breaking news
Rashmika Mandanna
-
'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ
హీరోయిన్ రష్మికని పెళ్లి చేసుకున్న తర్వాత విజయ్ దేవరకొండ.. సోమవారం తన సొంతూరు అయిన తుమ్మనపేటకు వచ్చాడు. ఈ గ్రామం తెలంగాణలోని అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలంలో ఉంది. సొంతూరిలోని ఫామ్ హౌస్లో నూతన వధూవరులిద్దరూ సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రజలందరికీ వెజ్-నాన్ వెజ్ భోజనాలు కూడా పెట్టారు. అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: భర్తని చూస్తూ సిగ్గుపడిపోతూ.. రష్మిక వీడియో వైరల్)సొంతూరితో ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఊర్లో పొలం కొందాం వ్యవసాయం చేసుకుందాం ఇల్లు కట్టుకుందామని నాన్న ఎప్పుడూ అడిగేవాడు. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది . ఊరిలో ఇల్లు కట్టుకోవడం పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడంతో హ్యాపీ. ఇకనుంచి గ్రామానికి రెగ్యులర్గా వస్తాం. తమ్ముడు ఆనంద్ పెళ్లి గ్రామంలోని అందరి సమక్షంలో చేస్తాం. ఊరికి చేసేది చాలా ఉంది. అందరం కలిసి ఊరిని అభివృద్ధి చేసుకుందాం. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ స్కూళ్లలో 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తాం అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.ఇకపోతే నిన్న అనగా ఆదివారం.. దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో అభిమానుల కోసం 'విరోష్' జంట అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల స్వీట్ల పంపిణీ కూడా చేశారు. ఈ బుధవారం(మార్చి 04) హైదరాబాద్లో రిసెప్షన్ జరగనుంది. దీనికి టాలీవుడ్కి చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది హాజరు కానున్నారు. (ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్)విరోష్ పెళ్లికానుక.. విద్యార్థులకు విజయ్ దేవరకొండ శుభవార్తవిజయ్ దేవరకొండ తన 'విరోష్' పెళ్లికానుకగా విద్యార్థులకు భారీ శుభవార్త చెప్పారు. తమ ట్రస్ట్ ద్వారా మొదట అచ్చంపేట డివిజన్లోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతి ప్రతిభావంతులకు స్కాలర్షిప్లు అందజేయనున్నారు. భవిష్యత్తులో ఈ… pic.twitter.com/nwMlm0M7sI— ChotaNews App (@ChotaNewsApp) March 2, 2026 -
భర్తని చూస్తూ సిగ్గుపడిపోతూ.. రష్మిక వీడియో వైరల్
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మిక.. గతవారం పెళ్లి చేసుకున్నారు. ఉదయ్పుర్ వేదికగా జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్తో ఒక్కటయ్యారు. తిరిగి హైదరాబాద్ వచ్చేసిన కొత్త జంట.. తెలంగాణలోని తుమ్మనపేట అనే గ్రామానికి వెళ్లారు. విజయ్ దేవరకొండ సొంతూరు ఇది. సోమవారం ఉదయం అక్కడే సత్యనారాయణ వ్రతం చేశారు. అలానే ఊరి వాళ్లందరికీ భోజనాలు కూడా పెట్టించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు చాలానే వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్)అయితే ఈ మొత్తం వాటిలో ఒక్క వీడియో మాత్రం విరోష్ (ViRosh) అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఇందులో రష్మిక.. తన భర్త విజయ్ని చూస్తూ సిగ్గుపడుతూ కనిపించింది. విజయ్ తనని చూసేసరికి రష్మిక ముఖాన్ని పక్కకు తిప్పుకొని మురిసిపోయింది. పూజ చేస్తున్న టైంలో ఈ క్యూట్ మూమెంట్ కనిపించింది.విజయ్ దేవరకొండ స్వస్థలం తెలంగాణలోని అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం తుమ్మనపేట. తన వివాహం తర్వాత తొలిసారి సతీమణి రష్మికతో సొంతూరికి వచ్చాడు. తన ఫామ్ హౌస్లోనే సత్యనారాయణ వ్రతం జరిపించాడు. అలానే ఆదివారం దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో అభిమానుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించాడు. పలుచోట్ల స్వీట్లు పంపిణీ చేశాడు. ఈ బుధవారం(మార్చి 04) హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)#VijayDeverakonda & #RashmikaMandanna ❤️pic.twitter.com/9S7AW5b0Zw— cinee worldd (@Cinee_Worldd) March 2, 2026 -
విజయ్-రష్మిక.. సత్యనారాయణ స్వామి వ్రతం
-
స్వగ్రామంలో విజయ్, రష్మిక సందడి
-
విజయ్ సొంతూరుకు 'విరోష్' జోడీ
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెద్దల అంగీకారంతో ఉదయ్పూర్లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత తొలిసారి సతీమణితో పాటుగా తన సొంతూరుకు విజయ్ చేరుకున్నారు. దీంతో భారీగా అభిమానులు, కుటుంబ సభ్యులు తరలివచ్చారు. తెలంగాణలోని మారుమూల గ్రామంలో జన్మించిన విజయ్ స్వశక్తితో ఎదిగి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపుని సాధించారు. తనకు ఇష్టమైన రష్మికని సినిమానే దగ్గర చేసింది. తమకు అభిమానులు పెట్టిన ‘విరోష్’ ట్యాగ్నే వివాహ వేడుకకి పేరుగా పెట్టుకుని వారికి ప్రథమ స్థానం ఇచ్చారు. అంతటితో ఆగని ఈ జంట దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్లు పంపిణీ చేసి ఫ్యాన్స్ నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే, ఇప్పుడు వివాహ అనంతరం సొంత ఊరుకు తొలిసారి జంటగా చేరుకోవడంతో అక్కడ సందడి వాతావారణం నెలకొంది.విజయ్ దేవరకొండ స్వస్థలం తెలంగాణలోని అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం తుమ్మనపేట. తన వివాహం తర్వాత తొలిసారి సతీమణి రష్మికతో సొంతూరు రావడంతో తన చిన్ననాటి స్నేహితులు అందరూ చేరుకున్నారు. నేడు (మార్చి 2న) తుమ్మనపేటలోని ఆయన ఫామ్ హౌస్లో సత్యనారాయణ వ్రతం జరిపించనున్నారు. ఇప్పటికే సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. విజయ్ అనుకుంటే హైదరాబాద్లోనే ఈ కార్యక్రమం జరిపించవచ్చు. కానీ, తన సొంతూరు గ్రామ ప్రజల సమక్షంలో ఈ వేడుక జరగాలని ఆయన కోరుకున్నట్లు తెలుస్తోంది. (వీడియో క్రెడిట్ — Telugu Scribe)స్వగ్రామానికి చేరుకున్న విజయ్ దేవరకొండ దంపతులునాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేట గ్రామానికి చేరుకున్న నవదంపతులు విజయ్ దేవరకొండ - రష్మిక మందన్ననూతన ఫామ్ హౌస్లో గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్న నవ దంపతులు https://t.co/GUBdsVIVLA pic.twitter.com/9GRJBql2Uu— Telugu Scribe (@TeluguScribe) March 2, 2026 -
అల్లు అర్జున్ ఇంటికి విజయ్, రష్మిక జోడీ (ఫోటోలు)
-
విజయ్, రష్మికల రిసెప్షన్.. ఫ్యాన్స్కు విజ్ఞప్తి
విజయ్ దేవరకొండ , రష్మికల వివాహం ఫిబ్రవరి 26న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఉదయ్పూర్లో కొద్దిమంది సమక్షంలో వారిద్దరు వివాహం చేసుకున్నారు. అయితే, పరిశ్రమలోని ప్రముఖులతో పాటు పలు రాజకీయ నాయకుల కోసం హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కూడా కొద్దిమంది మాత్రమే పాల్గొననున్నారు. తాజాగా విరోష్ జోడి తమ ఫ్యాన్స్కు, ఈ వేడుకకు హాజరయ్యే అతిథులకు విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 4న సాయంత్రం జరిగే రిసెప్షన్ వేడుకకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆహ్వానం అందిన అతిథులు మాత్రమే హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఆహ్వానం లేకుండా ఇతరులు ఈ వేడకకు వచ్చి ఇబ్బంది పడొద్దని ప్రకటనలో పేర్కొన్నారు.విజయ్, రష్మిక రిసెప్షన్ కోసం సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్ల ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దని, వచ్చి ఇబ్బందుల పాలు కావద్దని విరోష్ జంట కోరింది. మీ క్షేమమే మాకు ముఖ్యమని, మీరు ఎక్కడున్నా మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నట్లు టీమ్ తెలిపింది. -
సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మిక.. గతవారం ఉదయ్పుర్ వేదికగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. ఆదివారం నాడు దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని ఆలయాల్లో అన్నదానం, స్వీట్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేశారు. ఇకపోతే ఈ బుధవారం(మార్చి 04) హైదరాబాద్లో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి సినీ రాజకీయ ప్రముఖులు రాబోతున్నారు.(ఇదీ చదవండి: 'పెద్ది' మొదలుపెట్టేశాడు.. బుచ్చిబాబుని ఆడుకున్న చరణ్)పెళ్లి జరగడానికే ముందే విజయ్ దేవరకొండ వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చారు. అయితే అది పెళ్లి ఆహ్వానం కోసమే అని అంతా అనుకున్నారు. ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు రష్మిక.. స్వయంగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి.. ఆయన కుటుంబాన్ని రిసెప్షన్కి వ్యక్తిగతంగా ఆహ్వానించింది. ఈ క్రమంలోనే రష్మికని సాదరంగా ఆహ్వానించిన రేవంత్ రెడ్డి దంపతులు.. తెలుగు సంప్రదాయంలో భాగంగా చీరపెట్టి గౌరవించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రిసెప్షన్ సందర్భంగా అభిమానులని ఉద్దేశిస్తూ.. 'విరోష్' జోడి ఓ నోట్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో మార్చి 04 సాయంత్రం వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. కొద్దిమంది సన్నిహితులు, పరిమిత సంఖ్యలో అతిథులు ఇందులో పాల్గొనున్నారు. పోలీసులు ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దు. వచ్చి ఇబ్బంది పడొద్దు అని ఇందులో విజ్ఞప్తి చేశారు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్తో సినిమా.. 15 రోజులు తినడం మానేశా) -
హైదరాబాద్ టీటీడీ ఆలయంలో విజయ్-రష్మిక (ఫొటోలు)
-
'రణబాలి' పోస్టర్ వెనుక ఎమోషనల్ స్టోరీ: దర్శకుడు
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి సందర్భంగా రణబాలి నుంచి ఒక పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. వారిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో నెట్టింట వైరల్ అయింది. పోస్టర్లో వారిద్దరి లుక్ చాలా ఓల్డ్ గెటప్లో ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, దీని వెనుక దాగిన ఆసక్తికరమైన స్టోరీని చిత్ర దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ షేర్ చేశారు. రణబాలి నుంచి తాజాగా విడుదలైన పోస్టర్ కేవలం ఒక సినిమాకు సంబంధించినది మాత్రమే కాదని తెలిపారు. ఈ పోస్టర్ రూపకల్పనలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయని చెప్పారు. పాత కాలపు ఫోటోలంటే తనకు ఎంతో ఇష్టమని దర్శకుడు గుర్తుచేసుకున్నారు. మన పూర్వీకులు కెమెరా ముందు ఎలాంటి కృత్రిమమైన ఫోజులు లేకుండా చాలా సహజంగా ఫోటోలు దిగేవారని చెప్పారు. అలాంటి కృత్రిమమైన లుక్ను రణబాలి పోస్టర్లో తీసుకురావాలని తాము ప్రయత్నించినట్లు రాహుల్ సాంకృత్యన్ తెలిపారు.రణబాలి పోస్టర్ గురించి దర్శకుడు ఇలా చెప్పారు. '1800ల కాలం నాటి నేపథ్యంలో ‘రణబాలి’ మూవీ ఉండనుంది. కాబట్టి, ఆ కాలపు గాంభీర్యం, మట్టి వాసన కనిపించేలా ఈ చిత్రంలో వివాహ వేడుకను డిజైన్ చేశాం. ఈ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో విజయ్, రష్మిక పెళ్లి దుస్తుల్లో వచ్చినప్పుడు వారిద్దరూ నిజంగానే మన పూర్వపు కాలంలోకి వెళ్ళిన వ్యక్తుల్లా కనిపించారు. ఫోటో లుక్లో కూడా వారిద్దరూ ఎలాంటి స్టైలిష్ ఫోజులు ఇవ్వలేదు. కేవలం సాధారణ వ్యక్తుల్లా వారిద్దరినీ కెమెరాతో బంధించాం. ఇదే ఈ పోస్టర్ ప్రత్యేకత. ఈ సినిమా పోస్టర్ విడుదల నాటికి వారిద్దరూ నిజ జీవితంలో ఒక్కటి కావడం ఆశ్చర్యంగా అనిపించింది. ఒక్కోసారి సినిమా, నిజ జీవితం రెండూ పలకరించుకుంటాయ్. ఈ పోస్టర్ చూస్తుంటే వారి గత జన్మకు సంబంధించిన పెళ్లి ఫోటోలా అనిపిస్తుంది.' అని రాహుల్ సాంకృత్యన్ ఎమోషనల్ స్టోరీ రాసుకొచ్చారు.STORY BEHIND THE WEDDING POSTERYesterday, we released the wedding poster of Ranabaali.But this wasn’t designed as a “poster.” It was a moment.I’ve always been fascinated by old photographs — our parents, grandparents… the way they stood before a camera. No posing. No… pic.twitter.com/ppuBj9tMjQ— Rahul Sankrityan (@Rahul_Sankrityn) March 1, 2026 -
విజయ్, రష్మిక మూడోసారి.. చిరు-త్రిష రెండోసారి.. జోడీ రిపీట్
వెండితెరపై ఓ హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కుదిరి, ఆ సినిమా హిట్ కూడా అయితే అప్పుడు ‘హిట్ పెయిర్’ అనిపించుకుంటారు. ఆ హిట్ పెయిర్ కాంబినేషన్కి ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న కొన్ని జోడీలు రిపీట్ అవుతున్నాయి. తొలిసారి జోడీగా నటించి, సక్సెస్ సాధించిన ఈ జంటకు సక్సెస్ రిపీట్ కావడం ఖాయం అనే అంచనాలున్నాయి. ఇక... రిపీట్ అవుతున్న జోడీల గురించి తెలుసుకుందాం. రెండోసారి... ఈ మధ్య చిరంజీవి హీరోగా నటించిన చిత్రాల్లో ‘విశ్వంభర’ మూవీ ఒకటి. ‘బింబిసార’ మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించారు. త్రిష మెయిన్ హీరోయిన్గా, ఆషికా రంగనాథ్ సెకండ్ హీరోయిన్గా నటించారు. చిరంజీవి, త్రిష కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘స్టాలిన్ ’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2006 సెప్టెంబరు 20న విడుదలై, హిట్గా నిలిచింది. ఆ చిత్రం తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రాలేదు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరి జోడీ ‘విశ్వంభర’ సినిమాతో రిపీట్ అవుతోంది. ‘‘స్టాలిన్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన చిరంజీవి–త్రిష జోడీ ‘విశ్వంభర’తో రెండోసారీ అలరించనుంది. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్గా ఈ మూవీ రూపొందింది. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ఫై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంజీవి పుట్టినరోజుని పురస్కరించుకుని 2025 ఆగస్టు 22న విడుదల చేసిన ‘విశ్వంభర’ సినిమా గ్లింప్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ వేసవిలో సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పనుల వల్ల సినిమా విడుదల ఆలస్యం అయింది. చందమామ కథలా సాగిపోయేటటువంటి అద్భుతమైన కథ ‘విశ్వంభర’. ముఖ్యంగా చిన్నపిల్లలకు, మరీ ముఖ్యంగా పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలను సైతం ఇది అలరిస్తుంది... వినోదపరుస్తుంది. ఈ వేసవికి ఈ సినిమా మీ ముందు ఉంటుంది. నాది భరోసా’’ అని చిరంజీవి పేర్కొన్న సంగతి తెలిసిందే. వందో చిత్రంలో... హీరో నాగార్జున, హీరోయిన్ టబు జోడీకి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరి పేరు చెప్పగానే ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా గుర్తొస్తుంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో మొదటిసారి నటించారు నాగార్జున–టబు. 1996 అక్టోబరు 4న రిలీజైన ఈ చిత్రం సూపర్హిట్గా నిలిచింది. ఈ మూవీలో తమదైన నటనతో ఆడియన్స్ని ఆకట్టుకున్నారు నాగార్జున–టబు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత నాగార్జున–టబు కలిసి నటించిన చిత్రం ‘ఆవిడా మా ఆవిడే’. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1998 జనవరి 14న విడుదలైంది. ఈ చిత్రంలోనూ మరోసారి సందడి చేశారు. ఆ తర్వాత వీరిద్దరూ జోడీగా నటించలేదు. కానీ, ‘సిసింద్రి’ (1995) సినిమాలో మాత్రం ‘ఆటాడుకుందాం రా అందగాడా...’ అంటూ సాగే స్పెషల్ సాంగ్లో సందడి చేశారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున–టబు ముచ్చటగా మూడోసారి నటిస్తున్నారు. నాగార్జున కెరీర్లో 100వ సినిమాగా రూపొందుతోన్న చిత్రం ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్). ఈ మూవీకి తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్పై అక్కినేని నాగార్జున ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నాగార్జున కెరీర్లో మైలురాయిలాంటి ఈ చిత్రంలో మరోసారి ఆయనకి జోడీగా టబు నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ మైసూర్లో జరుగుతోంది. మూడోసారి... హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికా మందన్నా జోడీకి పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ వంటి సినిమాల్లో జంటగా నటించిన వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’. విజయ్–రష్మిక కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ‘గీత గోవిందం’. పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018 ఆగస్టు 15న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఆ మూవీ తర్వాత వీరిద్దరూ జోడీగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 జూలై 16న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఏడేళ్లకు విజయ్–రష్మిక కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ మూవీ తెరకెక్కించిన రాహుల్ సంకృత్యాన్ ‘రణబాలి’కి దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా వారి లైఫ్లో ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే.. రీల్ లైఫ్లో జోడీగా నటించిన విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా రియల్ లైఫ్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడమే. ఫిబ్రవరి 26న వీరి వివాహం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వీరి కాంబోలో రానున్న ‘రణబాలి’ మూవీపై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. 19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందుతోన్న ఈ మూవీలో విజయ్ రణబాలిగా, రష్మిక జయమ్మ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 11న రిలీజ్ కానుంది. సెకండ్ టైమ్ హీరో శర్వానంద్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ లది హిట్ జోడీ. ‘శతమానం భవతి’ మూవీలో ఫస్ట్ టైమ్ జోడీగా నటించిన ఈ జంట సెకండ్ టైమ్ ‘భోగి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా, డింపుల్ హయతి కీలక పాత్రలో నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందుతోన్న ఈ సినిమాలో తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి జోడీగా నటిస్తున్నారు శర్వానంద్–అనుపమ. వీరిద్దరూ ఫస్ట్ టైమ్ నటించిన చిత్రం ‘శతమానం భవతి’. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ మూవీ 2017 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీలో క్యూట్ జోడీగా ఆకట్టుకున్నారు శర్వా, అనుపమ. ఈసారి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘భోగి’లో నటిస్తున్నారు.1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 28న విడుదల కానుంది.ఈసారి భయపెడతారు ‘సామజ వరగమన’ సినిమాతో ప్రేక్షకులకు కడుపుబ్బా వినోదాలు పంచారు హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ రెబా మోనికా జాన్. వీరిద్దరూ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 జూన్ 29న విడుదలై, థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపించింది. ‘సామజవరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ నటించిన సెకండ్ మూవీ ‘మృత్యుంజయ్’. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. రమ్య గుణ్ణం సమర్పణలో సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ మూవీ కోసం రెండోసారి జోడీ కట్టారు శ్రీవిష్ణు–రెబా. తొలి చిత్రంలో ప్రేక్షకులకు నవ్వులు పంచిన ఈ జంట ‘మృత్యుంజయ్’లో మాత్రం భయపెట్టనున్నారు. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందింది. ‘సాంగ్స్, కామెడీ లేకుండా హానెస్ట్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. నా నటన కూడా సరికొత్తగా ఉంటుంది’’ అంటూ ఇటీవల శ్రీ విష్ణు తెలిపారు. ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదల కావాల్సి ఉంది. అయితే అదే రోజు శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘విష్ణు విన్యాసం’ మూవీ రిలీజ్ అవుతుండటంతో ఈ నెల 6కి ఈ మూవీ రిలీజ్ని వాయిదా వేశారు. బేబీ హిట్తో... ‘బేబీ’ మూవీతో ఓవర్నైట్ స్టార్స్ అయిపోయారు హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్య. వారిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ‘బేబీ’. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై కల్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రత్యేకించి వీరి జోడీపై యూత్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ‘బేబీ’తో హిట్ పెయిర్ అనిపించుకున్న ఆనంద్– వైష్ణవి జంటగా నటిస్తున్న రెండో సినిమా ‘ఎపిక్’. ‘90స్’ (ఎ మిడిల్ క్లాస్ బయోపిక్) వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మి స్తున్నారు. కాగా ఎపిక్– ఫస్ట్ సెమిస్టర్ పేరుతో రిలీజ్ చేసిన ఈ మూవీ గ్లింప్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోలాంటి అబ్బాయికి... సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోలాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ’ అంటూ ఆనంద్ దేవరకొండ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ‘బేబీ’ మూవీతో సూపర్హిట్ జోడీ అనిపించుకున్న ఆనంద్–వైష్ణవి కలిసి నటిస్తున్న ‘ఎపిక్’ మూవీపై మంచి క్రేజ్ నెలకొంది. రెండోసారి... ‘కోర్ట్’ సినిమాతో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు హర్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా. ఈ ఇద్దరూ పరిచయమైన తొలి చిత్రం ‘కోర్ట్’. ఇప్పుడు రెండోసారి జంటగా నటించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. ప్రియదర్శి, శివాజీ, రోషన్, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా 2025 మార్చి 14న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో తొలిసారి జోడీగా నటించిన హర్ష్ రోషన్–శ్రీదేవి హిట్ పెయిర్గా నిలిచారు. సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆడియన్స్లో వీరి జోడీకి ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో వీరు జంటగా నటించిన తాజా చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంపై ఫుల్ బజ్ నెలకొంది. -
ఫ్యాన్స్ అన్నదానం.. విజయ్- రష్మికపై వెల్లువిరిసిన అభిమానం
టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి పెళ్లి వేడుక ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లిలో సన్నిహితులు, బంధుమిత్రులు సందడి చేశారు. పెళ్లి తర్వాత తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు విరోష్ జంట. పెళ్లి తర్వాత విరోష్ జంట తొలిసారి భార్య, భర్తలుగా భాగ్యనగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.అయితే వీరి పెళ్లిని అభిమానులు కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో, హీరోయిన్ల పెళ్లి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని శ్రీ సాయికృప బాలాజీ మందిర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఓ అభిమాని ట్విటర్లో షేర్ చేశారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.అభిమానుల కోసం విరోష్ జంట అన్నదానం..కాగా.. తమ అభిమానుల కోసం విరోష్ జంట కీలక నిర్ణయం తీసుకుంది. తమ వెడ్డింగ్ సందర్భంగా అభిమానుల కోసం ప్రత్యేక స్వీట్స్ పంపిణీ చేయనున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో మిఠాయిలు మార్చి 1వ తేదీన పంచనున్నారు. ఆ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల వద్ద ఆదివారం అన్నదానం కూడా నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కాగా.. ఈ టాలీవుడ్ జంట మార్చి 4న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. Vijay Deverakonda – Rashmika Mandanna వారి వివాహం సందర్భంగా అన్నదానం కార్యక్రమం.VDFC JAGITYAL - Dharmapuri❤️❤️#VijayDeverakonda #rashmikamandanna #virosh #TeamDeverakonda #ViRoshWedding pic.twitter.com/jQNFuTENir— Adarsh Vinny (@AdarshVinn53747) February 28, 2026 Vijay Deverakonda – Rashmika Mandanna వారి వివాహం సందర్భంగా అన్నదానం కార్యక్రమం.#VijayDeverakonda #rashmikamandanna #virosh #TeamDeverakonda pic.twitter.com/jcR3130HNM— Adarsh Vinny (@AdarshVinn53747) February 28, 2026 -
విరాట్ కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన రష్మిక.. అదేంటో తెలుసా?
కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇన్ని రోజులుగా సీక్రెట్గా రిలేషన్లో ఉన్న వీరిద్దరు పెళ్లికి కొద్ది రోజుల ముందు అఫీషియల్గా ప్రకటించారు. గత నెల ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒక్కటయ్యారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గల మెమెంటోస్ ప్యాలెస్లో అతికొద్దిమంది సమక్షంలో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.పెళ్లి తర్వాత విజయ్, రష్మిక తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ జంట తమ భావాలను ప్రకటిస్తూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఈ పిక్స్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేశాయి. అత్యధిక లైక్స్తో పలువురి సెలబ్రిటీల ఫోటోలు క్రియేట్ చేసిన రికార్డ్స్ను విరోష్ జంట తుడిచిపెట్టేసింది. తాజాగా ఈ పిక్స్ మరో రికార్డ్ సృష్టించాయి.2024లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా విరాట్ కోహ్లీ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోకు దాదాపు 23 మిలియన్ల లైక్స్ వచ్చాయి. తాజాగా ఆ రికార్డ్ను రష్మిక షేర్ చేసిన పెళ్లి ఫోటోలు బద్దలు కొట్టాయి. రష్మిక పోస్ట్కు ఏకంగా 25 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. దీంతో విరాట్ పోస్ట్ రికార్డ్ను రష్మిక అధిగమించింది. కాగా.. ఇన్స్టాలో రష్మికకు 50 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంటే దాదాపు సగం మంది ఈ వెడ్డింగ్ ఫోటోలను లైక్ చేశారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఫోటోలకు 19.8 మిలియన్ల లైక్ వచ్చాయి. కాగా.. మరోవైపు విరాట్కు ఇన్స్టాలో 274 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రష్మిక పోస్ట్కు ఈ రేంజ్లో ఆదరణ దక్కడం చూస్తుంటే ఆమె క్రేజ్ ఏంటో తెలిసిపోతోంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
విరోష్ వెడ్డింగ్.. పాన్ ఇండియా ఫ్యాన్స్కు కొత్త జంట సర్ప్రైజ్
టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి పెళ్లి వేడుక ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లిలో సన్నిహితులు, బంధుమిత్రులు సందడి చేశారు. పెళ్లి తర్వాత తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు విరోష్ జంట. పెళ్లి తర్వాత విరోష్ జంట తొలిసారి భార్య, భర్తలుగా భాగ్యనగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.తాజాగా అభిమానుల కోసం విరోష్ జంట కీలక నిర్ణయం తీసుకుంది. తమ వెడ్డింగ్ సందర్భంగా అభిమానుల కోసం ప్రత్యేక స్వీట్స్ పంపిణీ చేయనున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో మార్చి 1వ తేదీన ఆదివారం మిఠాయిలు పంచనున్నారు. ఆ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల వద్ద స్వీట్స్ పంపిణీ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అంతేకాకుండా ఈ ఆలయాల వద్ద అన్నదానం కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ టాలీవుడ్ జంట మార్చి 4న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు.❤️ pic.twitter.com/zXPGxIxHz7— Rashmika Mandanna (@iamRashmika) February 28, 2026 -
విశేషాలకు కొదవ లేని కొడవ కళ్యాణం
అక్కడ పురోహితులు ఉండరు... వేద మంత్రోచ్చారణలు వినిపించవు... వధూవరులు ఏడడుగులు వేయరు... ‘కొడవ’ సంప్రదాయ పద్ధతిలో జరిగే వివాహ వేడక ఇలానే ఉంటుంది. అంతేనా? ఇంకా చాలా విశేషాలుంటాయి. తెలుగు సంప్రదాయానికి పూర్తి భిన్నంగా ఈ వేడుక ఉంటుంది. టాలీవుడ్ లవ్బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా ఈ రెండు పద్ధతుల్లోనూ పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 26న ఉదయం తెలుగు సంప్రదాయంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అదే రోజు సాయంత్రం కర్ణాటకలోని కొడవ పద్ధతిలో పెళ్లి జరిగింది. దీంతో కొడవ తెగకు సంబంధించిన వేడుక ఎలా జరిగి ఉంటుందా?! అనే చర్చలు మొదలయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం...విజయ్ దేవరకొండది తెలంగాణలోని నాగర్కర్నూలు. రష్మికది కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్ పేట. కొడగునే కూర్గ్ అని కూడా పిలుస్తారు. అక్కడి స్థానిక వారియర్ కమ్యూనిటీనే కొడవగా పిలుస్తారు. కొడవ ప్రజల సంస్కృతి, ఆహార్యం, సంప్రదాయాలు మిగతా వారితో పోల్చితే భిన్నంగా ఉంటాయి. వారి పూర్వీకులను గౌరవిస్తూ వివాహ వేడుకలను జరుపుతారు. మామూలుగా జరిగే తెలుగు వివాహాలకు భిన్నంగా కొడవ వెడ్డింగ్ ఉంటుంది. అగ్నిసాక్షిగా ఏడడుగులు నడుస్తూ ప్రమాణాలు చేసుకోవడం వంటిది ఏమీ ఉండదు. సుదీర్ఘంగా పెళ్లి మంత్రాలు వినిపించవు. అరిటాకుల్లో విందు, సంప్రదాయ అలంకరణలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ. ఈ వివాహ వేడుకను వాళ్లు ‘మంగళ’ అని పిలుస్తారు. అంతా పెద్దల సమక్షంలో, ప్రకృతి సాక్షిగా జరుగుతుంది. వేదికను అరిటాకులతో పచ్చదనానికి ప్రతీకగా అలంకరిస్తారు.భిన్నమైన కట్టుకొడవ పెళ్లిలో వధూవరులిద్దరూ అభ్యంగన స్నానం చేస్తారు. అనంతరం తమ సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. పెళ్లి కొడుకు ‘కుష్య’ అనే నల్లని కోటు, ‘చేలే’ అని పిలిచే నడుముకు కట్టే పట్టీ, ‘పీచే కత్తి’ (చిన్న కత్తి) ధరిస్తాడు. ఇక వధువు చీరకట్టు సంప్రదాయం మిగతా చీరకట్టులతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. సాధారణంగా భారతీయ వస్త్రధారణలో చీర పల్లూను ముందు నుంచి వెనక వైపుకు వేస్తారు. కానీ కొడవ సంప్రదాయంలో చీర కొంగును వెనక నుంచి ముందుకు తీసి, వేస్తారు. అలాగే, వెనక వైపు కుచ్చిళ్లు వచ్చేలా కట్టుకునే ప్రత్యేకమైన కట్టు ఈ కమ్యూనిటీలో కనిపిస్తుంది. ఇక వేడుక అంతా డ్రమ్ బీట్స్, పాటలతో వారియర్ నేపథ్యాన్ని గుర్తుచేసే నృత్యాలు చేస్తారు. అలాగే గన్ సెల్యూట్స్ కూడా ఆ వేడుకలో భాగమే. ఈ పద్ధతిని అనుసరిస్తూ విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా కూడా ఈ నృత్యాలు చేశారు.కొడవలు ఎవరు కొడవలను ‘కూర్గులు’ అని కూడా అంటారు. వీరిది కర్ణాటక రాష్ట్రంలోని కొడగు (కూర్గ్) ప్రాంతం. వీరు సుమారు 1.6 లక్షల దాకా ఉన్నారని అంచనా. గతంలో వీరు వ్యవసాయం, ఇతర పనుల మీద ఆధారపడి జీవించేవారు. 19వ శతాబ్దంలో కాఫీ సాగు ద్వారా వీరి పనికి ప్రాధాన్యం లభించింది. మొదట వ్యవసాయ ఆధారిత పండుగలు జరుపుకునే వీరు అనంతరం ఇతర పండుగలూ జరుపుకోవడం మొదలుపెట్టారు. కావేరి నది వీరికి ప్రాధాన్యమైనది. బ్రిటిష్ పాలన సమయంలో వీరు ఇతర రంగాల్లోకి ప్రవేశించారు. వీరి నైపుణ్యాలను గమనించి బ్రిటిష్ అధికారులు వీరిని మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో వినియోగించారు. కొడవల్లో అనేకమంది స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు.బంగారు నాణేల మూటపెళ్లి వేదికకు వచ్చే మార్గంలో అరటి చెట్టు నాటుతారు. వరుడు దీని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, అనంతరం ఆ చెట్టు కాండాన్ని నరకడం ఒక ముఖ్యమైన ఆచారంగా ఉంటుంది. ఇది వరుడి పరాక్రమానికి, అడ్డంకులను తొలగించడానికి ప్రతీకగా నిలుస్తుంది. తర్వాత వరుడు పెళ్లి పీటల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, తూర్పు ముఖంగా కూర్చుంటాడు. ఆ సమయంలో ముందుగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు వరుడిని ఆశీర్వదిస్తారు. తర్వాత వధువు అక్కడికి చేరుకుని వరుడికి పాలు, బహుమతులు, బంగారం, వెండి, రాగి నాణేలను అందిస్తుంది. ఇది సంపద, శుభం, స్థిరత్వానికి సంకేతంగా భావిస్తారు.12 గులకరాళ్లతో వధువుపై సర్వహక్కులువధూవరులిద్ద్దరూ మల్లెపూల దండలు మార్చుకుంటారు. పవిత్ర దీపం ఎదురుగా నిలబడి వధువు బాధ్యత వరుడికి అప్పగిస్తున్నామని పెద్దలు చెబుతారు. దీంతో పాటు వధువు తరఫు పెద్దలు 12 గులకరాళ్లు వరుడి పెద్దలకు ఇచ్చి, వధువుపై సర్వహక్కులు ఇస్తున్నామని చెబుతారు. అయితే వరుడి వైపు పెద్దలు 11 రాళ్లు తీసుకొని ఒకటి తీసుకోకుండా వదిలేస్తారు. అవసరమైన సందర్భంలో వధువుపై వారికీ హక్కు ఉందనే అర్థంలో ఇలా చేస్తారు. పుట్టింటివారికి కూతురి పట్ల కొంత బాధ్యత ఉంటందని సూచించడానికే ఇలా చేస్తారని చెప్పవచ్చు.నీళ్ల బిందె తలపై పెట్టుకొని..పెళ్లి తర్వాత వధువు తమ అత్తగారి ఇంటి వద్ద గంగా పూజ చేస్తుంది. ఈ పూజ కోసం వధువు బావి నుంచి నీటిని తోడి, ఆ బిందెను తలపై పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంది. ఈ సమయంలో వరుడి కుటుంబ సభ్యులు ఆమెను ఆటపట్టిస్తూ, ఆమె నడవకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆమె సహనాన్ని, ఓర్పును పరీక్షించడానికే ఈ ఘట్టం. ఇతర హిందూ వివాహాలకు భిన్నంగా కొడవ పెళ్లిళ్లలో మాంసాహారాన్ని వడ్డిస్తారు. అందులో ప్రధానంగా పంది మాంసం, మద్యం తప్పనిసరిగా ఉంటాయట. దీంతో విజయ్–రష్మిక పెళ్లి వేడుకలో ఈ వంటకాన్ని కూడా వడ్డించారు. ఇలా ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో, సాయంత్రం కొడవ సంప్రదాయ పద్ధతిలో జరిగిన విజయ్–రష్మికల వివాహ వేడుకలు ‘టాక్ ఆఫ్ ది నేషన్’ అయ్యాయి. మార్చి 4న హైదరాబాద్లో వీరి వివాహ రిసెప్షన్ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.విరోష్ సెలబ్రేషన్స్‘‘దేశంలోని ప్రజలందరూ ఎప్పుడూ మా ప్రయాణం, ప్రేమలో భాగమయ్యే ఉన్నారు. అందుకే మీ అందరితో మా వెడ్డింగ్ను సెలబ్రేట్ చేసుకోవడం మాకెంతో సంతోషం. ప్రతి వేడుకను ఇండియా ఎలా అయితే ఫుడ్ అండ్ మిఠాయిలతో సెలబ్రేట్ చేసుకుంటుందో అలా మా జీవితంలోని ఈ బిగ్ మూమెంట్ను మీతో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు మార్చి 1న దేశవ్యాప్తంగా ఫుడ్ అండ్ స్వీట్ ట్రక్స్ను పంపిస్తున్నాం (కొన్ని నగరాల్లో మాత్రమే). అలాగే దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నాం. మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి. ప్రేమతో విజయ్ అండ్ రష్మిక’’ అంటూ విజయ్ దేవరకొండ, రష్మిక ‘ఎక్స్’ లో శనివారం రాత్రి ఓ పోస్ట్ షేర్ చేశారు. అలాగే ‘విరోష్ సెలబ్రేషన్స్’ అంటూ, ఏయే నగరాల్లో స్వీట్స్ పంచనున్నారు, ఏయే దేవాలయాల్లో అన్నదానం నిర్వహించనున్నారన్న జాబితాను కూడా ఈ ఇద్దరూ షేర్ చేశారు.స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్... ∙తెలంగాణ – హైదరాబాద్, మహబూబ్నగర్, కరీంనగర్, ∙ఢిల్లీ (ఎన్సీటీ) – ఢిల్లీ ∙చండీఘర్ (యూటీ)– చండీఘర్ ∙ఉత్తరప్రదేశ్ – నోయిడా, గజియాబాద్ ∙గుజరాత్ – అహ్మదాబాద్ ∙మధ్యప్రదేశ్ – భోపాల్ ∙మహారాష్ట్ర – ముంబై ∙రాజస్థాన్ – జైపూర్ ∙ఆంధ్రప్రదేశ్ – వైజాగ్, విజయవాడ, పుట్టపర్తి ∙కేరళ – కొచ్చి ∙కర్ణాటక – మైసూర్, కూర్గ్, బెంగళూరు ∙తమిళనాడు – కోయంబత్తూర్, చెన్నై ∙పాండిచ్చేరి (యూటీ) – పాండిచ్చేరి ∙బిహార్– (ట్రైన్ యాక్సిడెంట్ కారణంగా సోమవారానికి వాయిదా). -
విజయ్ పెళ్లిలో ఈషా రెబ్బ, తరుణ్ భాస్కర్ అట్రాక్షన్ (ఫోటోలు)
-
విజయ్, రష్మికలకు సర్ప్రైజ్ గిఫ్ట్
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న నూతనంగా పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి సంతోషాన్ని రెట్టింపు చేసేందుకు రణబాలి మూవీ నుంచి స్పెషల్ వీడియోను విడుదల చేసి మేకర్స్ సర్ప్రైజ్ చేశారు. ఏందయ్య సామీ అంటూ సాగే ఒక గీతాన్ని ప్రోమోగా వదిలారు. సింగర్స్ శ్వేతా మోహన్, అజయ్ గోగవాలే ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఈ పాటలో కొత్తగా పెళ్లైన దంపతులుగా విజయ్, రష్మికలు కనిపిస్తున్నారు. 1854 - 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా రణబాలి చిత్రాన్ని డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఉదయపూర్ ఎయిర్పోర్ట్లో సందడి చేసిన 'విరోష్' జోడీ (ఫొటోలు)
-
విరోష్... ఓ రికార్డ్
బాక్సాఫీస్ దగ్గర భారీ సినిమాలు వసూళ్లపరంగా రికార్డ్ బ్రేక్ చేయడం కామన్. అయితే ఇప్పుడు ‘విరోష్’ (విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా) వివాహం ఓ రికార్డ్ బ్రేక్ చేసింది. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గల మెమెంటోస్ ప్యాలెస్ వేదికగా ఉయం 10 గంటల 10 నిమిషాలకు విరోష్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి ఫొటోలను ‘విరోష్’ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, ఒకరిçపట్ల మరొకరికి ఉన్న ప్రేమను చెబుతూ, ఓ పోస్ట్ని కూడా షేర్ చేశారు. కాగా... రష్మికా మందన్నా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫొటోలకు అత్యధిక లైక్స్ దక్కాయి. దీంతో ‘విరోష్’ వివాహ ఫొటోలు రికార్డ్ సాధించాయి. బాలీవుడ్ కపుల్ పిద్ధార్థ్ మల్హోత్రా–కియారా అద్వానీల పెళ్లి ఫొటోలు అత్యధిక లైక్స్ దక్కించుకున్న రికార్డ్ని సొంతం చేసుకున్నాయి. ఆ రికార్డ్ని తాజాగా విరోష్ ఫొటోలు బ్రేక్ చేశాయి. షేర్ చేసిన తక్కువ సమయంలో ఎక్కువ లైక్స్ (15.8 మిలియన్లు) సాధించిన సిద్ధార్థ్–కియారాల రికార్డ్ని 18.5 మిలియన్ల లైక్స్తో ‘విరోష్’ పెళ్లి ఫొటోలు బ్రేక్ చేశాయి. ఈ నంబర్ ఇంతటితో ఆగలేదు... లైక్స్ సంఖ్య పెరుగుతూ వస్తోంది. శుక్రవారం సాయంత్రం దాటుతున్న సమయంలో ఈ సంఖ్య 20 మిలియన్లకు పైగా దాటింది. అంటే... దాదాపు రెండు కోట్లకు పైనే లైక్స్ దక్కాయి. దీన్నిబట్టి విజయ్–రష్మికల జోడీకి ఎంత క్రేజ్ ఉందో ఊహించుకోవచ్చు.ఉదయ్పూర్ టు హైదరాబాద్: పెళ్లి ఫొటోల్లో బ్యూటిఫుల్ కపుల్లా కనిపించిన విజయ్–రష్మిక శుక్రవారం ఎయిర్పోర్టులో క్యూట్గా కనిపించి, ఆకట్టుకున్నారు. శుక్రవారం ఈ నూతన జంట హైదరాబాద్ చేరుకుంది. కాగా ఎయిర్పోర్టులో ఈ జంటని చూసి, ‘కంగ్రాచ్యులేషన్స్’ అంటూ ఫ్యాన్స్ అభిమానం చాటుకోగా... ‘విరోష్’ శిరస్సు వంచి నమస్కరించడంతో పాటు ఫ్లయింగ్ కిస్లు ఇస్తూ... చిరునవ్వులు చిందించారు. మార్చి 4న హైదరాబాద్లో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ప్రధానికి ఆహ్వానం... వైరల్భారత ప్రధాని నరేంద్ర మోదీని గత వారం విజయ్–రష్మిక స్వయంగా కలిసి, తమ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ జంటను ఆశీర్వదిస్తూ... మోదీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ కూడా వైరల్గా మారిన విషయం తెలిసిందే. కాగా... మోదీని విజయ్–రష్మిక కలిసిన ఫొటోలు తాజాగా బయటకు రాగా... అవి కూడా వైరల్గా మారాయి. -
హైదరాబాద్లో అడుగుపెట్టిన విరోష్ జంట.. వీడియో వైరల్
టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయ్పూర్లో గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత భాగ్యనగరంలో అడుగుపెట్టారు. ఫ్యామిలీతో కలిసి శంషాబాద్ చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈ ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరిద్దరి వివాహ వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లిలో సన్నిహితులు, బంధుమిత్రులు సందడి చేశారు. పెళ్లి తర్వాత తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు విరోష్ జంట.అంతకుముందు ఇవాళ ఉదయం ఈ జంట ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఈ కొత్త ఈ జోడిని చూసిన వారందరూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో విజయ్, రష్మికలు అక్కడ ఉన్న ప్రేక్షకులకు నమస్కారం చేస్తూ అభివాదం చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలైంది. ఈ టాలీవుడ్ జంట మార్చి 4న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. The lovely couple #VijayDeverakonda & #RashmikaMandanna touch down in Hyderabad post-wedding!❣️✨#VIROSH #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/gY55ei8q5s— Telugu FilmNagar (@telugufilmnagar) February 27, 2026 -
విజయ్తో పెళ్లి.. ముందే చెప్పిన రష్మిక.. వీడియో వైరల్..!
