Rani Reddy
-
పంచాంగ శ్రవణం.. తరలివచ్చిన జనం
నిజాంపేట్: అది వేంకటేశ్వర స్వామి సన్నిధి.. భక్తులకు పెన్నిధి.. ఆలయ ప్రాంగణం వేదికగా పంచాంగ శ్రవణం.. స్థానికులు భారీగా తరలివచ్చి శ్రద్ధాసక్తులతో వీక్షించారు. ఇదీ ఆదివారం సాయంత్రం బాచుపల్లిలోని క్రాంతినగర్ కాలనీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కనిపించిన సన్నివేశం. ‘సాక్షి’మీడియా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం సాయంత్రం ఆరు నుంచి రాత్రి 9 గంటల వరకు సాగింది. ‘సాక్షి’డైరెక్టర్ రాణిరెడ్డి, ఆలయ చైర్మన్ కాంతారావు, సర్క్యులేషన్ జీఎం కీర్తికిరణ్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రఖ్యాత నర్తకి యామినిరెడ్డి బృందం చేసిన కళాత్మక కూచిపూడి నృత్యం ఆహూతులను ఆకట్టుకుంది. అనంతరం సిద్ధాంతి చక్రవర్తులు శ్రీవత్సాచార్యులు పంచాంగ పఠనం చేశారు. విశ్వావసు నామ సంవత్సరంలో రాశిఫలాల గురించి చాలా విపులంగా వివరించారు. ‘విశ్వాసం అని నామధేయంతో ఈ సంవత్సరముంది. విశ్వాసులు అంటే సూర్యుడి ప్రజ్వలితం ఏ «విధంగా ఉంటుందో ఈ సంవత్సరం కూడా అంతే ప్రజ్వలితంగా ఉంటుంది. అందరి జీవితాల్లో విశ్వావసు అంత గొప్ప వెలుగును నింపుతుంది. 12 రాశుల వారికి 12 స్థానాల్లో శుభ ఫలితాలను తెలుసుకోవచ్చు’అని పేర్కొన్నారు. అనంతరం అన్ని రాశుల వారి ఆదాయం, వ్యయం, రాజయోగం, అవమానం ఏ యే స్థాయిల్లో ఉందో వివరించారు. తర్వాత భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. భారతీ సిమెంట్స్ ఈ కార్యక్రమానికి స్పాన్సరర్గా వ్యవహరించింది. కార్యక్రమంలో సాక్షి సర్క్యులేషన్ మేనేజర్ వినోద్కుమార్, మహేశ్రెడ్డి, స్థానిక నాయకులు జీవీ రెడ్డి, కొమ్మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జైపాల్రెడ్డి, సంగమేశ్, మహేశ్, వెంకటేశ్, భూపతి, చరణ్, సూర్య తదితరులు పాల్గొన్నారు.రాశి ఫలాలు తెలుసుకున్నాం.. ఉగాది పండుగ సందర్భంగా మా కాలనీలో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయడం మా అందరికీ సంతోషంగా ఉంది. పంచాంగంతో మా రాశుల ఫలాలు తెలుసుకున్నాం. సిద్ధాంతి గారి ఆధ్యాతి్మక ప్రసంగం ఎంతో ఆలోచింపజేయడంతోపాటు ఆచారించాల్సిన ఆవశ్యకతను తెలిపింది. – జి.ప్రసన్న, క్రాంతినగర్అవగాహన కలిగింది.. శుభ ముహూర్తాలు, అందులో గ్రహాల బలాల వల్ల జరిగే ఫలితాలు బాగా అర్థమయ్యాయి. సాక్షి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహాన్ని ఇవ్వడంతోపాటు రాశి ఫలాలపట్ల అవగాహన ఏర్పడింది. –ఎ.ఊర్మిళ చాలా సంతోషంగా ఉంది.. ఉగాది పండుగను ఇలా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. సాక్షి మీడియా ఆ«ధ్వర్యంలో విశ్వావసు నామ ఉగాదిని ఈ విధంగా నిర్వహించడం చాలా గొప్ప విషయం. తెలుగు పండుగల ప్రాధాన్యతను ఇలా చాటి చెప్పడం మంచి పరిణామం. ప్రజలంతా ఎంతో సంతోషంగా ఈ పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. – కాంతారావు, ఆలయ కమిటీ చైర్మన్, క్రాంతినగర్‘సాక్షి’ చొరవ అభినందనీయం ప్రతి నిత్యం ప్రజల సమస్యలను వెలుగులోకి తెస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు సాక్షి మీడియా ఎంతగానోకృషి చేస్తోంది. వాటితోపాటు పండుగలను నిర్వహిస్తూ తెలుగు సంప్రదాయాల్లో ప్రజలను భాగస్వాములను చేసేందుకు ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా ఆనందకరమైన విషయం. – నందిగామ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ బాచుపల్లి -
ఘనంగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 10th ఎడిషన్
-
‘పుడమి సాక్షిగా’ క్యాంపెయిన్కు ప్రతిష్టాత్మక ఏఎఫ్ఏఏ అవార్డు
సాక్షి, హైదరాబాద్: పుడమి సంరక్షణ కోసం సాక్షి మీడియా గ్రూప్ చేస్తోన్న ‘పుడమి సాక్షిగా’క్యాంపెయిన్కు అంతర్జాతీయ గౌరవం దక్కింది. అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ ఆఫ్ ఏషియా (ఏఐఏ) ఆధ్వర్యంలోని ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (ఏఎఫ్ఏఏ).. పుడమి సాక్షిగా కార్యక్రమాన్ని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ‘కార్పొరేట్ సోషల్ క్రూసేడర్ ఆఫ్ ది ఇయర్’సిల్వర్ అవార్డుతో సత్కరించింది. ముంబై వేదికగా జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో సాక్షి కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణి రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఏఎఫ్ఏఏ చైర్మన్ శ్రీనివాసన్ స్వామి, ఏఐఏ ప్రెసిడెంట్ అవినాష్ పాండే, ఆలివ్ క్రౌన్ చైర్మన్ జనక్ సర్థా ఈ అవార్డును అందజేశారు. పుడమి‘సాక్షి’గా లక్ష్యాలివే.. ప్రతీ ఏటా జనవరి 26న మెగా టాకథాన్గా వస్తోన్న పుడమి సాక్షిగా కార్యక్రమం 2020–21లో ప్రారంభమైంది. ఇప్పటివరకు మూడు ఎడిషన్లు పూర్తి చేసుకుంది. పర్యావరణాన్ని కాపాడడం, కాలుష్యం తగ్గించడం, స్వచ్ఛమైన పుడమిని భవిష్యత్ తరాలకు అందించడం.. పుడమి సాక్షిగా లక్ష్యాలు. ప్రాణకోటికి జీవనాధారమైన ధరిత్రి ప్రమాదంలో పడడానికి మనుషులే ప్రధాన కారణం. ఈ భూమి మళ్లీ పునర్వవైభవం దక్కించుకోవాలంటే.. ప్రతి ఒక్కరూ చేయాల్సిన కృషిని పుడమి సాక్షిగా గుర్తు చేస్తోంది. ప్రతి నెలా ఏదో ఒక రూపంలో పుడమి కార్యక్రమాలు చేపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యావరణంపై అవగాహన కల్పించడంతో పాటు ఇందులో ప్రజలను భాగస్వామ్యులను చేస్తోంది. దీంతోపాటు గణతంత్ర దినోత్సవం రోజున సాక్షి టీవీలో దాదాపు 10 గంటలపాటు మెగా టాకథాన్ రూపంలో ప్రసారం చేస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతున్న పెద్దలు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. తమ అనుభవాలను పంచుకుంటూ సమాజానికి స్పూర్తి కలిగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సమస్త సమాచారం, స్టోరీలు, వీడియోలు https://www.pudamisakshiga.com/ వెబ్ సైట్లో చూడవచ్చు. -
సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు
-
విజేత గౌతమ్ జూనియర్ కాలేజి
