Ravi Raju
-
కారు అదుపుతప్పి.. అనంతలోకాలకు
- ఇద్దరికి తీవ్ర గాయాలు - త్రుటిలో తప్పించుకున్న మరో ఇద్దరు గండేపల్లి (జగ్గంపేట) : ఏడీబీ రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయపడ్డారు. ఈ సంఘటనలో మరో ఇద్దరికి ప్రమాదం త్రుటిలో తప్పింది. స్థానిక ఎసై కె.దుర్గా శ్రీనివాసరావు కథనం ప్రకారం మండలంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో శ్రీకాకుళానికి చెందిన యవ్వారి మనోజ్కుమార్ (21), అనకాపల్లికి చెందిన రవిరాజు ఈఈఈ ఫైనల్ ఇయర్, రాజోలుకు చెందిన కంచి కౌశిక్ మెకానికల్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. పెద్దాపురం బ్యాంక్ కాలనీలో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ కళాశాలకు రోజు వెళ్లి వస్తుంటారు. సోమవారం రవిరాజుకు చెందిన కారులో స్నేహితుడైన కౌశిక్ను కళాశాలలో డ్రాప్ చేసేందుకు కళాశాల సమీపంలోకి వచ్చి వెనుదిరిగి పెద్దాపురం బయలుదేరారు. లలిత గొడౌన్ వద్దకు వచ్చేసరికి వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి కాలువలోంచి దూసుకెళ్లి గొడౌన్ గేట్ వద్ద చెట్టును, పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది షెల్టర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో ముగ్గురు కారులో చిక్కుకుపోయారు. గొడౌన్కు చెందిన పలువురు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను కారులోంచి బయటకు తీసి 108 అంబులెన్స్కు సమాచారం అందజేశారు. అప్పటికే మనోజ్కుమార్ మృతి చెందినట్టు అంబులెన్స్ సిబ్బంది తెలిపింది. తీవ్ర గాయాలతో ఉన్న రవిరాజు, కౌశిక్లను పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమచికిత్స అనంతరం కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఏఎస్సై వరహాలరాజు వివరాలు సేకరించారు. ప్రస్తుతం రవిరాజు పరిస్థితి విషమంగా ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. భీతిల్లిన సిబ్బంది షెల్టర్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది.. ఈ ప్రమాదంతో భీతిల్లారు. ఒక్కసారిగా పెద్దగా శబ్దం రావడంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. షెల్టర్ను కారు ఢీకొనడంతో తమకు ప్రమాదం తప్పిందని పడాల శ్రీనివాస్, మద్దాల విలియం తెలిపారు. కారణం.. అతివేగమా? రోడ్డుపై బురదేనా? విద్యార్థులు ప్రయాణం చేస్తున్న కారును వేగంగా నడపడంతో ఈ ప్రమాదం సంభవించిందా...లేక రోడ్డుపై బురద కారణమా అనే అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రోజుల్లోనే రోడ్డు నునుపుగా ఉంటుందని, వర్షం పడడం, ఈ రహదారిలో గ్రావెల్ను తరలిస్తున్న లారీ డ్రైవర్లు రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో రోడ్డుపై గ్రావెల్ పడుతోందని అంటున్నారు. దీంతో ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ ఎన్. సతీష్రెడ్డి తక్షణమే స్పందించి చర్యలు చేపట్టారు. మనోజ్ కుమార్ మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కాకినాడలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి వైద్యులతో మాట్లాడారు. -
మెడికల్ కౌన్సిలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి
-
మెడికల్ కౌన్సెలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్: మెడికల్ కౌన్సెలింగ్కు జెఎన్టీయూ సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వీసీ రవిరాజు వెల్లడించారు. బుధవారం రవిరాజు హైదరాబాద్లో మాట్లాడుతూ... తెలంగాణ ఎంసెట్ రాసినా రెండు రాష్ట్రాల విద్యార్థలు ఈ కౌన్సెలింగ్కు హాజరుకావచ్చునని తెలిపారు. 85 శాతం లోకల్, 15 శాతం నాన్ లోకల్ ప్రకారం సీట్ల భర్తీ జరుగుతుందన్నారు. ఇప్పటికే వెబ్సైట్లో సీట్ మ్యాట్రిక్స్ను అప్లోడ్ చేశామని చెప్పారు. వాటిని పరిశీలించుకుని ఎక్కడ సీటు వచ్చే అవకాశం ఉందో ముందే తెలుసుకోవచ్చని సూచించారు. మెడిసెట్ ర్యాంకుల ప్రకారమే సీట్లు భర్తి చేస్తున్నట్లు రవిరాజు వివరించారు. -
ఆత్మహత్య చేసుకుంటున్నా... నేనెవరో కనుక్కోండి...!