టాలీవుడ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన విరోష్ వెడ్డింగ్ గ్రాండ్గా జరిగింది. కొన్నేళ్ల పాటు సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరు పెళ్లికి కొద్ది రోజుల ముందే అఫీషియల్గా ప్రకటించారు. ఎంగేజ్మెంట్ కూడా అత్యంత ప్రైవసీ పాటించిన ఈ జంట ఉదయ్పూర్లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్లో ఒక్కటయ్యారు. ఎక్కడా కూడా తమ రిలేషన్షిప్ బయట పడకుండా కొన్నేళ్ల పాటు కొనసాగించారు. ఎక్కడికెళ్లినా జంటగా కనిపించి దొరికిపోయినప్పటికీ ఎక్కడా కూడా అఫీషియల్గా ప్రకటించలేదు.అలా కొన్నేళ్లుగా వీరిద్దరి డేటింగ్ రూమర్స్ వస్తున్నా వాటిని అస్సలు పట్టింకోలేదు విరోష్ జంట. కేవలం తమ సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. అలా అత్యంత సీక్రెట్గా విజయ్- రష్మిక తమ బంధాన్ని కొనసాగించారు. అయితే గతేడాది ఓ సినిమా ఈవెంట్కు హాజరైన రష్మిక.. తన పెళ్లి గురించి ముందుగానే చెప్పేసింది. కానీ మనకే అర్థం కాలేదంటూ నెటిజన్స్ ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ అదేంటో మనం కూడా తెలుసుకుందాం.గతంలో ఓ మూవీ ఈవెంట్కు హాజరైన రష్మికను.. అనంద్ దేవరకొండ ఆట పట్టించాడు. దీనికి రష్మిక సమాధానమిస్తూ.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా.. ఇలా నన్ను స్పాట్లో పెట్టి అడిగితే ఎట్లా అంటూ అప్పుడే హింట్ ఇచ్చేసింది. రష్మిక- విజయ్ పెళ్లి వేళ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2024లోనే ఈ విషయం మనం అర్థం చేసుకోవాల్సిందని అంటూ నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 2024 లోనే అర్థం చేసుకోవాల్సింది మనం We did a mistake 😭😭😭😭😭😭#RashmikaMandanna #VijayDeverakonda pic.twitter.com/tryvGuCGsF— Swaasthi (@swaasthi) February 26, 2026 -
ఉదయపూర్ ఎయిర్పోర్ట్లో సందడి చేసిన 'విరోష్' జోడీ
-
విజయ్- రష్మిక పెళ్లి వేడుక.. అందరి ఫోకస్ వాటిపైనే..!
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా ఎట్టకేలకు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఉదయ్పూర్ వేదికగా ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్లో అత్యంత సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 26న ఉదయం పదిగంటల పది నిమిషాలకు విజయ్ దేవరకొండ.. రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. ఆ తర్వాత తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు విరోష్ జంట.ఈ ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్స్ వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి పెళ్లిలో వీరిద్దరు ధరించిన నగలపై పడింది. రాయల్ లుక్లో కనిపించిన ఈ నగలే వీరు షేర్ చేసిన ఫోటోలు హైలెట్గా నిలిచాయి. దీంతో నెట్టింట వాటి గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.ఉదయ్పూర్లో జరిగిన ఈ వేడుకలో విరోష్ జంట ధరించిన నగలు హైలెట్గా నిలిచాయి. రష్మిక నక్షీ వర్క్ నగలు రాజసం ఉట్టిపడేలా కనిపించాయి. విజయ్ దేవరకొండ ధరించిన క్లాసిక్ గోల్డ్ జ్యూవెలరీ కూడా అచ్చం రాజులు ధరించినట్లుగా మెరిసిపోయింది. అలా గ్రాండ్ రాయల్ లుక్తో వీరిద్దరు తమ వెడ్డింగ్ను సెలబ్రేట్ చేసుకున్నారు. -
హైదరాబాద్కు విజయ్– రష్మిక.. తొలిసారి జంటగా (వీడియో)
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న హైదరాబాద్కు రానున్నారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వివాహం చేసుకున్న తర్వాత తొలిసారిగా కలిసి కనిపించారు. తాజాగా ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న ఈ జోడిని చూసిన వారందరూ శుభాకాంక్షలు చెప్పారు. ఈ క్రమంలో విజయ్, రష్మికలు అక్కడ ఉన్న ప్రేక్షకులకు నమస్కారం చేస్తూ అభివాదం చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.పెళ్లికి ముందు కూడా వారిద్దరూ కలిసి ప్రయాణం చేసినప్పటికీ వేర్వేరుగా ప్లాన్ చేసుకునేవారు. ఆ సమయంలో కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే, ఇప్పుడు పెళ్లి తర్వాత ఒకరిచేయి మరోకరు పట్టుకుని సంతోషంగా ఎయిర్పోర్ట్లో కనిపించారు. ఇలా వారిద్దరూ కలిసి కనిపించడంతో ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
ViRosh అచ్చమైన దేవతలా ఆమె, ఆభరణాలతో కొత్త ట్రెండ్
లవ్బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న ఉదయపూర్లో అత్యంత వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లిని అత్యంత గోప్యంగా నిర్వహింకున్న వీరిద్దరూ పెళ్లి వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకున్నారు. ఏఐ కాదు ఒరిజినల్ అంటూ తమ అభిమాన నటుల వెడ్డింగ్ను సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే సంస్కృతి,కళ, సంప్రదాయాల ప్రాముఖ్యతల కలయికతో రాజసం ఉట్టిపడేలా , ప్రత్యేకంగా చేత్తో తయారు చేసిన ఆభరణాలు వారి రాయల్ వెడ్డింగ్ను మరింత వైభోగంగా మార్చాయి. విరోష్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో రికార్డ్ సృష్టించాయి.కర్ణాటకకు చెందిన మందన్న కొడవ వంశం, దేవరకొండ తెలుగు మూలాల సంప్రదాయాలను గౌరవిస్తూ రాయల్ లుక్లో అదరగొట్టారు. ఈ జంట దక్షిణ భారత సాంప్రదాయ వివాహ దుస్తులు , పురాతన ఆలయ ఆభరణాలతో స్వర్గం నుండి దిగివచ్చిన దేవతల్లా కనిపించారు. విరోష్ వివాహంలో వధూవరుల ఆభరణాలు, ముఖ్యంగా విజయ్ దేవర కొండ ధరించిన చెవి రింగ్స్, సాంప్రదాయ హరామ్లు, స్టేట్మెంట్ ఝుమ్కాలు, జడ బిల్లా, చంపసరాలు, హత్ఫూల్, మఠపట్టి, ముక్కు పిన్, గాజులు, బాజుబంద్, నడుము బెల్ట్, చోకర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హై-రిలీఫ్ నక్షి పని , క్లిష్టమైన రావ గ్రాన్యులేషన్ లాంటి మాస్టర్ ఆర్టిస్టులచే చేతితో రూపుదిద్దుకున్నాయని ఆభరణాల నిపుణులు పేర్కొన్నారు. ఈ వివాహ ఆభరణాలను ఒక బలమైన థీమ్తో రూపొందించారట. విజయ్ను ఒక శక్తివంతమైన రాజుగా, రష్మికను ఒక దేవతగా ప్రతిబింబించేలా ఈ డిజైన్లు శ్రీ జ్యువెలర్స్ (Shree Jewellers) తీర్చిదిద్దింది.పది నెలల కష్టం.. కిలోల కొద్దీ బంగార అద్భుత సృష్టిన్యూస్ 18 కథనం ప్రకారం, శ్రీ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు అభిషేక్ అగర్వాల్ , కౌశిక్ కుమార్ ఈ జంటతో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభూతిగా పేర్కొన్నారు. విరోష్ జీవితంలో ఒక ముఖ్యమైన వేడుకలో తాము భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు.ఈ ఆభరణాల తయారీకి సంబంధించి ఆలోచన మొదలు , చివరి రూపం తీసుకొచ్చేవరకు సుమారు పది నెలల సమయం పట్టింది. ఇందులో క్రియేటివ్ చర్చలు, కస్టమైజేషన్, మేకింగ్ , స్టైలింగ్ వంటి అనేక దశలు ఉన్నాయి. దక్షిణ భారత సాంప్రదాయ పద్ధతులైన రావా గ్రాన్యులేషన్ (Rava granulation) దీప్ నక్షి (Deep Nakshi)తో ఈ కళాఖండాలను రూపొందించారు.దేవతలా రష్మిక మందన్నవివాహ వేడుకలో రష్మిక 11 రకాల ప్రత్యేక ఆభరణాలతో మెరిసిపోయింది.దక్షిణ భారత దేవాలయ శిల్పాల నుండి స్ఫూర్తి పొంది, అనుభవజ్ఞులైన కళాకారుల నక్షి పనితనం,యాంటిక్ మ్యాట్ పాలిష్ (Antique matte polish) ఆభరణాలు ఆకర్షణీయంగా నిలిచాయి. లేయర్డ్ చోకర్, సాంప్రదాయ హారాలు, జుంకాలు, జడ బిళ్ళ, చెంపసరాలు, హాత్ ఫూల్, మఠాపట్టి, ముక్కు పుడక, గాజులు, బాజుబంద్ (వంకీ), వడ్డాణం , పట్టీలు ఈ సెట్లో ఉన్నాయి. ఇవి కేవలం అందం కోసం మాత్రమే కాకుండా, తరతరాలకు గుర్తుండిపోయే వారసత్వ ఆభరణాలుగా (Heirloom pieces) నిలిచిపోయేలా రూపొందించబడ్డాయి.విజయ్ దేవరకొండ అలంకరణ: సాధారణంగా భారతీయ వివాహాల్లో వరుడి ఆభరణాల గురించి పెద్దగా పట్టింపు ఉండదు. కానీ విజయ్ దేవరకొండ ట్రెండ్కు భిన్నంగా పెద్ద చెవిపోగులు, మణికట్టు కఫ్, ఉంగరం రెండు నెక్లెస్లు, కాళ్లకు కడియాలు, నడుము ఆభరణాలతో పురుషుల వెడ్డింగ్ జ్యువెలరీకి విజయ్ కొత్త మార్క్ను క్రియేట్ చేశారు. డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించిన రస్ట్ ఆరెంజ్ చీరను ధరించగా, విజయ్ దేవరకొండ ఐవరీ ధోతీ , ఎరుపు రంగు అంగవస్త్రంతో కళకళలాడుతూ అలరించారు. -
రికార్డ్ క్రియేట్ చేసిన విజయ్, రష్మిక పెళ్లి ఫోటో..
ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం చేసుకున్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గల మెమెంటోస్ ప్యాలెస్లో అతికొద్దిమంది సమక్షంలో ఒక్కటయ్యారు. విరోష్ పేరుతో తమ ఫ్యాన్స్ కోసం వారు కొన్ని ఫోటోలు షేర్ చేశారు. అయితే, తమ అభిమానులు ఈ జంటపై ప్రేమతో పాటు శుభాకాంక్షలు కురిపించారు. పెళ్లి ఫోటోలు సోషల్మీడియాలో సంచలనంగా మారాయి. మిలియన్ల కొద్ది లైక్స్తో రికార్డ్ క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా రేంజ్లో వీరి పెళ్లి ఫోటోకు అత్యధికంగా లైక్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డ్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.సినీ పరిశ్రమకు సంబంధించి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఆ సందర్భంగా గతంలో వారు కూడా ఫోటోలు పంచుకున్నారు. బాలీవుడ్ నటి కియారా అద్వానీ తమ పెళ్లి సమయంలో ఫోటోలు షేర్ చేస్తే 15.8 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఇప్పటివరకు ఇదే రికార్డ్. కానీ, తాజాగా విరోష్ జోడీ 18.5 మిలియన్ల లైక్స్తో రికార్డ్ క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండ కూడా అవే ఫోటోలను షేర్ చేశారు. అక్కడ కూడా 15.2 మిలియన్ల లైక్స్ రావడం విశేషం. మరోసారి విజయ్- రష్మిక జోడీ తమ ఇమేజ్ను చిత్రపరిశ్రమకు చూపారని ఫ్యాన్స్ అంటున్నారు.విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి రణబాలి సినిమాలో నటిస్తున్నారు. టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు. ‘టాక్సీవాలా’ విజయం తర్వాత మరోసారి విజయ్తో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదే ఏడాది సెప్టెంబర్ 11న ఈ మూవీ విడుదల కానుంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
రష్మిక మందన్న మేలి ముసుగుపై శక్తిమంతమైన ఆ పదాలు..!
టాలీవుడ్ సెలబ్రిటీ జంట రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి26, 2026న గురువారం అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయపూర్ వెలుపల 50 కి.మీ దూరంలో ఉన్న అద్భుతమైన ఐటీసీ మెమెంటోస్లో వీరి వివాహం జరిగింది. అయితే వీరిద్దరు తమ పెళ్లిలో ఎంచుకున్న కాస్ట్యూమ్స్ మొత్తం సాంస్కృతిక వారసత్వానికి అర్థం పట్టేలా ఎంచుకున్నారు. ఆధునికతను జోడిస్తూ..సాంప్రదాయ విలువలకు అనుగుణంగా తీర్చిద్దిన డిజైనర్ వేర్లో ముగ్ధమనోహరంగా మెరిశారు. అయితే పెళ్లిలో దాంపత్య విలువను తెలియజేసే పెళ్లి మంత్రాల మాదిరిగా తాను ధరించిన చీరలో సైతం దాన్ని ప్రదర్శించింది రష్మిక. అది ఆ వేడుకనే నిశబ్దంగా హైలెట్ చేసింది. ఇక్కడ రష్మిక ధరించిన ముసుగుపై ఉన్న మూడు శక్తిమంతమైన పదాలు వైవాహిక బంధం గొప్పతనం తెలియజేసేలా చాలాచక్కగా పొందుపరిచారు. ఇంతకీ అక్కడ ఏమని రాశారంటే..రష్మిక పెళ్లివేడుకలో లేత ఎరుపు గోల్డ్ అంచు చీరలో మెరిశారు. మొత్తం చీరపై ఆలయ ప్రేరేపిత ఎంబ్రాయిడరీలు, తోరణాలు, స్థంబాలు, పవిత్రమైన మోటీఫ్లతో చాలా వివరణాత్మకంగా తీర్చిదిద్దారు. వాటిలో హైదరాబాద్ చారిత్రాత్మక వాస్తుశిల్పం నుంచి గర్భగుడులు, ఆధ్యాత్మికతకు సంబంధించి.. ఆలయ గృహనమునాలతో ఎంబ్రాయిడరీ చేశారు. బంగారు జరీ వర్క్తో డిజైన్ చేశారు. దానికి తగ్గట్టుగా బ్లౌజ్ సైతం బంగారు థ్రెడ్వర్క్తో చక్కటి ఎంబ్రాయిడరీతో హుందాగా ఉంది. దానికి రాయల్టీ లుక్క్ఇచ్చేలా ధరించిన బంగారు మేలి ముసుగు అత్యంత ఆకర్షణీయంగా కనిపించింది. చూపురులను ఆ ముసుగు బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా దానిపై ఉన్న బంగారు ఎంబ్రాయిడరీతో రాసిన ఆ " ప్రతి జీవితకాలంలో" అనే పద బంధం అందర్నీ ఆలోచింపచేసేలా ఆకర్షించింది. అంటే.. జీవితాంతం ఒకరికొకరు మనం వేరు కాదు, ఇది జన్మజన్మల బంధం అని చెబుతూ భావోద్వేగంగా అందరి హృదయాలను తాకింది. వైవాహిక జీవిత గొప్పదనాన్ని ఈ చిన్న పద బంధంతో చాలా అద్భుతంగా హైలెట్ చేసి చెప్పారు. ఒకరకంగా ఇది ఆ డిజైనర్ నైపుణ్యాన్ని నొక్కి చెప్పింది కూడా. ఇక రష్మిక అందుకు తగ్గట్టు ధరించిన ఆభరణాలు గజిబిజి కాకుండా చాలా చక్కగా పెట్టిన తీరు చాలా బాగుంది. నెక్లైన్ నుంచి లేయర్డ్ ఆభరణాలు, చోకర్లు ఆ చీర లుక్ని మరింత హైలెట్ చేశాయి.అలాగే తలపై ధరించిన పాపిడి బొట్టు సైతం చెదరకుండా చక్కగా అమర్చారు. రష్మిక మొత్తం ఆహార్యం దివి నుంచి భువికి వచ్చిన దేవ కన్యలా అబ్బురపరిచింది. ఇక హీరో విజయ్ దేవరకొండ అనామిక ఖన్నా డిజైనర్ వేర్ ఐవరీ ధోతీ సిల్హౌట్ ధరించి అద్భుతమైన వెర్మిలియన్ అంగవస్త్రంతో రాజకుమారుడిలా కనిపించారు. ఆయన ధరించి ధోతి హైదరాబాద్ వారసత్వం వనసింగారం నేత, దానిపై అడవి, ఆలయ మూలాంశాలతో కూడిన ఎంబ్రాయిడరీ మన సాంస్కృతిక వారసత్వ శక్తిని హైలెట్ చేశాయి.(చదవండి: నటి రష్మిక మందన్న 'కొడగు' శారీ స్టైల్..! ఈ చీరకట్టు స్పెషాల్టీ ఇదే..) -
ప్రధాని మోదీని కలిసిన 'విరోష్' జోడీ
-
మండపంలో విరోష్ ఆనందభాష్పాలు.. కల్యాణి పోస్ట్
గతకొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విజయ్ దేవరకొడ- రష్మిక మందన్నా జంట మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టారు. ఫిబ్రవరి 26న వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. రాజస్థాన్ ఉదయ్పూర్లోని మెమొంటోస్ ప్యాలెస్ ఈ వివాహ వేడుకకు వేదికగా నిలిచింది. ఈ పెళ్లి సెలబ్రేషన్స్కు ఇరు కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి బంధుమిత్రులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.ఇది నా అదృష్టంవారిలో మలయాళ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ ఒకరు. విరోష్ (విజయ్-రష్మిక జంటను ఫ్యాన్స్ ముద్దుగా విరోష్ అనే పిల్చుకుంటారు) జంట పెళ్లి చూడటం తన అదృష్టమంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. ఎంతో మంచి మనసున్న అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్ను పెళ్లాడిన మధుర క్షణాలను కళ్లారా చూశాను. ఆమె అతడివైపు అడుగులు వేస్తూ వస్తున్నప్పుడు అతడు స్తబ్ధుగా కూర్చుని ఆ శబ్ధాన్ని వింటున్నాడు.ఆనంద భాష్పాలుఆమె అలా మండం వైపు వస్తుంటే ఇద్దరి కళ్లలో కనిపించిన ఆనంద భాష్పాలు వారి మధ్య ప్రేమను తెలియజేస్తున్నాయి. డీప్ ఫ్రెండ్షిప్, పరస్పర గౌరవంతో ఒక్కటైన ఈ జంటను ఇలా చూడటం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. రష్మిక- విజయ్కు ఇది మరో అందమైన ప్రారంభం అని రాసుకొచ్చింది.చదవండి: విరోష్ పెళ్లి.. ఇద్దరూ ఎంత చదువుకున్నారంటే? -
పెళ్లి తర్వాత మోదీ, అమిత్ షాలను కలిసిన 'విరోష్' జోడీ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా సరే ‘విరోష్’ జోడీ పేరుతో వారి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నిన్న ఉదయపూర్లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగిన విషయం తెలసిందే. అయితే, మార్చి 4న జరగనున్న తమ రిసెప్షన్కు రావాలని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రి అమిత్ షాను విజయ్, రష్మిక ఆహ్వానించారు. పెళ్లి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత నూతన దంపతులు కలిసి అహ్వానం అందించారు. ఇప్పటికే వారిద్దరికీ శుభాంకాక్షలు చెబుతూ మోదీ ఒక లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 4న హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ జరగునుంది. ఈ రిసెప్షన్ కోసం ఇప్పటికే పలువురు రాజకీయ సినీ వ్యాపారవేత్తలను విజయ్, రష్మిక ఆహ్వానించారు.‘గీత గోవిందం’ సినిమాలో హీరో హీరోయిన్లుగా పెళ్లి పీటల మీద కూర్చున్న విజయ్ దేవరకొండ – రష్మికా మందన్నా నిజ జీవితంలో ఏడడుగులు వేశారు. ముందు స్నేహితులై, ఆ తర్వాత ప్రేమికులుగా మారి ఇప్పుడు భార్యాభర్తలయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గల మెమెంటోస్ ప్యాలెస్లో ఉదయం 10 గంటల 10 నిమిషాలకు వైభవంగా, ఆహ్లాదకరంగా జరిగింది. ఉదయం తెలుగు, సాయంత్రం కొడవ (కర్ణాటకకు చెందిన కొడగు జిల్లా రష్మిక సొంతూరు) సంప్రదాయం పరంగా పెళ్లి వేడుకలు జరిగాయి. దండలు మార్చుకున్నప్పుడు వధూవరులిద్దరూ ఆనందబాష్పాలతో ఉద్వేగానికి గురయ్యారు. భావోద్వేగాలు, చిరునవ్వులు మధ్య జరిగిన ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నవారు నూతన వధూవరులిద్దర్నీ ఆశీర్వదించారు. -
నటి రష్మిక మందన్న 'కొడగు' శారీ స్టైల్..!
నటి రష్మిక మందన్న పెళ్లి గురువారం ఉదయం తెలుగు సంప్రదాయంలో, సాయంకాలం కొడగు (కూర్గి) సంప్రదాయ పద్ధతిలో వైభవంగా జరిగింది. తన సంప్రదాయ మూలాలను మర్చిపోకుండా కొడగు స్టైల్ కట్టును వివిధ సందర్భాలలో ధరించడం మనం చూశాం. వివాహం, ఇతర వేడుకలలో కొడగు సంప్రదాయ చీరకట్టుదే ప్రత్యేక ఆకర్షణ.రష్మిక వివాహ వేడుక సందర్భంగా కొడగు చీరకట్టు ప్రాచుర్యంలోకి వచ్చింది. మన దేశ సంప్రదాయ డ్రేపింగ్ శైలిలో విలక్షణంగా కనిపించే కొడగు కట్టును రీ క్రియేషన్ చేసి, బాలీవుడ్ క్లాసిక్ సినిమాలలోనూ కనువిందు చేశారు తారలు. కొడగు స్టైల్ డ్రేప్ ట్రెండ్ గురించి..కర్నాటకలోని కొడగు జిల్లాలో మగువల చీరకట్టులో ప్రత్యేకంగా కనిపిస్తుంది ఈ శారీ డ్రేపింగ్. కొండ ప్రాంతంలో పుట్టిన సంప్రదాయ శైలి ఇది. కొడగు లేదా కొడవ లేదా కూర్గి అని పిలిచే కమ్యూనిటీలోని వివాహ సమయంలో అక్కడి వధువు జరీ అంచుతో ఉన్న పట్టు చీరను వారి సంప్రదాయ శైలిలో ధరిస్తుంది. ఇది కేవలం ఒక శైలి కాదు ఒక తరం నుండి మరొక తరానికి అందివస్తున్న వారసత్వం. ఈ చీరకట్టు కొడవ మహిళల బలం, అందం, స్వాతంత్య్రాన్ని ప్రతిబింబింపజేస్తుంది. వేడుకలలో సాధారణంగా ఎరుపు, ఆకుపచ్చ, బంగారు రంగులలో .. జరీ అంచుతో ఉండే కాంతిమంతమైన పట్టు చీరలను ఎంచుకుంటారు. ఇవి శుభాన్ని, శ్రేయస్సును తీసుకువస్తాయని వారి నమ్మకం.నడుము వద్ద చీరను పెట్టికోట్ లోపలికి టక్ చేస్తారు. సాధారణ చీరకట్టుకు భిన్నంగా ముందు వైపు కాకుండా కూర్గి శారీ డ్రేప్కు వెనకవైపు కుచ్చిళ్లు పెడతారు.చీరను రెండుసార్లు శరీరం చుట్టూ తిప్పుతూ, చీర పల్లూ ఛాతీ మీదుగా ఎడమ భుజం కింద నుంచి, కుడి భుజం పై నుంచి ముందుకు తీస్తారు.కుడి భుజం నుంచి తీసిన పల్లూని బ్లౌజ్తో కలిపి పిన్తో అటాచ్ చేస్తారు. పల్లూ అలంకరణ కొంత వరకు బెంగాలీ స్టైల్ను పోలి ఉంటుంది. కొడవ సంప్రదాయ ఆభరణాలలో చంద్రవంక, నాగాభరణం.. వంటి పొడవాటి హారాలతోపాటు ఇతర సంప్రదాయ నగలను అలంకరించుకుంటారు.కొడవ యువతులు షిఫాన్, జార్జెట్, ఆర్గంజా చీరలతో డ్రేపింగ్లో వివిధ రకాల ప్రయోగాలు చేస్తారు.యువతుల కోసం రెడీమేడ్ కొడవ కట్టు శారీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేక ఆకర్షణతో ఉండే బెల్టులు, బ్రోచ్లు ఈ కట్టుకు ఇప్పుడు ఫ్యూజన్ ట్విస్ట్ను తీసుకువస్తున్నాయి. View this post on Instagram A post shared by राशि रमा शर्मा (@_wearyourstory__) (చదవండి: ఆ పాదాలకు నమస్కారం..! ఏకంగా 12 వేల కిలోమీటర్లు..) -
నా బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడు నా వైఫ్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్
-
పెళ్లి వేళ.. రష్మిక, విజయ్ విద్యార్హతలు వైరల్.. ఎవరెంత చదువుకున్నారు?