లాలాపేట: డిఫెండింగ్ చాంపియన్ గౌతమ్ జూనియర్ కాలేజి (ఈసీఐఎల్) జట్టు తెలంగాణ రీజియన్ సాక్షి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీలో టైటిల్ నిలబెట్టుకుంది. హబ్సిగూడలోని ఐఐసీటీ మైదానంలో జరిగిన జూనియర్ విభాగం ఫైనల్లో గౌతమ్ కాలేజి జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఎస్ఆర్ఆర్ జూనియర్ కాలేజి (మంచిర్యాల) జట్టుపై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్ఆర్ కాలేజి 11 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌటైంది. గౌతమ్ కాలేజీ స్పిన్నర్ డి.మనీశ్ రెండు వికెట్లు పడగొట్టాడు. టోర్నీ మొత్తంలో మనీశ్ 12 వికెట్లతో టాప్ ర్యాంక్లో నిలిచాడు. అనంతరం గౌతమ్ కాలేజి జట్టు కేవలం. 4.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసి గెలిచింది. అన్విత్ రెడ్డి 11 బంతుల్లో 24 పరుగులు చేశాడు. టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన అన్విత్ రెడ్డి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. హెచ్సీఏ అండర్–14, అండర్–16 లీగ్లలో కూడా అన్విత్ రెడ్డి తన సత్తా చాటుకున్నాడు. బాలాజీకి ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు లభించింది. సీనియర్ విభాగంలో భవాన్స్ వివేకానంద డిగ్రీ కాలేజి (సైనిక్పురి) జట్టు టైటిల్ సొంతం చేసుకుంది. ఫైనల్లో భవాన్స్ జట్టు 35 పరుగుల తేడాతో వాగ్దేవి డిగ్రీ కాలేజి (మంచిర్యాల) జట్టును ఓడించింది. ముందుగా భవాన్స్ జట్టు 15 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు సాధించింది. రాహుల్ 36 బంతుల్లో 71 పరుగులు చేశాడు. అనంతరం వాగ్దేవి కాలేజి 14.4 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ రెడ్డికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఫైనల్’ అవార్డులు దక్కాయి. జూనియర్, సీనియర్ విభాగాల్లో విజేతగా నిలిచిన జట్లకు రూ. 25 వేలు చొప్పున... రన్నరప్ జట్లకు రూ. 15 వేలు చొప్పున నగదు పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి మల్లా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విన్నర్స్, రన్నరప్ జట్లకు ట్రోఫీలను అందజేశారు. అబ్బాయిలకే కాకుండా అమ్మాయిలకు కూడా టోర్నీ లు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ రాణి రెడ్డి కూడా పాల్గొన్నారు. -
స్ఫూర్తిదాయక విజయాలకుప్రోత్సాహమిది
సాక్షి, హైదరాబాద్: విభిన్న రంగాల్లోని వ్యక్తుల విజయాలు స్ఫూర్తిని అందిస్తాయని.. పురస్కారాల ద్వారా ఆ విజయాలకు మరింత విలువ వస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నిర్వహించిన సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రాణాలు పణంగా పెట్టి దేశరక్షణ కోసం ప్రాణాలొడ్డిన సైనికులు, దేశానికి అన్నం పెట్టే రైతులు, సాంకేతిక విప్లవాలతో అద్భుతాలు సృష్టిస్తున్నవారు, నిస్వార్ధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తులు ఇలా భిన్న రంగాల్లో దేశానికి సేవ చేస్తున్నవారికి