Ravi teja reddy
-
వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేత అవుతు సునీతారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమం గురువారం గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని శ్రీ శ్రీనివాస కన్వెన్షన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరై నూతన వధూవరులు శ్రీవల్లి, రవితేజరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి.. ఆశీర్వదించారు. -
ఉప్పల్ చేరుకున్న రవితేజారెడ్డి మృతదేహం
-
ఉప్పల్ చేరుకున్న రవితేజారెడ్డి మృతదేహం
హైదరాబాద్: అమెరికాలో బోటింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ నదిలో పడి మృతి చెందిన తెలుగు విద్యార్థి రవితేజారెడ్డి మృతదేహం శుక్రవారం ఉప్పల్లోని అతడి స్వగృహానికి చేరుకుంది. ఉన్నత విద్య కోసం రెండు నెలల క్రితమే యూఎస్ వెళ్లిన రవితేజారెడ్డి... ఈ నెల 16న బఫేల్లో నేషనల్ రివర్ పార్క్కు స్నేహితులతో కలసి వెళ్లాడు. అక్కడ బోటింగ్ చేస్తున్న సమయంలో నదిలోపడి మరణించాడు. రవితేజాకు ఈత రాకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రవితేజారెడ్డి మృతదేహన్ని అతడి స్నేహితులు భారత్కు తరలించారు. ఈ క్రమంలో నేడు అతడి స్వగృహానికి మృతదేహం చేరుకుంది. అయితే రవితేజారెడ్డి స్వగ్రామం వరంగల్ జిల్లా జనగాం. కాగా... ఉప్పల్లోని సూర్యానగర్లో అతడి కుటుంబ సభ్యులు నివాసముంటున్నారు. రెండు నెలల క్రితమే రవితేజారెడ్డి అమెరికా వెళ్లాడని... ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని మృతుడి తల్లి సుమిత్రా విలపించారు.