టాలీవుడ్ ప్రేమ పక్షులు విజయ్ దేవరకొండ, రష్మిక భార్యభర్తలయ్యారు. ఫిబ్రవరి 26న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గల మెమెంటోస్ ప్యాలెస్లో వీరి వివాహం జరిగింది. ఉదయం తెలుగు, సాయంత్రం కొడవ (కర్ణాటకకు చెందిన కొడగు జిల్లా రష్మిక సొంతూరు) సంప్రదాయం పరంగా పెళ్లి వేడుకలు జరిగాయి. పెళ్లి ఫోటోలను అటు రష్మిక, ఇటు విజయ్ ఒకేసారి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో రష్మిక, విజయ్లకు సంబంధించిన మరో విషయంపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ చదువుకున్నారు? వీళ్ల ఎడ్యుకేషన్ ఎలా సాగింది? తదితర వివరాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు.విజయ్ ఏం చదువుకున్నాడు?విజయ్ దేవరకొండ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా అనంతపురం జిల్లా పుట్టపర్తిలోనే సాగింది. శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో బోర్డింగ్ విద్యార్థిగా తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్కు చేరుకున్న విజయ్, అబిడ్స్లోని భద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ నుండి బీకాం (B.Com) డిగ్రీని పూర్తి చేశాడు. ఆ తర్వాత చదువు ఆపేసి.. ప్యాషన్ వైపు అడుగులు వేశాడు. థియేటర్ ఆర్ట్స్ ద్వారా సినిమాల్లోకి ప్రవేశించాడు.చదువులోనూ రష్మిక ‘స్టారే’రష్మిక నటిగానే కాకుండా చదవులోనూ ‘స్టార్’గానే కొనసాగింది. ఆమె పాఠశాల విద్య మొత్తం కొడగులోని కూర్గ్ పబ్లిక్ స్కూల్లో సాగింది. ఉన్నత చదువుల కోసం బెంగళూరు వెళ్లిన రష్మిక, అక్కడ ఎం.ఎస్. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ నుండి డిగ్రీ పట్టా అందుకుంది. కేవలం ఒకే సబ్జెక్టులో కాకుండా, రష్మిక సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్లో ట్రిపుల్ మేజర్ డిగ్రీని పూర్తి చేయడం గమనార్హం.మొత్తంగా విజయ్, రష్మిక ఇద్దరూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ.. డిగ్రీల పరంగా చూస్తే మాత్రం విజయ్ కంటే రష్మికనే కాస్త ముందంజలో ఉంది. ఆమె సైకాలజీ, జర్నలిజం లాంటి కీలక రంగాలలో డిగ్రీ పట్టాపొందింది. -
వైభవంగా... ఆహ్లాదకరంగా విరోష్ వివాహం
‘గీత గోవిందం’ సినిమాలో హీరో హీరోయిన్లుగా పెళ్లి పీటల మీద కూర్చున్న విజయ్ దేవరకొండ – రష్మికా మందన్నా నిజ జీవితంలో ఏడడుగులు వేశారు. ముందు స్నేహితులై, ఆ తర్వాత ప్రేమికులుగా మారి, ఫిబ్రవరి 26న ‘విరోష్’ (ఫ్యాన్స్ ఈ ఇద్దర్నీ అలానే పిలుస్తారు. తమ వివాహ వేడుకకు ఆ పేరునే పెట్టారు విజయ్–రష్మిక) భార్యాభర్తలయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గల మెమెంటోస్ ప్యాలెస్లో ఉదయం 10 గంటల 10 నిమిషాలకు వైభవంగా, ఆహ్లాదకరంగా జరిగింది.ఉదయం తెలుగు, సాయంత్రం కొడవ (కర్ణాటకకు చెందిన కొడగు జిల్లా రష్మిక సొంతూరు) సంప్రదాయం పరంగా పెళ్లి వేడుకలు జరిగాయి. దండలు మార్చుకున్నప్పుడు వధూవరులిద్దరూ ఆనందబాష్పాలతో ఉద్వేగానికి గురయ్యారు. భావోద్వేగాలు, చిరునవ్వులు మధ్య జరిగిన ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నవారు నూతన వధూవరులిద్దర్నీ ఆశీర్వదించారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇక సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా తమ పెళ్లి ఫొటోలను షేర్ చేసి, ఒకరిపట్ల మరొకరికి ఉన్న మమకారాన్ని, నమ్మకాన్ని, ఇష్టాన్ని పంచుకున్నారు.ప్రాణ స్నేహితురాల్ని భార్యను చేసుకున్నాను: విజయ్ ‘‘ఒక రోజు ఆమెను నేను మిస్ అయ్యాను... ఆమె పక్కన ఉండి ఉంటే ఈరోజు ఇంకా బాగుండేది కదా అన్నంతగా ఆమెని మిస్ అయ్యాను. ఒకవేళ ఆమె నా పక్కన కూర్చుని ఉంటే.. నా భోజనం ఇంకా పరిపూర్ణంగా అనిపించేది కదా అనిపించింది... అలాగే నాతో కలిసి ఆమె వర్కవుట్స్ చేస్తే అది పనిష్మెంట్లా కాకుండా ఫన్లా ఉండేది అనిపించింది. నా జీవితానికి ఆమె అవసరం అనిపించింది. నేను ఎక్కడ ఉన్నా ఇంట్లో ఉన్న అనుభూతిని, ప్రశాంతతను ఇచ్చే ‘ఇల్లు’ అంటే తనే అని నాకు అర్థమైంది. అందుకే నేను నా ప్రాణ స్నేహితురాల్ని నా భార్యను చేసుకున్నాను... 26.02.2026’’ అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) విజ్జూ... మాటలు సరిపోవడం లేదు: రష్మికహాయ్ మై లవ్స్, ఇప్పుడు మీకు ‘నా భర్త’ని పరిచయం చేస్తున్నాను! మిస్టర్ విజయ్ దేవరకొండ!! నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి. ప్రశాంతంగా ఉంటే ఎలా ఉంటుందో నాకు చూపించిన వ్యక్తి. ప్రతి రోజూ పెద్ద కలలు కనడం మంచిదే అనీ, ఆ కలను సాకారం చేసుకునే సామర్థ్యం నీకు ఉందని చెప్పిన వ్యక్తి. ఎవరూ నన్ను చూడడంలేదనుకుంటూ నేను డ్యాన్స్ చేస్తుంటే నన్ను ఆపని వ్యక్తి. అలాగే స్నేహితులతో ప్రయాణం చేయడం ఎంత బాగుంటుందో చూపించిన వ్యక్తి. నన్ను నమ్మండి... ఈ వ్యక్తి గురించి ఓ పుస్తకం రాయొచ్చు. నేను ఎలాంటి స్త్రీగా ఉండాలని కలలు కన్నానో అలా ఉండేలా నువ్వు నన్ను మార్చావు.విజ్జూ... నీ గురించి ఎప్పుడు ఏం చెప్పాలన్నా నాకు మాటలు సరిపోవు. నా విజయాలు, కష్టాలు, ఆనందం, విచారం, జీవితం... ఇవన్నీ హఠాత్తుగా నాకు అర్థవంతంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నందుకు.... వీటన్నింటికీ సాక్ష్యంగా నువ్వు ఉన్నందుకు... నేను నీ భార్యను కావడం, నీ భార్యగా పిలవబడడం నాకు చాలా ఎగ్జయిటింగ్గా ఉంది. ఇది పూర్తిగాపార్టీ టైమ్. మనిద్దరం కలిసి ఒక అందమైన జీవితాన్ని గడుపుదాం. ఐ లవ్ యు. -
రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి... గెస్ట్ లిస్ట్ & గ్రాండ్ ఫుడ్ మెనూ
-
రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి వీడియో వైరల్
-
ఒక రోజు రష్మికను చాలా మిస్ అయ్యా.. పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ విజయ్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమపై వస్తున్న వార్తలకు తెరదించుతూ, నేడు (ఫిబ్రవరి 26) ఉదయం 10.10 గంటలకు రాజస్తాన్లోని ఉదయ్పూర్లో గల మెమెంటోస్ ప్యాలెస్ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక సాగింది.వివాహం అనంతరం విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాలో పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ, తన లవ్స్టోరీని అభిమానులతో పంచుకున్నారు. ‘ఒక రోజు ఆమెను చాలా మిస్ అయ్యాను. తను నా పక్కనే ఉంటే బాగుంటుందని, తను ఎదురుగా ఉంటే నేను తినే భోజనానికి ఒక అర్థం ఉంటుందని గ్రహించాను. జిమ్లో తను తోడుంటే ఆ కష్టం శిక్షలా కాకుండా సరదాగా అనిపించేది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, మనశ్శాంతిని ఇచ్చే 'ఇల్లు' అంటే తనే అని నాకు అర్థమైంది. అందుకే నా బెస్ట్ ఫ్రెండ్నే నా భార్యగా చేసుకున్నాను’ అని విజయ్ తన పెళ్లి విషయాన్ని అధికారికంగా తెలియజేశాడు. అటు రష్మిక కూడా ‘నా భర్తను పరిచయం చేస్తున్నా’ అంటూ పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకుంది.'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో వెండితెరపై మాయ చేసిన ఈ జంట, నిజ జీవితంలోనూ జంటగా మారడం పట్ల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. నటీనటులు, ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
ఇదిగో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు
-
'నా భర్తను పరిచయం చేస్తున్నా'.. రష్మిక ఎమోషనల్ పోస్ట్
తన పెళ్లి ఫోటోలను హీరోయిన్ రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. హాయ్ మై లవ్స్.. తన భర్త విజయ్ దేవరకొండను మీకు పరిచయం చేస్తున్నానంటూ పోస్ట్ చేసింది. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి అని విజయ్ను కొనియాడింది. ప్రశాంతంగా ఎలా ఉండాలో నాకు చూపించిన వ్యక్తి అని ప్రశంసలు కురిపించింది. నా కలలు నేను ఎప్పుడైనా సాధించగలనని చెప్పిన ఏకైక వ్యక్తి అంటూ భర్త విజయ్ దేవరకొండను ఆకాశానికెత్తేసింది. ఇది చూసిన అభిమానులు రష్మిక-విజయ్ జంటకు అభినందనలు చెబుతున్నారు. రష్మిక తన ఇన్స్టాలో రాస్తూ..' హాయ్ మై లవ్స్.. ఇప్పుడు మీకు నా భర్తని పరిచయం చేస్తున్నా. మిస్టర్ విజయ్ దేవరకొండ.. నిజమైన ప్రేమ, ప్రశాంతంగా ఎలా ఉండాలో నేర్పించిన వ్యక్తి. ప్రతిరోజు పెద్ద కలలు కనడం.. నేను ఎప్పుడైనా సాధించగలనని చెప్పగలిగే వ్యక్తి. స్నేహితులతో ప్రయాణించడం నాకు చూపించిన వ్యక్తి. నన్ను నమ్మండి.. నేను ఈ వ్యక్తి గురించి ఒక పుస్తకం రాయగలను. నేను ఎప్పుడూ కలలు కన్న స్త్రీని అయ్యా.. ఎందుకంటే మీరు ఈ రోజు నాదిగా మార్చారు. ఈరోజు నన్ను నిజంగా ఆశీర్వదించారు. విజ్జు నీ పట్ల నాకున్న భావాలను వర్ణించడానికి నాకు మాటలు లేవు!! నేను ఎప్పుడూ నీకు చెబుతూనే ఉన్నానంటూ' పోస్ట్ చేసింది.అంతేకాకుండా..'నా విజయాలు, కష్టాలు, ఆనందం, విచారం, జీవితం అన్నీ నీకు తెలుసు. ఇప్పుడు ప్రతిదీ చాలా అర్థవంతంగా ఉంది. ఎందుకంటే నేను నీతో ఉన్నా. ఇది మన జీవితంలో అన్నింటిలో అతిపెద్ద భాగం. నేను నీ భార్యగా మారడానికి చాలా ఉత్సాహంగా ఉన్నా. మీ భార్యగా ఉండటానికి.. మీ భార్యగా పిలవడానికి.. ఇప్పుడిది పూర్తిగా పార్టీ సమయం. మనిద్దరం కలిసి ఎప్పుడూ లేనంత ఉత్తమ జీవితాన్ని గడుపుదాం. ఐ లవ్ యూ' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.'ఉదయ్పూర్లో గ్రాండ్ వెడ్డింగ్..టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. ఇవాళ ఉదయం ఈ ఫేమస్ స్టార్స్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్కు రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా నిలిచింది. తెలుగు సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగ్గా.. సాయంత్రం కర్ణాటకలోని కొడవ సంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి వేడుక జరగనుంది. ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
గ్రాండ్గా విరోష్ పెళ్లి.. విజయ్ దేవరకొండకు భారీ కట్నకానుకలు?
టాలీవుడ్ పవర్ కపుల్ విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న చుట్టూ ఇప్పుడు భారీ హైప్ నడుస్తోంది. ఈ ప్రేమ జంట పెళ్లి ఈ రోజు(ఫిబ్రవరి 26) ఉదయం ఉదయపూర్లో ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో కట్న, కానులకు సంబంధించి పలు గాసిప్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ రష్మిక నుంచి భారీ కట్నం తీసుకుంటున్నాడనే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ రూమర్స్ నిజమా? లేక ఓవర్ హైప్నా?విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచి వీళ్ల మధ్య లింకప్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. 2025 అక్టోబర్లో హైదరాబాద్లో సీక్రెట్ ఎంగేజ్మెంట్ జరిగిందని సోర్సెస్ చెబుతున్నాయి. కానీ ఇద్దరూ ఓపెన్గా కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు వెడ్డింగ్ హడావిడి బాగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ వెడ్డింగ్ డీటైల్స్ నెటిజెన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఫిబ్రవరి 26న ఉదయపూర్లోని ఒక హెరిటేజ్ ప్యాలెస్లో వీరిద్దరి వివాహం జరిగింది. మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందని చెబుతున్నారు. ఈ వెడ్డింగ్ను 'విరోష్ వెడ్డింగ్' అని పిలుస్తున్నారు . ఇక్కడ విరోష్ అంటే విజయ్ + రష్మిక = విరోష్ అని అర్ధం.ఇకపోతే వీళ్ళ పెళ్ళి వార్తల్లో మెయిన్ కాంట్రవర్సీ డౌరీ క్లెయిమ్స్! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్ ప్రకారం, రష్మిక సైడ్ నుంచి విజయ్కు భారీ డౌరీ ఇస్తున్నారని... గోల్డ్, లగ్జరీ ప్రాపర్టీలు, ఇండియాలో హై-ఎండ్ హోమ్స్, కార్లు, క్యాష్ వంటివి ఉన్నాయని చెబుతున్నారు. కొన్ని పోస్టుల్లో "150 కోట్ల డౌరీ" అని కూడా రాస్తున్నారు! ఇది 'బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్' అని, టాలీవుడ్లో ఎప్పుడూ లేనంత గ్రాండ్గా జరగబోతోందని ట్రెండ్ అవుతోంది.కానీ ఈ క్లెయిమ్స్ ఎంత వరకు నిజం? చాలా ముఖ్యంగా – ఇవన్నీ *అన్వెరిఫైడ్* అలాగే *వైరల్ రూమర్స్* మాత్రమే! విజయ్ లేదా రష్మిక ఎవరూ ఈ డౌరీ గురించి కాదు కదా కనీసం వాళ్ళ పెళ్ళి గురించి కూడా ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. డౌరీ అనేది చట్టవిరుద్ధం, ఈ రకమైన రూమర్స్ సెలబ్రిటీల చుట్టూ తరచూ వస్తాయి – కొన్ని ట్రోల్స్, కొన్ని ఫేక్ న్యూస్ కోసం. గతంలో కూడా ఫిబ్రవరి 2 లేదా ఇతర డేట్స్పై ఫేక్ వీడియోలు వచ్చాయి, కానీ అవి తప్పు అని తేలాయి.ఈ కట్నకానుకలతో పాటు ఇంకా కొన్ని హాట్ రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. నెట్ఫ్లిక్స్ వీళ్ల వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రూ. 260 కోట్లు కూడా ఆఫర్ చేసిందని, కానీ విజయ్ రిజెక్ట్ చేశాడని చెబుతున్నారు .ఎందుకంటే తమ వెడ్డింగ్ మెమరీస్ పర్సనల్ అని వాటిని పబ్లిక్ డొమైన్ లో ఉంచడం తమకు ఇష్టంలేదని విజయ్ చెప్పాడట. అంతేకాదు ఈ పెళ్ళికి సంబంధించి సెక్యూరిటీ టీమ్ 3 వారాలు ట్రైనింగ్ తీసుకుందని, స్టార్ గెస్ట్స్ లిస్ట్ భారీగా ఉందని కూడా లీక్ అయ్యాయి. అయితే పెళ్లి గురించి అయితే కొంతవరకు ఓకే కాసీ డౌరీ లాంటి సెన్సిటివ్ టాపిక్స్పై కూడా రూమర్స్ వ్యాప్తి చేయడం మంచిది కాదు. -
రష్మిక చూసిన మొదటి తెలుగు సినిమా.. మన స్టార్ హీరోదే..!
స్టార్ హీరోయిన్ రష్మిక తెలుగింటి కోడలిగా మెట్టినింట అడుగుపెట్టనుంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రష్ పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. కర్ణాటకకు చెందిన రష్మిక తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్ల పాటు విజయ్తో ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ ఈ రోజే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వీరి పెళ్లి వేదికగా నిలిచింది. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.అియితే రష్మిక మందన్నా తెలుగింటి కోడలిగా రానున్న తరుణంలో గత ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మికను మీకిష్టమైన తెలుగు సినిమా ఏది? ఎందుకు? అని ప్రశ్నించారు. దీనికి రష్మిక సమాధానమిచ్చింది.తాను చూసిన ఫస్ట్ తెలుగు సినిమా మహేశ్ బాబు నటించిన బిజినెస్మెన్ అని తెలిపింది. నాన్నతో పాటు వెళ్లి బిజినెస్మెన్ థియేటర్లో చూశానని రష్మిక పంచుకుంది. నా కెరీర్ కాకుండా తెలుగులో నేను చూసిన మొదటి సినిమా ఇదేనని వెల్లడించింది. రష్మిక- విజయ్ పెళ్లి వేళ ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. “First Telugu movie I watched was #Businessman. I went to theatre with my father” - #RashmikaMandanna 🔥#MaheshBabu | #Varanasi pic.twitter.com/4d1xb3PWK2— VardhanDHFM (@_VardhanDHFM_) February 26, 2026 -
విరోష్ జంట గొప్పమనసు.. వారికి ప్రత్యేకంగా స్వీట్ బాక్సులు..!
ఎన్నో ఏళ్లుగా వేచి చూసిన తరుణం రానే వచ్చింది. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న విరోష్ జంట పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్లో ఉదయ్పూర్లో వీరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఇవాళ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో మూడు ముళ్లు వేశాడు విజయ్ దేవరకొండ. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విరోష్ జంట తమ గొప్పమనసు చాటుకున్నారు. వీరి పెళ్లిని కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులకు స్వీట్ బాక్సులు అందించారు. అంతేకాకుండా అక్కడే ఉన్న చిన్నపిల్లలకు సైతం స్వీట్స్ పంచారు. ఐటీసీ మెమొంటోస్ హోటల్ బయట ఉన్న వారి దగ్గరికి వచ్చిన ఈ ప్రత్యేక స్వీట్ బాక్సులు అందజేశారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #TFNExclusive A 'Sweet' gesture!❣️Team #VIROSH share joy with the media at Udaipur!!🤩✨#VijayDeverakonda #RashmikaMandanna #TeluguFilmNagar pic.twitter.com/6PryBXwsEp— Telugu FilmNagar (@telugufilmnagar) February 26, 2026 -
విజయ్ దేవరకొండకు రష్మిక ఎంత కట్నం ఇస్తుందో తెలుసా?
-
కొడవ సంప్రదాయంలో ‘విరోష్’ వివాహం.. పెళ్లి ప్రత్యేకతలు ఇవే!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. గురువారం ఉదయం 10:10 గంటలకు రష్మిక మెడలో విజయ్ దేవరకొండ మూడుమూళ్లు వేశాడు. రాజస్తాన్లోని ఉదయ్పూర్లో గల మెమెంటోస్ ప్యాలెస్ ఈ పెళ్లికి వేదికగా మారింది. ఈ రోజు సాయంత్రం మరోసారి రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నారు. తొలుత తెలుగు హిందూ పద్దతిలో ఈ జంట పెళ్లి చేసుకుంది. ఇప్పుడు రష్మిక కుటుంబ మూలలను గౌరవిస్తూ కొడవ సంప్రదాయంలో వివాహం చేసుకోబోతున్నారు.కొడవ పెళ్లి ఎలా జరుగుతుంది?రష్మికది కర్ణాటకలోని కొడగు (కూర్గ్) ప్రాంతానికి చెందిన కొడవ సామాజిక వర్గం. అక్కడి వారి పెళ్లి సంప్రదాయ భారతీయ వివాహాలన్నింటిలోకి చాలా భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. పెళ్లి తంతుని వాళ్లు ‘మంగళ’ అని పిలుస్తారు. ఈ పెళ్లిళ్లలో హిందూ సంప్రదాయాల్లో కనిపించే పురోహితులు (బ్రాహ్మణులు), అగ్ని సాక్షి (హోమం) వంటివి ఉండవు. అంతా పెద్దల సమక్షంలో, ప్రకృతి సాక్షిగా జరుగుతుందట.పెళ్లి రోజు ఉదయం వధూవరులు తమ తమ ఇళ్లలో అభ్యంగన స్నానం చేసి, సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. పెళ్లి కొడుకు'కుప్య' (నల్లని కోటు), 'చేలే' (నడుముకు కట్టే పట్టీ) మరియు 'పీచే కత్తి' (చిన్న కత్తి) ధరిస్తాడు. పెళ్లి కూతురు వెనుక వైపు కుచ్చెళ్లు వచ్చేలా కట్టుకునే ప్రత్యేకమైన కొడవ చీరను ధరిస్తుంది.పెళ్లి వేదిక వద్దకు వరుడు వచ్చే ముందు, అడ్డుగా ఉన్న అరటి చెట్టు కాండాలను నరకడం ఒక ముఖ్యమైన ఆచారం. ఇది వరుడి పరాక్రమానికి, అడ్డంకులను తొలగించడానికి ప్రతీక.వధూవరులు పెళ్లి పీటలపై కూర్చున్నప్పుడు, కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి వారిని ఆశీర్వదిస్తారు. ఇక్కడ ఎటువంటి మంత్రాలు ఉండవు. కేవలం పెద్దల దీవెనలే ప్రధానం. వధువుకి ఒడి బియ్యానికి బదులు ఒక చిన్న నాణేల మూట అందిస్తారట.ఇది సంపద, శుభం, స్థిరత్వానికి సంకేతం.పెళ్లి తర్వాత వధువు తన అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు గంగా పూజ జరుగుతుంది. వధువు బావి నుంచి నీటిని తోడి, ఆ బిందెను తలపై పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంది. ఈ సమయంలో వరుడి కుటుంబ సభ్యులు ఆమెను ఆటపట్టిస్తూ, ఆమె నడవకుండా అడ్డుకుంటారు. ఆమె సహనాన్ని, ఓర్పును పరీక్షించే ఆహ్లాదకరమైన ఘట్టం ఇది. ఇతర హిందూ వివాహాలకు భిన్నంగా, కొడవ పెళ్లిళ్లలో మాంసాహారం (ముఖ్యంగా పంది మాంసం), మద్యం తప్పనిసరిగా వడ్డిస్తారు.కొడవ భాష మాట్లాడుతూ.. తన సంప్రదాయ బట్టల్లో రష్మిక#RashmikaMandana #Virosh #VijayDevarakonda pic.twitter.com/ZNNrxCCYgl— Milagro Movies (@MilagroMovies) February 26, 2026 -
ఇద్దరి మధ్య 16 ఏళ్ల గ్యాప్.. రష్మిక చెల్లి గురించి తెలుసా?
హీరోయిన్ రష్మిక ఎట్టకేలకు హీరో విజయ్ దేవరకొండని పెళ్లాడింది. ఉదయ్పుర్ వేదికగా కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. తెలుగు సంప్రదాయంలో ఏడడుగులు వేశారు. ఈ రోజు సాయంత్రం రష్మికకు చెందిన కొడవ పద్ధతిలోనూ వివాహం జరగనుంది. సరే ఈ విషయాలు కాసేపు పక్కనబెడితే విజయ్ ఫ్యామిలీ గురించి చాలామందికి తెలుసు. కానీ రష్మిక విషయానికొస్తే ఈమె కుటుంబం గురించి చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. మరీ ముఖ్యంగా రష్మిక చిట్టి చెల్లెలు ఎవరు? ఈమెకు ఆమెకు 16 ఏళ్ల గ్యాప్ అని తెలుసా?రష్మిక విషయానికొస్తే.. కర్ణాటకలోని విరాజీపేటలో 1995లో పుట్టింది. తండ్రి మదన్కి స్థానికంగా ఓ కాఫీ ఎస్టేట్, ఫంక్షన్ హాల్ ఉంది. తల్లి సుమన్ హౌస్ వైఫ్. రష్మికతో పాటు వీళ్లకు మరో కూతురు కూడా ఉంది. పేరు షిమన్. ఈ పాపకు ఇప్పుడు 14 ఏళ్లు. అంటే రష్మిక కంటే 16 ఏళ్లు చిన్నది. ప్రస్తుతం స్కూలింగ్ చేస్తోంది. ఇంతలా వయసు వ్యత్యాసం వల్ల షిమన్ని చెల్లిలా కంటే కూతురిలా చూసుకుంటున్నాని రష్మిక గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: #Virosh.. పెళ్లి చేసుకున్న విజయ్-రష్మిక)రష్మిక కాస్త పెద్దయ్యాక షిమన్ పుట్టింది. దీంతో తన చిట్టి చెల్లిల్ని ఎంతో గారాబంగా చూసుకోవాలని రష్మిక అనుకుంది. కానీ నటిగా మారి వరస సినిమాలు చేయడం వల్ల చెల్లితో గడపడమే రష్మికకు చాలా కష్టమైపోయింది. షిమన్ని చాలా మిస్ అవుతున్నాననే విషయాన్ని ఏ మాత్రం దాచుకోలేదు. చాలా ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని రష్మిక బయటపెట్టింది కూడా. ఇండస్ట్రీలోకి రావడంతో గత ఎనిమిదేళ్లుగా ఆమెతో(చెల్లి) ఉండలేకపోతున్నాను. పెరిగి పెద్దవడాన్ని చూడలేకపోతున్నాను. ఇప్పుడు నా అంత ఎత్తు ఎదిగిపోయింది. ఒక్కోసారి తనని కలవలేకపోతున్నానని ఏడ్చేసేదాన్ని అని రష్మిక చెప్పుకొచ్చింది.రష్మిక ఇంతలా పాన్ ఇండియా స్టారడమ్ అనుభవిస్తున్నప్పటికీ.. తన కుటుంబాన్ని ఎప్పుడు పెద్దగా మీడియా కంటపడనివ్వలేదు. ఈమె తల్లిదండ్రులు కూడా షిమన్ని సాధారణ పిల్లల్లానే పెంచాలనుకున్నారు. అందుకే తల్లిదండ్రులతో కలిసి షిమన్.. మైసూరులో ఉండగా.. రష్మిక మాత్రం వరస సినిమాలతో హైదరాబాద్, ముంబైకి తిరుగుతూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఎప్పుడైనా ఖాళీ టైం దొరికితే ఇంట్లో వాలిపోయి చెల్లితో సరదాగా ఆడుకుంటుంది. ఆ ఫొటోల్ని కూడా పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో షేర్ చేసింది.(ఇదీ చదవండి: Virosh.. రష్మికకు మూడోసారి.. విజయ్కు మాత్రం తొలిసారి!) -
విజయ్-రష్మిక పెళ్లి.. ప్రధాని స్పెషల్ విషెస్
-
Rashmika Mandanna: నా కాబోయే భర్త అలానే ఉండాలి..!
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇద్దరు చాలాకాలం ప్రేమలో ఉన్నారు. అయితే ఆ విషయం బయటకు చెప్పకపోవడంతో.. ఈ ఇద్దరూ ఎక్కడ కనిపించినా.. రకరకాల పుకార్లు, గాసిప్స్ చక్కెర్లు కొట్టాయి. ప్రస్తుతం వాటిన్నింటికీ చెక్పెట్టేస్తూ..ఈ ఫిబ్రవరి 26న ఉదయపూర్లో గ్రాండ్గా వివాహం చేసుకోనుంది ఈ జంట. ఇంకొన్ని గంటల్లో పెళ్లి బంధంతో ఒక్కటికానుకున్న నేపథ్యంలో రష్మిక మందన్న తన కాబోయే భర్త ఎలా ఉండాలో ఓ ఇంటర్యూలో చాలా ఆసక్తికరంగా చెప్పారు. అవేంటో ఈ సందర్భంగా చూద్దామా..!ప్రతి అమ్మాయి పెళ్లి విషయంలో ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కొన్ని అంచనాలు, ఆకాంక్షలు ఉంటాయి. అది సహజం. ఇక్కడ నటి మదన్న కూడా అలానే భావించారు. ఈ ముద్దుగుమ్మ సైతం సగటు అమ్మాయిలా..తన కాబోయే వాడు అలానే ఉండాలని అలా ఉంటేనే అతడిని పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పేసింది. ఇంతకీ ఆమె తన భాగస్వామి ఎలా ఉండాలందంటే..ప్రేమలో దయ, గౌరవం ఉంటేనే ఆ బంధం నిలబడుతుందని అంటోంది. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక సమయంలో సహచరుడు తప్పక ఉండాలి. కాబట్టి ఆ అమ్మాయికి తన కాబోయే జీవిత భాగస్వామి చాలా స్పెషల్గా ఉండాలి. ఏవిధంగా అంటే..ఆ అమ్మాయి ప్రతి బాధ, కష్టం, ఆనందంలోనూ తన పక్కనే ఉండాలి . ఆ భాగస్వామిని చూడగానే ఎలాంటి ఒడిదుడుకులనైనా ఇట్టే ఎదుర్కొనగలను అనే ధైర్యం, నమ్మకం కలగించేలా ఉండాలి.అతడే ఆమెకు ఓదార్పు, భద్రత, సానుభూతి.. అన్ని అవ్వాలి. అవే ఏ అమ్మాయైనా తన కాబోయే భర్తలో కోరుకునేది. అలాంటి వ్యక్తి లభిస్తే ఏ అమ్మాయి అయినా..అదృష్టవంతురాలే అంటూ తన కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలో చాలా చక్కగా వివరించింది రష్మిక. అంతేగాదు ఏ సంబంధంలోనైనా ఒకరినొకరు గౌరవించుకుంటున్నప్పుడు, శ్రద్ధ వహిస్తున్నప్పుడు, బాధ్యత వహిస్తున్నప్పుడు..ఆ బంధం చాలా స్ట్రాంగ్గా ఉంటుందని అంటోంది. చివరగా..ఇలాంటి లక్షణాలే తన భర్తలో ఉండాలని కోరుకుంటానని నవ్వుతూ చెప్పింది రష్మిక. మరి అలాంటి లక్షణాలే విజయ్లో ఉన్నాయి కాబోలు..అందుకే ఈ క్రేజీ బోయ్తో ఇంకొన్ని గంటల్లో ఏడుగుగులు వేసి..కొత్త జీవితాన్ని ఆరభించనుంది ఈ బ్యూటీ. కాగా, విజయ్ రష్మికలు రాజస్థాన్లోని ఉదయ్పూర్కి 50 కి.మీ దూరంలో ఉన్న లగ్జరీ హోటల్ ఐటీసీ మెమెంటోస్లో గ్రాండ్గా వివాహం చేసుకోనున్నారు.(చదవండి: ట్రెండీగా 'కూల్ గర్ల్ ఫ్రమ్ ఇండియా' ..! ఫ్యాషన్ని ఇలా కూడా చూపించొచ్చా..) -
తెలుగు హీరోలు.. ఎవరు ఏ వయసులో పెళ్లి చేసుకున్నారంటే?
తెలుగు హీరో విజయ్ దేవరకొండ ఎట్టకేలకు బ్యాచిలర్ లైఫ్కి టాటా చెప్పేశాడు. హీరోయిన్ రష్మిక మెడలో మూడు ముళ్లు వేసేశాడు. ఉదయ్పుర్ వేదికగా ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. అయితే విజయ్ వయసు 36 కాగా రష్మిక వయసు 29. ఈ సందర్భంగా తెలుగు హీరోలు.. ఎవరు ఏ వయసులో పెళ్లి చేసుకున్నారు? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఎవరెప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారంటే?(ఇదీ చదవండి: ఎట్టకేలకు సొంతిల్లు కట్టుకున్న 'బిగ్బాస్ 8' విజేత నిఖిల్)చిరంజీవి కొడుకు రామ్ చరణ్.. 27 ఏళ్లకే ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ప్రస్తుతం ఇద్దరు ఆడపిల్లలు, ఓ బాబు ఉన్నాడు.ఎన్టీఆర్ తన 28వ ఏట లక్ష్మీ ప్రణతిని వివాహమాడాడు. వీళ్లకు ప్రస్తుతం ఇద్దరు కొడుకులు ఉన్నారు.హీరో నాని కూడా తనకు 28 ఏళ్లున్నప్పుడే వైజాగ్కి చెందిన అంజనని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ కొడుకు ఉన్నాడు.అల్లు అర్జున్ తన 29 ఏళ్లకు స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమిది. వీళ్లకు ఓ బాబు, పాప ఉన్నారు.మహేశ్ బాబు కూడా తన 29 ఏటనే నమ్రతతో ఏడడుగులు వేశాడు. వీళ్లది ప్రేమ వివాహమే. ప్రస్తుతం ఓ కొడుకు, కూతురు ఉన్నారు.నాగచైతన్య 30 ఏళ్ల వయసులో సమంతని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆమెకు విడాకులిచ్చేశాడు. ఏడాదిన్నర క్రితం శోభితని పెళ్లాడాడు.మెగాహీరో వరుణ్ తేజ్ 33వ ఏట హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వివాహమాడాడు. ఇది ప్రేమ వివాహం. వీళ్లకు ఓ కొడుకు ఉన్నాడు.హీరో నిఖిల్.. తనకు 34 ఏళ్లున్నప్పుడు పల్లవి వర్మ అనే డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ కొడుకు కూడా ఉన్నాడు.రానా తన 35వ ఏట మిహీక బజాజ్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.విజయ్ దేవరకొండ 36 ఏళ్ల వయసులో ఇప్పుడు రష్మికని పెళ్లి చేసుకున్నాడు. చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెద్దల్ని ఒప్పించి ఇప్పుడు ఒక్కటయ్యారు.హీరో నితిన్ 37 ఏళ్లకు షాలినీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు కూడా ఓ కొడుకు పుట్టాడు.హీరో శర్వానంద్ అయితే 38 ఏళ్లకు రక్షితా రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీళ్లకు ఓ కూతురు ఉంది.ఇంతమంది హీరోలు పెళ్లిచేసుకుంటున్నారు గానీ ప్రభాస్ మాత్రం 47 ఏళ్లొచ్చినా ఇప్పటికే సింగిల్గానే ఉండిపోయాడు. పెళ్లి చేసుకుంటాడో లేదో?(ఇదీ చదవండి: #Virosh హల్దీ సెలబ్రేషన్.. ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్) -
#Virosh.. పెళ్లి చేసుకున్న విజయ్-రష్మిక
హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మెడలో మూడు ముళ్లు వేసేశాడు. రాజస్థాన్లోని ఉదయ్పుర్ వేదికగా ఉదయం 10:10 గంటలకు కుటుంబ సభ్యులు, పలువురు సన్నిహితుల నడుమ వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. తెలుగు సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగింది. ఇదే రోజు సాయంత్రం 4 గంటలకు కన్నడ(కొడవ) సంప్రదాయంలోనూ విజయ్-రష్మిక పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లిలో నో ఫేన్ నిబంధన కారణంగా ఫొటోలు ఇంకేం బయటకు రాలేదు. అధికారికంగా విజయ్-రష్మిక వాటిని పోస్ట్ చేసేంతవరకు వెయిట్ చేయాల్సిందే.(ఇదీ చదవండి: Virosh.. రష్మికకు మూడోసారి.. విజయ్కు మాత్రం తొలిసారి!)తెలంగాణకు చెందిన విజయ్ దేవరకొండ.. తొలుత చిన్న చిన్న పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం చిత్రాలు మంచి పాపులారిటీ తీసుకొచ్చాయి. గీతగోవిందం మూవీలో తనతో పాటు కలిసి నటించిన రష్మికనే ఇప్పుడు విజయ్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ డియర్ కామ్రేడ్ అనే మూవీ కూడా చేశారు. ప్రస్తుతం 'రణబాలి'లో చాన్నాళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు.రష్మిక విషయానికొస్తే కర్ణాటకలోని కొడుగు ప్రాంతానికి చెందిన అమ్మాయి. 'కిరిక్ పార్టీ' మూవీతో హీరోయిన్ అయింది. 'ఛలో'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మహేశ్ బాబు, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోలతోనూ కలిసి నటించింది. 'పుష్ప' దెబ్బకు ఈమెకు పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీలో వరస సినిమాలు చేస్తూ రష్మిక బిజీగా ఉంది.విజయ్-రష్మిక చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నప్పటికీ తమ బంధాన్ని అస్సలు బయటపెట్టలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీళ్లు డేటింగ్, ట్రిప్స్ గురించి ఎప్పటికప్పుడు ఫొటోలు బయటకొస్తూనే ఉండేవి. ఇప్పుడు పెళ్లి బంధంతో దాన్ని అధికారికం చేసేశారు.(ఇదీ చదవండి: విజయ్- రష్మిక వెడ్డింగ్.. అసలేంటి ఈ సెలబ్రిటీ ట్రెండ్?) -
#Virosh : పెళ్ళి సందడి.. ట్రెండింగ్లో రష్మిక మందన్న (ఫొటోలు)
-
#Virosh హల్దీ సెలబ్రేషన్.. ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ రష్మిక పెళ్లికి అంతా సిద్ధం. ఈరోజు(ఫిబ్రవరి 26) ఉదయం 10:10 గంటలకు విజయ్ మూడు మూళ్లు వేయనున్నాడు. రాజస్థాన్లోని ఉదయ్పుర్లో మెమొంటోస్ హోటల్.. ఈ వివాహానికి వేదిక. ఇప్పటికే బారాత్ మొదలైపోయింది. ఉదయం తెలుగు సంప్రదాయంలో పెళ్లి జరగనుండగా.. సాయంత్రం 4 గంటల తర్వాత (కొడవ) కన్నడ సంప్రదాయంలో మరోసారి వివాహ తంతు జరగనుంది.(ఇదీ చదవండి: Virosh.. రష్మికకు మూడోసారి.. విజయ్కు మాత్రం తొలిసారి!)ఇకపోతే బుధవారం సాయంత్రం హల్దీ సెలబ్రేషన్స్ జరగ్గా.. వేడుకకు వచ్చిన అతిధులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా వెళ్లింది. హల్దీకి సంబంధించిన ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది హల్దీ కాదని ముందే హోలీ వచ్చేసిందని చెప్పుకొచ్చింది. ఇదే పెళ్లి కోసం హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ కూడా అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇన్ స్టాలో పెట్టిన ఓ ఫొటో చూస్తే.. ఈమె కూడా హల్దీ వేడుకల్లో పాల్గొన్నట్లు కనిపిస్తోంది.ఇదే పెళ్లి కోసం డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా, టాలీవుడ్ స్టైలిష్ట్ శ్రావ్య వర్మ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తదితరులు ఇప్పటికే ఉదయ్పుర్ చేరుకున్నారు. ఈ రోజు గానీ రేపు గానీ వాళ్లు కూడా సోషల్ మీడియాలో కొత్త జంట విజయ్ దేవరకొండ-రష్మికకు పెళ్లి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడతారు. ఫొటోలు కూడా రిలీజ్ చేయడం గ్యారంటీ. అలానే మార్చి 4న హైదారాబాద్లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.(ఇదీ చదవండి: విజయ్- రష్మిక వెడ్డింగ్.. అసలేంటి ఈ సెలబ్రిటీ ట్రెండ్?) -
ఉదయపూర్ లో విరోష్ పెళ్లి హంగామా
-
విజయ్- రష్మిక పెళ్లి వేడుక.. తాళికట్టు శుభవేళ ఇదే
టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట రష్మిక- విజయ్ దేవరకొండ మరికొన్ని గంటల్లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఉదయ్పూర్లో ఫుల్గా సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారు. విజయ్- రష్మిక ఈనెల 26న మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఆన్ స్క్రీన్లో ఇప్పటికే పెళ్లి పీటలెక్కిన ఈ జంట.. రియల్ లైఫ్లోనూ వివాహం చేసుకోబోతున్నారు. రాజస్తాన్లోని ఉదయ్పూర్లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.ముహుర్తం ఫిక్స్..ఫిబ్రవరి 26న అంటే గురువారం విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి జరగనుంది. ఉదయం ఏడున్నర గంటలకు బరాత్ కార్యక్రమం ఉంటుందని సన్నిహితులు తెలిపారు. రేపు ఉదయం 10.10 నిమిషాలకి తెలుగు సాంప్రదాయం ప్రకారం వివాహ ముహూర్తం ఫిక్స్ చేశారు. అంటే అదే సమయానికి రష్మిక మెడలో మూడు ముళ్లు వేయనున్నారు విజయే దేవరకొండ. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు కన్నడలో కొడవ సాంప్రదాయం ప్రకారం మరోసారి వివాహ కార్యక్రమం జరగనుంది. అంటే రెండు పద్ధతుల్లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్గా జరగనుంది. ఈ క్షణం కోసమే విజయ్- రష్మిక ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. -
విజయ్- రష్మిక వెడ్డింగ్.. అసలేంటి ఈ సెలబ్రిటీ ట్రెండ్..!
టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట మరికొన్ని గంటల్లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఉదయ్పూర్లో ఫుల్గా సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. కొన్నేళ్లుగా ఎక్కడా బయటపడుకుండా రిలేషన్లోన్న విజయ్- రష్మిక ఈనెల 26న పెళ్లిబంధంతో ఒక్కటి కాబోతున్నారు. రాజస్తాన్లోని ఉదయ్పూర్లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.అయితే సెలబ్రిటీల పెళ్లి సందడి మామూలుగా ఉండదు. ఎక్కడా కూడా చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్తపడతారు. గతంలో విరాట్- అనుష్క, దీపిక-రణ్వీర్ సింగ్ సైతం తమ పెళ్లికి అత్యంత సీక్రెట్గా జరుపుకున్నారు. దీనికోసం నో మొబైల్ పాలసీని అత్యంత కఠినంగా అమలు చేశారు. ఇప్పుడదే బాటలో రష్మిక- విజయ్ జంట కూడా పెళ్లి వేడుకను జరుపుకుంటోంది. స్టార్ కపుల్ ఫాలో అవుతోన్న ఈ పద్ధతి ఓ అందమైన పేరు కూడా ఉంది. ఈ నో మొబైల్ పాలసీ సంప్రదాయాన్ని అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అని పిలుస్తారు.అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అంటే..?అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అంటే పెళ్లికి వచ్చిన అతిథులందరూ కూడా తమ మొబైల్స్ స్విచ్ఛాఫ్ చేసి అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించాలి. ఎవరు కూడా ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టడానికి వీలుండదు. అంతే కాకుండా ముందువరుసలో కూర్చొని ఫోన్లలో పెళ్లి ఫోటోలు తీయడానికి కూడా ఛాన్స్ ఉండదు. పెళ్లికి సంబంధిచిన ఫోటోలు, వీడియోలు ఆ జంట షేర్ చేసేవరకు సోషల్ మీడియాలో కనిపించవు. ఈ పద్ధతినే అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అని పిలుస్తున్నారు. లైఫ్లో చాలా ముఖ్యమైన ఈ క్షణాలను అత్యంత ప్రైవసీగా నిర్వహించాలనేది సెలబ్రిటీ వధూవరుల కోరిక. వారు మాత్రమే ఫస్ట్ ఈ వేడుక పిక్స్ పంచుకోవాలనే కాన్సెప్ట్ మంచిదే. దీంతో స్టార్ కపుల్ వివాహ వేడుకల్లో ఇదొక ట్రెండ్గా మారిపోయింది.ఈ వెడ్డింగ్ ప్రైవసీ అన్ప్లగ్డ్ ట్రెండ్ అనుష్క-విరాట్ కోహ్లీ పెళ్లి సమయంలో మొదటిసారి వైరలైంది. ఆ తర్వాత 2018లో ఇటలీలో పెళ్లి చేసుకున్న దీపిక-రణ్వీర్ సింగ్ కూడా నో ఫోన్ పాలసీని అమలు చేశారు. అంతేకాకుడా ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్, కత్రినాకైఫ్-విక్కీ కౌశల్, ఆలియా భట్-రణ్బీర్ కపూర్ సైతం ఇదే పద్ధతిని ఫాలో అయ్యారు. తాజాగా విరోష్ పెళ్లిలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. -
రష్మికకు మూడోసారి.. విజయ్కు మాత్రం తొలిసారి!
సినిమాలు, పనులు ఎప్పుడూ ఉండేవే.. కానీ పెళ్లి జీవితంలో ఒక్కసారే వస్తుంది. కల్యాణం వచ్చినా ఆగదు, కక్కొచ్చినా ఆగదన్నట్లు ఆ శుభఘడియలు ముంచుకొచ్చాక ఎవరూ దాన్ని వాయిదా వేయలేరు. టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా విషయంలో ఇదే జరుగుతోంది. చాలాకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ దాన్ని బయటకు చెప్పకుండా దాగుడుమూతలు ఆడుతున్నారు.ఇప్పుడు ఆ ఆటకు ముగింపు పలుకుతూ భార్యాభర్తలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫిబ్రవరి 26న విరోష్ (విజయ్- రష్మిక) పెళ్లి జరగనుంది. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తాజాగా జరిగిన సంగీత్ వేడుకలో విజయ్ తల్లి మాధవి.. వారసత్వంగా వస్తున్న బంగారు గాజులను రష్మికకు బహుకరించి తన ప్రేమను చాటుకున్నట్లుృ తెలుస్తోంది. మరి విరోష్ లవ్ స్టోరీ ఎప్పుడు? ఎలా? మొదలైందో ఓసారి చూసేద్దాం..2018లోనే పెళ్లిగీత గోవిందం.. 2018లో వచ్చిన ఈ సినిమాలో తొలిసారి విజయ్- రష్మిక జంటగా నటించారు. ఆన్ స్క్రీన్లో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇలా పెళ్లి సీన్లో నటించడం రష్మికకు మూడోసారి కానీ విజయ్కు మాత్రం అదే తొలిసారి కావడం విశేషం! ఈ చిత్రంతోనే వీరి మధ్య పరిచయం మొదలైంది. డియర్ కామ్రేడ్ మూవీతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. అందుకే ఈ మూవీ తమకెంతో స్పెషల్ అంటుంటారు. కానీ ప్రేమలో ఉన్నామని మాత్రం నేరుగా ఎన్నడూ చెప్పలేదు. అందరి ముందు..కలిసి విహారయాత్రలకు వెళ్లినప్పుడు కూడా జంటగా ఫోటోలు షేర్ చేసిందీ లేదు. అయితే ఇద్దరూ కలిసే ఉన్నట్లుగా హింట్లు మాత్రం వదిలేవారు. పుష్ప సినిమా సమయంలో విజయ్ను డార్లింగ్ ఫ్రెండ్ అని అభివర్ణించింది రష్. ఇంటర్వ్యూలలో కూడా అతడు తన ఫేవరెట్ అని వెల్లడించింది. ది గర్ల్ఫ్రెండ్ ఈవెంట్లో తొలిసారి విజయ్.. అందరిముందు రష్మిక చేయిని ముద్దాడాడు. దీంతో ఆమె సిగ్గుల మొగ్గయింది.ఆ ఒక్క మాటతో..జయాపజయాల్లోనూ ఒకరికి ఒకరు తోడుగా ఉన్నారు. పలు బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ తర్వాత విజయ్.. కింగ్డమ్తో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చిన్నపిల్లలా సంబరపడిపోయింది నేషనల్ క్రష్. మనం హిట్ కొట్టాం అని మురిసిపోయింది. తన ప్రేమ విజయ్ దగ్గరే ఆగిపోలేదు, అతడి కుటుంబాన్ని కూడా తన కుటుంబంగా భావించింది. విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ సినిమా ఈవెంట్స్కు వెళ్లేందుకు ఏనాడూ నో చెప్పలేదు. అటు విజయ్ తల్లితోనూ తనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె తనకు అమ్మ తర్వాత అమ్మతో సమానం అన్నప్పుడే ఆమె తెలుగింటి కోడలైపోయింది.పెళ్లి పత్రికలోనూ..విజయ్- రష్మికల ప్రేమను చూసిన అభిమానులు వీరికి విరోష్ (#Viorsh) అనే ట్యాగ్ ఇచ్చారు. అలానే పిలవడం మొదలుపెట్టారు. అభిమానులు ఇచ్చిన విరోష్ అనే పేరు ఈ లవ్బర్డ్స్కు సైతం నచ్చడంతో పెళ్లి పత్రికలోనూ అదే పేరు అచ్చువేయించారు. మరికొన్ని గంటల్లో ఒక్కటి కాబోతున్న ఈ విరోష్ జంటకు అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్!!చదవండి: పెళ్లి వేళ.. రష్మిక వ్యాఖ్యలు వైరల్ -
విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి సందడి విశేషాలు (ఫొటోలు)
-
ViRosh రెండు పద్ధతుల్లో వెడ్డింగ్, కాబోయే కోడలికి అత్తగారి అందమైన గిఫ్ట్
Wedding of ViRosh నేషనల్ క్రష్, నటి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి సందడికి సంబంధించిన కబుర్లుఉ ఊపందుకున్నాయి.విరోష్ అంటూ తమ వివాహాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ జంట ఫిబ్రవరి 26న వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే వధూవరులతోపాటు, అతిరథమహారథులు ఈ వివాహ వేడుకకోసం ఉదయపూర్కు వెళ్లారు. తెలుగు, కొడవ ఇలా రెండు సంప్రాదాయ పద్ధతుల్లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. తాజా నివేదికల ప్రకారం ప్రీ వెడ్డింగ్ వేడుకలు జోరుగా సాగుతున్నాయి.విజయ్ దేవరకొండ తల్లి రష్మిక మందన్నకు బహుమతిసంగీత వేడుకను మంగళవారం ఘనంగా జరిగింది. సరదాగా క్రికెట్ ఆడిన తర్వాత, ఉదయపూర్లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్లో సంగీత నైట్ ఉత్సాహంగా నిర్వహించుకోగా, ఈ వేడుకలకు సంబంధించి ఒక భావోద్వేగ సంగతి నెట్టింట విశేషంగా నిలుస్తోంది. సంగీత వేడుకలో విజయ్ తల్లి మాధవి దేవరకొండ కుటుంబ సంప్రదాయానికిఅనుగుణంగా రష్మికకు వారసత్వ గాజులను బహుకరించారట. తద్వారా తమ కుటుంబంలోకి కోడలిగా రష్మికను ప్రేమగా ఆహ్వానం పలికినట్టుగా భావిస్తున్నారు. సంగీత వేడుక నుండి లీక్ అయిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈరోజు హల్దీ వేడుకు జరగనుందివిరోష్ పెళ్లికి తరలివెళ్లిన అతిథులుమరోవైపు అనేక మంది అతిథులు ఇప్పటికే లేక్స్ నగరానికి చేరుకున్నారు. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్,నటి ఈషా రెబ్బాతోపాటు ఈ జంటకు సన్నిహితురాలైన స్టైలిస్ట్ శ్రావ్య వర్మ కూడా హాజరయ్యారు. అంతేకాదు రష్మిక బ్లాక్బస్టర్ మూవీ ది గర్ల్ఫ్రెండ్ నటి ఆషికా రంగనాథ్ , దర్శకుడు-నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా వేడుకలకు తరలివెళ్లారు. కోకిలాబెన్ అంబానీ, ముఖేష్ అంబానీ, నీతా, ఆకాష్, శ్లోకా అంబానీలతో సహా అంబానీ కుటుబం కూడా ఉదయపూర్లో దిగినట్టు సమాచారం. ఇది ఇలా ఉంటే మార్చి 4న హైదరాబాద్లో జరగబోయే రిసెప్షన్ కోసం హితులు, సన్నిహితులతోపాటు, స్టార్ లవ్బర్డ్స్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
విజయ్ & రష్మిక వెడ్డింగ్ విశేషాలు..
-
రష్మిక పెళ్లికి పిలిచిందా? రిషభ్ శెట్టి సమాధానమిదే
హీరోయిన్ రష్మిక పెళ్లి మరికొన్ని గంటల్లో జరగనుంది. హీరో విజయ్ దేవరకొండతో ఉదయ్పుర్ వేదికగా ఏడడుగులు వేయనుంది. గతంలోనే రష్మిక.. కన్నడ హీరో రక్షిత్ శెట్టిని పెళ్లి చేసుకోవాల్సింది. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల అది రద్దయింది. అప్పటినుంచి రక్షిత్ శెట్టి అతడి స్నేహితులకు రష్మిక అంటే ఎందుకో కోపం? తాజాగా రష్మిక పెళ్లికి పిలిచిందా అనే ప్రశ్న 'కాంతార' రిషభ్ శెట్టికి ఎదురైంది. మరి అతడేం సమాధానమిచ్చాడో తెలుసా?(ఇదీ చదవండి: విజయ్-రష్మిక పెళ్లి.. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని)కర్ణాటకకు చెందిన రష్మిక.. రిషభ్ శెట్టి దర్శకత్వం వహించిన 'కిరిక్ పార్టీ' సినిమాతోనే హీరోయిన్ అయింది. ఇందులో రక్షిత్ శెట్టి హీరో. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే రక్షిత్-రష్మిక ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబ పెద్దల్ని ఒప్పించి ఘనంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ తర్వాత ఏమైందో ఏమో పెళ్లి రద్దయింది. అప్పటినుంచి రిషభ్ శెట్టి, రక్షిత్ శెట్టితోపాటు అతడి స్నేహితులు.. రష్మిక గురించి మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడరు. ఇప్పుడు కూడా అదే జరిగింది.మంగళవారం ఉదయం మంత్రాలయంకి వచ్చిన రిషభ్ శెట్టి.. రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఓ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న టైంలోనే.. రష్మిక మిమ్మల్ని తన పెళ్లికి పిలవలేదా? అని ఓ రిపోర్టర్ అడిగాడు. ప్రశ్న మధ్యలో ఉండగానే థ్యాంక్యూ అని చెబుతూ రిషభ్ శెట్టి అక్కడనుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రష్మిక పెళ్లి విషయానికొస్తే.. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి చేసిన విజయ్ దేవరకొండని ప్రేమించి పెళ్లి చేసుకుంటోంది. ఉదయ్పుర్ వేదికగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో గురువారం ఉదయం పెళ్లి చేసుకోనున్నారు. ఉదయం తెలుగు పద్ధతిలో, సాయంత్రం రష్మిక కుటుంబానికి చెందిన కొడవ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరగనుంది.(ఇదీ చదవండి: రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?)#RishabShetty ignored #RashmikaMandanna’s marriage invitation questionpic.twitter.com/gwUFUpj9AC— cinee worldd (@Cinee_Worldd) February 25, 2026 -
విజయ్, రష్మిక సంగీత్ వీడియో వైరల్.. క్రికెట్ బ్యాట్పై పెళ్లి డేట్!
రష్మిక, విజయ్ దేవరకొండ మరికొన్ని గంటల్లో వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబాలలో పెళ్లి సందడి మొదలైంది. మోహందీ, సంగీత్ సందడి కూడా జరిగిపోయింది. సంగీత్లో విజయ్, రష్మిక కలిసి నటించిన చిత్రాల్లోని క్యూట్ ఫోటోలతో కలర్పుల్గా డెకరేషన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో అధికారికంగా షేర్ చేయాలని కోరుతూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. దీంతో పాటు సంగీత్లో ఇరుకుటుంబ సభ్యులు సరదగా ‘విరోష్ ప్రీమియర్ లీగ్’ను కూడా సెలెబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోని విజయ్ దేవరకొండ తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేశాడు. అందులో క్రికెట్ బ్యాట్, సిల్వర్ మెడల్పై ఫిబ్రవరి 26 అని రాసి పెళ్లిడేట్ని డిఫరెంట్గా ప్రకటించారు. From the #Virosh Premier league! #VijayDeverakonda pic.twitter.com/ghf7F7TMDF— Hourly Vijay Deverakonda (@HourlyDVS) February 24, 2026ఈ రోజు హల్దీ వేడుకలు జరుగనున్నాయి. సాయంత్రం మెహందీ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోనున్నారు. గురువారం(ఫిబ్రవరి 26) ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరగనుంది. ఇదే రోజు సాయంత్రం కొడవ స్టైల్లో మరోసారి విజయ్-రష్మిక వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. ఉదయ్పూర్లోని మెమెంటోస్ హోటల్ జరిగే ఈ పెళ్లికి కేవలం 100 మంది లోపే అతిథులు హాజరుకానున్నారు. మార్చి 4న హైదరాబాద్లో రిసెప్షెన్ ఏర్పాటు చేశారు.We need those original pictures @iamRashmika please 🥹❤️❤️#ViRosh pic.twitter.com/uVx2O2gWLz— Rahul (@The_pathbreaker) February 24, 2026 -
విజయ్-రష్మిక పెళ్లి.. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని
టాలీవుడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి.. గురువారం(ఫిబ్రవరి 26) జరగనుంది. ఇప్పటికే వీళ్లిద్దరి కుటుంబ సభ్యులు.. ఉదయ్పుర్ వెళ్లిపోయారు. పెళ్లి సందడి కూడా మొదలైపోయింది. మంగళవారం నాడు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు టీమ్స్గా విడిపోయి క్రికెట్ మ్యాచ్ ఆడారు. అలానే రాత్రి సంగీత్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. నేడు హల్దీ, మెహందీ తదితర సెలబ్రేషన్స్ జరగనున్నాయి. మరోవైపు కాబోయయే వధూవరులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు నోట్ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?)విజయ్-రష్మిక వివాహ వేడుకకు ఆహ్వానం అందుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్న మోదీ.. తన తరఫున శుభాకాంక్షలు తెలిపారు. విజయ్-రష్మిక జీవితంలో ఇది ఓ కొత్త, సుందరమైన అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు. సప్తపది అనే పవిత్ర సంప్రదాయంతో ఏడడుగులు కలిసి వేస్తూ జీవితాంతం స్నేహితులు, భాగస్వాములుగా మారుతున్నారని అన్నారు. సినిమాల్లో ఇప్పటికే ఎన్నో పాత్రలు చేసిన విజయ్, రష్మిక.. నిజ జీవితంలో ప్రేమ, అనురాగాలతో నిండిన కొత్త అధ్యాయాన్ని మరింత అందంగా నిర్మించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పర గౌరవంతో జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ శుభసందర్భంగా వధూవరులకు, వారి కుటుంబ సభ్యులకు తన ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!) -
పెళ్లి వేళ.. రష్మిక ముద్దు సీన్ వ్యాఖ్యలు వైరల్
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసిన విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి గురించే చర్చ జరుగుతుంది. గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఈ నెల 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. వీరిద్దరి ప్రేమాయణంపై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నప్పటికీ.. ఇద్దరూ స్పందించలేదు. తాము రిలేషన్లో ఉన్నామనే విషయాన్ని ఎప్పుడూ బయటకు చెప్పలేదు. కానీ పరోక్షంగా హింట్ ఇస్తూనే వచ్చారు. చివరకు ఎంగేజ్మెంట్ అయిన విషయాన్ని కూడా అధికారికంగా వెల్లడించలేదు. కానీ సడెన్గా పెళ్లి డేట్ని చెప్పి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. రేపు ఉదయం ఉదయ్పూర్లోని ఓ రిసార్ట్లో వీరిద్దరు ఏడు అడుగులు వేయబోతున్నారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.ఇదిలా ఉంటే..పెళ్లివేళ రష్మికకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. రష్మిక గతంలో 'గీత గోవిందం' సినిమాలోని తన తొలి ముద్దు సీన్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘తొలిసారి ఆన్స్క్రీన్పై ముద్దు సీన్లో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించింది. అది చాలా వ్యక్తిగతమైన విషయం. సెట్లో 200 మంది చూస్తుండగా ఎలా చేయాలో అర్థం కాలేదు. అయితే, నా కో-యాక్టర్ విజయ్ది కూడా అదే పరిస్థితి. నాలాగే ఆయన కూడా ఇబ్బంది పడ్డాడు. చివరకు అది ఒక టెక్నికల్ విషయంలా పూర్తి చేశాం. పాత్రకు అవసరమైతే అలాంటి సీన్ చేయాల్సిందే’ అని చెప్పుకొచ్చింది. కాబోయే భర్తతోనే తొలి ముద్దు సీన్ చేయడం గమనార్హం. కాగా, రష్మిక, విజయ్ గీత గోవిందంతో పాటు డియర్ కామ్రేడ్ అనే సినిమాలోనూ కలిసి నటించారు. -
విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లికి రెడీ అయిపోయారు. రెండు రోజుల క్రితమే అధికారికంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా మంగళవారం నుంచి పెళ్లి సందడి మొదలైపోయింది. ఇదలా ఉండగానే పెళ్లి జరగబోయే సంప్రదాయ పద్ధతులు, పెళ్లి జరిగే చోటు, అతిథుల లిస్ట్, మెనూ అని చెప్పి సోషల్ మీడియాలో చాలానే విషయాలు వైరల్ అయిపోతున్నాయి.(ఇదీ చదవండి: రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?)కలిసి రెండు సినిమాలు చేసిన విజయ్-రష్మిక.. చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. కాకపోతే ఎప్పుడూ బయటకు చెప్పలేదు. తమ పెళ్లిని గ్రాండ్గానే ప్లాన్ చేసుకున్నప్పటికీ.. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే ఇప్పుడు ఒక్కటి కాబోతున్నారు. ఉదయ్పుర్లోని ఆరావళి పర్వతాల మధ్యలో ఉన్న 'ద మెమొంటోస్' అనే లగ్జరీ హోటల్లో ఈ శుభకార్యం జరగనుంది. ఈ వివాహానికి విరోష్(VIROSH) అని పేరు కూడా పెట్టారు.ఇకపోతే మంగళవారం(ఫిబ్రవరి 24) సాయంత్రం సంగీత్ జరగనుంది. బుధవారం(ఫిబ్రవరి 25) ఉదయం హల్దీ.. సాయంత్రం మెహందీ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోనున్నారు. గురువారం(ఫిబ్రవరి 26) ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరగనుంది. ఇదే రోజు సాయంత్రం కొడవ స్టైల్లో మరోసారి విజయ్-రష్మిక వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. శుక్రవారం నాడు అంతా కలిసి తిరిగి హైదరాబాద్ వచ్చేయనున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్లో సినీ, రాజకీయ ప్రముఖల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.అలానే ఈ పెళ్లికి కేవలం 100 మంది లోపే హాజరు కానున్నారని, అతిథుల కోసం తెలుగు సంప్రదాయ ఆహారంతో పాటు జపనీస్ వంటకాలు కూడా మెనూలో ఉండనున్నాయని తెలుస్తోంది. వివాహం ఫొటోలు బయటకు రాకుండా ఉండేందుకు 'నో-ఫోన్' కాన్సెప్ట్ కూడా అమలు చేయనున్నట్లు టాక్.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ.. ఏజ్ గ్యాప్ ఎంతంటే?) -
రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?
అనుకున్నట్లే టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారు. చాన్నాళ్లుగా వస్తున్న రూమర్స్ నిజం చేస్తూ రెండు రోజుల క్రితమే అధికారికంగా తమ వివాహం విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఉదయ్పుర్లో పెళ్లి హడావుడి మొదలైపోయింది. ఈ గురువారమే(ఫిబ్రవరి 26) విజయ్-రష్మిక కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు. అయితే తమ ఇంటికి రాబోయే కోడలి గురించి విజయ్ తల్లిదండ్రులు గతంలో మాట్లాడారు. ఒకటి రెండు కండిషన్స్ కూడా పెట్టారు. ఇంతకీ అవేంటి?(ఇదీ చదవండి: 'ఓజీ' హీరోయిన్ కొరియన్ కాన్సెప్ట్ మూవీ.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)విజయ్ తెలంగాణ అబ్బాయి కాగా.. రష్మిక కన్నడ అమ్మాయి. వీళ్లిద్దరూ తొలుత 'గీతగోవిందం' అనే సినిమా కోసం కలిసి పనిచేశారు. ఆ టైంలోనే వీళ్లిద్దరి మధ్య స్నేహం చిగురించి, తర్వాత ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లిపీటల వరకు వచ్చింది. అయితే అదే మూవీ ఈవెంట్లోనే విజయ్ తల్లిదండ్రులు తమ కోడలి ఎలా ఉండాలి అనే విషయాల్ని కొన్ని చెప్పారు. ఇప్పుడు రష్మిక వాటిని నిజం చేసినట్లు కనిపిస్తోంది.'గీతగోవిందం' ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ సుమ మాట్లాడుతూ.. మీకు ఎలాంటి కోడలు కావాలనుకుంటున్నారు? అని విజయ్ తల్లిదండ్రులని అడిగింది. దీనికి సమాధానమిచ్చిన తల్లి మాధవి.. మా బాబుని(విజయ్ దేవరకొండ) బాగా చూసుకునే కోడలు వస్తే చాలు, అతడిని ప్రేమించాలి అంతే. ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఆమె, అతడిని బాగా అర్థం చేసుకోవాలి అని చెప్పుకొచ్చారు. విజయ్ తండ్రి గోవర్థన్ ఇదే ప్రశ్నకు సమాధానమిస్తూ.. తనకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చు. నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కులం, మతం గురించి పట్టింపులు లేవు. భారతీయురాలిని, ముఖ్యంగా దక్షిణాది అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు చాలా సంతోషం అని అన్నారు.మరో మూవీ ఈవెంట్లో విజయ్ కూడా తనకు కాబోయే భార్య గురించి మాట్లాడుతూ.. తనకు అరేంజ్డ్ మ్యారేజ్ వర్కౌట్ కాదని, చేసుకుంటే లవ్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటాను. కానీ ఆ అమ్మాయి నా తల్లిదండ్రులకు కూడా నచ్చాలి అని కండిషన్ పెట్టాడు. మరో సందర్భంలో రష్మిక మాట్లాడుతూ.. మాధవి(విజయ్ తల్లి) ఆంటీ తనకు మరో అమ్మలాంటిది అని చెప్పుకొచ్చింది. చూస్తుంటే విజయ్ దేవరకొండ పేరెంట్స్ పెట్టిన కండిషన్స్కి తగ్గట్లే రష్మిక.. వీళ్ల ఇంటి కోడలు కాబోతోంది. గతంలో పలుమార్లు వీళ్లు హింట్స్ ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ కలిపి ఉన్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ.. ఏజ్ గ్యాప్ ఎంతంటే?)They imagined the perfect daughter-in-law… Rashmika is their dream come true ❤️#VijayDeverakonda #RashmikaMandanna #Virosh pic.twitter.com/eq3a1NwyTd— Lilly ✨ (@therwdygirl) February 21, 2026 -
సెలబ్రేషన్స్కు రెడీ.. విజయ్- రష్మిక పెళ్లి సందడి షురూ..!
టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ అఫీషియల్గా తన పెళ్లిని అనౌన్స్ చేశారు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే విరోష్ జంట ఒక్కటి కానుందని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ గ్రాండ్ వేడుకలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న ఉదయపూర్లో మెహందీ వేడుకతో రష్మిక-విజయ్ పెళ్లి సందడి మొదలు కానుంది.ఆ తర్వాత ఫిబ్రవరి 25న హల్దీ, సంగీత్ సందడి కొనసాగనుంది. ఈ వేడుకలు ఉదయపూర్లోని విలాసవంతమైన ఐటీసీ మెమెంటోస్ జరుగుతాయి. ఈ వేడుకల్లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొననున్నారు. ఈ జంట ఫిబ్రవరి 26న మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. కాగా.. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు తెలుస్తోంది. విజయ్ - రష్మిక వారి కుటుంబ సభ్యులు, సహచరులతో కలిసి సోమవారం ఉదయమే ఉదయ్పూర్ చేరుకున్నారు. కొన్నేళ్లుగా తమ రిలేషన్ను సీక్రెట్గా కొనసాగించిన ఈ జంట చివరికీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పింది. విజయ్ దేవరకొండనే స్వయంగా తన పెళ్లిని ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వివాహం తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. -
ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్.. పెళ్లిపై విజయ్ ఎమోషనల్
-
విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ.. ఏజ్ గ్యాప్ ఎంతంటే..?
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ వివాహం గురించి తొలిసారి స్పందించారు. తమ బంధం గురించి అభిమానులు పెట్టిన 'విరోష్' పేరును గౌరవిస్తున్నట్లు సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ఫ్యాన్స్ తమలో ఒక భాగం అంటూ.. వారి కోరిక మేరకు పెళ్లి కార్యక్రమానికి వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. అయితే, వారిద్దరి వయసు గురించి కొందరు కామెంట్లు చేస్తుండగా... అభిమానులే కౌంటర్ ఇస్తున్నారు. వాస్తవంగా ఇద్దరి మధ్య పెద్దగా ఏజ్ గ్యాప్ లేదనే విషయం తెలిసిందే.విజయ్ దేవరకొండ (36), రష్మిక(30)ల మధ్య సుమారు ఆరేళ్ల గ్యాప్ ఉంది. విజయ్ 1989లో జన్మించగా.. రష్మిక 1996లో జన్మించారు. ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకుంటే పెద్దగా ఏజ్ గ్యాప్ కనిపించదు. దీంతో వారిద్దరిది సరైన జోడీ అంటూ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. విజయ్ దేవరకొండకు సంబంధించి సుమారు రూ. 80 కోట్ల మేరకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. తను ఒక్కో సినిమాకు రూ. 15 కోట్ల మేరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్. రష్మికకు సంబంధించి సుమారు రూ. 70 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. తను ఒక్కో సినిమాకు రూ. 6 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం.గీత గోవిందం మూవీతో పరిచయమైన ఈ జోడీ.. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఆపై ‘డియర్ కామ్రేడ్’ మూవీతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించారు. ఇప్పుడు వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 26న రాజస్థాన్లోని ఉదయ్పుర్ వారి వివాహానికి వేదిక కానుంది. హైదరాబాద్లో మార్చి 4న వివాహ రిసెప్షన్ కార్యక్రమం జరగనుంది. -
రష్మిక, విజయ్ల పెళ్లి వేదికగా ఐటీసీ మెమెంటోస్..! ప్రత్యేకతలు ఇవే..
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ నెల ఫిబ్రవరి 26, 2026న వివాహ చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు వేదిక కానుంది రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఐటీసీ మెమెంటోస్ హోటల్. సన్నిహిత వర్గాల ప్రకారం..ఒక వారం ముందుగానే బుక్ చేసినట్లు తెలుస్తోంది. పచ్చటి ఆరావళి కొండలు, నీలి ఆకాశానికి నిలయమైన ఈ వాతావరణంలో గడపాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..!.రష్మిక-విజయ్లు వివాహం చేసుకుంటున్న ITC మెమెంటోస్ లోపల 117 విల్లాలతో, ప్రశాంతమైన సరస్సులు, పచ్చని పచ్చిక బయళ్లు, విశాలమైన పచ్చని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ వెల్నెస్ సెంటర్, అందంగా రూపొందించిన లాంజ్లు ఉన్నాయి. ఇక్కడ అతిథులు చేతితో తయారు చేసిన కాక్టెయిల్స్, వెచ్చని పానీయాలు, ప్రశాంతమైన దృశ్యాలను హాయిగా ఆస్వాదించవచ్చు.ఈ హోటల్లో ఉదయ్ పెవిలియన్, కబాబ్స్ అండ్ కుర్రీస్, రాయల్ వేగా, ది రాక్ బార్ వంటి చక్కటి భోజనాలను ఆస్వాదించొచ్చు. శాఖాహారం నుంచి వివిధ ప్రపంచ రుచుల తోపాటు రిఫ్రెష్ కాక్టెయిల్ వరకు అన్నిరకాల టేస్ట్లను ఆస్వాదించొచ్చు. పలనా రెసిపీ లోటు అనేదానికి అవకాశం లేకుండా ప్రతి వంటకం అందుబాటులో ఉంటుందట. ఆరోగ్యం పరంగా ఫిట్నెస్ సెంటర్ని అధునాతన యంత్రాలతో సెట్ చేశారు. ఇక్కడ ఉన్న విశాలమైన ప్రకృతి దృశ్యాన్ని చూస్తూ హాయిగా వర్కౌట్లు చేసుకోవచ్చు. ఇదేగాక మరో గొప్ప అనుభూతి ఏంటంటే..ఇక్కడ రాయల్ స్పాలో, వేడుకకు విచ్చేసిన అతిథులు పురాతన భారతీయ చికిత్సలు, ఉత్తేజకరమైన వెల్నెస్ చికిత్సలను ఆస్వాదించవచ్చు. ఇక్కడ తప్పనిసరిగా ఇన్ఫినిటీ పూల్ లేదా లాంజ్ పూల్ను మిస్ అవ్వకండి. చక్కటి విశ్రాంతికి నిలయం. ఈ పెళ్లికి విచ్చేస్తున్న అతిథులంతా ఇక్కడ జరిగే అన్ని రకాల వినోద కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు, ఉదయ్పూర్ను సందర్శించొచ్చు. ఈ ప్రాంతం ప్రకృతి సహజ సౌందర్యానికి, సాహస అనుభవాలను గమ్యస్థానం. ఈ మెమెంటోస్ సూట్లో బసకి- అక్షరాల రూ. 73,199 - 91,499/-లు ఖర్చు అవుతుందట. View this post on Instagram A post shared by Mementos By ITC Hotels- Ekaaya Udaipur (@mementosbyitchotels_udaipur) (చదవండి: నాట్యమయూరి సుధా చంద్రన్ వెల్నెస్ సీక్రెట్..! ఆయిల్ మసాజ్లు, ఇంట్లో తయారు చేసే..) -
‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’.. పెళ్లిపై స్పందించిన విజయ్, రష్మిక
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ తొలిసారి ఇన్స్టాగ్రామ్లో పెళ్లి విషయమై స్పందించారు. అభిమానులు వీరిని ఎంతో ఇష్టంగా “విరోష్” అని పిలుస్తున్నారు. అదే పేరును తమ వివాహ వేడుకకు ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. “మేం ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా, ముందే అభిమానులు ఆ పనులు చేసి పెడుతున్నారు. ఇప్పుడు పెళ్లి విషయంలోనూ చాలా ప్రేమతో ఒక పేరు పెట్టారు. అందువల్ల మా వివాహ వేడుకకు ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాం. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు” అంటూ విజయ్, రష్మిక పేర్కొన్నారు. ఈ జంట వివాహ వేడుక అతి కొద్ది మంది సమక్షంలో రాజస్థాన్లోని ఉదయ్పుర్లో జరగనుందని సమాచారం. ఫిబ్రవరి 26న విజయ్ – రష్మిక మూడుముళ్లతో ఒక్కటవుతున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణలో రాత్రి 7 గంటలకు గ్రాండ్గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.వీరిద్ధరూ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచే ఈ జంటపై రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు పెళ్లి వార్తలతో ఆ రూమర్స్కు ముగింపు పలుకుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘రణబలి’ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. దీనికి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్లో అత్యంత క్రేజీ కపుల్గా పేరుగాంచిన విజయ్, రష్మిక వివాహం కోసం వీరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి రిసెప్షన్ డేట్ లీక్
-
విజయ్ & రష్మిక పెళ్లిపై నటుడు ప్రమోద్ శెట్టి కీలక వ్యాఖ్యలు
-
విజయ్-రష్మిక పెళ్లి..నాకు ఆహ్వానం అందలేదు: ప్రముఖ నటుడు
రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండల వివాహానికి తమను ఆహ్వానిస్తారని వెయిట్ చేయడం లేదని ప్రముఖ నటుడు ప్రమోద్ శెట్టి కామెంట్స్ చేశారు. అంతేకాకుండా రక్షిత్ శెట్టిని.. తనను ఆమె వివాహానికి పిలుస్తారని భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రక్షిత్ శెట్టి పూర్తిగా సినిమాలతో బిజీగా ఉన్నాడని ప్రమోద్ శెట్టి తెలిపారు. హీరోయిన్ రష్మికతో వివాహం కానందుకు రక్షిత్ శెట్టి బాధపడడం లేదని వెల్లడించారు.కాగా.. గతంలో రష్మికకు కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు. అంతకుముందు రష్మిక, రక్షిత్ కిరిక్ పార్టీ మూవీలో జంటగా నటించారు. రష్మిక ఈ మూవీతోనే కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రమోద్శెట్టి కీలక పాత్రలో కనిపించారు.కాగా.. ఈ నెల 26న టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ- రష్మిక వివాహం జరగనుంది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ ఉదయ్పూర్ ప్యాలెస్లో జరగనుంది. ఈ వేడుకకు ప్రముఖులు, సన్నిహితులు హాజరు కానున్నారు. -
విజయ్, రష్మికల సంపాదన ఇద్దరి ఆస్తులు ఎన్ని కోట్లు అంటే..?