సెల్యూట్ చేస్తున్నానని విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. అలాంటి వ్యక్తులను, సంస్థలను గుర్తించి పురస్కారాలు అందించడం అభినందనీయమన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నేపథ్యంలో.. వివిధ రంగాల్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల వారికి ‘సాక్షి’ మీడియా గుర్తింపు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సాక్షి ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, వైఎస్ భారతిరెడ్డి, సాక్షి డైరెక్టర్లు రాణిరెడ్డి, ఏఎల్ఎన్ రెడ్డి, భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్రెడ్డి, సాక్షి సీఈవో అనురాగ్ అగర్వాల్, సాక్షి డైరెక్టర్లు కేఆర్పీ రెడ్డి, వైఈపీ రెడ్డి, వీఐటీ యూనివర్సిటీ ఏపీ క్యాంపస్ వీసీ ఎస్వీ కోటారెడ్డి పురస్కార గ్రహీతల విజయాలు తననెంతో ఆకట్టుకున్నాయన్నారు. ఈ సందర్భంగా పలువురు స్వాతంత్య్ర సమరయోధుల విజయాలను ఆయన గుర్తు చేశారు. ‘‘ఒక సమయంలో ఒకే పని చెయ్యి. దానిపైనే నీ సర్వశక్తియుక్తులు కేంద్రీకరించు. మిగిలినవన్నీ మినహాయించు’’ అంటూ ప్రవచించిన వివేకానందుడి సూక్తి ప్రతీ ఒక్కరికీ అనుసరణీయమన్నారు. అనంతరం పలు రంగాలకు చెందినవారికి గవర్నర్, సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతిరెడ్డిల చేతుల మీదుగా సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ వి.మురళి స్వాగతోపన్యాసం చేయగా.. కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి వందన సమర్పణ చేశారు. పురస్కారాలకు విజేతలను ఎంపిక చేసిన న్యాయ నిర్ణేతల జ్యూరీకి చైర్పర్సన్గా రెయిన్బో ఆస్పత్రి డైరెక్టర్ ప్రణతిరెడ్డి, సభ్యులుగా పద్మశ్రీ శాంతాసిన్హా, రాజకీయ విశ్లేషకుడు బండారు శ్రీనివాసరావు, క్రెడాయ్ నేషనల్ జనరల్ సెక్రెటరీ జి.రామిరెడ్డి, ఎన్డీ టీవీ రెసిడెంట్ ఎడిటర్ ఉమా సుధీర్, తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వినోద్ కె అగర్వాల్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ సభ్యులుగా వ్యవహరించారు. -
స్త్రీ శక్తికి వందనం
-
ప్రతిభకు సాక్షి పురస్కారం
సాక్షి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. తెలుగు మీడియాలో సాక్షి ప్రత్యేకం. ఎందుకంటే ప్రారంభంలోనే టాప్ మీడియాగా నిలిచింది. ఈ రోజు నాకు ఈ అవార్డు వచ్చిందంటే దానికి కారణమైన మహానుభావుడు ఆదుర్తి సుబ్బరావుగారు. నా ఫస్ట్ సినిమాకు విశ్వనాథ్గారు డైలాగులు నేర్చించారు. ఆయన చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది. విశ్వనాథ్గారికి కృతజ్ఞతలు. – కృష్ణ సాక్షి అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. నేను, కృష్ణగారు ‘సాక్షి’ సినిమాలోనే కలిశాం. మా పెళ్లి జరిగింది అప్పుడే. వైయస్గారు అంటే నాకు పంచప్రాణాలు. ఎందుకంటే ఆయన నన్ను సొంత చెల్లెలిలా భావించేవారు. చాలా అభిమానంగా చూసుకునేవారు. ఎప్పుడన్నా కలిసినప్పుడు టిఫిన్ చేద్దాం చెల్లెమ్మా అని అప్యాయంగా పిలిచేవారు. అంత అభిమాన రాజకీయ నాయకుడు వెళ్లిపోయిన తర్వాత నా కుటుంబంలో ఒకరు వెళ్లిపోయారనిపించింది. ఈ అవార్డు నాకు చాలా ప్రత్యేకం.