Red Light
-
రెడ్లైట్ థెరపీ అంటే ఏంటీ..? నటి సమంత బ్యూటీ సీక్రెట్ ఇదే..!
టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏం మాయ చేశావే సినిమాతో కుర్రాళ్ల కలల రాకుమారిగా క్రేజ్ సంపాదించుకుంది. తన అందం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. వేలాదిగా అభిమానులను సొంతం చేసుకుంది. అలాంటి సమంత ఎప్పటికప్పుడూ ఫిట్నెస్, ఆరోగ్యం సంబంధిత వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఈసారి తన చర్మ సంరక్షణ కోసం తన రోజువారి దినచర్యలో భాగంగా తీసుకునే థెరపీ గురించి ఇన్స్టాలో చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియోకి "లైఫ్ గోల్డెన్" అనే క్యాప్షన్ని జోడించి మరీ పోస్ట్ చేసింది. సమంత మచ్చలేని చర్మ రహస్యం ఏంటో ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. తన చర్మం ప్రకాశవంతంగా డిస్కోబాల్ మాదిరిగా మెరుస్తూ ఉండేందుకు తాను ఉదయపు సూర్యకాంతిని తన ముఖంపై పడేలాచేసుకుంటానని అంటోంది. అంతేగాదు ఆయిల్ పుల్లింగ్, గువాషా, రెడ్లైట్ థెరపీలతో ముఖ వర్చస్సును కాపాడుకుంటానని చెబుతోంది. అలాగే తన రోజువారీ వెల్నెస్ రొటీన్లో భాగంగా రెడ్లైట్ థెరపీని తీసుకుంటానని తెలిపింది. ఇది కంటి సంరక్షణ తోపాటు చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుందని చెబుతోంది. ఈ రెడ్లైట్ థెరపీకి సంబంధించిన ఐ మాస్క్ల, ఫేస్ మాస్క్లు, ఫుల్ బాడీ ప్యానెల్ వంటి అనే సాధనాలు మార్కెట్లో ఉన్నాయి. దీని కోసం బ్యూటీ క్లినిక్లకు వెళ్లాల్సిన పనిలేకుండా ఇంట్లోనే చర్మ వ్యాధుడి నిపుణుడి సలహాలతో తీసుకోవచ్చని అంటోంది సమంత. దీన్ని ఉదయం సాయంత్రంలో తీసుకుంటుంటే క్రమేణ చర్మం ఆకృతి మెరుగుపడుతుందని చెప్పింది. ఈ థెరఫీని ఇంట్లోనే పొందేలంటే ఉపయోగించాల్సిన పరికరాలు గురించి కూడా వెల్లడించింది. ఫోరో యూఎఫ్ఓ 2 పరికరం అనేది కొల్లాజెన్ని పెంచేలా చేసే రెడ్లైట్ థెరపీ పరికరం. ఇది క్రియోథెరపీని కలిగి ఉంటుంది. చర్మాన్ని విశ్రాంతి తీసుకునేలా చేసి గొంతు కండరాలకు ఉపశమనం కలిగించే హ్యాండ్హెల్డ్ పరికరం. ఇక మరొకటి డెన్నిస్ గ్రాస్ డీఆర్ఎక్స్ స్పెక్ట్రాలైట్ ఫేస్వేర్ప్రో అనేది నాలుగు రకాల లైట్లను కలిగి ఉన్న అత్యంత ప్రసిద్ధ హ్యాండ్స్ ఫ్రీ రెడ్లైట్ పరికరం. ఇది ముఖ ఆకృతులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడమే గాక మొటిమలు, దాని తాలుకా గుర్తులను రీమూవ్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది. అలాగే ముఖం, మెడను లక్ష్యంగా చేసుకుని మాన్యువల్గా పనిచేసే పోర్టబుల్ రెడ్లైట్ థెరపీ కావాలనుకుంటే సోలావేవ్ 4 ఇన్ 1 రేడియంట్ రెన్యూవల్ స్కిన్కేర్ బెస్ట్ అని చెబుతోంది. ఇది ఎర్రటి కాంతిని చర్మంపై ప్రసరించేలా చేసి, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. పైగా ముఖం ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) ఈ థెరపీతో కలిగే ప్రయోజనాలు..