-
స్వలింగ సంపర్క ప్రేమికురాలిగా రష్మిక?
ఇండస్ట్రీలో ఒకప్పటితో పోలిస్తే పరిస్థితులు ఇప్పుడు చాలా మారిపోయాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసే జనాలు తగ్గిపోయారు. హీరోహీరోయిన్లు ఎవరైనా సరే కాస్త వైవిధ్యమైన పాత్రలు చేస్తే చూసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. అయితే అలాంటివి చేసే వాళ్లు మాత్రం ఇప్పటికే కాస్త తక్కువగానే ఉన్నారని చెప్పొచ్చు. కానీ రష్మిక మాత్రం ఇప్పుడు పెద్ద సాహసమే చేసినట్లు తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులు.. కనీసం కలలో కూడా ఊహించని పాత్రలో కనిపించనుందని టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది.స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన రష్మిక.. తొలుత సొంత భాషలో గుర్తింపు తెచ్చుకుని తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్డమ్ సొంతం చేసుకుంది. 'పుష్ప' మూవీతో పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ అయిపోయింది. గత కొన్నాళ్ల నుంచి బాలీవుడ్లోనూ వరస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. అలా ఈమె చేసిన హిందీ సినిమాల్లో 'కాక్టెయిల్ 2' కూడా ఒకటి.(ఇదీ చదవండి: ఆ హీరోని చూసి నా ఎక్స్ భాయ్ఫ్రెండ్ భయపడ్డాడు: మృణాల్)ఈ సినిమాలో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక నటించారు. అయితే ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని, కాకపోతే కృతి సనన్, రష్మిక.. స్వలింగ సంపర్క పాత్రల్లో కనిపించనున్నారని బాలీవుడ్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. అంటే లెస్బియన్ పాత్రలు అనమాట. బాలీవుడ్ సినిమాల్లో ఈ పాయింట్ అప్పుడప్పుడు టచ్ చేస్తుంటారు గానీ దక్షిణాదిలో ఇలాంటి పాత్రలు రావడం దాదాపు అసాధ్యం. అందున స్టార్ హీరో లేదా హీరోయిన్లు ఇలాంటి చేయరు. మరి రష్మిక ఈ తరహా పాత్ర చేసిందని రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే గనక తెలుగు ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి?ఇకపోతే రష్మిక వచ్చే వారమే పెళ్లి చేసుకోనుంది. ప్రియుడు విజయ్ దేవరకొండతో కలిసి కొత్త జీవితం ప్రారంభించనుంది. రాజస్తాన్ వేదికగా ఈ నెల 26న డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఈ శుభకార్యానికి ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. మార్చి 4న హైదరాబాద్లో రిసెప్షన్ జరగనుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ) -
సోషల్ మీడియాలో విజయ్- రష్మిక వెడ్డింగ్ కార్డ్.. టీమ్ ఆగ్రహం..!
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లిపై తెగ చర్చ నడుస్తోంది. ఈ నెల 26న వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారని వెడ్డింగ్ కార్డ్ నెట్టింట తెగ వైరలైంది. తాజాగా దీనిపై విజయ్ దేవరకొండ టీమ్ స్పందించింది. వివాహం, రిసెప్షన్కు సంబంధించిన అన్ని వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.'విజయ్- రష్మిక పెళ్లి గురించి కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పెళ్లి, రిసెప్షన్ వేదిక వివరాలను వెల్లడిస్తున్నారు. ఇలాంటి వాటితో అతిథులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయి. వీరి పెళ్లికి టాలీవుడ్, బాలీవుడ్కు చెందిన వారితోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరవుతారు. ఇలాంటి వేదికల వివరాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడం సరైంది కాదు. పెళ్లికి హాజరయ్యే అతిథులు కాంటాక్ట్ కావాల్సిన ఫోన్ నెంబర్ వెడ్డింగ్ కార్డుపై ప్రింట్ చేస్తే.. అది కూడా పోస్ట్ చేశారు. పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. ఇలాంటి సున్నితమైన సమాచారాన్ని ఆన్లైన్లో పోస్ట్ చేయవద్దని' విజయ్ టీమ్ పేర్కొంది.Special request from Team Vijay Deverakonda & Rashmika !! As many people were posting the marriage details of Vijay & Rashmika including the RSVP contact and venue. The team now are requesting not to post such sensitive information online which could lead to unnecessary fanfare… pic.twitter.com/YESwrwNumE— Filmy Focus (@FilmyFocus) February 18, 2026 -
విజయ్, రష్మికల పెళ్లికి వెళ్తున్న స్టార్స్ వీళ్లే..!
-
గుట్టుచప్పుడు కాకుండా విజయ్,రష్మిక లవ్ స్టోరీ
-
విజయ్- రష్మికల పెళ్లికి వెళ్తున్న స్టార్స్ వీళ్లే..
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న వివాహం ఈ నెల 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో జరగనుంది. ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు పాల్గొననున్నారు. అయితే, మార్చి 4వ తేదీన హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ జరగనుంది. ఆ సమయంలో భారీగా టాలీవుడ్తో పాటు ఇతర ఇండస్ట్రీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.విజయ్, రష్మికల వివాహానికి ఉదయ్పూర్ వెళ్లే అతిధుల జాబితా నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వేడుకలో సినీ పరిశ్రమ నుండి ఎంపిక చేసిన ప్రముఖులతో పాటు వారి సన్నిహితులు మాత్రమే పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో వస్తున్న సమాచారం ప్రకారం, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, అల్లు అర్జున్, సుకుమార్, వర్ష బొల్లమ్మ, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, కరణ్ జోహార్, కృతి సనన్, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ వంటి ప్రముఖులు వివాహ వేడుకకు హాజరవుతారని భావిస్తున్నారు.అయితే, హైదరాబాద్లో మార్చి 4న జరిగే రిసెప్షన్ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఆ సమయంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి ప్రముఖ తెలుగు స్టార్స్తో పాటు యువ నటీనటులు హజరుకానున్నారు. ఆపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నుండి కొంతమంది కీలక రాజకీయ నాయకులు కూడా విజయ్ పెళ్లిలో పాల్గొంటారని సమాచారం. ఈ జాబితా గురించి విజయ్ జోడీ నుండి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.విజయ్-రష్మిక తొలిసారి జంటగా 'గీతగోవిందం' సినిమా చేశారు. అది సూపర్ హిట్. తర్వాత 'డియర్ కామ్రేడ్' మూవీ చేశారు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. తర్వాత చాన్నాళ్ల పాటు కలిసి పనిచేయలేదు. ప్రస్తుతం విజయ్ 'రణబాలి' అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో రష్మికనే హీరోయిన్. ఇది దసరాకు రిలీజ్ కానుందని కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు. -
విజయ్ రష్మిక పెళ్లి సందడి శుభలేఖ ఇదే.. పెళ్లి ముహూర్తం ఫిక్స్
-
బ్రేకింగ్: విజయ్ రష్మిక పెళ్లి శుభలేఖ ఇదే.. ఫొటో వైరల్
టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ-రష్మిక.. ఈ నెల 26న పెళ్లి చేసుకోనున్నారు. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. తాజాగా హైదరాబాద్ విమానాశ్రయంలోనూ కనిపించారు. వీళ్లిద్దరూ వెళ్తున్నది పెళ్లి జరిగే రాజస్థాన్లోని ఉదయ్పుర్కే అనేది తెలిసిందే. తాజాగా వీళ్ల పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)26వ తేదీన ఉదయ్పుర్లో పెళ్లి జరగనుందని అందులో రాసుకొచ్చారు. కాకపోతే కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరు కానున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ జరగనుంది. ఆ విషయాన్ని పెళ్లి పత్రికలో ముద్రించారు. ఈ మేరకు సినిమా సెలబ్రిటీలకు ఇదివరకే ఆహ్వానాలు అందాయి. ఇప్పుడు ఆ ఫొటోలే వైరల్ అవుతున్నాయి.విజయ్-రష్మిక తొలిసారి జంటగా 'గీతగోవిందం' సినిమా చేశారు. అది సూపర్ హిట్. తర్వాత 'డియర్ కామ్రేడ్' మూవీ చేశారు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. తర్వాత చాన్నాళ్ల పాటు కలిసి పనిచేయలేదు. ప్రస్తుతం విజయ్ 'రణబాలి' అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో రష్మికనే హీరోయిన్. ఇది దసరాకు రిలీజ్ కానుందని కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు. అంటే పెళ్లి తర్వాత విజయ్-రష్మిక నుంచి రాబోయే మూవీ ఇదే.(ఇదీ చదవండి: బీజేపీ నేత దారుణ కామెంట్స్పై స్పందించిన త్రిష) -
పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ?
హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఈ నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొన్నాళ్ల నుంచి ఈ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇద్దరిలో ఎవరూ కూడా దీన్ని ధ్రువీకరించడం లేదు. బహుశా పెళ్లి అయిపోయిన తర్వాత ఫొటోలు రిలీజ్ చేసి వెల్లడిస్తారేమో! సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు పెళ్లి పిలుపులు మొదలైపోయినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడమే దీనికి కారణం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)విజయ్ దేవరకొండ ఇప్పుడు కలిశాడంటే వేరే కారణాలేం లేవు. కచ్చితంగా పెళ్లికి ఆహ్వానించే విషయమై కలిసుంటారు. ఇందుకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది గానీ మిగతా వివరాలు అయితే రాలేదు. అసలు విషయానికొస్తే ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పుర్ వేదికగా విజయ్-రష్మిక డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చాలారోజులుగా జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 20నే ఇరు కుటుంబాలు రాజస్థాన్ వెళ్లనున్నారు.ఈనెల 22వ తేదీ నుంచి పెళ్లి కార్యక్రమాలు అంటే హల్దీ, మెహందీ, సంగీత్ లాంటివి ఉండనున్నాయి. చివరగా 26వ తేదీన పెళ్లి. తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చేయనున్నారని తెలుస్తోంది. అయితే మార్చి తొలివారంలో టాలీవుడ్ సెలబ్రిటీల కోసం రిసెప్షన్ ఉండనుంది. దీని వివరాలు తెలియాల్సిఉంది. ఏదేమైనా వివాహ తేదీ దగ్గరపడినప్పటికీ విజయ్-రష్మిక.. పెళ్లి విషయాన్ని రహస్యం ఉంచుతూనే ఉన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా) -
60 కోట్లు ఇస్తానన్న నెట్ ఫ్లిక్స్.. షాకిచ్చిన విజయ్
-
రష్మిక, శ్రీలీల బాటలో కాంతార బ్యూటీ.. టాలీవుడ్ కలిసొస్తుందా?
కన్నడ బ్యూటీలకు టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. రష్మిక, శ్రీలీలకు ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోయిన్లుగా తమ పేరును లిఖించుకున్నారు. పుష్ప మూవీతో రష్మిక మందన్నా రేంజ్ పూర్తిగా మారిపోయింది. అలా కన్నడ భామలు ఇలా వచ్చి తెలుగులో సూపర్ పవర్గా ఎదిగారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిల కంటే శాండల్వుడ్ భామలకే ఫుల్ డిమాండ్ ఉంటోంది.ఇప్పుడదే అదే బాటలో మరో కన్నడ బ్యూటీ అడుగులేస్తోంది. గతేడాది కాంతార-2 మూవీతో అందరి చూపులు తనవైపు తిప్పుకున్న భామ రుక్మిణి వసంత్. ఇప్పుడు టాలీవుడ్పై దృష్టి సారించింది. సప్త సాగరాలు దాటి లాంటి కన్నడ మూవీతో సూపర్ హిట్ కొట్టిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం టాలీవుడ్లోనూ ఛాన్స్ కొట్టేసింది. ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న చిత్రంలో అవకాశం దక్కించుకుని టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది.ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ విషయాన్ని మేకర్స్ కూడా అఫీషియల్గా ప్రకటించారు. ఈ మూవీతోనైనా రుక్మిణి వసంత్ టాలీవుడ్లో క్రేజ్ దక్కించుకుంటుందేమో వేచి చూడాల్సిందే. రష్మిక, శ్రీలీల మాదిరిగానే ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్లో స్టార్గా హోదాను సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. టాలీవుడ్లోనూ తన కెరీర్ను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా.. రుక్మిణి వసంత్ ఇప్పటికే తెలుగులో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వచ్చిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రంలో నటించింది. -
రష్మిక-విజయ్ పెళ్లి వేడుక.. కోట్ల రూపాయల డీల్కు నో..!
టాలీవుడ్లో గత కొంత కాలంగా వీరి పెళ్లి చుట్టే చర్చ నడుస్తోంది. ఎంగేజ్మెంట్ వార్తల తర్వాత ఆ ఇద్దరు స్టార్స్ పెళ్లి వేడుక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ జంట మరెవరో కాదు.. టాలీవుడ్లో మోస్ట్ వైరల్ ప్రేమజంట రష్మిక- విజయ్ దేవరకొండ. వీరిద్దరి పెళ్లి ఫిబ్రవరిలోనే జరనుందని వచ్చినా డేట్ విషయంలో క్లారిటీ లేదు. మొదట ఫిబ్రవరి 2న జరగనుందని వార్తలొచ్చనా అలా జరగలేదు. తాజాగా ఈనెల 26న ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుందని టాక్ వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో విజయ్- రష్మిక పెళ్లికి సంబంధించిన మరో న్యూస్ తెగ వైరలవుతోంది. వీరి పెళ్లి వీడియోను ఏ ఓటీటీకి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ వెడ్డింగ్ కార్యక్రమాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్తో ముందుకొచ్చనట్లు సమాచారం. అయితే తమ వ్యక్తిగత జీవితంలో బిజినెస్ చేసే ఉద్దేశం లేదని ఓటీటీ విజ్ఞప్తిని తిరస్కరించనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.గతంలో లేడీ సూపర్ స్టార్ నయనతార వెడ్డింగ్ వీడియో విషయంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే విజయ్- రష్మిక జాగ్రత్త పడుతున్నట్లు టాక్. ముఖ్యంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వేడుకతో వ్యాపారం చేయడం విజయ్కి అస్సలు ఇష్టం లేదని సమాచారం. అందుకే కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా ఓటీటీ డీల్ను వీరు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తమ పెళ్లిని కేవలం కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్గా ఉంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఏదేమైనా వీరిద్దరి పెళ్లి కోసం టాలీవుడ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
AA22: బన్నీకి విలన్ గా రష్మిక
-
జోడీ రిపీట్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, హీరోయిన్ రష్మికా మందన్నా జోడీ రిపీట్ కానుందని సమాచారం. హోమీ అడజానియా దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘కాక్టెయిల్ 2’లో షాహిద్ కపూర్, రష్మికా మందన్నా తొలిసారి కలిసి నటించారు. ఈ చిత్రంలో కృతీ సనన్ మరో హీరోయిన్గా చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. అయితే తాజాగా మరో రొమాంటిక్ కామెడీ మూవీలో షాహిద్ కపూర్, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించనున్నారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది.హిందీలో ‘బదాయి హో, మైదాన్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన అమిత్ శర్మ ఓ రొమాంటిక్ కామెడీ కథను రెడీ చేసి, షాహిద్ కపూర్కు వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట షాహిద్. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మికా మందన్నా నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఇదే నిజమైతే షాహిద్, రష్మికల జోడీ సిల్వర్ స్క్రీన్పై రిపీట్ అవుతుంది. జియో స్టూడియోస్తో కలిసి సునీల్ ఖేతర్ పాల్ ఈ సినిమాను నిర్మించనున్నారట.మరోవైపు ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణతో రష్మికా మందన్నా బిజీగా ఉన్నారు. ఇంకా విజయ్ దేవరకొండ ‘రణబాలి’, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మైసా’ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు రష్మికా మందన్నా. ఇలా వరుస చిత్రాలతో రష్మిక బిజీ బిజీగా ఉన్నారు. -
బన్నీ మూవీలో రష్మిక కీ రోల్ ..! అట్లీ ప్లాన్ అదుర్స్
-
ఉదయ్పూర్లో పెళ్లి
గత ఏడాది అక్టోబరులో విజయ్ దేవరకొండ – రష్మికా మందన్నాల నిశ్చితార్థం జరిగినప్పట్నుంచి వీరి వివాహ తేదీ ఎప్పుడు? అనే విషయంపై చర్చ మొదలైంది. ఈ నెల 26న ఈ ప్రేమికులు... భార్యాభర్తలు కానున్నారు. రాజస్తాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్ వీరి పెళ్లికి వేదిక కానుంది. ఇంకా 20 రోజులే ఉన్నందున ఇటు విజయ్ అటు రష్మిక కుటుంబ సభ్యులు జోరుగా పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు.ఇరువైపు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుంది. అలాగే హైదరాబాద్లో మార్చి 4న సినీ, రాజకీయ ప్రముఖులు, ఇతర సన్నిహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారని సమాచారం. ఇక గతంలో ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో విజయ్–రష్మిక జంటగా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. తాజాగా వీరి కాంబినేషన్లో మూడో సినిమాగా ‘రణబాలి’ రూపొందుతోంది. ఈ చిత్రం సెప్టెంబరు 11న విడుదల కానుంది. -
రష్మిక, విజయ్ పెళ్లి డేట్ వచ్చేసింది..!
-
రష్మిక- విజయ్ పెళ్లి తేదీపై కన్ఫ్యూజన్.. కన్ఫామ్ చేసినట్టేనా?
టాలీవుడ్లో ఇప్పుడంతా వీరిద్దరి పెళ్లి గురించి చర్చ నడుస్తోంది. డేటింగ్ నుంచి ఎంగేజ్మెంట్ వరకు ఫ్యాన్స్లో కన్ఫ్యూజన్ అలాగే ఉంది. గతేడాది నిశ్చితార్థం జరిగినట్లు వార్తలొచ్చినప్పటికీ ఇంకా ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. ఇంతకీ ఎవరి పెళ్లి అనుకుంటున్నారా? అదేనండి మన రష్మిక- విజయ్ దేవరకొండ జంట గురించే. గత కొద్ది రోజలుగా ఉదయ్పూర్లో గ్రాండ్ వెడ్డింగ్ అంటూ వార్తలు హల్ చల్ చేశాయి. అంతేకాకుండా ఈనెల 2న రష్మిక- విజయ్ వెడ్డింగ్ అంటూ ఇద్దరు అమ్మాయిలు మాట్లాడిన వీడియో తెగ వైరలైంది. కానీ అదంతా ఫేక్ అని తర్వాత తెలిసిపోయింది.అయితే తాజాగా మరో మ్యారేజ్ డేట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. రష్మిక ఎయిర్పోర్ట్లో వెళ్తుండగా ఓ అభిమాని ఫోటో తీసుకుంటానంటూ రష్మికను రిక్వెస్ట్ చేశాడు. దీంతో వెంటనే మాస్క్ తొలగించి ఫోటోలకు పోజులిచ్చింది. ఆ తర్వాత వెంటనే అతను రష్మికకు కంగ్రాట్స్ చెప్పాడు. దీనికి రష్మిక దేనికి రా అంటూ అతన్ని నవ్వుతూ అడిగింది. వెయిటింగ్ ఫర్ ఫిబ్రవరి 26 ఫర్ వెడ్డింగ్ మేడం అన్నాడు. దీనికి రష్మిక క్యూట్గా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. తన స్మైల్తో పెళ్లి తేదీ ఫిక్సయినట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక పరోక్షంగా తన పెళ్లి తేదీని రివీల్ చేసిందని అంటున్నారు.గత డిసెంబర్లో వచ్చిన సమాచారం ప్రకారం రష్మిక- విజయ్ ఫిబ్రవరి 26న ఉదయపూర్లోని ప్యాలెస్లో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత హైదరాబాద్లో తమ సినీ ఇండస్ట్రీ స్నేహితుల కోసం రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే వీటిపై ఈ జంట ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. కాగా.. వీరిద్దరు జంటగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలలో నటించారు. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
రష్మిక- విజయ్ పెళ్లి డేట్ ఫిక్స్.. వీడియో వైరల్..!
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో పుష్ప మూవీతో నేషనల్ క్రష్గా మారిపోయింది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ముద్ర వేసుకున్న రష్మిక.. బాలీవుడ్లోనూ వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఓ లేడీ ఓరియంటెడ్ మూవీలో నటిస్తోంది ముద్దుగుమ్మ.అయితే రష్మిక సినీ కెరీర్ పక్కనపెడితే.. వ్యక్తిగతంగా ఎన్నో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. గతేడాది విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ అయిందని వార్తలొచ్చినా.. వీళ్లు మాత్రం అఫీషియల్గా ప్రకటించలేదు. అయితే ఈవెంట్స్లో మాత్రం చెప్పి చెప్పనట్లుగా మాట్లాడుతూ వచ్చారు. అలా అభిమానుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల వీరిద్దరి పెళ్లి ఉదయ్పూర్లో జరగనుందని వార్తలొచ్చాయి. దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అటు విజయ్ దేవరకొండ కానీ.. రష్మిక కానీ ఎక్కడా బయటికి చెప్పలేదు.కానీ తాజాగా వీరి పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట వైరలవుతోంది. ఇద్దరు ఈవెంట్ ప్లానర్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఇది రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నామంటూ ఇద్దరు అమ్మాయిలు వీడియోలో మాట్లాడారు. రష్మిక- విజయ్ ఈ నెల 2న పెళ్లి చేసుకోబోతున్నారంటూ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఇది చూసిన కొందరు నెటిజన్స్ ఇదంతా ఫేక్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో కంగ్రాట్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే రష్మిక కానీ.. విజయ్ కానీ క్లారిటీ ఇవ్వాల్సిందే. Rashmika Mandanna and Vijay Devrakonda are getting married in Udaipur on Feb 2 😲-Confirmed by the Event Planners.pic.twitter.com/HXGUS8RdOE— Christopher Kanagaraj (@Chrissuccess) January 31, 2026 -
డబ్బు కోసమే తప్పుడు వార్తలు రాస్తున్నారు: రష్మిక
మనుషుల మనో భావాలు రక రకాలుగా ఉంటాయి. ఇక సినీ తారల అభిప్రాయలు సందర్భానుసారంగా ఉంటాయని చెప్పవచ్చు. కొందరు తమపై వచ్చే విమర్శలను స్వాగతిస్తున్నామంటారు. మరి కొందరు వదంతులను ఎంజాయ్ చేస్తున్నామంటారు. ఇంకొందరు సీరియస్గా రియాక్ట్ అవుతుంటారు. ఇందుకు మన కథానాయకిలు అతీతంగా కాదు. అలా నటి రష్మిక మందన్నా(Rashmika Mandanna) కూడా వదంతులపై స్పందించారు. ఈ కన్నడ బ్యూటీ మాతృభాషలో నటించిన తొలి చిత్రం తరువాత నుంచే వివాదాల్లో చిక్కుకున్నారనే చెప్పాలి. ఆ తరువాత కూడా తన వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలకు గురయ్యారు. ఆ తరువాత ప్రేమ వ్యవహారంలో వైరల్ అయ్యారు. విషయం ఏమిటంటే ఇవేవీ ఈ భామ కెరీర్కు ఎఫెక్ట్ అవ్వలేదు. అదే సమయంలో అవన్నీ ఈమెకు ప్లస్ అయ్యాయనే చెప్పాలి. అందుకే శాండిల్ వుడ్ వైయా టాలీవుడ్, కోలీవుడ్లోనూ దాటి బాలీవుడ్లోనూ వరుస విజయాలను సాధిస్తూ నేషనల్ క్రష్గా వెలిగిపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాలతో పాటూ హిందీలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన గురించి వైరల్ అవుతున్న రకరకాల ట్రోలింగ్స్పై స్పందించిన రష్మిక మందన్నా అసత్య ప్రచారాలపై ఎందుకు వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు. అలాంటి విషయాలపై స్పందిస్తే వారిని ప్రోత్సహించినట్లే అవుతుందన్నారు. కొందరు డబ్బు కోసమే అలాంటి నిరాధారమైన వార్తలు రాస్తున్నారని అన్నారు. అలాంటి ముఖం తెలియని వారికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎప్పుడూ ఒకేలా ఉంటున్నానని నటి రష్మిక మందన్నా పేర్కొన్నారు. -
జపాన్ అభిమాని దెబ్బకు బిత్తరపోయిన పుష్ప..
-
విజయ్-రష్మిక పెళ్లి తర్వాత వచ్చే సినిమా ఇదే.. వీడియో రిలీజ్
గత కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు గానీ సరైన సక్సెస్ మాత్రం విజయ్ దేవరకొండకు దొరకట్లేదు. గతేడాది 'కింగ్డమ్'తో వచ్చాడు గానీ అదే సీన్ రిపీటైంది. ప్రస్తుతం రెండు మూవీస్ చేస్తున్నాడు. వాటిలో ఒకటి 'రౌడీ జనార్ధన' కాగా మరొకటి రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పీరియాడిక్ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇందులో విజయ్ సరసన రష్మిక హీరోయిన్గా నటిస్తుండటం విశేషం.విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు 'రణబాలి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 1876-78 మధ్య రాయలసీమ ప్రాంతంలో జరిగే స్టోరీతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ కాలంలో భారతదేశానికి వచ్చిన బ్రిటీషర్లు.. హిట్లర్ చేసిన దానికంటే ఎంత పెద్ద మారణహోమం సృష్టించారు. ఏకంగా 45 ట్రిలియన్ డాలర్లు దోచుకోవడం, 40 ఏళ్లలో 100 మిలియన్ల మంది చావులకు కారణమవడం.. ఇలాంటి చాలా విషయాలు సినిమాలో ఉండబోతున్నాయని అనౌన్స్మెంట్ వీడియోతో చెప్పకనే చెప్పేశారు.ఇందులో విజయ్.. బ్రిటీషర్లపై పోరాడిన రణబాలి అనే వీరుడిగా కనిపించనున్నాడు. రష్మిక.. జయమ్మ అనే పాత్ర పోషించింది. 'మమ్మీ' ఫేమ్ ఆర్నాల్డ్ ఓస్లో ... సర్ థియోడర్ హెక్టర్ పాత్ర చేశాడు. బాలీవుడ్ ఫేమ్ అజయ్ అతుల్ సంగీతమందిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 11న ఇది పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఫిబ్రవరిలో విజయ్-రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే వీళ్లిద్దరూ భార్యభర్తలుగా నటించిన తొలి సినిమా ఇదే అవుతుంది. గతంలో వీళ్లిద్దరూ గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు జంటగా చేశారు. -
VD 14 : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్ని ఇప్పటి వరకు ప్రకటించలేదు. వీడీ14 అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ ప్రారంభించారు. అయితే రిపబ్లిక్ డే సందర్భంగా రౌడీ ఫ్యాన్స్కి మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమా టైటిల్ని జనవరి 26న అనౌన్స్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా బ్రిటీష్ కాలం నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా "వీడీ 14" సినిమా రూపొందుతోంది. 'డియర్ కామ్రేడ్', 'ఖుషి' వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ కలిసి చేస్తున్న మూడో చిత్రమిది. 'టాక్సీవాలా' లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' తర్వాత "వీడీ 14"లో మూడోసారి రష్మిక, విజయ్ జంటగా కనిపించనున్నారు. 26.1.26.Remember the date🔥You will remember the name❤️🔥#VD14@TheDeverakonda @Rahul_Sankrityn @MythriOfficial #NiravShah #BhushanKumar #KrishanKumar @TSeries #ShivChanana @neerajkalyan_24 @vd14thefilm pic.twitter.com/07HL8UJqth— Mythri Movie Makers (@MythriOfficial) January 24, 2026 -
రౌడీ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా వీడీ 14.. ప్రామిస్ చేసిన దర్శకుడు!
‘టాక్సీవాలా’ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్లో వీడీ14 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సారి తమ హీరో విజయ్ దేవరకొండ కు మంచి హిట్ మూవీ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ రాహుల్ కు రిక్వెస్ట్స్ పంపుతున్నారు.రీసెంట్ గా యశ్వంత్ అనే విజయ్ దేవరకొండ ఫ్యాన్ తమ హీరోకు మెమొరుబల్ మూవీ ఇవ్వాలటూ హార్ట్ టచింగ్ రిక్వెస్ట్ ఒకటి పంపారు. ఆ అభిమాని రిక్వెస్ట్ కు స్పందించిన రాహుల్ సంకృత్యన్ 'మీ అభిమానులందరి ఆకలి తీర్చేలా వీడీ 14 ఉంటుంది..' అంటూ ప్రామిస్ చేశారు. విజయ్ అభిమానికి స్పందిస్తూ రాహుల్ ఇచ్చిన రిప్లైతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ వీడీ 14 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. -
రష్మిక, మురగదాస్ ఇద్దరి మాట ఒక్కటే..
ఎవరైనా విజయాలను తమకు ఆపాదించుకోవడంలో ముందుంటారు. అపజయాలను ఇతరులపై నెడుతుంటారు. ఇది సహజం. అపజయాలకు బాధ్యత వహించేవారు చాలా తక్కువనే చెప్పాలి. ఆ మధ్య సల్మాన్ఖాన్, రష్మిక మందన్నా జంటగా నటించిన హిందీ చిత్రం సికిందర్. తమిళ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై పూర్తిగా నిరాశ పరచింది. దీంతో ఈ చిత్రం ఫ్లాప్పై దర్శకుడు మురుగదాస్ స్పందిస్తూ ఉత్తరాదిలో సల్మాన్ఖాన్ బెదిరింపులను ఏదుర్కొంటున్న కారణంగా షూటింగ్ను పగలు చేయడం సాధ్యం కాక పగలు చిత్రీకరించాల్సిన సన్నివేశాలను కూడా రాత్రి వేళల్లో చేయాల్సి వచ్చిందని చెప్పారు. సల్మాన్ఖాన్ షూటింగ్కు ఆలస్యంగా వచ్చేవారు అని చర్చనీయాంశ వ్యాఖ్యలు చేశారు. సికిందర్ డిజాస్టర్లో తన పాత్ర లేదని కూడా చెప్పారు. దీంతో సల్మాన్ అభిమానులు దర్శకుడు మురుగదాస్పై విమర్శల దాడి చేశారు. సల్మాన్ఖాన్ కూడా మురుగదాస్ వ్యాఖ్యలకు పరోక్షంగా గట్టిగానే బదులిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో రష్మిక మందన్నా ఆజ్యం పోసేలా వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఈ బ్యూటీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ సికిందర్ కథను దర్శకుడు ఏఆర్.మురుగదాస్ తనకు చెప్పినప్పుడు బాగుందని. అయితే షూటింగ్లో వేరే విధంగా మారిపోయిందని పేర్కొన్నారు. ఆ చిత్ర అపజయంలో తన బాధ్యత లేదని చెప్పే ప్రయత్నం చేశారు. కాగా హిందీలో మంచి సక్సెస్లో ఉన్న రష్మిక మందన్నాకు సికిందర్ చిత్రం పూర్తిగా నిరాశపరిచందన్నది గమనార్హం. మొత్తం మీద సికిందర్ చిత్రం విడుదలై చాలా కాలం అయినా, దాని గురించి రచ్చ ఇంకా జరుగుతూనే ఉందన్నది గమనార్హం. -
అది నిజం కాదు.. కానీ నిజం కావాలి : రష్మిక
‘‘నా జీవితంలో జరిగిన ప్రతి విషయం నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను’’ అని హీరోయిన్ రష్మికా మందన్నా(Rashmika Mandanna ) అంటున్నారు. నటిగా తన కథల ఎంపిక, పారితోషికం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు రష్మిక. ఆమె మాట్లాడుతూ–‘‘హీరోయిన్గా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే నా పని. ఎలాంటి భాషాపరమైన హద్దులు లేకుండా, అందరికీ నచ్చే చిత్రాలు చేయడానికే ప్రయత్నిస్తుంటాను. కొంతమంది ప్రేక్షకులకు లవ్స్టోరీ సినిమాలు ఇష్టం. ఇంకొంతమంది వాణిజ్య చిత్రాలను ఇష్టపడతారు. అందుకే కమర్షియల్, లవ్ స్టోరీ, ఉమెన్ సెంట్రిక్... ఇలా విభిన్న రకాల జానర్స్లో సినిమాలు చేస్తున్నాను. (చదవండి: నా ఫోటోలు జూమ్ చేసి చూశారు.. దర్శకుడిపై 'ఈషా రెబ్బా')ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసమే వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నాను. ఇకపై కూడా ఇలానే ముందుకు సాగుతాను. ఇక స్పెషల్ సాంగ్స్ చేయడంపైనా నాకు ఆసక్తి ఉంది. కాకపోతే ఆ చిత్రంలో నేనే హీరోయిన్ గా ఉండాలి. లేదంటే.. ఇండస్ట్రీలో ఉన్న ఓ నలుగురు డైరెక్టర్స్ సినిమాల్లో మాత్రం లీడ్ రోల్ కాకపోయినా స్పెషల్ సాంగ్ చేస్తాను. అలాగే ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషికం తీసుకునే నటిని నేనే అనుకుంటున్నారు.. అయితే ఇది నిజం కాదు. కానీ, అది నిజం కావాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. -
వచ్చేనెలలో విజయ్తో పెళ్లి.. రష్మిక ఏమన్నారంటే?