– విజయ నిర్మల కృష్ణగారికి లైఫ్టైమ్ అవార్డు ప్రదానం చేయడానికి నేను తప్ప ఎవ్వరూ అర్హులు కారు. కృష్ణగారి చలనచిత్ర జీవితం విచిత్రమైనది. చిన్న స్టార్ నుంచి ఒక పెద్ద సూపర్స్టార్గా, ఆ తర్వాత పద్మాలయ స్టూడియోస్ ఓనర్గా ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. కృష్ణగారి ఎదుగుదల చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా చేతుల మీదుగా ఆయనను సన్మానించడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక చిన్న సంఘటనను గుర్తు చేసుకుంటాను. ‘తేనేమనసులు’ సినిమా చేస్తున్నప్పుడు కృష్ణగారు నన్ను ఓ డౌట్ అడిగారు. ‘సార్ డైలాగ్స్ చేప్తున్నప్పుడు చేతులు ఎక్కడ పెట్టుకోవాలని’’. నేను అదే ఆదుర్తి సుబ్బరావుగారికి చెప్పాను.– కె. విశ్వనాథ్ అవార్డు ఇచ్చినందుకు సాక్షికి కృతజ్ఞతలు. ఫస్ట్టైమ్ డైరెక్టర్కి ప్రొడ్యూసర్ ముఖ్యం. మా ఫాదర్, బ్రదర్కి చాలా థ్యాంక్స్. సినిమా సక్సెస్లో భాగమైన విజయ్, షాలిని ఇలా నటీనటులందరికీ కృతజ్ఞతలు. – సందీప్రెడ్డి వంగా ‘మెల్లగా తెల్లారిందోయ్’ పాటకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నా లైఫ్లో ఈ పాటకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పాట తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి. పాటలో ఎమోషన్ ఉండాలని డైరెక్టర్ సతీష్ వేగేశ్న, నిర్మాత ‘దిల్ రాజు’గారు అన్నారు. ఆ ఎమోషన్ను పాటలో రాశాను అనుకున్నాను. ఈ పాటకు ముందు చాలా పాటలు అనుకున్నాం. కానీ మీరు విన్న ‘మెల్లగా తెల్లారిందోయ్’ పాటను ఫైనలైజ్ చేయడం జరిగింది. నేను పల్లెటూరి వాడిని కాదు. అయినా చాలా రీసెర్చ్ చేసి రాశా. అవార్డు ఇచ్చిన సాక్షికి ధన్యవాదాలు.– శ్రీమణి ‘తెలిసెనే నా నువ్వే’ సాంగ్కి అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ సందీప్రెడ్డి వంగా, మ్యూజిక్ డైరెక్టర్ రధన్ దగ్గరుండి పాడించారు. అవార్డు ఇచ్చినందుకు సాక్షికి థ్యాంక్స్.– రేవంత్ మా టీమ్ అందరి తరపున సాక్షికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్రీ ఇయర్స్ స్ట్రగుల్ ఈ సినిమా. ‘ఘాజీ’ చిత్రానికి జాతీయ అవార్డు తీసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. టీమ్ అంతా కలసి చేసిన ఈ సినిమాకు అన్ని అవార్డులు అందుకోవడం హ్యాపీగా ఉంది. ఈ అవార్డు అందజేసిన సాక్షికి థ్యాంక్స్. – సంకల్ప్ రెడ్డి ‘ఖైదీ నంబర్ 150’ చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా అవార్డు తీసుకోవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో బాస్ చిరంజీవిగారు మళ్లీ బ్యాక్ అయ్యారు. ఎక్స్లెన్స్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు 22 మంది హాస్యనటులు ఉన్నారు. వారందరినీ దాటుకుని నాకు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఈ అవార్డు వచ్చిందంటే కారణం దర్శకుడు వీవీవినాయక్గారే. సాక్షి మేనేజ్మెంట్కి, చైర్పర్సన్ భారతిగారికి చాలా కృతజ్ఞతలు.