రెడ్లైట్ థెరపీ చర్మంపై ముడతలు, ఫైన్లైన్స్, వయసు సంబంధిత మచ్చలను తగ్గిస్తుంది. ముఖ ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. టోన్డ్ స్కిన్ను ప్రోత్సహిస్తుంది. చర్మం ఉపరితలంపై మచ్చలు, సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మాన్ని మెరుగుపడేలా చేస్తుంది.(చదవండి: ఫరా ఖాన్ ఇష్టపడే వంటకం: ఇడ్లీలో ఇన్ని రకాలా..!) -
రెడ్లైట్ థెరఫీతో షుగర్కి చెక్! పరిశోధనలో షాకింగ్ విషయాలు
చక్కెర వ్యాధి పేరు చెబితేనే అందరికి భయం వేస్తుంది. అదీగాక ఇటీవల కాలంలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీన్ని అదుపులో పెట్టుకోవడమే గానీ తగ్గడమనేది ఉండదు. అలాంటి చక్కెర వ్యాధిని జస్ట్ ఎరుపు రంగు కాంతితో అడ్డుకట్టవేయొచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేగాదు చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని చెబుతున్నారు. దీన్ని రెడ్ లైట్ థెరఫీ అని పిలుస్తున్నారు శాస్త్రవేత్తలు. ఏంటీ థెరఫీ? ఎలా తగ్గించొచ్చు?.. శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో డయాబెటిస్ని ‘రెడ్లైట్ థెరపీ’(ఎరుపు రంగు కాంతి)తో నియంత్రించొచ్చని వెల్లడయ్యింది. ఈ రెడ్ లైట్ స్టిమ్యులేటెడ్ ఎనర్జీ ప్రొడక్షన్లో నాన్-ఇన్వాసివ్, నాన్-ఫార్మాకోలాజికల్ అనే టెక్నిక్ గ్లూకోజ్ వినియోగాన్ని పెంచుతుందని, తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని నిరూపితమయ్యింది. ఈ పరిశోధనలో రెడ్లైట్ థెరపీ ద్వారా మైటోకాండ్రియాలో 670 నానోమీటర్ల ఉత్తేజిత శక్తి (స్టిమ్యులేటెడ్ ఎనర్జీ)ని ఉత్పత్తి చేయగలిగినట్లు గుర్తించారు. అది గ్లూకోజ్ వినియోగానికి దారితీస్తుందని తేలింది. ఈ అధ్యయనంలో ముఖ్యంగా గ్లూకోజ్ తీసుకున్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో అనూహ్యంగా 27.7% తగ్గడమే కాకుండా గ్లూకోజ్ స్పైకింగ్ను గరిష్టంగా 7.5%కి తగ్గించింది. ఈ మైటోకాండ్రియా కీలకమైన సెల్యులార్ ప్రక్రియలకు శక్తిని అందిస్తుంది. ఫలితంగా ఆక్సిజన్ గ్లూకోజ్ని ఉపయోగించి శక్తి అధికంగా ఉండే న్యూక్లియోసైడ్ అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ (ATP)ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఏటీపీ ఉత్పత్తిలో మెరుగుదల కారణంగా మైటోకాండ్రియా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నియంత్రిస్తుందని చెప్పారు పరిశోధకులు. అందుకోసం సుమారు 30 ఆరోగ్యవంతమైన వ్యక్తులపై పరిశోధనలు చేశారు. ఒక 15 మందికి 670 nm రెడ్ లైట్ థెరఫీ ఇవ్వగా మిగిలిన వాళ్లకు ఈ థెరపీ ఇవ్వలేదు. వారందరి దగ్గర నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి నోటి గ్లూకోజ్ టాలరెన్స్ పరీక్షను తీసకున్నారు. అలాగే గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత గ్లూకోజ్ స్థాయిలు ఎలా ఉన్నాయో కూడా పరీక్షించారు. ఈ అధ్యయనంలో సుమారు 45 నిమిషాలు రెడ్లైట్ ఎక్స్పోజర్ని పొందిన వ్యక్తుల రక్తంలో గణనీయంగా గ్లూకోజ్ స్థాయిలు తగ్గగా, మిగిలిన వారిలో చక్కెర నిల్వలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ థెరఫీ తీసుకున్న వారిలో భోజనం తర్వాత శరీరంలో ఉత్పత్తి అయ్యే హానికరమైన గ్లూకోజ్ స్పైక్లు కూడా తగ్గినట్లు గుర్తించారు. అలాగే మనం ఉపయోగించే ఈ ఎల్ఈడీ లైట్లలలో కూడా నీలం రంగే ఉంటుంది కానీ అస్సలు ఎరుపు రంగు ఉండదని అన్నారు. అందువల్ల మైటోకాండ్రియా ఏటీపీ ఉత్పత్తి ఫంక్షన్ని తగ్గిస్తోందని చెప్పారు. ఇలా శరరీం ధర్మానికి విరుద్ధంగా పనిచేయడం వల్లే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతున్నట్లు తెలిపారు పరిశోధకులు. ఇది క్రమేణ దీర్ఘకాలిక మధుమేహనికి దోహదం చేసి బలహీననపరుస్తుందని అన్నారు. ఈ పరిశోధన కాంతి ప్రాముఖ్యతను తెలియజేసింది. అలాగే ఈ ఎరుపు రంగ కాంతిలో జస్ట్ 15 నిమిషాలు ఉంటే చాలు మంచి ఫలితాలు ఉంటాయని అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధన మొత్తం జర్నల్ ఆఫ్ బయోఫోటోనిక్స్లో ప్రచురితమయ్యింది. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఎల్ఈడీ లైట్లు వినియోగం పెరగుతున్నందువల్ల త్వరితగతిన అందరూ ఈ ముప్పుని గుర్తించాలని అన్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: వర్కౌట్లతో సమంత..ఉదయానికి మించిన బెస్ట్ టైమ్ లేదు!) -
‘రెడ్ లైట్ ఆన్- వెహికిల్ ఆఫ్’ అంటే ఏమిటి? ఢిల్లీలో ఎందుకు అమలు చేస్తున్నారు?
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలలో భాగంగా నేడు (గురువారం) ఐటీఓ కూడలిలో ‘రెడ్ లైట్ ఆన్- వెహికల్ ఆఫ్’ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈసారి ప్రజా భాగస్వామ్యంతో ఈ ప్రచారం సాగనుంది. 28న బరాఖంబలో, అక్టోబర్ 30న చంద్గిరామ్ అఖారా కూడలి, నవంబర్ 2న మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ప్రచారం సాగనుంది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ ‘రెడ్ లైట్ ఆన్- వెహికల్ ఆఫ్’ ప్రచారాన్ని ఈసారి ఐటీఓ కూడలి నుంచి ప్రారంభిస్తామన్నారు. నవంబర్ 3వ తేదీన 2000 ఎకో క్లబ్ల ద్వారా చిన్నారులకు కూడా అవగాహన కల్పించనున్నామన్నారు. 2020వ సంవత్సరంలో ‘రెడ్ లైట్ ఆన్- వెహికిల్ ఆఫ్’ ప్రచారం ప్రారంభించారు. భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు 2019 సంవత్సరంలో దీనిపై అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం.. కూడలి సిగ్నల్ వద్ద రెడ్ లైట్ కనిపించినప్పుడు వాహనాల ఇంజిన్లను స్విచ్ ఆఫ్ చేయని పక్షంలో తొమ్మిది శాతం అధికంగా కాలుష్యం వ్యాపిస్తుంది. సాధారణంగా ఢిల్లీలో వాహనదారులు 10 నుండి 12 రెడ్ లైట్ల గుండా వెళుతుంటారు. ఈ కూడళ్లలో వాహనం ఇంజన్ రన్ అవుతూనే ఉంటుంది. ఫలితంగా 