హీరోయిన్ రష్మిక ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయింది. గతేడాది ది గర్ల్ఫ్రెండ్తో హిట్ కొట్టిన ముద్దుగుమ్మ.. కొత్త ఏడాదిలోనూ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ.. తనపై వస్తున్న రూమర్స్పై స్పందించింది. విజయ్ దేవరకొండతో వచ్చే నెలలోనే పెళ్లంటూ వార్తలొస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇవ్వాలని యాంకర్ రష్మికను ప్రశ్నించింది.ఈ ప్రశ్నకు రష్మిక చాలా తెలివిగా సమాధానం చెప్పుకొచ్చింది. నాలుగేళ్లుగా ఇలాంటి వింటూనే ఉన్నానని తెలిపింది. జనం కూడా ఎప్పటి నుంచో ఇదే ప్రశ్న అడుగుతున్నారు.. దాని కోసమే తాను కూడా ఎదురుచూస్తున్నానంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. దీనిపై ఎప్పుడు చెప్పాలో అప్పుడే మాట్లాడతానని తెలిపింది. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెప్తానంటూ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాకుండా కెమెరా ముందు కాకుండా ఆఫ్ ది రికార్డ్లో ఈ విషయం గురించి మాట్లాడతానని రష్మిక సమాధానం దాటవేసింది.కాగా.. విజయ్ దేవరకొండతో ఫిబ్రవరి 26న రష్మిక పెళ్లి జరగనుందని నెట్టింట వైరలవుతోంది. రాజస్థాన్లోని ఉదయపూర్లో గ్రాండ్ వెడ్డింగ్ జరగనుందని టాక్. గతేడాది అక్టోబర్లో వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారని వార్తలొచ్చాయి. కానీ దీనిపై కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. అలాగే తాజాగా పెళ్లి విషయంలోనూ అదే ఫాలో అవుతూ సర్ప్రైజ్ ఇస్తారేమో వేచి చూడాల్సిందే. Q: There’s been a lot of buzz that #VijayDeverakonda and Rashmika are engaged and getting married on FEB 26th in Udaipur. What’s the truth?#RashmikaMandanna : pic.twitter.com/x6vD2jSIZB— Whynot Cinemas (@whynotcinemass_) January 19, 2026 -
జపాన్ లో పుష్ప 2 ప్రమోషన్స్ లో అల్లు అర్జున్, రష్మిక (ఫొటోలు)
-
సికందర్ విషయంలో అదే జరిగింది: రష్మిక
గతేడాది తిరుగులేని కథానాయికగా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్నా. ఛావా, కుబేర, థామా, ది గర్ల్ఫ్రెండ్ సినిమాలతో సూపర్ హిట్లు, బ్లాక్బస్టర్లు అందుకుంది. 2025లో ఆమె నటించిన అన్ని సినిమాలు విజయాలు సాధిస్తే.. ఒకే ఒక మూవీ మాత్రం బాక్సాఫీస్ వద డిజాస్టర్గా నిలిచింది. అదే సికందర్. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు.గతేడాది ఒక్కటే ఫ్లాప్ తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. గతేడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం బడ్జెట్ కూడా రాబట్టలేకపోయింది. హీరో సమయానికి సెట్కు వచ్చేవాడు కాని, అందుకే సినిమా పోయింని మురుగాస్ సల్మాన్ను విమర్శించాడు. దాంతో ఆ హీరో కూడా దర్శకుడికి రివర్స్ కౌంటర్లిచ్చాడు. తాజాగా సికందర్ మూవీ గురించి రష్మిక స్పందించింది.నాకు చెప్పిన కథ వేరుతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సికందర్ కథ నాకు చెప్పినప్పుడు ఒకలా ఉంది. తర్వాత మొత్తం మారిపోయింది. సాధారణంగా ఇది సినిమాల్లో జరుగుతూనే ఉంటుంది. మొదట కథ ఒకటి చెప్తారు.. సినిమా తీసే క్రమంలో.. పర్ఫామెన్స్, రిలీజ్ డేట్, ఎడిటింగ్.. వీటన్నింటి మూలంగా అన్నీ మారిపోతూ ఉంటాయి. సికందర్ విషయంలో కూడా అదే జరిగింది అని చెప్పుకొచ్చింది.చదవండి: ఆ ఇద్దరే బిగ్బాస్ విజేతలు.. మరో సర్ప్రైజ్ ఏంటంటే? -
జై జై నాయిక..!
ఒకవైపు హీరోయిన్స్ గా సినిమాలు చేస్తూనే, సమయం దొరికినప్పుడల్లా ఉమెన్స్ సెంట్రిక్ సినిమాలూ చేస్తున్నారు కొందరు కథానాయికలు. సందేశాత్మక చిత్రాలే కాదు.. ఫుల్ యాక్షన్స్ చిత్రాలకూ సై అంటున్నారు. మరి.. ఏ హీరోయిన్స్ ఏ సినిమా చేస్తున్నారు? తొలిసారిగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్న హీరోయిన్స్ ఎవరు? అనే అంశాలపై ఓ లుక్ వేయండి.మా ఇంటి బంగారం‘ఓ.. బేబీ’ వంటి సూపర్హిట్ మూవీ తర్వాత హీరోయిన్స్ సమంత, దర్శకురాలు నందినీరెడ్డి కాంబినేషన్స్ లో రూపొందుతున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఇటీవల ఈ సినిమా టీజర్ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సమంత ఓ గృహిణి పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు..ఈ చిత్రంలో సమంత క్యారెక్టరైజేషన్స్ లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్లుగా, ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఇక ఈ సినిమాలో సమంత పాత్ర వివాహం చేసుకుని, అత్తగారిఇంటికి వెళ్లడం, ఆమె ఊహించుకున్న కొన్ని పరిస్థితులు, అంచనాలు తలకిందులు కావడం, మరోవైపు సడన్స్ గా సమంత ఫైట్స్ చేయడం వంటి విజువల్స్ కూడా కనిపించాయి. ఈ చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజూషా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు, హిమాన్స్ ్క దువ్వూరు ‘మా ఇంటి బంగారం’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుందని తెలిసింది. మరోవైపు 2023లో విజయ్దేవరకొండ, సమంత కలిసి ‘ఖుషి’ సినిమాలో నటించారు. ఈ చిత్రం తర్వాత సమంత ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన మరో మూవీ ఆడియన్స్ ముందుకు రాలేదు. సమంత నిర్మించిన ‘శుభం’ సినిమా గత ఏడాది మేలో విడుదలైంది. ఈ చిత్రంలో సమంత గెస్ట్ రోల్ మాత్రమే చేశారు. మరి..సమంత చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా ఈ ఏడాది థియేటర్స్లో విడుదలైతే, కొంతగ్యాప్ తర్వాత సమంతను ఓ ఫుల్ లెంగ్త్ రోల్లో ఆడియన్స్, ఆమె ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతారని ఊహించవచ్చు. పవర్ఫుల్ మైసారష్మికా మందన్నా నటించిన తొలి ఉమెన్స్ సెంట్రిక్ ఫిల్మ్ ‘ది గర్ల్ఫ్రెండ్’ గత ఏడాది విడుదలై, సూపర్హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు..ఈ చిత్రంలో రష్మిక మందన్నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ జోష్లో ‘మైసా’ అనే మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్కు గ్రీన్స్ సిగ్నల్ ఇచ్చారు రష్మిక. ఈ ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్స్ ఎంటర్టైనర్ సినిమాకు రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు. అన్స్ ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ సినిమా కోసం రష్మికా మందన్నా అద్భుతంగా మేకోవర్ అయ్యారు. గోండ్ తెగకు చెందిన శక్తివంతమైన మహిళగా ఇందులో నటిస్తున్నారు రష్మిక. తెలంగాణ, కేరళలోని దట్టమైన అడవుల్లో ‘మైసా’ చిత్రీకరణ జరిపారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు సిల్వర్స్క్రీన్స్ పై రష్మిక మందన్నా ఎక్కువగా రొటీన్స్ గ్లామర్ రోల్స్, కాలేజీ అమ్మాయి, గృహిణి.. వంటి పాత్రలు చేశారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు రష్మిక మందన్నా తొలిసారి ఓ పూర్తి స్థాయి యాక్షన్స్ సినిమా చేస్తుండటంతో, ‘మైసా’ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.ది బ్లాక్గోల్డ్‘బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలతో నటిగా మంచి పేరు సంపాదించు కున్నారు హీరోయిన్స్ సంయుక్త. ఈ సక్సెస్లతో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారామె. అయితే ఈ బ్యూటీ తొలిసారిగా ఉమెన్స్ సెంట్రిక్ ఫిల్మ్స్ జానర్లో ఎంట్రీ ఇచ్చి, ‘ది బ్లాక్గోల్డ్’ అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలోపోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు సంయుక్త. యోగేష్ కేఎమ్సీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది.తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్పై ఓ క్లారిటీ వస్తుంది. ప్రస్తుత సమాజంలోని ఓ బర్నింగ్ ఇష్యూని టచ్ చేస్తూ, ‘ది బ్లాక్గోల్డ్’ను తెరకెక్కిస్తున్నారట యోగేష్. సంయుక్త పూర్తిస్థాయి యాక్షన్స్ చేస్తున్న ఈ ‘ది బ్లాక్గోల్డ్’ సినిమాపై ఆడియన్స్్సలో అంచనాలు ఉన్నాయి.భార్యాభర్తల గొడవలుభార్యాభర్తల గొడవలు, వారి అనుబంధాలు, గిల్లికజ్జాలు, విడాకులు... వంటి అంశాల నేపథ్యంతో రూపొందుతున్న సినిమా ‘సతీ లీలావతి’. ఈ సినిమాలో లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో దేవ్ మోహన్స్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో దేవ్, లావణ్య భార్యాభర్తలు నటించారు. ‘భీమిలీ కబడ్డీ జట్టు’, ‘ఎస్ఎంఎస్’ (శివ మనసులో శృతి) చిత్రాల ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఆల్రెడీ ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్లో రిలీజ్ కానుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ క్లారిటీ రానుందని తెలిసింది.సస్పెన్స్ థ్రిల్లర్హీరోయిన్స్ శోభిత ధూళిపాళ్ల ప్రధాన పాత్ర చేసిన సినిమా ‘చీకటిలో..’. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సురేష్ ప్రోడక్షన్స్ పతాకంపై డి.సురేష్బాబు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో సంధ్య అనే పాత్రలో నటించారు శోభిత. సంధ్య వద్ద శిక్షణ పొందుతున్న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా చని΄ోతాడు. ఈ మరణం గురించి సంధ్యకు కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అవి ఏంటి? అనేది సినిమాలో చూసి తెలుసుకోవాలి. ఈ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా జనవరి 23 నుంచి ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.క్రేజీ కల్యాణంపెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథ, కథనాలతో రూపొందుతున్న సినిమా ‘క్రేజీ కల్యాణం’. ఈ చిత్రంలో అనుపమా పరమే శ్వరన్స్ లీడ్ రోల్ చేస్తుండగా, నరేష్ వీకే, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్ మెహన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణను జరుపుతున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ΄్లాన్స్ చేస్తున్నారు. ఇక ఈ సంగతి ఇలా ఉంచితే.. గత ఏడాది ‘పరదా’ అనే ఉమెన్స్ సెంట్రిక్ సినిమా చేశారు అనుపమా పరమేశ్వరన్స్ . ఈ సినిమాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది.గరివిడి లక్ష్మిఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రముఖ జానపద గాయని, కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం వెండితెరపైకి వస్తోంది. ‘గరివిడి లక్ష్మి’ టైటిల్తో ఆమె బయోపిక్ తెరకెక్కుతోంది. హీరోయిన్స్ ఆనంది టైటిల్ రోల్ చేస్తున్నారు.1990 నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుంది. ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమాకు గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీపై సరైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఇలా ఈ కోవలో మరికొన్ని ఉమెన్స్ సెంట్రిక్ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. మరి.. జై జై నాయిక అంటూ ప్రేక్షకులు, హీరోయిన్ల అభిమానులు ఈ తరహా చిత్రాలను ఈ ఏడాదిలో ఎంత మేరకు ఆదరిస్తారో చూడాలి.⇒ లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ రూపకల్పనకు సన్నాహాలు మొదలైనట్లుగా తెలిసింది. నిర్మాత రాక్లైన్స్ వెంకటేశ్ ఈ బయోపిక్కు సంబంధిన పనులపై వర్క్ చేస్తున్నారని, ఈ సినిమా నిర్మాణంలో తాను అసోసియేట్ అవుతానన్నట్లుగా ఇటీవల ‘ఈషా’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నిర్మాత బన్నీ వాసు పేర్కొన్నారు. ఈ రకంగా ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు మొదలైనట్లుగా తెలుస్తోంది.అయితే ఈ బయోపిక్లో ఎంఎస్ సుబ్బలక్ష్మిగా ఎవరు నటించనున్నారు? అనే విషయంపై సరైన స్పష్టత రావడం లేదు. హీరోయిన్స్ సాయిపల్లవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే దర్శకుడిగా గౌతమ్ తిన్ననూరి పేరు తెరపైకి వచ్చింది. మరి.. వెండితెరపై ఎంఎస్ సుబ్బలక్ష్మిగా సాయిపల్లవి నటిస్తారా? లేక మరోక హీరోయిన్స్ ఎవరైనా ఈ పాత్రను చేస్తారా? అన్న అంశాలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.⇒ వరుస సినిమాలతో టాలీవుడ్లో వన్నాఫ్ ది టాప్ హీరోయిన్స్ గా దూసుకెళ్తున్నారు హీరోయిన్స్ శ్రీలీల. అయితే ఈ యంగ్ బ్యూటీ ఇప్పటì æవరకు ఉమెన్స్ సెంట్రిక్ ఫిల్మ్ జానర్లో సినిమా చేయలేదు. అయితే ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్స్ లో సూపర్హిట్ ఫిల్మ్ ‘మంగళవారం’ చిత్రానికి సీక్వెల్ రానుందని, ఈ చిత్రంలో శ్రీలీల మెయిన్స్ లీడ్ రోల్ చేస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అలాగే అనుష్కా శెట్టి నటించిన బ్లాక్బస్టర్ సినిమా ‘అరుంధతి’ హిందీలో రీమేక్ కానుందని, ఈ చిత్రంలో శ్రీలీల నటించనున్నానే ప్రచారం సాగింది. అయితే ఈ విషయాలపై పూర్తిస్థాయి అధికారిక సమాచారం అందాల్సి ఉంది.⇒ రవితేజ ‘మిస్టర్ బచ్చన్స్ ’, విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’, దుల్కర్ సల్మాన్ ‘కాంత’, రామ్ ‘ఆంధ్రాకింగ్ తాలూకా’ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యారు హీరోయిన్స్ భాగ్యశ్రీ బోర్సే. కాగా తాజాగా ఉమెన్స్ సెంట్రిక్ ఫిల్మ్ జానర్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట ఈ హీరోయిన్స్ . ‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా’ అనే టైటిల్తో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా రానుందని, ఈ చిత్రంలో భాగ్యశ్రీ మెయిన్స్ లీడ్ రోల్ చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.ఈ సినిమాను రమేష్ అనే ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్నారనే టాక్ వినిపిస్తోంది. మద్యపాన నిషేధం నేపథ్యంతో సాగే ఈ పీరియాడికల్ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం. స్వప్న సినిమా నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుందనే ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. – ముసిమి శివాంజనేయులు -
అగ్రస్థానంలో.. రష్మిక మందన్న: కొడగు జిల్లాలో..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి దాదాపు చాలామందికి తెలుసు. కానీ ఈమె కొడగు జిల్లాలో అత్యధిక పన్ను చెల్లింపుదారు అనే విషయం బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఈ కథనంలో తెలుసుకుందాం.కొడగు జిల్లాలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తిగా.. రష్మిక మందన్న సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాలలో రూ.4.69 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించి, జిల్లాలోని మొత్తం పన్ను చెల్లింపుదారులలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.కొడగు జిల్లాలోని విరాజ్పేటకు చెందిన రష్మిక.. కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత చలో సినిమాతో తెలుగు చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత గీతగోవిందం సినిమాతో బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఈమె తమిళం, హిందీ భాషా సినిమాల్లో కూడా నటిస్తూ.. మంచి గుర్తింపు పొందారు.విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లిహీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా నిశ్చితార్థం జరిగిందన వార్తలు వచ్చినప్పటికీ.. వారు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కానీ, సరైన సమయంలో ఆ విషయం గురించి చెబుతానని ఇప్పటికే రష్మిక క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్లోని విజయ్ దేవరకొండ నివాసంలో వీరి ఎంగేజ్మెంట్ అయిందని వారి సన్నిహితులు కూడా పోస్టులు పెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే, ఇప్పుడు పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి.సోషల్ మీడియాలో వస్తున్న తాజా సమాచారం ప్రకారం.. 2026 ఫిబ్రవరి 26న విజయ్ - రష్మికల పెళ్లి జరగనుందని తెలుస్తోంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో వారిద్దరూ పెళ్లిపీటలెక్కబోతున్నారని టాక్ జరుగుతుంది. ఘనంగా పెళ్లి జరిపేందుకు ఇరు కుటుంబ సభ్యులు ఘనంగా ఏర్పాట్లు చేయబోతున్నారని టాక్. అయితే, ఇందులో నిజమెంతో తెలియాలంటే విజయ్-రష్మికలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.ఇదీ చదవండి: మార్చి 2026 నుంచి ఏటీఎమ్లో రూ.500 నోట్లు రావా.. నిజమెంత? -
శారీతో ఆదితి గౌతమ్ ఫుల్ గ్లామర్.. జ్ఞాపకాల్లో తేలిపోతున్న రష్మిక..!
బాలీవుడ్ బ్యూటీ రషా తడానీ న్యూ ఇయర్ చిల్..బ్లూ డ్రెస్లో హీరోయిన్ సదా అందాలు..శారీలో హీరోయిన్ ఆదితి గౌతమ్ హోయలు..క్యూట్ బేబీతో రేణు దేశాయ్ న్యూ ఇయర్ పిక్.. గతేడాది జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న రష్మిక మందన్నా.. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by Sadaa Sayed (@sadaa17) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) -
న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)
-
రష్మిక రోమ్ ట్రిప్.. మరిది ఆనంద్తో కలిసి (ఫొటోలు)
-
మృణాల్ క్యూట్ ఫేస్.. 'ధురంధర్' బ్యూటీ లావిస్ లుక్
'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ లావిస్ లుక్క్యూట్ ఫేస్ పెట్టి మాయ చేస్తున్న మృణాల్ ఠాకుర్రోమ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మికలంగా ఓణీలో మెరిసిపోతున్న హీరోయిన్ ఈషారెబ్బామంచులో తిరిగేస్తున్న 'ఫౌజీ' బ్యూటీ ఇమాన్విబ్లాక్ డ్రస్లో ఎగిరిపోతున్న పూజా హెగ్డే View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Sara Arjun (@saraarjunn) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Parvathy Thiruvothu (@par_vathy) -
విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి సందడి..రోమ్ టూర్లో రష్మిక ఫ్యాషన్ వైబ్..!
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా నిశ్చితార్థం జరిగిందన వార్తలు వచ్చినప్పటికీ వారు మాత్రం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అయితే హైదరాబాద్లోని విజయ్ దేవరకొండ నివాసంలో వీరి ఎంగేజ్మెంట్ అయిందని వారి సన్నిహితులు కూడా పోస్టులు పెట్టారు. తాజాగా ఇప్పుడు వారి పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ఈ జంట ఫిబ్రవరి 26, 2026న విజయ్-రష్మికల పెళ్లి జరగనుందని తెలుస్తోంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో వారిద్దరూ పెళ్లిపీటలెక్కబోతున్నారని టాక్. ఇదెంత వరకు వాస్తవం అన్నది తెలియదు కానీ రష్మిక, హీరో విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ, ఆమె స్నేహితులతో కలిసి రోమ్ టూర్లో ఉంది. ఆ యూరోపియన్ విహారయాత్రలో తన అభిమానులను ఫ్యాషన్ లుక్స్తో అలరిస్తోంది. లాంగ్-స్లీవ్డ్ ట్రెంచ్ కోట్లో ఫ్యాషన్ ఐకానిక్గా..గోధుమ రంగు లాంగ్-స్లీవ్డ్ ట్రెంచ్ కోట్లో వింటర్ ఫ్యాషన్ ఐకాన్గా మెరిసింది రష్మిక. ఆ కోట్ సరికొత్త ఫ్యాషన్ వైబ్స్ని సృష్టించింది. నిట్టెడ్ టాప్లో రష్మిక మందన్నరష్మిక మందన్న ధకించిన బూడిద రంగు అల్లిన టాప్లో సరికొత్తగా కనిపించింది. ముఖ్యంగా చేతిలో పువ్వుల గుత్తితో స్టన్నింగ్ లుక్తో ఆకట్టుకుంది. అందుకు తగ్గట్టు డార్క్ ఫ్రేమ్డ్ గ్లాసెస్, మెటల్ బ్యాండ్తో స్టైలిష్ రిస్ట్ వాచ్తో లుక్ను అలంకరించింది. బ్రౌన్ స్వెటర్లో వ్యాపారవేత్తలా..అల్లిన గోధుమ రంగు స్వెటర్, చంకీ బ్లాక్ గ్లాసెస్లో అదరహో అనిపించేలా ఉంది ఆమె ఆహార్యం.రష్మిక మందన్న రోమ్ వార్డ్రోబ్తో ఫ్యాషన్ ప్రియులను అలరించింది. నటి క్రీమ్ స్వెటర్, డెనిమ్ జీన్స్పై పొరలుగా ఉన్న మరొక నల్ల ట్రెంచ్ కోటును స్టైలిష్ ఐకాన్గా కనిపించింది. ఎక్కడ మేకప్ లేకుండా..చాలా సింపుల్గా సాదాసీదాగా నేచురల్ లుక్లో కనిపించి నేచరల్ స్టార్ అంటే సహజసిద్ధమైన అందం అని ఎలుగెత్తి చాటింది.(చదవండి: వాట్ యాన్ ఐడియా..! యువతకు సాంకేతికతో భావోద్వేగ సందేశం..) -
విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి తేదీ ఫిక్స్..?
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా నిశ్చితార్థం జరిగిందన వార్తలు వచ్చినప్పటికీ వారు మాత్రం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. కానీ, సరైన సమయంలో ఆ విషయం గురించి చెబుతానని ఇప్పటికే రష్మిక క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్లోని విజయ్ దేవరకొండ నివాసంలో వీరి ఎంగేజ్మెంట్ అయిందని వారి సన్నిహితులు కూడా పోస్టులు పెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే, ఇప్పుడు పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి.సోషల్మీడియాలో వస్తున్న తాజా సమాచారం ప్రకారం 2026 ఫిబ్రవరి 26న విజయ్-రష్మికల పెళ్లి జరగనుందని తెలుస్తోంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో వారిద్దరూ పెళ్లిపీటలెక్కబోతున్నారని టాక్ జరుగుతుంది. ఘనంగా పెళ్లి జరిపేందుకు ఇరు కుటుంబ సభ్యులు ఘనంగా ఏర్పాట్లు చేయబోతున్నారని టాక్. అయితే, ఇందులో నిజమెంతో తెలియాలంటే విజయ్-రష్మికలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. -
టాలీవుడ్ లవ్ బర్డ్స్.. న్యూ ఇయర్ పార్టీకి రెడీ..!
టాలీవుడ్ ప్రేమ జంటల్లో విజయ్- రష్మిక జోడీ గురించి మనందరికీ సుపరిచితమే. చాలా ఏళ్లుగా డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఈ ఏడాదిలోనే నిశ్చితార్థం చేసుకున్నారని వార్తలొచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. పరోక్షంగానైతే హింట్ ఇచ్చారు. వచ్చే ఏడాదిలో వీరిద్దరు పెళ్లి పీటలెక్కబోతున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. వచ్చే ఫిబ్రవరిలో గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వైరలైంది.ప్రస్తుతం తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన, రష్మిక మందన్నా మైసా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చేశాయి. అయితే ప్రస్తుతం షూటింగ్కు కాస్తా గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా క్రిస్మస్, న్యూ ఇయర్ ఉండడంతో ఈ జంట వేకేషన్ ప్లాన్ చేశారు. నూతన ఏడాది వేడుకల కోసం ఫారిన్ ట్రిప్కు బయల్దేరారు. దీనికి సంబంధించిన ఫోటోలను రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. వెకేషన్ ట్రిప్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అయితే విజయ్, రష్మిక హైదరాబాద్ విమానాశ్రయంలో విడివిడిగా కనిపించారు. దీంతో వీరిద్దరు కలిసే వేకేషన్కు ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది.పెళ్లి గురించి ఇటీవల రష్మికతో ప్రస్తావించగా.. సమయం వచ్చినప్పుడు తానే అందరికీ చెప్తానని తెలిపింది. నిశ్చితార్థ వార్తలను కొట్టిపారేయలేదు.. అలాగని డైరెక్ట్గా చెప్పలేదు నేషనల్ క్రష్. ఇటీవలే ది గర్ల్ఫ్రెండ్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన రష్మిక.. ప్రస్తుతం మైసా చిత్రంలో నటిస్తోంది. గతంలో విజయ్, రష్మిక గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలలో నటించారు. -
జపాన్లో 'యానిమల్' సినిమా
జపాన్లో ఇండియన్ సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఇప్పటికే బాహుబలి మొదలుకొని కల్కి , ఆర్ఆర్ఆర్, దేవర వరకూ జపాన్లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకొన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా 'యానిమల్' సినిమా విడుదల కానుంది. 2023లో విడుదలైన ఈ మూవీ ఇండియాన్ బాక్సాఫీస్ను షేక్ చేసింది. టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్, రష్మిక నటించారు.సందీప్ రెడ్డి మునుపటి దర్శకత్వం వహించిన కబీర్ సింగ్ మాదిరిగానే, 'యానిమల్' మూవీపై కూడా విమర్శలు వచ్చాయి. అయితే, ప్రేక్షకుల నుండి ఆదరణ లభించింది. ఆ ఏడాదలో అత్యంత చర్చనీయాంశమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు జపాన్ సినిమా మార్కెట్ను యానిమల్ టార్గెట్ చేస్తుంది. 2026 ఫిబ్రవరి 13న ఈ మూవీ విడుదల కానున్నట్లు టీ-సీరిస్ కొత్త పోస్టర్ను విడుదల చేసింది. బాక్సాఫీస్ కలెక్షన్స్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ కూడా తన సోషల్ మీడియాలో ఈ ప్రకటనను పంచుకున్నారు. యానిమల్ జపాన్కు చేరుకుందంటూ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Taran Adarsh (@taranadarsh) -
మైసా నుంచి సర్ప్రైజ్.. రష్మిక రప్పారప్పా..
ఈ ఏడాది బాక్సాఫీస్ను రప్ప రప్పా ఆడించేసింది రష్మిక మందన్నా.. తను హీరోయిన్గా నటించిన ఛావా, థామా, కుబేర, ద గర్ల్ఫ్రెండ్ చిత్రాలు వందల కోట్లు రాబట్టాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ మైసా అనే లేడీ ఓరియంటెడ్ ఫిలిం చేస్తోంది. బుధవారం (డిసెంబర్ 24న) ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. "నా బిడ్డ సచ్చిందన్నారు. కానీ మట్టే వణికిపోయింది.. నా బిడ్డ రక్తాన్ని దాసలేక, గాలే ఆగిపోయింది.. దాని ఊపిరి మోయలేక, అగ్గే బూడిదైంది.. మండుతున్న నా బిడ్డని సూడలేక.." అన్న సంభాషణతో వీడియో మొదలైంది. నా బిడ్డను సంపలేక సావే సచ్చిపోయింది.. నా బిడ్డ ఎవరో తెలుసా.. అంటూ రష్మికను పవరల్ఫుల్ లేడీ వారియర్గా చూపించారు. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్ఫార్ములా ఫిలింస్ నిర్మిస్తోంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2026లో విడుదల కానుంది. -
కధానాయిక...కదిలేనా ఇక?
కొంతకాలం క్రితం వరకు తెలుగు సినిమాలో మహిళా ప్రధాన చిత్రాలకు తగినంత ఆదరణ ఉండేది. అందుకు తగ్గట్టే వారూ వీరని తేడా లేకుండా విజయశాంతి నుంచి అనుష్క వరకు, చాలా మంది కథానాయికలు తమ మహిళా ప్రధాన చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్బస్టర్లను సాధించారు. ఓ వైపు గ్లామర్ చిత్రాలు చేస్తూనే మరోవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలలోనూ రమ్యకృష్ణ లాంటి వారు సత్తా చాటారు. అయితే ఉత్తరాది నుంచి దిగుమతయ్యే గ్లామర్ డోస్ పెరగడం మొదలైన దగ్గర నుంచి కధానాయిక ప్రాధాన్యమున్న సినిమాల జోరు తగ్గడం కూడా మొదలైంది. అదే క్రమంలో కధానాయిక ప్రాధాన్య చిత్రాలు తీయడమే అరుదైపోగా అరకొర గా వచ్చినవి కూడా జనాదరణ పొందలేక పోయాయి. మొన్నటి సమంత శాకుంతలం నుంచి నిన్నటి అనుష్క ఘాటి దాకా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా చతికిలబడ్డాయి. దీంతో హీరోయిన్ ప్రాధాన్యమున్న చిత్రాలను తీసి మెప్పించే సత్తా టాలీవుడ్ కోల్పోయిందా? లేక చూసే ఆసక్తిని ప్రేక్షకులు కోల్పోయారా? అనే ప్రశ్నలు తలెత్తాయి.ఈ నేపధ్యంలో ఇటీవల విడుదలైన మహిళా ప్రధాన చిత్రాలైన ’8 వసంతాలు’ ’పరదా’ ది గర్ల్ ఫ్రెండ్ బాక్సాఫీస్ ట్రెండ్లను బట్టి చూస్తే, సమస్య ప్రేక్షకుల దగ్గర లేదని సినిమా రూపకర్తల దగ్గరే ఉందని తేలిపోయింది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ’8 వసంతాలు’ చిత్రం జూన్ 20న ’కుబేరా’ చిత్రంతో పాటు విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించినప్పటికీ, ఈ చిత్రం విడుదలకి ముందు ప్రేక్షకులలో హైప్ని రేకెత్తించడంలో విఫలమైంది. ఫలితంగా, ఇది బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది. ఆ మరుసటి రోజునే అనుపమ పరమేశ్వరన్ నటించిన ’పరదా’ చిత్రం విడుదలైంది. సినిమా కంటెంట్ సంగతి పక్కన పెడితే, మొదటి రోజు వసూళ్లను బట్టి చూస్తే, ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిందనే విషయం కూడా చాలా మందికి తెలియనే తెలీదు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన ’గర్ల్ఫ్రెండ్’ ఒక్కటే మరోసారి కధానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల విజయాలకు ఊపిరి పోసింది. అంటే జనాన్ని థియేటర్లకు రప్పించడంలో ప్రస్తుతం రష్మికకు ఉన్న క్రేజ్ కూడా ఉపకరించిందని ఒప్పుకోవాలి. ఏదేమైనా ఒక మహిళా ప్రధాన చిత్రం మంచి కాన్సెప్ట్తో తగిన సత్తా కలిగిన నటితో వస్తే, ప్రజలు వాటిని ఖచ్చితంగా ఆదరిస్తారని మరోసారి ఈ సినిమాతో రుజువైంది. మరోవైపు ధియేటర్లకు వెళ్లకున్నా, ఓటీటీ వేదికలపై ’8 వసంతాలు’ ’పరదా’ చిత్రాలు చూసిన వారిలో అత్యధికులు ప్రశంసలు కురిపించారు.కాబట్టి మహిళా ప్రధాన చిత్రాల పట్ల ఆదరణ, ఆసక్తి పూర్తిగా లేదని మనం చెప్పలేం. నిజానికి ఒకప్పటితో పోలిస్తే ఈ రోజుల్లో, ప్రేక్షకులు సినిమాల్లో నటీనటులు ఎవరనేది కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు, కాకపోతే వారు థియేటర్లకు వెళ్ళడానికి మాత్రం కొన్ని షరతులు కలిగి ఉన్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా అగ్రహీరోలు, పెద్ద బ్యానర్లు, లేదా భారీ బడ్జెట్తో నిర్మించిన చిత్రాలను మాత్రమే థియేటర్ కోసం ఎంచుకుంటున్నారు. లేదంటే నటీనటులు ఎవరైనప్పటికీ, తక్కువ బడ్జెట్తో నిర్మించినప్పటికీ పాజిటివ్ టాక్ వచ్చిన చిత్రాలను చూడటానికి మాత్రం థియేటర్లకు వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో పేక్షకులను థియేటర్లకు రప్పించేది ఏదో మహిళా ప్రధాన చిత్రాల్లో లోపిస్తోందనేది నిర్వివాదం. అదేంటో సమీక్షించుకుని సరిచేసుకోగలిగితే మరోసారి మహిళా చిత్రాల విజయ పరంపర మొదలు కావచ్చు. -
హీరోయిన్ రష్మిక.. గర్ల్స్ గ్యాంగ్తో శ్రీలంక ట్రిప్ (ఫొటోలు)
-
రష్మిక ది గర్ల్ఫ్రెండ్.. మరో క్రేజీ రికార్డ్..!