– అలీ సురేశ్బాబుగారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. రామానాయుడుగారు తీసిన, సురేశ్బాబుగారు నిర్మించిన సినిమాలు చూస్తూ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఈ అవకాశం వస్తుందని ఊహించలేదు. గతేడాది మా సంస్థ నుంచి అన్నీ మంచి కథలు కుదిరాయి. ఆరుగురు డైరెక్టర్లు (సతీష్వేగేశ్న, నక్కిన త్రినాథరావు, హారీష్ శంకర్, శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి, వేణు శ్రీరామ్) మంచి సినిమాలు తీశారు. ఇది వాళ్ల అవార్డు. ప్రేక్షకులు సినిమాలను ఇష్టపడే తీరు సంవత్సరం సంవత్సరానికి మారుతుంటుంది. మంచి సినిమా ఇవ్వడం మాత్రమే మా ప్రయత్నం. మంచి సినిమాలను ప్రేక్షకులే సక్సెస్ చేస్తారు. – ‘దిల్’ రాజు సురేశ్బాబుగారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రొయ్యల నాయుడు గొప్ప పాత్ర. నాన్నగారి చివరి రోజుల్లో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో ఈ పాత్ర చేశారు. ఈ సినిమాలోని రొయ్యల నాయుడు పాత్ర ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ‘డీజే (దువ్వాడజగన్నాథమ్)’ సినిమాలో ఆ పాత్రను రీ క్రియేట్ చేసిన దర్శకుడు హారీష్ శంకర్గారికి కళాత్మక వందనాలు. ఈ సినిమా తర్వాత చిన్న పిల్లలు నన్ను రొయ్యల నాయుడు అంటూ గుర్తుపడుతున్నారు. నాన్నగారు చేసిన ఈ పాత్రను నేను చేయడంతో నా కెరీర్లో ఒక సైకిల్ పూర్తయిందనిపిస్తుంది. అవార్డు ఇచ్చిన సాక్షికి, చైర్పర్సన్ భారతి మేడమ్కు ధన్యవాదాలు. – రావు రమేశ్ భారతిమేడమ్గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిర్భయ ఇష్యూ అప్పుడు ఆవిడను కలిశాను. మహిళలకు చెందిన ఏ ఇష్యూలో అయిన భారతిగారి కమిట్మెంట్ బాగుంటుంది. తన చానల్ ద్వారా ప్రొత్సహిస్తారు. ఏ సినిమా అయినా డైరెక్టర్స్ వాయిస్ అనే నేను నమ్ముతాను. ఫస్ట్ సినిమా నుంచి ఏదో చెప్పాలనే ట్రై చేస్తున్నాను. ‘ఫిదా’ లాంటి ఫుల్ రీచ్ ఉన్న సినిమా రావడం హ్యాపీ. ఈ సినిమాకు పని చేసిన టీమ్ అందరి సక్సెస్ ఇది. ఇంకా మంచి ‘ఫిదా’లు అందిచాలని కోరుకుంటున్నాను. సాక్షికి థ్యాంక్స్. – శేఖర్ కమ్ముల సాక్షికి థ్యాంక్స్. ‘బాహుబలి’ సినిమాకు వరల్డ్ వైడ్గా గుర్తింపు వస్తోంది. ‘బాహుబలి’ గుర్తింపు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి సినిమాలో భాగం అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను నమ్మిన రాజమౌళి గారికి థ్యాంక్స్. రాజమౌళి గారిని నమ్మిన నిర్మాతలు శోభు, ప్రసాద్లకు ఇంకా థ్యాంక్స్. – సెంథిల్ కుమార్ విజేతలకు అవార్డులు అందించిన తర్వాత డి. సురేశ్ బాబు మాట్లాడుతూ– ఆరు విజయవంతమైన సినిమాలను ఒకే ఏడాదిలో తీయడం అంత ఈజీ కాదు. సినిమాలు నిర్మించడం విన్నంత సులభం కాదు. ‘దిల్’ రాజు గారు చాలా ప్యాషనైట్ ప్రొడ్యూసర్. ఆయన లాంటి వాళ్లు