25 నుంచి 30 నిమిషాల పాటు అనవసరంగా పెట్రోల్ లేదా డీజిల్ ఖర్చయి, పొగ రూపంలో కాలుష్యం వ్యాపిస్తుంది. అందుకే కూడలిలో రెడ్ లైట్ పడినప్పుడు వాహనం ఇంజిన్ అపాలని ట్రాఫిక్ అధికారులు తెలియజేస్తున్నారు. కాగా చలికాలంలో ఢిల్లీలో కాలుష్యం మరింత ఆందోళనకరంగా మారుతోంది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆప్ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది. ఇది కూడా చదవండి: ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. ‘నాసా’ ఫొటోలలో కారణం వెల్లడి! -
ముళ్ల ఒడి తల్లడిల్లుతోంది
ఢిల్లీలో రోజుకు 29 ఫైట్లు జరుగుతుంటాయి. అవి రాష్ట్రాలవి. ఢిల్లీలోనే 8 ఏళ్లుగా ఓ ఫైట్ జరుగుతోంది. అది ఓ తల్లిది! ఢిల్లీ నుంచి తన పల్లెకు చేరాలని ఆమె ఆరాటం. వెళ్లొచ్చుగా.. ఏముంది ఢిల్లీలో? ఢిల్లీలో ఆమె ప్రాణం ఉంది. ఆ ప్రాణం.. ఎనిమిదేళ్ల ఆమె కూతురిలో ఉంది. ఆ కూతురు.. ‘ఇల్లీగల్ అడాప్షన్’లో ఉంది! బతుకు చీకటిని తప్పించుకోడానికి చీకటి బతుకులోకి జారిపడి.. ఒడిలోని కూతుర్ని చేజార్చుకున్న ఈ ‘రెడ్లైట్’ బాధితురాలు ఎదుగుతున్న ఆ కూతుర్ని దక్కించుకునేందుకు... న్యాయపోరాటం చేస్తోంది. పిల్ల లేనిదే ఢిల్లీ కదలనంటోంది. ఢిల్లీలోని రెడ్లైట్ ఏరియా. ‘నువ్వు నాకు నచ్చావ్! పెళ్లి చేసుకుంటా.. ఈ కూపంలోంచి బయటకు తీసుకెళ్తా!’ చెప్పాడు అతను. ‘హు..’ పేలవంగా నవ్వింది ఆమె. ‘నిజం.. ఒట్టు ... నన్ను నమ్ము’ ఆమె తల మీద చెయ్యేసి చెప్పాడు నమ్మకంగా! ‘ఆడవాళ్లనే నమ్మలేను నీ మాటెలా నమ్మాలి’.. తల మీదనుంచి చేయి తీసేస్తూ అన్నది ఆమె నిర్లిప్తంగా. ‘కానీ నన్ను నమ్ము’ నమ్మించే ప్రయత్నం చేస్తూ అతను. ‘నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలంటే బ్రోతల్ హౌజ్ వాళ్లకు డబ్బు కట్టాలి.. పైగా నన్ను నీ భార్యగా మీ ఇంట్లోవాళ్లు ఒప్పుకుంటారా?’ అతని కళ్లల్లోకి సూటిగా చూస్తూ ఆమె. ‘వాళ్లు అడిగినంత డబ్బు కట్టే నిన్ను విడిపించుకు వెళ్తా.. ఇక మా ఇంట్లోవాళ్ల సంగతి అంటావా... ఇది నా పెళ్లి.. నా ఇష్టం’ అని సమాధానమిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆమె పేరు సారిక.. అతని పేరు రాకేశ్! (గోప్యత దృష్ట్యా ఇద్దరి పేర్లూ మార్చాం) ఆమెది ఆంధ్రప్రదేశ్ లోని ఓ గ్రామం. అందరి అమ్మాయిల్లాగే పెళ్లి చేసుకొని, పిల్లల్ని కని హాయిగా సంసారం చేయాలని కలలు కన్నది. అనుకున్నట్టే చక్కటి భర్త దొరికాడు. యేడాది తిరక్కుండానే పండంటి బిడ్డ పుట్టింది. ఏ చింతా లేకుండా సాగిపోతున్న కాపురం ఒక్కసారిగా కల్లోలంలో పడింది. సారిక ఎనిమిదినెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె భర్తకు పాము కాటుకు చనిపోయాడు. అత్తింట, పుట్టింట ఆదరణ లేక.. అనాథయింది సారిక. చేతిలో బిడ్డతో ఆ నిండుచూలాలికి దిక్కు తోచలేదు. దమ్మిడీ ఆదాయం లేక ఆ పిల్లనెలా సాకేది? ఇంకో బిడ్డనెలా కనేది? అప్పుడు వచ్చింది పక్కింటామె. పొట్టకూటికోసం ఢిల్లీ వెళ్లి చుట్టపుచూపుగా సొంతూరుకి వచ్చిపోతూ ఉంటుంది. సారిక గురించి తెలిసి పరామర్శించడానికి ఆ ఇంటి గుమ్మంలో అడుగుపెట్టింది. ఆప్యాయంగా పలకరించింది. ఆ కాసింత ప్రేమకే కదిలిపోయింది సారిక. ఆమె ఒళ్లో తలపెట్టి వెక్కివెక్కి ఏడ్చింది. ‘పిచ్చిదానా...