (మార్చి 10), విశాఖపట్నం (మార్చి 13) వేదికల్లో రెండు టి20లు జరుగుతాయి. -
హైదరాబాద్లో చాంపియన్స్ లీగ్
న్యూఢిల్లీ: చాంపియన్స్ లీగ్ టి20 (సీఎల్టి20) మ్యాచ్లకు హైదరాబాద్ మరో సారి వేదిక కానుంది. సీఎల్టి20- 2014లో భాగంగా ఏడు మ్యాచ్లను ఉప్పల్లోని రాజీవ్గాంధీ స్టేడియంకు కేటాయించారు. ఇందులో ఐదు లీగ్ మ్యాచ్లతో పాటు రెండు సెమీ ఫైనల్ మ్యాచ్లు కూడా ఉన్నాయి. హైదరాబాద్తో పాటు బెంగళూరు, మొహాలీ, రాంచీ టోర్నీ వేదికలుగా 29 మ్యాచ్లు జరుగుతాయి. రాంచీలో జరిగే క్వాలిఫయింగ్ మ్యాచ్ల అనంతరం టోర్నీ మొదటి ప్రధాన మ్యాచ్లో ఐపీఎల్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్తో చెన్నై సూపర్ కింగ్స్ హైదరాబాద్లో తలపడుతుంది. సెప్టెంబర్ 13నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఈ టోర్నీ ఫైనల్ బెంగళూరులో నిర్వహిస్తారు. గత ఏడాది ఫార్మాట్లాగే మొత్తం 12 జట్లు బరిలోకి దిగుతున్నాయి. భారత్నుంచి నాలుగు, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలనుంచి రెండు జట్లు ఉండగా, పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్, వెస్టిండీస్ దేశాలనుంచి ఒక్కో జట్టు పాల్గొంటుంది.