ఇండస్ట్రీకి చాలా అవసరం. అలాంటి నిర్మాతలు ఉంటేనే ఇండస్ట్రీ మంచి షేప్లో ఉంటుంది. ‘దిల్’ రాజుగారికి శుభాకాంక్షలు. ‘బాహుబలి’ సినిమా తీయాలంటే ధైర్యం ఉండాలి. కాదు అంతకుమించిన గట్స్ ఉండాలి. ఇంత పెద్ద సినిమా చేస్తునప్పటికీ దర్శక–నిర్మాతలు ఎప్పుడూ టెన్షన్ పడలేదు. స్మైల్తో లీడ్ చేశారు. కొన్ని సార్లు నేను షూటింగ్కి వెళ్లాను. ‘బాహుబలి’ విజయం అంతర్జాతీయ స్థాయిలో దక్కింది. చైనా మార్కెట్కు కూడా వెళ్లింది. చైనాలో ఈ సినిమా మీద కామిక్స్ రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ‘బాహుబలి’ మూవీ ఆఫ్ ది ఇయర్ కాదు. మూవీ ఆఫ్ ది డెకేడ్ అని చెప్పుకోవచ్చు. దర్శక–నిర్మాతలు, యాక్టర్స్ టీమ్ అందరికీ శుభాకాంక్షలు. – సురేశ్బాబు అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు సాక్షి. దర్శకుడు శేఖర్ కమ్ములగారికి స్పెషల్ థ్యాంక్స్. ఎనిమిదేళ్ల క్రితం నేను పాడిన ‘ఆడపిల్లనమ్మ...’ అనే పాటను గుర్తు పెట్టుకుని ఫిదా సినిమాలో పాడటానికి నాకు అవకాశం ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్కి ధన్యవాదాలు. ఈ అవార్డు మా అమ్మనాన్నల ముందు అందుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. భారతి మేడమ్గారిని ఫస్ట్ టైమ్ కలుస్తున్నాను. సంతోషంగా ఉంది. – మధుప్రియ ఈ అవార్డు ఇచ్చిన సాక్షికి ధన్యవాదాలు. డైరెక్టర్ సందీప్రెడ్డి, హీరో విజయ్ దేవరకొండ, ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్. సినిమాలో నేను చేసిన ప్రీతి క్యారెక్టర్ బాగా రావడానికి వీళ్లే కారణం. నన్ను ఇంత బాగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్... థ్యాంక్స్ ఎ లాట్. – షాలినీ పాండే (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్ లిస్ట్ 2017 జీవిత సాఫల్య పురస్కారం: ఘట్టమనేని కృష్ణ జీవిత సాఫల్య పురస్కారం: శ్రీమతి విజయ నిర్మల మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ద ఇయర్ చిరంజీవి: (ఖైదీ నంబర్ 150) మోస్ట్ పాపులర్ మూవీ ఆఫ్ ద ఇయర్: బాహుబలి –2 మోస్ట్ పాపులర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల: (ఫిదా) మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్ ఆఫ్ ద ఇయర్: షాలినీ పాండే (అర్జున్రెడ్డి) మోస్ట్ పాపులర్ కమేడియన్ ఆఫ్ ద ఇయర్: అలీ (ఖైదీ నంబర్ 150) స్పెషల్ జ్యూరీ అవార్డు: ‘దిల్’ రాజు (ఒకే ఏడాదిలో వరుసగా ఆరు విజయవంతమైన చిత్రాలు నిర్మించినందుకు) మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్: తమన్ (మహానుభావుడు) డెబ్యూడెంట్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్: సందీప్రెడ్డి (అర్జున్రెడ్డి) మోస్ట్ క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీ ఆఫ్ ది ఇయర్: ఘాజీ బెస్ట్ సినిమాటోగ్రఫీ ఆఫ్ ద ఇయర్ : సెంథిల్ కుమార్ (బాహుబలి –2) మోస్ట్ పాపులర్ సింగర్ ఆఫ్ ద ఇయర్ (ఫీమేల్): ఎమ్.