రష్మిక ప్రధాన పాత్రలో వచ్చిన లేటేస్ట్ మూవీ ది గర్ల్ఫ్రెండ్. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ నిలిచింది. దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటించిన ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓవరాల్గా రూ.28 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే కేవలం మౌత్ టాక్తోనే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది.ప్రస్తుతం ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన నాన్-ఇంగ్లీష్ చిత్రాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సింగర్ చిన్మయి శ్రీపాద ట్వీట్ చేసింది. ది గర్ల్ఫ్రెండ్ పోస్టర్ను షేర్ చేసింది. కాగా.. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు.ది గర్ల్ఫ్రెండ్ కథేంటంటే?భూమా (రష్మిక మందన్నా) తండ్రి (రావు రమేశ్)చాటు కూతురు. పీజీ చదివేందుకు తొలిసారి తండ్రిని వదిలి నగరానికి వెళ్లి ఓ కాలేజీలో చేరుతుంది. అదే కాలేజీలో విక్రమ్ (దీక్షిత్ శెట్టి), దుర్గ (అను ఇమ్మాన్యుయేల్) కూడా చేరతారు. దుర్గ.. విక్రమ్ను ప్రేమిస్తే.. అతడు మాత్రం భూమాను లవ్ చేస్తాడు. ప్రేమ జోలికి వెళ్లకూడదనుకుంటూనే భూమా కూడా అతడితో ప్రేమలో పడిపోతుంది. తర్వాత ఏం జరిగింది? భూమా జీవితం విక్రమ్ కంట్రోల్లోకి వెళ్లిందని తెలుసుకుని ఆమె ఏం చేసింది? అన్నదే మిగతా కథ. #TheGirlfriend is the 2nd most watched Non English film in THE WORLD on @NetflixIndia Have you watched it yet? pic.twitter.com/d21N2UhQuS— Chinmayi Sripaada (@Chinmayi) December 17, 2025 -
శ్రీలంకలో రష్మిక బ్యాచిలర్ పార్టీ.. తోడుగా ఆ హీరోయిన్
పాన్ ఇండియా సినిమాలతో రష్మిక ఫుల్ బిజీగా ఉంది. ఈ ఏడాది ఈమె నుంచి ఐదు సినిమాలు వచ్చాయి. వీటి కంటే ఈమెకు గత నెలలో హీరో విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం జరిగిందనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇది నిజమని ఇప్పటివరకు అటు రష్మిక గానీ ఇటు విజయ్ గానీ బయటపెట్టలేదు. కానీ ఈమె చేతికి ఉన్న రింగ్ మాత్రం ఇదంతా నిజమని చెప్పకనే చెబుతోంది.(ఇదీ చదవండి: 'అవతార్'లో కళ్లుచెదిరే గ్రాఫిక్స్ వెనక భారతీయ మహిళ)వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారనే రూమర్స్ వస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే ఇప్పుడు రష్మిక.. తన గర్ల్స్ గ్యాంగ్తో కలిసి శ్రీలంక ట్రిప్ వేసింది. బీచ్, రిసార్ట్స్లో ఫుల్ చిల్ అవుతూ కనిపించింది. ఈమెతో పాటు హీరోయిన్ వర్ష బొల్లమ్మ, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ కనిపించారు. మిగిలిన స్నేహితులు ఎవరనేది పెద్దగా తెలియదు.'నాకు ఈ మధ్యే రెండు రోజుల బ్రేక్ దొరికింది. నా గర్ల్స్తో పాటు చిల్ అయ్యే ఛాన్స్ దొరికింది. మేం శ్రీలంకలోని ఈ అందమైన ప్రదేశానికి వెళ్లాం. గర్ల్స్ ట్రిప్స్.. ఎంత చిన్నవి అనేది సమస్య కాదు. నా గర్ల్స్ బెస్ట్' అని రష్మిక.. తన శ్రీలంక ట్రిప్ జ్ఞాపకాల్ని పోస్ట్ చేసింది. అయితే ఇది ఈమె బ్యాచిలరేట్ పార్టీ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే అలానే అనిపిస్తుంది కూడా. రష్మిక చేతిలో ఇప్పుడు మైసా, రెయిన్ బో అనే చిత్రాలున్నాయి.(ఇదీ చదవండి: శ్రీలీల కూడా బాధితురాలే.. ఆవేదనతో పోస్ట్) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
ఓటీటీలో 'రష్మిక' హిట్ సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
బాలీవుడ్లో విజయం దక్కించుకున్న థామా సినిమా ఓటీటీలోకి వచ్చేసిన విషయం తెలిసిందే.. అయితే, రెంట్ ప్రాతిపదికన స్ట్రీమింగ్ అవుతుంది. కానీ, తాజాగా ఉచితంగానే చూసే సౌకర్యం కల్పించారు. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా ప్రధానపాత్రల్లో నటించిన హారర్ మిస్టరీ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘థామా’. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్లో భాగంగా రూపొందిన ఈ చిత్రానికి ‘ముంజ్య’ ఫేమ్ ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహించారు. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ చిత్రంలో అలోక్పాత్రలో ఆయుష్మాన్ ఖురానా, తడ్కాపాత్రలో రష్మికా మందన్నా దుమ్మురేపారు.థియేటర్లలో దీపావళి కానుకగా అక్టోబరు 21న ధామా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 220 కోట్లకు పైగానే రాబట్టింది. అనంతరం అమెజాన్ ప్రైమ్(amazon prime video) ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, హిందీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఇప్పుడు ఉచితంగానే చూసే అవకాశం కల్పించింది.థామా స్టోరీ ఏంటి..?'థామా' విషయానికొస్తే.. అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా) ఓ జర్నలిస్ట్. ఫ్రెండ్స్తో కలిసి న్యూస్ కవరేజీ కోసం ఓ రోజు కొండ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఇతడిపై ఎలుగుబంటి దాడి చేయగా.. తడ్కా (రష్మిక) రక్షిస్తుంది. ఆమె బేతాళ జాతికి చెందిన యువతి. మనుషుల రక్తాన్ని తాగే అలవాటున్న వీళ్లకు ఎన్నో అతీత శక్తులుంటాయి. ఈ జాతికి నాయకుడు థామాగా పిలిచే యక్షాసన్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) చేసిన ఓ తప్పు కారణంగా బేతాళ జాతి అతడిని ఎన్నో దశాబ్దాలుగా ఓ గుహలో బందీగా ఉంచుతుంది.అలాంటి బేతాళ సామ్రాజ్యంలోకి అలోక్ వచ్చాడని తెలిసి.. ఆ జాతి వాళ్లు ఇతడిని శిక్షించే ప్రయత్నం చేయగా.. తడ్కా తప్పిస్తుంది. ఈ క్రమంలోనే అలోక్తో ప్రేమతో పడిన తడ్కా.. తన జాతిని విడిచి జనజీవనంలోకి వస్తుంది. తర్వాత వీళ్ల ప్రేమలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి. తడ్కా ఓ వ్యాంపైర్ అని అలోక్కి ఎప్పుడు తెలిసింది? ఈ కథకు 'భేడియా', 'ముంజ్యా', 'స్త్రీ 2' సినిమాలతో లింకేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
తెరపై నటన.. బయట మాత్రం మరో ప్రపంచం
లేడీ యాక్టర్స్ అనగానే అయితే నటిస్తారు లేదంటే పెళ్లి చేసుకుంటారు అని చాలామంది అనుకుంటారు. ఒకప్పుడు పరిస్థితి ఇలానే ఉండేదేమో కానీ ఇప్పుడు చాలా మారింది. ఓ వైపు యాక్టింగ్ మరోవైపు పలు విభాగాల్లో ప్రతిభ చూపిస్తూ ఆల్రౌండర్స్ అనిపించుకుంటున్నారు. టాలీవుడ్ లో అలాంటి వాళ్లు ఎవరైనా ఉన్నారా? వాళ్ల ఏమేం చేస్తున్నారనేది ఇప్పుడు చూద్దాం.రీసెంట్గా టర్కీలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని ఏకంగా నాలుగు పతకాలు గెలుచుకున్న నటి ప్రగతి.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఓ వయసు దాటిన తర్వాత అవకాశాలు రావడమే కష్టం. అలాంటిది వచ్చిన ఛాన్స్ల్ని వదులుకుని గత రెండు మూడేళ్లుగా పవర్ లిఫ్టింగ్లో ప్రతిభ చాటుకుంది. మొన్నటివరకు దేశంలో పలు రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో మెడల్స్ గెలిచిన ఈ నటి.. ఇప్పుడు అంతర్జాతీయంగానూ అదరగొట్టేసింది. ఈమెని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుత తరం నటీమణులకు ఎంతైనా ఉంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు చూడాల్సిందే)మెంటల్ మదిలో, చిత్రలహరి తదితర సినిమాల్లో హీరోయిన్గా చేసి గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేతురాజ్.. యాక్టింగ్ మాత్రమే చాలా వాటిలో ప్రతిభ చూపిస్తోంది. ట్రాక్పై రయ్ రయ్ అంటూ దూసుకెళ్లే కారు రేసింగ్ నేర్చుకుంది. మరోవైపు తమిళనాడులో జరిగిన బ్యాడ్మింటన్ పోటీల్లోనూ పాల్గొని ప్రతిభ చూపించింది. హీరోయిన్స్ అంటే గ్లామర్ మాత్రమే కాదు చాలానే టాలెంట్స్ ఉన్నాయని నిరూపించింది.ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి చౌదరి కూడా ఇండస్ట్రీలోకి రాకముందు పలు విభాగాల్లో ప్రతిభ చూపించింది. డెంటిస్ట్ డాక్టర్ పట్టా అందుకున్న ఈమె.. టీనేజీలో స్టేట్ లెవల్ స్మిమ్మింగ్, బ్యాడ్మింటన్ ప్లేయర్గానూ ప్రతిభ చూపించి విజయాలు సాధించింది. హీరోయిన్ సదా అయితే ప్రస్తుతం యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసి వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్గా మారిపోయింది. ఈమె ఇన్ స్టా ఓపెన్ చేసి చూస్తే మొత్తం అడవుల్లో తిరుగుతూ తీసిన కృూరమృగాల ఫొటోలే దర్శనమిస్తాయి.వీళ్లే కాదు ప్రస్తుత పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న సమంత, రష్మిక లాంటి హీరోయిన్స్.. ఓవైపు మూవీస్ చేస్తూనే మరోవైపు ఫెర్ఫ్యూమ్ బిజినెస్లోకి ఎంటరయ్యారు. రకుల్ ప్రీత్ సింగ్కి అయితే హైదరాబాద్లో జిమ్, హోటల్ అంటూ బిజినెస్లు చాలానే ఉన్నాయి. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రస్తుత తరం హీరోయిన్స్.. మగాళ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా తమ అభిరుచుల్ని చాటుకుంటున్నారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.(ఇదీ చదవండి: ఎంపీ కుమార్తె పెళ్లిలో కంగన డ్యాన్స్.. వీడియో వైరల్) -
రష్మిక ముఖంపై అన్ని రంగులెందుకు?.. ది గర్ల్ఫ్రెండ్ డైరెక్టర్ రిప్లై ఇదే!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా లీడ్ రోల్లో వచ్చిన లేటేస్ట్ మూవీ ది గర్ల్ఫ్రెండ్. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. గతనెల థియేటర్లలో ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 7న విడుదలైన ఈ చిత్రం రూ.28 కోట్లకు పైగానే రాబట్టింది. దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.అయితే ఈ మూవీలో క్లైమాక్స్ సీన్ ఆడియన్స్ను కట్టిపడేసింది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ బ్రేకప్ అయినప్పుడు జనం సంతోషంతో చప్పట్లు కొట్టారు. దీంతో ఈ మూవీకి థియేటర్ల వద్ద అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఓ నెటిజన్ రష్మిక లుక్పై కామెంట్ చేశాడు. క్లైమాక్స్ సీన్లో ప్రత్యేకమైన లుక్ ఇవ్వడం వెనుక ఉన్న ఆలోచన ఏమిటి? ఆమె ముఖం, దుస్తులపై అన్ని రంగులు ఎందుకు? ఇది చాలా పవర్ఫుల్ మూవీనే.. కానీ అర్జున్ రెడ్డికి, ది గర్ఫ్రెండ్కి సినిమాకు ఏమైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించాడు.నెటిజన్ ప్రశ్నకు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ స్పందించారు. ఈ మూవీకి ఏ సినిమాతోనూ సంబంధం లేదన్నారు. ఈ రంగులు ఆమెను సిగ్గుపడేలా, అవమానించడానికి విక్రమ్ ఉపయోగిస్తాడు.. అలా వాటిని స్వీకరించడం నేర్చుకుంది. అది ఆమెలో ఇప్పుడొక భాగమని కూడా తెలుసు.. ఆ అంగీకారమే తనను మరింత బలంగా, అజేయంగా చేసిందన్నారు. ఒకప్పుడు ఇంట్రావర్ట్గా ఉన్న వ్యక్తి.. ఇప్పుడు కళాశాల అందరి ముందు ఈ రంగులతో నిలబడటానికి ఆలోచించదు.. దాన్ని చెప్పడానికి ఉద్దేశించినదే ఆ రంగుల ఎంపిక. సింపుల్గా చెప్పాలంటే మరి నీకు లేని సిగ్గు నాకెందుకు రా యెదవ!అని చెప్పడమేనని రాహుల్ ట్విటర్లో రిప్లై ఇచ్చారు. No buddy… it had nothing to do with any other movie. Vikram uses these colours/paint to shame and humiliate her. She has learnt to embrace it now. She knows it’s a part of her now. That acceptance makes her stronger, invincible even. And for someone who starts out as an… https://t.co/jfdcWe3Zh9— Rahul Ravindran (@23_rahulr) December 7, 2025 -
పెళ్లి వార్తలపై ఎట్టకేలకు స్పందించిన 'రష్మిక'
పెళ్లి వార్తల గురించి నటి రష్మిక స్పందించారు. విజయ్ దేవరకొండతో ఇప్పటికే నిశ్చతార్థం కూడా చేసుకున్నట్లు బలంగానే వార్తలు కూడా వచ్చాయి. కానీ, వారిద్దరూ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఫిబ్రవరిలో వారు పెళ్లి చేసుకోనున్నట్లు సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో రష్మిక స్పందించారు. తన పెల్లి గురించి వస్తున్న రూమర్స్ను ఖండించలేనని అంటూనే ఆ వార్తలను ఇప్పుడే ధ్రువీకరించలేనని అన్నారు. అయితే, పెళ్లి గురించి తప్పకుండా సరైన సమయం, ప్రదేశంలో మాట్లాడుతానని క్లారిటీ ఇచ్చారు. ఈ సంతోషకరమైన వార్తను అందరితో పంచుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటానన్నారు. ఇంతకు మించి పెళ్లి గురించి చెప్పలేనని రష్మిక పేర్కొన్నారు.తన వ్యక్తిగత విషయాలను బయటి ప్రపంచానికి చెప్పేందుకు పెద్దగా ఇష్టపడనని రష్మిక అన్నారు. తాను ఇంట్లో ఉన్నప్పుడు సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకోనన్నారు. అదే విధంగా బయటకు వచ్చినప్పుడు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడనన్నారు. ఈ ఏడాది తన జీవితంలో చాలా ఎంతో ప్రత్యేకమైనదని ఆమె అన్నారు. 2025లో తాను నటించిన ఐదు సినిమాలు విడుదలై ప్రేక్షకుల నుంచి మంది ఆదరణ పొందడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని రష్మిక అన్నారు. -
జపాన్కి పుష్పరాజ్
పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటిన పుష్పరాజ్ జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. హీరో అల్లు అర్జున్ టైటిల్ రోల్ (పుష్పరాజ్)లో నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా 2026 జనవరి 16న జపాన్లో విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించగా, శ్రీలీల ప్రత్యేక పాటలో సందడి చేశారు. సుకుమార్ రైటింగ్స్తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా 2024 డిసెంబరు 5న విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. అంతేకాదు... విడుదలైన 32 రోజుల్లోనే ‘పుష్ప 2: ది రూల్’ ప్రపంచవ్యాప్తంగా రూ. 1831 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించినట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలై (డిసెంబరు 4న ప్రీమియర్స్) నేటికి ఏడాది అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్లోని విమల్ థియేటర్లో స్పెషల్ షో ఏర్పాటు చేశారు నిర్మాతలు. మరి.. వచ్చే ఏడాది జపాన్ భాషలో రిలీజ్ కానున్న ‘పుష్ప 2: ది రూల్’ ఎన్ని వసూళ్లు సాధిస్తుంది? ఎన్ని రికార్డులు సృష్టిస్తుంది? అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. -
ఈ ఏడాది క్రేజీ స్టార్స్.. టాప్ టెన్లో రష్మిక, రుక్మిణి.. ఫుల్ లిస్ట్ ఇదే!
త్వరలోనే మరో ఏడాది కాల గర్భంలో కలిసిపోనుంది. చూస్తుండగానే రోజులు అలా గడిపోతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే అందరూ కొత్త ఏడాది స్వాగతం పలకడానికి సమయం ఆసన్నమైంది. మరి సినీ ఇండస్ట్రీలో 2025లో కలిసొచ్చిందా? ఎంతమందికి స్టార్స్ హోదాను దక్కించుకున్నారు. ఇండియా సినీ చరిత్రలో ఈ ఏడాది అత్యంత ఆదరణ సొంతం చేసుకున్న నటీమణులు, హీరోలు ఎవరు? 2025లో ఎంట్రీ స్టార్డమ్ను దక్కించుకున్న యంగ్ హీరోయిన్స్, హీరోలు ఎవరో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి.2025లో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న స్టార్స్ లిస్ట్ను ప్రముఖ సినీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ రిలీజ్ చేసింది. ఈ ఏడాది టాప్-10లో నిలిచిన హీరోయిన్స్, హీరోల జాబితాను వెల్లడించింది. ఈ సారి అత్యధికంగా బాలీవుడ్తో పాటు దక్షిణాది తారలు సైతం సత్తా చాటారు. ఐఎండీబీ మోస్ట్ పాపులర్ యాక్టర్-2025 లిస్ట్లో చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, రుక్మిణి వసంత్, కల్యాణి ప్రియదర్శన్ నిలిచారు. కాగా.. 2025లో ఆమె ఛావా, సికందర్, థామా, కుబేర, ది గర్ల్ఫ్రెండ్ లాంటి చిత్రాలతో మెప్పించింది. రుక్మిణి వసంత్.. కాంతార చాప్టర్-1తో ఆడియన్స్లో క్రేజ్ను సొంతం చేసుకుంది. కల్యాణి ప్రియదర్శన్ కొత్తలోక: చాప్టర్- 1 మూవీతో సూపర్ హిట్ కొట్టేసింది.బాలీవుడ్ మూవీ సయారాతో సూపర్ హిట్ కొట్టిన అహాన్ పాండే, అనీత్ పడ్డా తొలి రెండు స్థానాలు కైవసం చేసుకున్నారు. కేవలం ఒక్క సినిమాతోనే వీరిద్దరు టాప్లో నిలవడం విశేషం. అంతేకాకుండా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మోహిత్ సూరి డైరెక్టర్ల లిస్ట్లో టాప్ ప్లేస్ దక్కించుకున్నారు. కేవలం రూ.45 కోట్లతో నిర్మించిన సయారా బాక్సాఫీస్ వద్ద రూ.570 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.ఐఎండీబీ- 2025 లిస్ట్..టాప్-10 సినీ స్టార్స్ వీళ్లే...అహాన్ పాండే (సయారా)అనీత్ పడ్డా (సయారా)ఆమిర్ ఖాన్ (సితారే జమీన్ పర్)ఇషాన్ ఖట్టర్ (హోమ్ బౌండ్)లక్ష్య (ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్)రష్మిక మందన్నా (ఛావా, సికిందర్, థామా, కుబేర)కల్యాణి ప్రియదర్శన్ ( కొత్త లోకా చాప్టర్1)త్రిప్తి డిమ్రి (ధడక్2)రుక్మిణి వసంత్ (కాంతార: చాప్టర్1)రిషబ్ శెట్టి (కాంతార: చాప్టర్1) టాప్-10 ఇండియన్ డైరెక్టర్స్ వీళ్లే..మోహిత్ సూరి (సయారా)ఆర్యన్ ఖాన్ (ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్)లోకేశ్ కనగరాజ్ (కూలీ)అనురాగ్ కశ్యప్ (నిశాంచి, బందర్)పృథ్వీరాజ్ సుకుమారన్ (ఎల్2: ఎంపురాన్)ఆర్.ఎస్. ప్రసన్న (సితారే జమీన్ పర్)అనురాగ్ బసు (మోట్రో ఇన్ దినో)డోమినిక్ అరుణ్ (కొత్త లోకా చాప్టర్1)లక్ష్మణ్ ఉటేకర్ (ఛావా)నీరజ్ ఘేవాన్ (హోమ్ బౌండ్) -
'అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి'.. రష్మిక స్ట్రాంగ్ వార్నింగ్..!
టెక్నాలజీ వచ్చాక ప్రతి పని మరింత సులభతరమైపోయింది. ఇప్పుడు మనం పూర్తిస్థాయి డిజిటల్ ఇండియాగా మారిపోయాం. దీంతో సాంకేతికత పెరిగే కొద్ది సవాళ్లు కూడా అదే స్థాయిలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అంతే వేగంగా సమస్యలు కూడా తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉద్యోగాలపై ప్రభావం మాత్రమే కాదు.. వ్యక్తిగత గోప్యతకు కూడా సవాల్గా మారింది.సినీతారలు ఫోటోలను ఇష్టమొచ్చినట్లుగా ఏఐతో ఏడిట్ చేసి నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. వీటిలో మంచికంటే ఎక్కువగా అసభ్యకరమైన కంటెంట్ ఉంటోంది. వీటి బారిన ఇప్పటికే పలువురు అగ్ర సినీతారలు పడ్డారు. ఏఐని మంచి పనుల కోసం ఉపయోగించాలి కానీ.. ఎక్కువ శాతం దుర్వినియోగం చేయడానికే మొగ్గు చూపుతున్నారు. అలా చాలామంది సినీతారల ఫోటోలను మార్ఫింగ్ చేసిన సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.ఇలా దుర్వినియోగానికి ఏఐని వాడుకోవడంపై రష్మిక మందన్నా రియాక్ట్ అయింది. ఏఐ అనే మన అభివృద్ధికి కోసమని.. అంతేకానీ అసభ్యతను సృష్టించడానికి కాదని ట్వీట్ చేసింది. మహిళలను లక్ష్యంగా చేసుకుని దుర్వినియోగానికి పాల్పడుతున్న కొంతమందికి నైతికత లేదని మండిపడింది. మనం నిజాన్ని సృష్టించినప్పుడు.. వివేచన అనేది గొప్ప రక్షణగా మారుతుందని పోస్ట్లో రాసుకొచ్చింది.రష్మిక తన ట్వీట్లో రాస్తూ..' ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి.. ఇంటర్నెట్ అనేది నిజానికి అద్దం లాంటిది కాదు.. అది ఏదైనా సృష్టించగలిగే ఓ కాన్వాస్. ఇకపై ఏఐ టెక్నాలజీని దుర్వినియోగానికి కాకుండా.. గౌరవప్రదమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగించుకుందాం. ఇక్కడ మనం నిర్లక్ష్యం కంటే బాధ్యతగా వ్యవహరిద్దాం.. ప్రజలు మనుషుల్లా వ్యవహరించకపోతే.. అలాంటి వారికి కఠినమైన, క్షమించరాని శిక్షలు విధించాలి' అంటూ పోస్ట్ చేసింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో కొందరు నెటిజన్స్ రష్మికకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. “When truth can be manufactured, discernment becomes our greatest defence.”AI is a force for progress, but its misuse to create vulgarity and target women signals a deep moral decline in certain people.Remember, the internet is no longer a mirror of truth. It is a canvas where…— Rashmika Mandanna (@iamRashmika) December 3, 2025 -
సడన్గా ఓటీటీలోకి వచ్చిన రష్మిక దెయ్యం సినిమా
రష్మిక నటించిన రెండు సినిమాలు ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్నాయి. అందులో ఒకటి 'ద గర్ల్ఫ్రెండ్'. ఇది నెట్ఫ్లిక్స్లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ఈ బ్యూటీ చేసిన హారర్ మూవీ కూడా ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా డిజిటల్గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: సమంతకు ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం అయిపోయిందా?)రష్మిక ఓవైపు తెలుగు, మరోవైపు హిందీ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అలా ఈ ఏడాది దీపావళికి 'థామా' అనే హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్లోని 'స్త్రీ' యూనివర్స్లో భాగంగా వచ్చిన చిత్రమిది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా, నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్గా చేశాడు. ఇందులో రష్మిక.. రక్తం తాగే అమ్మాయి అంటే వ్యాంపైర్ పాత్రలో కనిపించింది. థియేటర్లలో ఓ మాదిరిగా ఆడినప్పటికీ ఈమె నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.థియేటర్లలో అక్టోబరు 21న రిలీజైన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, హిందీలో ప్రస్తుతానికి అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఉచితంగా ఎప్పటినుంచి అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)'థామా' విషయానికొస్తే.. అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా) ఓ జర్నలిస్ట్. ఫ్రెండ్స్తో కలిసి న్యూస్ కవరేజీ కోసం ఓ రోజు కొండ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఇతడిపై ఎలుగుబంటి దాడి చేయగా.. తడ్కా (రష్మిక) రక్షిస్తుంది. ఆమె బేతాళ జాతికి చెందిన యువతి. మనుషుల రక్తాన్ని తాగే అలవాటున్న వీళ్లకు ఎన్నో అతీత శక్తులుంటాయి. ఈ జాతికి నాయకుడు థామాగా పిలిచే యక్షాసన్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) చేసిన ఓ తప్పు కారణంగా బేతాళ జాతి అతడిని ఎన్నో దశాబ్దాలుగా ఓ గుహలో బందీగా ఉంచుతుంది. అలాంటి బేతాళ సామ్రాజ్యంలోకి అలోక్ వచ్చాడని తెలిసి.. ఆ జాతి వాళ్లు ఇతడిని శిక్షించే ప్రయత్నం చేయగా.. తడ్కా తప్పిస్తుంది. ఈ క్రమంలోనే అలోక్తో ప్రేమతో పడిన తడ్కా.. తన జాతిని విడిచి జనజీవనంలోకి వస్తుంది. తర్వాత వీళ్ల ప్రేమలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి. తడ్కా ఓ వ్యాంపైర్ అని అలోక్కి ఎప్పుడు తెలిసింది? ఈ కథకు 'భేడియా', 'ముంజ్యా', 'స్త్రీ 2' సినిమాలతో లింకేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?) -
నెల తిరక్కుండానే ఓటీటీలోకి 'ది గర్ల్ఫ్రెండ్'
ఏ సినిమాలో అయినా హీరోహీరోయిన్ కలిస్తే జనం చప్పట్లు కొడతారు. కానీ, ఈ సినిమాలో మాత్రం వాళ్లిద్దరికీ బ్రేకప్ అయినప్పుడు జనం సంతోషంతో చప్పట్లు కొట్టారు. ఆ మూవీయే ది గర్ల్ఫ్రెండ్. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా, దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.నెల తిరగకముందే ఓటీటీలోనవంబర్ 7న విడుదలైన ఈ చిత్రం రూ.28 కోట్లకు పైగా రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 5న అందుబాటులోకి వస్తున్నట్లు వెల్లడించారు. నెలరోజులు కాకముందే ది గర్ల్ఫ్రెండ్ ఓటీటీలో సందడి చేయనుందన్నమాట! తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమ్ అవనుంది. ఇది చూసిన అభిమానులు.. ఈ మూవీ కోసం ఎంతలా ఎదురుచూస్తున్నామో అని కామెంట్లు చేస్తున్నారు.కథేంటంటే?The Girlfriend Movie: భూమా (రష్మిక మందన్నా) తండ్రి (రావు రమేశ్)చాటు కూతురు. పీజీ చదివేందుకు తొలిసారి తండ్రిని వదిలి నగరానికి వెళ్లి ఓ కాలేజీలో చేరుతుంది. అదే కాలేజీలో విక్రమ్ (దీక్షిత్ శెట్టి), దుర్గ (అను ఇమ్మాన్యుయేల్) కూడా చేరతారు. దుర్గ.. విక్రమ్ను ప్రేమిస్తే.. అతడు మాత్రం భూమాను లవ్ చేస్తాడు. ప్రేమ జోలికి వెళ్లకూడదనుకుంటూనే భూమా కూడా అతడితో ప్రేమలో పడిపోతుంది. తర్వాత ఏం జరిగింది? భూమా జీవితం విక్రమ్ కంట్రోల్లోకి వెళ్లిందని తెలుసుకుని ఆమె ఏం చేసింది? అన్నదే మిగతా కథ. ఈ శుక్రవారం ఎంచక్కా ఓటీటీలో గర్ల్ఫ్రెండ్ చూసేయండి.. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: బ్రహ్మానందంపై నోరు జారిన రాజేంద్రప్రసాద్.. అంతమాటన్నాడా? -
‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ మీట్.. ముఖ్య అతిథిగా విజయ్ (ఫొటోలు)
-
‘ది గర్ల్ ఫ్రెండ్’ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ (ఫొటోలు)
-
రష్మికది చాలా మంచి మనసు
‘‘రష్మికని నేను ‘గీత గోవిందం’ సినిమా నుంచి చూస్తున్నా.. నిజ జీవితంలోనూ తను భూమానే. తను ఇన్నోసెంట్. తన గురించి ఆలోచించదు.. సెట్స్లో అందరూ సంతోషంగా ఉండాలి.. డైరెక్టర్ హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తుంటుంది. డైరెక్టర్ ఏది చేయమంటే అది చేస్తుంటుంది. తన ప్రయాణం చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది. ‘నన్ను ఎవడన్నా ఏదైనా గెలికితే నేను మళ్లీ రివర్స్లో వెళతాను. కానీ, రష్మిక ఏంటంటే... ప్రపంచంలో ఎవరు ఎన్ని మాటలు అన్నా పట్టించుకోకుండా తన పనిపైనే దృష్టి పెడుతుంది.. అంత మంచి మనసు తనది. తను నిజంగా అమేజింగ్ ఉమన్’’ అని హీరో విజయ్ దేవరకొండ తెలిపారు. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో రూ. 20.4 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ–‘‘ది గర్ల్ఫ్రెండ్’ సినిమా నన్ను ఎంత భావోద్వేగానికి గురి చేసిందంటే చాలా చోట్ల కన్నీళ్లు ఆపుకోవాల్సి వచ్చింది. చాలా సన్నివేశాల్లో మనసు బరువెక్కిన అనుభూతి కలిగింది. ఈ మధ్య నేను చూసిన గొప్ప చిత్రాల్లో ‘ది గర్ల్ఫ్రెండ్’ ఒకటి. ఈ సినిమా ఇటు ఇండియాలో అటు విదేశాల్లో హ్యూజ్ సక్సెస్ అందుకుంది. ఇలాంటి సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కిన సినిమాని నంబర్స్తో పోల్చలేం. ఈ చిత్రం సమాజంలో అవేర్నెస్ తీసుకొస్తుంది. ఈ సినిమాకి పని చేసిన అందరూ మీ లైఫ్లో ‘ది గర్ల్ఫ్రెండ్’ లాంటి మూవీ చేసి జీవితం పరిపూర్ణం చేసుకున్నారు’’ అని చెప్పారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ది గర్ల్ ఫ్రెండ్’కి హీరో మా డైరెక్టర్ రాహుల్. మా ‘గీత గోవిందం’లో నటించిన రష్మిక.. ‘ది గర్ల్ ఫ్రెండ్’తో మా సంస్థకు వన్నె తెచ్చింది’’ అని పేర్కొన్నారు. రష్మికా మందన్నా మాట్లాడుతూ– ‘‘ది గర్ల్ఫ్రెండ్’లో నేను చేసిన భూమా పాత్రలో ఏం జరిగిందో నా జీవితంలోనూ అలానే జరిగింది. మనందరి జీవితాల్లోనూ జరిగి ఉంటుంది. ఈ చిత్రం కోసం మొదటిసారి రాహుల్కి సరెండర్ అయిపోయి పనిచేశాను. ఈ సినిమాని మీరు (ప్రేక్షకులు) అర్థం చేసుకున్నారు.. బాగా కనెక్ట్ అయ్యారు.. అదే నాకు పెద్ద అవార్డుతో సమానం. ఈ సినిమాలో మొదటి నుంచి విజయ్ భాగమయ్యారు. తనలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటే అదొక బ్లెస్సింగ్ అనుకోవాలి’’ అని తెలిపారు. ‘‘భూమా పాత్రలో నటించడం ద్వారా ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇచ్చారు రష్మిక’’ అన్నారు విద్య కొప్పినీడి. ‘‘మా సినిమాకి ప్రేక్షకులు ఇస్తున్న ప్రశంసలతో జాతీయ అవార్డు పొందినంత సంతోషంగా ఉంది’’ అని ధీరజ్ మొగిలినేని పేర్కొన్నారు. ‘‘నా గత సినిమా (మన్మథుడు 2) రిలీజై ఆరేళ్లయింది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ చేస్తున్నప్పుడు ఈ సినిమా ఫలితం అనుకున్నట్లు రాకుంటే నా పరిస్థితి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అని భయపడ్డాను. కానీ సినిమా చూశాక నా కుటుంబ సభ్యులు గర్వపడుతున్నారు’’ అని రాహుల్ రవీంద్రన్ అన్నారు. ఈ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రశాంత్ విహారి, హేషమ్ అబ్దుల్ వహాబ్, ప్రొడ్యూసర్స్ బన్నీ వాస్, ఎస్కేఎన్, డైరెక్టర్ సాయి రాజేశ్, పాటల రచయిత రాకేందు మౌళి, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ, నటి రోహిణి తదితరులు మాట్లాడారు. -
‘గర్ల్ ఫ్రెండ్’కి రూ.20 కోట్లు
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటించిన "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహించారు."ది గర్ల్ ఫ్రెండ్" మూవీ సూపర్ హిట్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ 5 రోజుల్లో 20.4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు చిత్ర యూనిట్ పేర్కొంది. రిలీజ్ రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కాస్త తగ్గాయి. కానీ రెండో రోజు నుంచి పాజిటివ్ మౌత్టాక్తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. -
స్టార్ హీరోలతో సినిమా.. రిగ్రెట్ ఫీల్ అవుతున్నానన్న హీరోయిన్
నేను తెలుగు తమిళంలో స్టార్ హీరోలతో నటించాను. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, నాని, నాగ చైతన్య, శివకార్తికేయన్, కార్తి, విశాల్..ఇలా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. అయితే నా కెరీర్ లో కొన్ని సినిమాలు చేసి ఉండకూడదు అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. కొన్ని కమర్షియల్ మూవీస్ లో నటించడం వల్ల నటిగా నాకు ఎలాంటి సంతృప్తి లభించదు. నాలుగు డ్యాన్స్ స్టెప్స్ వేసి, ఏవో డైలాగ్స్ చెప్పిస్తారు. ఈ రొటీన్ మూవీస్ చేసేప్పుడు నేను రియలైజ్ కాలేదు గానీ ఇకపై అలాంటి మూవీస్ చేయకూడదు అని నిర్ణయించుకున్నా’ అని అన్నారు హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్. ఈ బ్యూటీ కీలకపాత్రలో, రష్మిక-దీక్షిత్ శెట్టి జంటగా నటించిన ‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుర్గ అనే క్యారెక్టర్లో అను నటించింది. ఈ మూవీకి హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో తాజాగా అను మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అనుభవాలతో పాటు తన కెరీర్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.→ ఈ సినిమా కోసం మొదట ప్రొడ్యూసర్ ధీరజ్ నుంచి కాల్ వచ్చింది. ఆ తర్వాత రాహుల్ కలిసి స్క్రిప్ట్ చెప్పారు. స్క్రిప్ట్, నా క్యారెక్టర్ గురించి విన్న తర్వాత తప్పకుండా ఈ మూవీలో నటించాలని అనిపించింది. అమ్మాయిల గురించి ఒక మంచి విషయం చెప్పే మూవీ ఇది. ఈ చిత్రంలో నటించడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఇది గీతా ఆర్ట్స్ సినిమా కాబట్టి బాగా చూసుకుంటారనే నమ్మకం ఉంది. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాకు వస్తున్న రెస్పాన్స్ హ్యాపీగా ఉంది. అయితే నేను ఏ సినిమా చేసినా ఆ మూవీకి ఎలాంటి ప్రశంసలు వస్తాయని ఆశించను.→ ఈ చిత్రంలో దుర్గ క్యారెక్టర్ లో నటించాను. ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు నా క్యారెక్టర్ ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయంవేసింది. కానీ ఆ తర్వాత డైరెక్టర్ రాహుల్ నా క్యారెక్టర్ ను తీర్చిదిద్దిన విధానంతో హ్యాపీగా ఫీలయ్యా. రాహుల్ చాలా సెన్సిటివ్ డైరెక్టర్. నా క్యారెక్టర్ ఒక్కటే కాదు, అన్ని పాత్రలను చేయి పట్టి నడిపించారు. కమర్షియల్ మూవీస్ లో మాతో ఓవర్ యాక్షన్ చేయిస్తారు.→ ఈ చిత్రంలో నాకు అవకాశం వచ్చేసరికే రశ్మికను భూమా పాత్రకు తీసుకున్నారు. నేను భూమా పాత్రలో నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. హాలీవుడ్ లో మూవీస్ చూస్తే హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు. ప్రతి ఒక్కరూ కథకు కాంట్రిబ్యూట్ చేసేలా క్యారెక్టర్స్ చేస్తారు. ఈ చిత్రంలో రాహుల్ అలాంటి ప్రయత్నమే చేశారు. అన్ని పాత్రలను జస్టిఫై చేసేలా మూవీ రూపొందించారు.→ నా కెరీర్ పరంగా అసంతృప్తిగానే ఉన్నా, అయితే నటిగా సంతృప్తి ఉంది. పెద్ద పెద్ద స్టార్స్ తో కలిసి నటించాను. అయితే నాది అవకాశాల కోసం ఆరాటపడే తత్వం కాదు. నాకు వచ్చే సినిమా తప్పకుండా దక్కుతుందని నమ్ముతా.→ ప్రొడ్యూసర్ ధీరజ్ తో గతంలో ఊర్వశివో రాక్షసివో సినిమా చేశాను. "ది గర్ల్ ఫ్రెండ్" లాంటి చిత్రాలు వర్కవుట్ కావాలంటే ధీరజ్ లాంటి మంచి ప్రొడ్యూసర్ ఉండాలి. మంచి టీమ్ కుదరకే గతంలో కొన్ని ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ ఆదరణ పొందలేకపోయాయి.→ ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ స్టేజ్ లో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. -
'గర్ల్ఫ్రెండ్' కోసం వస్తున్న బాయ్ ఫ్రెండ్
పాన్ ఇండియా సెన్సేషన్ హీరోయిన్ రష్మిక.. గత 11 నెలల్లో ఐదు విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రీసెంట్గా అయితే 'ద గర్ల్ఫ్రెండ్' మూవీతో వచ్చింది. దీనికి అన్నివైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ మూవీని సపోర్ట్ చేసేందుకు రష్మిక కోసం స్వయంగా విజయ్ దేవరకొండ కూడా రాబోతున్నాడు.(ఇదీ చదవండి: నాన్న చనిపోలేదు.. ధర్మేంద్ర కూతురి షాకింగ్ పోస్ట్)'గర్ల్ఫ్రెండ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మాట్లాడిన నిర్మాత అల్లు అరవింద్.. సక్సెస్ మీట్కు విజయ్ దేవరకొండని తీసుకొస్తానని అన్నారు. ఇప్పుడు అదే జరగబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో బుధవారం సక్సెస్ ఈవెంట్ నిర్వహించబోతున్నారని టాక్. సాధారణంగా చూస్తే ఇందులో పెద్ద విషయమేం ఉండదు. కానీ గతకొన్నాళ్లుగా రిలేషన్లో ఉన్న వీళ్లిద్దరూ.. కొన్నాళ్ల క్రితమే రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయం అనధికారికంగా బయటకొచ్చినా విజయ్ గానీ రష్మిక గానీ బయటపడట్లేదు.ఎంగేజ్మెంట్ రూమర్స్ తర్వాత విజయ్-రష్మిక కలిసి తొలిసారి స్టేజీపై కనిపించబోతున్నారు. మరి ఇద్దరిలో ఎవరైనా ఈ విషయం గురించి మాట్లాడుతారా అనేది చూడాలి? మరోవైపు విజయ్-రష్మికల పెళ్లి గురించి కూడా అప్పుడే రూమర్స్ వచ్చేస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాజస్థాన్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని అంటున్నారు. ఇప్పుడు కనిపించబోతున్న ఈవెంట్లో వివాహం గురించి కూడా ఏమైనా హింట్ ఇస్తారా అనేది చూడాలి.(ఇదీ చదవండి: ట్రెండింగ్ బ్యూటీ.. ఇంతకీ ఎవరీమె? డీటైల్స్ ఏంటి?) -
'గర్ల్ఫ్రెండ్' కోసం రష్మిక రెమ్యునరేషన్ ఎంత?