‘నా ఆత్మహత్యకు ఎలాంటి కారణాలూ లేవు. ఆత్మహత్య చేసుకోవాలని చిన్నప్పటి నుంచే అనుకుంటున్నాను. ముక్కలు ముక్కలైన నా బాడీ(శరీరం)ని నా వాళ్లకు అందజేయండి. నా పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ ఇందులో (పజిల్) ఉన్నాయి. కనుక్కోండి...’ఆత్మహత్య చేసుకున్న గుర్తుతెలియని యువకుడి వద్ద దొరికిన ఇంగ్లిష్లో రాసిన సూసైడ్ నోట్ ఇది..! ఖమ్మం క్రైం: గుర్తు తెలియని ఓ యువకుడు శుక్రవారం ఉదయం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జీఆర్పీ ఎస్ఐ రవిరాజు తెలిపిన ప్రకారం... నగరంలోని శ్రీరాం హిల్స్ ప్రాంతంలో రైలు పట్టాలపై ఓ యువకుడు నడుచుకుంటూ వెళుతున్నాడు. ఎదురుగా రైలు వస్తున్నప్పటికీ అతడు పక్కకు తప్పుకోలేదు. రైలు ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిని దూరం నుంచి చూసిన స్థానికులు కొందరు.. రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ యువకుడి వయసు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇతని ఎడమ చేతికి పోలియో వచ్చింది. ఇతని వద్ద దొరికిన బ్యాగ్లో ఖరీదైన కళ్ళ జోడు, ఉడ్ల్యాండ్ షూ, ‘ది లాస్ ఆఫ్ ద స్పిరిట్ వరల్డ్’ అనే పుస్తకం, ఖమ్మం నుంచి డోర్నకల్ వరకు వెళ్లేందుకు గురువారం రాత్రి తీసుకున్న టికెట్ ఉన్నాయి. వీటితోపాటు, ఇంగ్లిష్లో రాసిన సూసైడ్ నోట్, పజిల్తో కూడిన కాగితం ఉన్నాయి. సూసైడ్ నోట్లో... ‘‘నేను చిన్నప్పటి నుంచి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను. నా ఆత్మహత్యకు ప్రేమ విఫలంగానీ, ఇతరత్రా కారణాలుగానీ ఏమీ లేవు..’’ అని ఉంది. మరో కాగితంపై ఇంగ్లిష్ అక్షరాలు, అంకెలు ఉన్నాయి. వాటిలో కొన్ని పెన్నుతో రౌండప్ చేసి ఉన్నాయి. ఈ కాగితంపై ఇంకా.. ‘ముక్కలు ముక్కలైన నా బాడీ(శరీరం)ని నా వాళ్లకు అందజేయండి. నా పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ ఇందులో (పజిల్) ఉన్నాయి. కనుక్కోండి...’ అని ఉంది. ఈ పజిల్ ఆధారంగాసెల్ నంబర్(9313516443)ను పోలీసులు గుర్తించారు. ఢిల్లీ అడ్రస్తో ఉన్న ఆ నంబర్కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వస్తోంది. మృతదేహన్ని జిల్లా ఆసుపత్రి మార్చురీకి పోలీసులు తరలించారు. ఈ యువకుని వివరాలు తెలిసిన వారు ఖమ్మం జీఆర్పీ స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ రవిరాజు కోరారు.