మధుప్రియ (వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే) ఫిదా మోస్ట్ పాపులర్ సింగర్ ఆఫ్ ద ఇయర్(మేల్) : రేవంత్ (తెలిసెనే నా నువ్వే: అర్జున్రెడ్డి) మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్ ఆఫ్ ద ఇయర్: శ్రీమణి (మెల్లగా తెల్లారిందో ఇలా: శతమానం భవతి) ఈ వేడుకలో హీరో కార్తికేయ, హీరోయిన్లు రాశీఖన్నా, నందితా శ్వేత, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. వేదికపై గాయకుడు ‘సింహ’ పాడిన పాటలు శ్రోతలను అలరించాయి. రాహుల్ రవీంద్రన్, షాలినీ పాండే, సుశాంత్ వై.ఎస్. భారతి, శేఖర్ కమ్ముల ‘దిల్’ రాజు, సందీప్ రెడ్డి రాహుల్ రవీంద్రన్, సెంథిల్, సుశాంత్ ‘దిల్’ రాజు, డి.సురేశ్బాబు రాశీ ఖన్నా, సంకల్ప్ రెడ్డి, వైఈపీ రెడ్డి అలీ, ‘దిల్’ రాజు కె. రామచంద్రమూర్తి, శ్రీమణి, కృష్ణుడు రావు రమేశ్, డి.సురేశ్బాబు ఆర్పీ పట్నాయక్, రేవంత్, వైఈపీ రెడ్డి కార్తికేయ, మధుప్రియ, నందితా శ్వేత -
కిచెన్ గార్డెనింగ్ వర్క్షాప్కు విశేష స్పందన
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, సాక్షి మీడియా సంయుక్తాధ్వర్యంలో నిర్వహణ పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సబ్సిడీపై కిట్ల పంపిణీ సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్లో శనివారం జరిగిన కిచెన్ గార్డెనింగ్ వర్క్షాప్నకు విశేష స్పందన లభించింది. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, సాక్షి మీడియా సంయుక్తంగా నిర్వహించిన ఈ వర్కషాప్నకు పిల్లలు, వారి తల్లిదండ్రులు, స్థానికులు, ఇతరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రసాయనాలతో తలెత్తే ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించుకునే అంశాలను తెలుసుకునేందుకు ఆసక్తిని కనబరిచారు. ఇందుకు సంబంధించి పలు వివరాలను అధికారులను, నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ విభాగం అధికారి అరుణ సబ్సిడీ కిట్ గురించి వివరించారు. ఈ కిట్లో కిచెన్ గార్డెనింగ్కు అవసరమైన పరికరాలు ఉన్నాయన్నారు. రూ.6 వేల విలువ కలిగిన ఈ కిట్ను సబ్సిడీ పోనూ రూ.3 వేలకే అందజేస్తున్నామని ఆమె తెలిపారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం నుంచి రిసోర్స్ పర్సన్గా వచ్చిన చంద్రశేఖర్ కిచెన్ గార్డెన్లో తలెత్తే ఇబ్బందులు వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు అందజేశారు. కిచెన్ గార్డెనింగ్ సబ్సిడీ కిట్ అందుకున్న వారికి ఫాలోఅప్ మీట్స్ నెలనెలా నిర్వహించి వారికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తామని సాక్షి టీవీ మార్కెటింగ్ డెరైక్టర్ రాణీ రెడ్డి తెలిపారు. ప్రతి నెలా జరిగే పేరెంట్స్ మీట్లో భాగంగా అదనపు గంట నిర్వహించిన ఈ వర్క్షాపునకు విశేష స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు. స్కూల్ పిల్లల్లో కూడా కిచెన్ గార్డెనింగ్ అలవాటును పెంపొందించేందుకు ప్రయత్నిస్తామని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ వరలక్ష్మి తెలిపారు.