హీరోహీరోయిన్లు అన్నాక సినిమాలు చేస్తారు. రెమ్యునరేషన్ తీసుకుంటారు. కానీ గత కొన్నాళ్లలో కొందరు సెలబ్రిటీలు.. ముందు మూవీస్ చేస్తున్నారు. రిలీజ్ తర్వాత పారితోషికాలు అందుకుంటున్నారు. పాన్ ఇండియా లేటెస్ట్ సెన్సేషన్ రష్మిక కూడా 'ద గర్ల్ఫ్రెండ్' విషయంలో ఇలానే చేసినట్లు తెలుస్తోంది. మూవీ విడుదలకు ముందు ఓ ఈవెంట్లో నిర్మాత ధీరజ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రిలీజ్ తర్వాత తనకు డబ్బులివ్వాలని రష్మిక చెప్పిన సంగతి బయటపెట్టారు.'గర్ల్ఫ్రెండ్' రీసెంట్గానే (నవంబరు 07న) థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రోజురోజుకీ కలెక్షన్ నంబర్స్ పెరుగుతున్నాయి. దీంతో రష్మిక రెమ్యునరేషన్ ఎంత తీసుకుందా అనే విషయం మరోసారి చర్చకు వచ్చింది. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తున్న రష్మిక.. ఒక్కో ప్రాజెక్ట్ కోసం రూ.5-6 కోట్ల వరకు అందుకుంటోందట. 'గర్ల్ఫ్రెండ్' కోసం మాత్రమే రూ.3 కోట్లు చాలానే అందట. ఇప్పుడీ విషయం చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: 'జటాధర' సినిమాకు నెగిటివ్ టాక్.. కలెక్షన్స్ మాత్రం ఇలా)కొన్నిసార్లు కొన్ని సినిమాలు.. ఆయా హీరోహీరోయిన్లకు కిక్ ఇస్తుంటాయి. బహుశా రష్మికకు కూడా 'గర్ల్ఫ్రెండ్'తో ఇలాంటి సంతృప్తి లభించినట్లు ఉంది. అందుకే సాధారణంగా తీసుకునే దానికంటే తక్కువగానే తీసుకుందని మాట్లాడుకుంటున్నారు. దీంతో రష్మిక మరోసారి టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. అలానే ప్రస్తుతం ఎక్కడ చూసినా రష్మిక పేరే వినిపిస్తుంది. ఎందుకంటే గత ఏడాది కాలంలో ఈమె నుంచి ఐదు వైవిధ్య భరిత సినిమాలు రావడం విశేషం.'ద గర్ల్ఫ్రెండ్' విషయానికొస్తే.. భూమా(రష్మిక) ఎం.ఏ లిటరేచర్ స్టూడెంట్. తండ్రి(రావు రమేశ్)ని ఒప్పించి హస్టల్లో చేరుతుంది. కానీ కాలేజీలో చేరిన తొలిరోజే భూమా, విక్రమ్ (దీక్షిత్ శెట్టి) ప్రేమలో పడతారు. విక్రమ్ని దుర్గ(అను ఇమ్మాన్యుయేల్) కూడా ఇష్టపడుతుంది. కానీ విక్రమ్ మాత్రం భూమానే ప్రేమిస్తాడు. రిలేషన్లో మానసికంగా, శారీరకంగా చాలానే దూరం వెళ్తారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే..) -
నాకోసం యుద్ధాలు చేయాలి.. విజయ్నే పెళ్లాడతా..: రష్మిక
సోషల్ మీడియాలో ది గర్ల్ఫ్రెండ్ సినిమా టాక్ చూస్తుంటే రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఖాతాలో మరో హిట్టు పడినట్లే కనిపిస్తోంది! మొన్నటివరకు థామా, ఇప్పుడు ది గర్ల్ఫ్రెండ్తో మంచి జోష్ మీదుంది. వీటన్నింటికన్నాముందు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో ఎంగేజ్మెంట్ న్యూస్తో వార్తల్లోకెక్కింది. తాజాగా ఓ చిట్చాట్లో తన భాగస్వామికి ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడింది రష్మిక. యుద్ధానికైనా రెడీగా ఉండాలి'నిజాయితీగా చెప్పాలంటే నా భాగస్వామికి నన్ను లోతుగా అర్థం చేసుకునే శక్తి ఉండాలి. ప్రతి విషయాన్ని నావైపు నుంచి ఆలోచించి అవగాహన చేసుకోగలగాలి. పరిస్థితులను దాటుకుంటూ అన్నింటినీ అర్థం చేసుకుంటే చాలు. మనిషి మంచివాడై ఉండాలి. నాకోసం యుద్ధం చేయడానికి కూడా వెనుకాడనివాడై ఉండాలి. అలాంటి మనిషి కోసం నేను తూటాకైనా ఎదురెళ్తాను' అని రష్మిక చెప్పుకొచ్చింది.విజయ్ దేవరకొండను పెళ్లాడతా..డేటింగ్, పెళ్లి గురించి మాట్లాడుతూ.. యానిమేషన్ క్యారెక్టర్ నరుటోతో డేట్కు వెళ్తా.. విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటా.. అని చెప్పుకొచ్చింది. రష్మిక- విజయ్ అక్టోబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ పరోక్షంగా దానిగురించి మాట్లాడుతూనే ఉన్నారు. వీరి పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరూ గీతా గోవిందం, డియర్ కామ్రేట్ చిత్రాల్లో జంటగా నటించారు.చదవండి: ఇక చాలు ఆపండి, మీ కాళ్లు మొక్కుతా..: విశాల్ -
రష్మికా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
రష్మిక 'ద గర్ల్ఫ్రెండ్' సినిమా (ఫొటోలు)
-
రష్మిక మందన్నా లవ్ లెటర్.. నెట్టింట వైరల్
ది గర్ల్ఫ్రెండ్ సినిమా (The Girlfriend Movie)లో నటనకు రష్మిక మందన్నా (Rashmika Mandanna)కు జాతీయ అవార్డు రావాల్సిందే! నిన్నటివరకు ఇది అల్లు అరవింద్ మాట.. కానీ, ఈ సినిమా చూశాక చాలామందిదీ ఇదే మాట! రష్మికకు అవార్డు ఇచ్చి తీరాల్సిందే.. అంత అద్భుతంగా నటించింది అని కొనియాడుతున్నారు. రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన మూవీ ది గర్ల్ఫ్రెండ్. మీ అందరికీ నా ప్రేమలేఖరాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నేడు (నవంబర్ 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా రష్మిక సోషల్ మీడియా వేదికగా ఓ లవ్ లెటర్ రాసింది. అమ్మాయిలందరికీ దాన్ని అంకితమిచ్చింది. అందులో ఏముందంటే.. స్త్రీగా ఎదుగుతున్న అమ్మాయిలందరికీ నా ప్రేమలేఖ.. 'నీకేం తెలుసు?' అన్న ప్రశ్న ఎదుర్కొనే ప్రతి అమ్మాయి 'తనకేం కావాలో బాగా తెలుసు' అనే స్థాయికి చేరుకుంటుంది. ఈ జర్నీ చిన్నదేమీ కాదు. ప్రేమ అంటే బంధీ అవడం కాదునువ్వు ఎంతోదూరం వచ్చావ్.. ఇప్పటికైనా నిన్ను నువ్వు ప్రేమించు, నిన్ను చూసి నువ్వు గర్వపడు. ఇలాంటి అమ్మాయిలకు అండగా నిలబడిన అబ్బాయిలు.. మీ ప్రేమ వల్లే తాను ఇంత ధైర్యంగా నిలబడగలిగింది. ప్రేమలో ఎవరూ మాట్లాడని విషయాల గురించి ఈ సినిమా చర్చిస్తుంది. ప్రేమ అంటే హద్దులు గీసుకుని బంధీ అవడం కాదు, స్వేచ్ఛగా జీవించడం.. ఎన్ని గాయాలైనా సరే.. మనసును తేలిక చేసుకుని ధైర్యంగా ముందుకు సాగడం. మిమ్మల్ని మీరు ప్రేమించండినా ప్రాణం పెట్టి ఈ సినిమా చేశాను. ఈ సినిమా మీ మనసును తాకుతుందని, మీ బలాన్ని మీకు గుర్తు చేస్తుందని ఆశిస్తున్నాను. మిమ్మల్ని మీరు ప్రేమిస్తారని అనుకుంటున్నాను. అదే గనక నిజమైతే నా ఆశయం నెరవేరినట్లే! నిశ్శబ్ధాన్ని చీల్చుకుని ధృడసంకల్పంతో ముందడుగు వేసేవారికి.. వారిని వెన్ను తట్టి ప్రోత్సహించే వారికోసమే నా ఈ ప్రేమలేఖ అని ట్వీట్ చేసింది. ఈ లవ్ లెటర్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. A love letter to all the girlies growing into the woman they love.To every Girl who was told “what do you know”… and yet grew into a woman “who knows what she wants”.You’ve come a long way, give yourself that proud, tight Hug🫂 And to the men who’ve loved, not by leading,…— Rashmika Mandanna (@iamRashmika) November 7, 2025చదవండి: The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీ రివ్యూ -
The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీ రివ్యూ
నేషనల్ క్రష్ రష్మిక, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్ఫ్రెండ్’(The Girlfriend Review). రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ ఇంటెన్స్, ఎమోషనల్ లవ్స్టోరీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్తో పాటు పాటలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో ‘ది గర్ల్ఫ్రెండ్’పై హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల మధ్య నేడు(నవంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..భూమా(రష్మిక) తండ్రి(రావు రమేశ్)చాటున పెరిగిన ఓ అమాయకపు అమ్మాయి. ఎంఏ లిటరేచర్ చదవడం కోసం తొలిసారి తండ్రిని వదిలి నగరానికి వచ్చి రామలింగయ్య ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీలో జాయిన్ అవుతుంది. విక్రమ్(దీక్షిత్ శెట్టి), దుర్గ(అను ఇమ్మాన్యుయేల్) కూడా అదే కాలేజీలో చేరతారు.విక్రమ్ ఆవేశపరుడు. అంతేకాదు అమ్మాయిలు అంటే ఇలానే ఉండాలనుకునే స్వభావం కలవాడు. తనకు నచ్చినట్లుగా భూమా ప్రవర్తన ఉండడంతో ఆమెను ప్రేమిస్తాడు. మరోవైపు అదే కాలేజీకి చెందిన మరో అమ్మాయి దుర్గ(అనూ ఇమ్మాన్యుయేల్)..విక్రమ్ని ఇష్టపడుతుంది. కానీ విక్రమ్ మాత్రం ఆమెను నిరాకరిస్తూ ఉంటాడు. లవ్, రిలేషన్కు దూరంగా ఉండాలనుకుంటూనే..భూమా కూడా విక్రమ్తో ప్రేమలో పడిపోతుంది. ఆ తర్వాత భూమా జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? తన లైఫ్ మొత్తం విక్రమ్ కంట్రోల్లోకి వెళ్లిందని తెలిసిన తర్వాత భూమా తీసుకున్న అనూహ్య నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయం ఆమెకు ఎలాంటి సమస్యలను తెచ్చిపెట్టింది? వాటిని అధిగమించి ఎలా సక్సెస్ అయిందనేదే మిగతా కథ(The Girlfriend Review)ఎలా ఉందంటే..అమ్మాయిలు అంటే ఇలానే ఉండాలి.. ఇలాంటి పనులే చేయాలని చెప్పే ‘మగమహారాజులు’ చాలా మందే ఉన్నారు. బయట నీతులు మాట్లాడి..ఇంట్లో ఆడవాళ్లకు కనీస గౌరవమర్యాదలు ఇవ్వని భర్తలు.. ప్రేమ పేరుతో వారి జీవితాన్ని తమ కంట్రోల్లోకి తీసుకొని.. మాటలతో హింసించే బాయ్ప్రెండ్స్ ఇప్పటీకీ అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు. అలాంటి బాధలన్నీ భరించి.. ఎదురించి చివరకు తన లక్ష్యాన్ని చేరుకున్న ఓ అమ్మాయి కథే ‘ది గర్ల్ఫ్రెండ్’. మనల్ని కంట్రోల్ చేసే పవర్ని ఇతరులకు ఇవ్వొద్దని, కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలే తీసుకోవాలి అని చెప్పే సినిమా ఇది. కథగా చూస్తే..ఇది చాలా సింపుల్ అండ్ రొటీన్ స్టోరీ. కానీ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దాన్ని తెరపై చూపించిన విధానం కొత్తగా ఉంటుంది. విజువల్స్ ద్వారానే తను చెప్పాలనుకున్న పాయింట్ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంటర్వెల్ ముందు వచ్చే రష్మిక షవర్ సీన్, హీరో అమ్మగారితో మాట్లాడుతున్న సమయంలో తీసిన మిరర్ విజువల్, బ్రేకప్ తర్వాత హీరో గ్యాంగ్ వెంబడించినప్పు వచ్చే సింబాలిక్ షాట్స్.. ఇవన్నీ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వ ప్రతిభను చాటిచెబుతాయి.ఇదంతా ఒకవైపు.. ఇక లాజిక్కులు, ప్రస్తుత సమాజంలోని వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సినిమా చూస్తే.. పాత చింతకాయపచ్చడి కథేలాగే కనిపిస్తుంది. అంతేకాదు నాణానికి ఒకవైపే చూపించాడని.. రెండో వైపు కూడా ఉంటుంది కదా..దర్శకుడు అదేలా మిస్ అయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది. కేవలం మగవాళ్లను బ్యాడ్ చేయడానికే ఈ సినిమా తీశాడనే విమర్శలు కూడా దర్శకుడిపై వచ్చే అవకాశం ఉంది. అయితే ఏ వర్గం ప్రేక్షకుడైనా ఈ సినిమాలోని హీరో లేదా హీరోయిన్ పాత్రతో కనెక్ట్ అవ్వడం ఖాయం. ఇద్దరీ పాత్రలూ.. మనం ఎక్కడో చూసినట్లుగా, విన్నట్లుగానే ప్రవర్తిస్తాయి. ఫస్టాఫ్ మొత్తం హీరోహీరోయిన్ల ప్రేమ చుట్టూ తిరిగితే.. సెకండాఫ్ మాత్రం ప్రేమలో పడిన తర్వాత వారి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయనే చూపించారు. ఊహకందేలా కథనం సాగినా..తెరపై ఆయా సన్నివేశాలను చూస్తుంటే..కొన్ని చోట్ల ఎమోషనల్ అవుతాం. క్లైమాక్స్లో హీరోయిన్ చెప్పే మాటలు ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా నేటి తరం యువకులను ఆలోచింపజేస్తాయి. అక్కడక్కడ లాజిక్ మిస్ అవ్వడంతో పాటు ల్యాగ్ చేసినా..‘ది గర్ల్ఫ్రెండ్’ని మాత్రం ఓ వర్గం ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలోని భూమా పాత్రకు రష్మికను ఎంచుకోవడంలోనే రాహుల్ సగం విజయం సాధించాడు. ఆ పాత్రకు రష్మిక తప్ప మరెవరూ న్యాయం చేయలేరు అన్నట్లుగా నటించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె అద్బుతంగా నటించింది. విక్రమ్ పాత్రలో దీక్షిత్ శెట్టి ఒదిగిపోయాడు. అనూ ఇమ్మాన్యుయేల్ పాత్ర నిడివి తక్కువే ఉన్నప్పటికీ.. చాలా బాగా నటించింది. రావు రమేశ్ ఒకటి రెండు షాడ్స్తో కనిపించినా..తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించాడు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ పాటలు, ప్రశాంత్ విహారి నేపథ్య సంగీతం రెండూ ఈ సినిమా స్థాయిని పెంచేశాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
రష్మికా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
మంచి సినిమా నిర్మించానని సంతృప్తిగా ఉంది
‘‘నిర్మాతగా ఎన్నో సినిమాలు చేశాను, చేస్తున్నాను. సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాను. అయితే ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ ద్వారా నేను సంపాదించాలనుకున్నది డబ్బు కాదు... సంతృప్తి. ఒక నిర్మాతగా ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమా నిర్మించానని సంతృప్తిగా ఉంది’’ అని అల్లు అరవింద్ తెలిపారు. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 7న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘రాహుల్లాంటి సున్నితమైన మనసు, కమిటెడ్ పర్సన్ మాత్రమే ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమా రూపొందించగలరు. మన అక్క, చెల్లి, పిన్నిల మనసుల్లో ఏముంటుంది? ఎలాంటి ఆశలు ఉంటాయి? అనుకుని ఈ మూవీ చూడాలి. రష్మిక ఈ సినిమాలో జీవించేసింది. దీక్షిత్ నటన నచ్చి, మరో సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చాను’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో రష్మిక నటన ఈ దశాబ్దంలో ఒక మహిళా నటి తెలుగులో చేసిన బెస్ట్ పర్ఫార్మెన్స్గా నిలుస్తుంది’’ అని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. ఈ సమావేశంలో దీక్షిత్, ధీరజ్, విద్య కొప్పినీడి తదితరులు పాల్గొన్నారు. -
రష్మిక ది గర్ల్ఫ్రెండ్ మూవీ.. ఎమోషనల్ సాంగ్ రిలీజ్
దీక్షిత్ శెట్టి, రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ది గర్ల్ఫ్రెండ్. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్కు అంతా సిద్ధమైంది. ఈనెల 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు అభిమానులు ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో మరో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా ఈ మూవీ ఫుల్ ఎమోషనల్ సాంగ్ను రిలీజ్ చేశారు. నీదే కథ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు రాకేందు మౌలి లిరిక్స్ అందించగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ సాంగ్ను హేషమ్ అబ్దుల్ వాహబ్ కంపోజ్ చేశారు. ఈ పాట రష్మిక ఫ్యాన్స్ను తెగ అలరిస్తోంది. కాగా.. ది గర్ల్ఫ్రెండ్ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. -
మగాళ్లకూ ఆ నరకం తెలియాలి: రష్మిక మందన్నా
హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఏది పట్టినా బంగారమే అవుతోంది. యానిమల్ నుంచి కుబేర వరకు ఆమె చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్టే.. ఒక్క సికిందర్ తప్ప! ఈ ఏడాది రష్.. ఇప్పటివరకు నాలుగు సినిమాల(ఛావా, సికిందర్, కుబేర, థామా)తో అలరించింది. ఇప్పుడేకంగా ఐదో మూవీ 'ది గర్ల్ఫ్రెండ్' (The Girlfriend Movie)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.టాక్ షోలో రష్మికరాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ కోసం బాగానే కష్టపడుతోందీ బ్యూటీ. ఈ మధ్యే తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ స్టేజీపైనా సందడి చేసింది. తాజాగా జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి హాజరైంది. ఈ టాక్ షోలో సినిమా కోసమే కాకుండా ఇతరత్రా విషయాలపైనా మాట్లాడింది.మగాళ్లకు పీరియడ్స్ రావాలిముందుగా ఆమె మనసులో ఉన్న కోరిక గురించి జగపతిబాబు ప్రస్తావించాడు. మగాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండని ఫీలైనట్లున్నావ్? అని అడిగాడు. అందుకు రష్మిక క్షణం ఆలోచించకుండా అవునని తలూపింది. మగాళ్లకు ఒక్కసారైనా పీరియడ్స్ వస్తే.. ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం అవుతుంది అని చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.చదవండి: ఓటీటీలో 'మిత్రమండలి'.. 20 రోజుల్లోనే స్ట్రీమింగ్ -
ప్రభాస్ తో రష్మిక సినిమా.. నా చావుకు కారణం అదేనన్న నెటిజన్..!
-
విజయ్తో ఎంగేజ్మెంట్ రింగ్.. అసలు విషయం చెప్పేసిన రష్మిక!
ఈ ఏడాది వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న బ్యూటీ రష్మిక మందన్నా. ఇప్పటికే ఛావాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. ఇటీవలే థామా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం రష్మిక నటించిన ది గర్ల్ఫ్రెండ్ రిలీజ్కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది.ది గర్ల్ఫ్రెండ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా రష్మిక తాజాగా టాలీవుడ్ టాక్ షోకు హాజరైంది. నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము..నిశ్చయమ్మురా టాక్ షోలో సందడి చేసింది. ఈ షోలో పాల్గొన్న రష్మిక చేతికి రెండు ఉంగరాలు కనిపించడంతో అందరి దృష్టి వాటిపై పడింది. ఈ సందర్భంగా రష్మికను జగపతిబాబు సరదాగా ఆటపట్టించారు. దళపతి విజయ్, విజయ్ సేతుపతి, విజయ్ దేవరకొండతో ఫ్రెండ్షిప్, విజయ్ సేతుపతి ఫ్యాన్, దళపతి విజయ్కి ఆల్ టైమ్ ఫ్యాన్ ఇలా విజయాన్ని సొంతం చేసేసుకున్నావా? అంటూ ఫన్నీగా మాట్లాడారు.ఆ తర్వాత చేతికి ఉన్న రింగ్స్ను సెంటిమెంట్తోనే పెట్టుకున్నావా అని జగపతిబాబు అడిగారు. దీనికి రష్మిక మాట్లాడుతూ.. అవీ చాలా ఇంపార్టెంట్ అని ముద్దుగుమ్మ చెప్పేసింది. వాటిలో ఒక రింగ్ ఫేవరేట్ అయి ఉంటుంది.. దానికి ఓ హిస్టరీ కూడా ఉంటుందని జగపతి నవ్వుతూ అన్నారు. దీనిపై ఆడియన్స్ ఏదో గోల చేస్తున్నారు.. అదేంటో కనుక్కోండని రష్మికతో చెప్పగా.. అది తాను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేసింది.అయితే గతనెలలో రష్మిక- విజయ్ దేవరకొండకు ఎంగేజ్మెంట్ జరిగిందని వార్తలొచ్చాయి. కానీ ఈ విషయాన్ని ఎవరూ కూడా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో టాలీవుడ్ ప్రియులతో పాటు అభిమానుల్లోనూ సస్పెన్స్ నెలకొంది. ఇటీవల తరచుగా రష్మిక చేతికి ప్రత్యేక రింగ్ కనిపించడంతో నిశ్చితార్థం జరిగినట్లు ఫ్యాన్స్ ఫుల్గా ఫిక్సయిపోయారు. -
ది గర్ల్ ఫ్రెండ్లో రష్మిక కనిపించరు: దీక్షిత్ శెట్టి
‘‘మనం ఒకే తరహాలో సాగే ప్రేమ కథా చిత్రాల్ని చూసి ఉంటాం. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రేమ కథని మరో కోణంలో చూపిస్తుంది. మనం వినోదం కోసం సినిమాలు చూస్తుంటాం. కానీ, కొన్ని సినిమాల్లోని ఫీల్ మనతో పాటే ఇంటివరకూ క్యారీ అవుతుంది. అలాంటి సినిమా ఇది. నా కెరీర్లో చేసిన మూవీస్లో ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఉత్తమ చిత్రం అని చెప్పగలను’’ అని దీక్షిత్ శెట్టి చెప్పారు. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ–‘‘దసరా’ చిత్రం తర్వాత రాహుల్ రవీంద్రన్గారు నన్ను సంప్రదించి, ‘ది గర్ల్ ఫ్రెండ్’లో విక్రమ్ పాత్రకి నేను సరిపోతానని చెప్పారు. రాహుల్గారికి ఉన్న క్లారిటీ వల్ల విక్రమ్ పాత్ర చేయడం సులభం అయ్యింది. ఈ సినిమా కేవలం యువత కోసమే కాదు.. కుటుంబ ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది. ఈ చిత్రంలో రష్మికగారి నటన చూశాక ‘ది గర్ల్ ఫ్రెండ్’ కి మరో నాయిక న్యాయం చేయలేదేమో? అనిపించింది. సినిమా చూస్తున్నంత సేపు తెరపై రష్మిక కనిపించరు.. ఆమె చేసిన భూమా పాత్ర మాత్రమే కనిపిస్తుంది.రాహుల్ రవీంద్రన్ మంచి రైటర్, డైరెక్టర్. అంతకంటే మంచి మనిషి. ‘ది గర్ల్ ఫ్రెండ్’ షూటింగ్ టైమ్లో అల్లు అరవింద్గారు రషెస్ చూసి, పిలిస్తే వెళ్లాను. ఆయన నన్ను అభినందించి, తర్వాతి చిత్రానికి అడ్వాన్స్ ఇవ్వడం చాలా సంతోషంగా అనిపించింది. విద్య, ధీరజ్గార్లు మా యూనిట్కి కావాల్సినంత సపోర్ట్ ఇచ్చారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం మా సినిమాకు హైలైట్ అవుతుంది. నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకోవడం నాకు ఇష్టం. అందుకే తెలుగు భాషని కూడా నేర్చుకున్నాను. విక్రమ్ పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పాను.బాగా నటిస్తే భాషతో సంబంధం లేకుండా ఆయా నటీనటులను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ‘దసరా’ చిత్రం నుంచి హీరో నానిగారితో నా అనుబంధం కొనసాగుతోంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ టీజర్, ట్రైలర్ బాగున్నాయంటూ ఆయన ప్రశంసించడం సంతోషం. ఇక నేను కన్నడలో నటించిన ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ సినిమాను తెలుగులో ఈ నెల 21న విడుదల చేయబోతున్నాం. తెలుగులో ‘షబనా, కేజేక్యూ’ తో పాటు మరో సినిమాలో నటిస్తున్నా. కన్నడలో శివ రాజ్కుమార్గారితో కలిసి ఓ మూవీ చేస్తున్నా. మలయాళంలో నటించిన ‘ఏంజెల్ నెం.16’ రిలీజ్కు రెడీ అవుతోంది. తమిళంలో ఒక మూవీ షూటింగ్లో పాల్గొంటున్నాను’’ అని తెలిపారు. -
ప్రభాస్తో రష్మిక సినిమా.. నా చావుకు కారణం అదేనన్న నెటిజన్!
రష్మిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ది గర్ల్ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి శెట్టి హీరోగా నటించారు. ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. రష్మిక సైతం ప్రమోషన్స్లో దూసుకెళ్తోంది. ఇటీవలే బిగ్బాస్ షోలోనూ సందడి చేసింది.తాజాగా ది గర్ల్ఫ్రెండ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా నెటిజన్స్తో చిట్చాట్ నిర్వహించింది. రష్అవర్ పేరుతో ట్విటర్ వేదికగా ప్రశ్నలు అడగాలని అభిమానులను కోరింది. దీంతో ఓ నెటిజన్ కాస్తా విభిన్నమైన ప్రశ్న వేశాడు. వీలైతే మీరు ప్రభాస్తో కలిసి నటిస్తారా? అలా జరిగితే మీ కాంబో హైప్ దెబ్బకు థియేటర్ నా శవాన్ని తీసుకెళ్లండి అంటూ ఫన్నీగా అడిగాడు. దీనికి స్పందించిన రష్మిక.. ప్రభాస్తో నటించడం నాకు కూడా ఇష్టమే.. ఒకవేళ ప్రభాస్ ఈ మేసేజ్ చూస్తారని ఆశిస్తున్నా.. మేమిద్దరం కలిసి భవిష్యత్తులో నటిస్తే నా కెరీర్లో చాలా ప్రత్యేకంగా నిలవనుంది అంటూ రిప్లై ఇచ్చింది. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. గతంలో ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తోన్న సినిమాలో రష్మికను సంప్రదించారని వార్తలొచ్చాయి. కానీ చివరికీ బాలీవుడ్ భామ, యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ ఆ ఛాన్స్ కొట్టేసింది. యానిమల్ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే థామా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ముద్దుగుమ్మ సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ది గర్ల్ఫ్రెండ్ చిత్రంతో మరోసారి అలరించేందుకు వస్తోంది.😆😆😆😆🩷 I love it.. I hope Prabhas sir see’s this message and I hope we really do work together on something special soon! 🩷— Rashmika Mandanna (@iamRashmika) November 3, 2025 -
గ్లామరస్ బొమ్మలా 'నేషనల్ క్రష్' రష్మిక (ఫొటోలు)
-
నిశ్చితార్థం కోసం అల్లు స్నేహా.. ఐలాండ్లో తమన్నా
మరిది నిశ్చితార్థం కోసం ఇలా ముస్తాబైన అల్లు స్నేహామలేషియాలోని ఓ ఐలాండ్లో తమన్నా ఫొటోషూట్దిక్కులు చూస్తూ రుక్మిణి వసంత్ ఫన్నీ పోస్ట్సిల్క్ చీరలో అందమే అసూయపడేలా రష్మిక'బైసన్' షూటింగ్.. సైకిల్ తొక్కుతూ అనుపమగ్రౌండెడ్ అంటూ నేలపై కూర్చుని అదితీ స్టిల్స్ View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
బిగ్బాస్ స్టేజీపై రష్మిక.. భరణి సిగ్గు చూస్తే నిజంగా చచ్చిపోవాల్సిందే!
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) స్టేజీపైకి నేషనల్ క్రష్, కాబోయే తెలుగింటి కోడలు రష్మిక మందన్నా (Rashmika Mandanna) వచ్చేస్తోంది. రష్మిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది గర్ల్ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి శెట్టి హీరోగా యాక్ట్ చేశాడు. ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా దీక్షిత్, రష్మిక బిగ్బాస్ స్టేజీపైకి వచ్చారు.సీన్స్ రీక్రియేషన్వీరుండగానే హౌస్మేట్స్తో ఓ ఫన్గేమ్ ఆడించాడు నాగ్.. కొన్ని పాపులర్ సీన్స్ ప్లే చేసి.. వాటిని రీక్రియేట్ చేయాలన్నాడు. ఇంకేముంది, హౌస్మేట్స్ తమ కళనంతా బయటపెట్టారు. పోకిరి, అదుర్స్ వంటి పలు హిట్ సినిమాల్లోని సీన్లను రీక్రియేట్ చేశారు. వారి డైలాగులు, యాక్టింగ్ చూస్తుంటే జనాలు కడుపుబ్బా నవ్వుకోవడం గ్యారెంటీగా కనిపిస్తోంది. చివర్లో భరణి (Bharani Shankar) బ్రహ్మానందంలా మారిపోయాడు. వెంటనే మాధురి.. ఆ వెధవ పొట్టేసుకుని ప్రేమ కావాలంట ప్రేమ అని భరణిపై సెటైర్లు వేసింది.బ్రహ్మానందంలా మారిపోయిన భరణిఅందరికీ ఏమైనా సిక్స్ ప్యాక్లు ఉన్నాయా? అని భరణి అంటుంటే.. ఇక్కడ డిస్కషన్ పొట్ట గురించి కాదు, పెళ్లి గురించి అని కోపగించుకుంది. దాంతో భరణి.. నువ్వలా హార్ష్గా మాట్లాడకు చందు, హర్టవుతాను అంటూ తెగ సిగ్గుపడిపోయాడు. అలాగే బామ్మ క్యారెక్టర్లో ఉన్న సంజనాతో.. మీరలా సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది అని డైలాగ్ వేశాడు. మొత్తానికి చాలాకాలం తర్వాత ఈ సండే ఫన్డేగా మారుతుందని అర్థమవుతోంది. అయితే, సోషల్ మీడియా లీక్స్ ప్రకారం మాధురి ఎలిమినేట్ అయిందట. అంటే రేపటినుంచి మంచి మాస్ మసాలా గొడవలు మిస్ అవుతామన్నమాట! చదవండి: ఎంతోమంది కళ్లు తెరిపించే మూవీ.. 'తలవర' రివ్యూ -
‘ది గర్ల్ఫ్రెండ్’.. రష్మికకు రెట్టింపు రెమ్యునరేషన్.. కారణం ఇదే!
‘ది గర్ల్ఫ్రెండ్’ కథ రష్మికకు బాగా నచ్చింది. నెరేషన్ ఇవ్వగానే వెంటనే ఈ ప్రాజెక్ట్ చేసేద్దాం అని చెప్పింది. రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించింది. అందుకే కృతజ్ఞతతో ఇప్పుడు మేము రెట్టింపు రెమ్యునరేషన్ ఇస్తున్నాం’ అన్నారు నిర్మాత ధీరజ్ మొగిలినేని. రష్మిక-దీక్షిత్ శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్ఫ్రెండ్’. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ఈ నెల 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాతలు ధీరజ్, విద్య కొప్పినీడి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ లాక్ డౌన్ టైమ్ లో థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. ఆ తర్వాత థియేటర్స్ అన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఆ టైమ్ లో స్క్రిప్ట్ డెవలప్ చేసే దశలో ఉన్నాం. థియేటర్స్ అన్నీ ఓపెన్ అయ్యాక ఈ సినిమాను థియేట్రికల్ గా రిలీజ్ చేయాలని అనుకున్నాం. మేము ఈ ప్రాజెక్ట్ టేకోవర్ చేసినప్పటి నుంచి థియేట్రికల్ గానే వెళ్లేందుకు ప్లాన్ చేశాం. ప్రొడ్యూసర్ గా కమర్షియల్ గా మూవీ ఉండాలని కోరుకుంటాం. కానీ మేము రిస్క్ చేసినా ఫర్వాలేదు అనేంత బాగా ఈ స్టోరీ నచ్చింది.→ మనం లవ్ స్టోరీస్ ను ఎవరో ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి. ఈ కథ హీరోయిన్ కోణంలో ఉంటుంది. అలాంటప్పుడు స్టార్స్ ను ఈ మూవీకి హీరోగా తీసుకోలేం. పర్ ఫార్మర్స్ నే తీసుకోవాలి. దీక్షిత్ మంచి పర్ ఫార్మర్. రశ్మిక లాగే తన క్యారెక్టర్ లో ఆకట్టుకునేలా నటించాడు. ఈ ఏజ్ గ్రూప్ లో నాకు తెలిసిన వాళ్లలో దీక్షిత్ ఈ మూవీకి పర్పెక్ట్ అనిపించింది. సినిమా చూశాక మీకూ అదే ఫీల్ కలుగుతుంది.→ "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాను మేమే సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. థియేట్రికల్ గా ఈ మూవీ బాగా వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నాం. దీక్షిత్ ను తీసుకోవడం వల్ల కన్నడ మార్కెట్ కు ఉపయోగపడుతుందని అనుకోలేదు, ఆ క్యారెక్టర్ కు ఆయన కరెక్ట్ గా సెట్ అవుతాడనే తీసుకున్నాం. అయితే రశ్మిక, దీక్షిత్ ఉండటం వల్ల కన్నడలో అడ్వాంటేజ్ అవుతుంది.→ తెలుగులో వస్తున్న పెద్ద సినిమాలను కన్నడ వెర్షన్ లో రిలీజ్ చేస్తున్నారు. చిన్న సినిమాలూ ఇలా ట్రై చేస్తున్నా కొన్నిసార్లు టైమ్ సరిపోక కన్నడ వెర్షన్ లో రిలీజ్ చేయడం లేదు. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాను ఈ నెల 7న హిందీ, తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. మరో వారం తర్వాత ఈ నెల 14న తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేస్తాం. ముంబైలో ఒక ఈవెంట్ చేయాలనే ప్లాన్ ఉంది.→ అనూ ఇమ్మాన్యుయేల్ మంచి రోల్ చేసింది. తనది గెస్ట్ రోల్ కంటే పెద్ద క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కు ఆమె పర్పెక్ట్ గా కుదిరింది. మామూలుగా సినిమా రిలీజ్ అంటే చివరిదాగా టెన్షన్ పడుతుంటాం. కానీ "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా విషయంలో మేము నమ్మింది స్క్రీన్ మీద కనిపిస్తోంది. సో హ్యాపీగా టెన్షన్ లేకుండా ఉన్నాం. రిలీజ్ కు మంచి డేట్ దొరికింది. రెండు రోజుల ముందే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం. ఎప్పుడు అనేది డేట్స్ అనౌన్స్ చేస్తాం.→ కోవిడ్ తర్వాత ప్రేక్షకుల్ని థియేటర్స్ కు రప్పించాలంటే మంచి కంటెంట్ ఉంటేనే సాధ్యమవుతోంది. థియేట్రికల్ గా ఇది బాగుంటుంది అనే స్టోరీస్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాం. గీతా ఆర్ట్స్, అరవింద్ నుంచి మాకు మంచి సపోర్ట్ ఉంటుంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ సినిమా రిలీజ్ అయ్యాక కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాం. ‘ఈ ప్రాజెక్ట్ సమంత గారితో చేయాలని అనుకోలేదు. ఈ స్క్రిప్ట్ కు రశ్మిక గారినే అనుకున్నాం. ఆమెకు ఈ స్క్రిప్ట్ పర్సనల్ గా చాలా నచ్చింది. అందుకే స్క్రిప్ట్ విషయంలో ఆమెతో ఎలాంటి డిస్కషన్స్ జరగలేదు’ అని నిర్మాత విద్య కొప్పినీడి అన్నారు. -
డైమండ్ నగల్లో మెరిపోతున్న రష్మిక మందన్నా (ఫోటోలు)