ఎందుకలా బాధపడ్తావ్? నేను లేనా?’ అని ఓదార్చింది. తనతోపాటు ఢిల్లీ వస్తే అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానని మాటిచ్చింది. ఆశపడ్డ సారిక అంతలోనే అనుమానంతో పొట్ట మీద చేయి వేసుకుంది అనుమానంగా. సారిక ఆంతర్యం గ్రహించిన ఆమె ‘అక్కడ మంచి ఆసుపత్రిలో క్షేమంగా డెలివరీ చేయించే బాధ్యత నాది’ అంది సారిక చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ! గుండె నిండా ఊపిరిపీల్చుకుంది సారిక. కూతురు పుట్టిన నెలకు.. అలా పక్కింటామె భరోసా మీద నాలుగేళ్ల బిడ్డతో ఢిల్లీలో ఏపీ ఎక్స్ప్రెస్ దిగింది సారిక. పక్కింటామె ఇంట్లోనే బసచేసింది. ఇదిగో రేపే ఓ బట్టల దుకాణంలో సేల్స్ ఉమన్గా ఉద్యోగంలో పెట్టించబోతున్నా. అయిదువేల రూపాయల జీతం’ అని చెప్పింది. ఏరోజుకారోజే రేపు అంటూ పదిహేనురోజులు దాటవేసింది. ‘తర్వాత డెలివరీ కానివ్వు..’ అంది. ఆ మాట అన్న పదిహేను రోజులకి సారికకు పురుడొచ్చింది. కూతురు పుట్టింది. నెలయ్యాక నెమ్మదిగా తన అసలు రంగు బయటపెట్టింది పక్కింటామె. ‘నీకు ఏ బట్టల షాపులో ఉద్యోగం లేదు. నేను చెప్పిన చోట పనిచేయాలి. నెలకు అయిదు వేలు నాకే ఇవ్వాలి ఎందుకంటే నీ పిల్లల్లిదర్నీ నేను చేసుకోవాలి కాబట్టి’ అంటూ ఆమెను తీసుకెళ్లి ఓ బ్రోతల్హౌజ్లో పెట్టింది. సారిక పెద్ద కూతురిని గుర్గావ్లో ఉన్న ఓ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించింది. రెండో కూతురిని సారిక తన ఇష్టం మీదే దత్తత ఇస్తున్నట్టు దత్తత కాగితాల మీద బలవంతంగా సంతకాలు చేయించుకుంది. అలా సారిక బలవంతంగా వ్యభిచార కూపంలోకి వచ్చిపడింది. వారానికి ఒకసారి గుర్గావ్ వెళ్లి పెద్దకూతురిని చూసొస్తూ ఉండేది సారిక. కానీ ఢిల్లీలోని జీబీ రోడ్లో ఉన్న చిన్న కూతురి దగ్గరకే మొదట్లో రానిచ్చినా తర్వాత ఆ పిల్లను చూడనివ్వడం మానేశారు. సారిక బలవంతంగా వస్తే.. తమ మాట వినకపోతే పిల్లలిద్దర్నీ కూడా వ్యభిచారంలోకి దింపుతామని బెదిరించేవారు. ఆ భయానికి చిన్న కూతురు దగ్గరకి వెళ్లడమే మానేసింది. ఆ సమయంలోనే పరిచయమయ్యాడు రాకేశ్. ముందు విటుడుగా.. తర్వాత ప్రేమికుడిగా! అనుకున్నట్టే పెళ్లైంది రాకేశ్ తాను సారికకు ఇచ్చిన మాట ప్రకారం ఆమె ఉంటున్న బ్రోతల్హౌజ్ యజమానికి లక్షరూపాయలు చెల్లించి సారికను విడిపించాడు. పెళ్లీ చేసుకున్నాడు. అప్పుడు చెప్పింది తన లక్ష్యాల గురించి రాకేశ్కి. అండగా ఉంటానని మాటిచ్చాడు. రాకేశ్ సహాయంతో పెద్ద కూతురిని తేలికగానే విడిపించుకుంది. తన బిడ్డ ఇక్కడుంటే ప్రమాదమని భావించి తీసుకెళ్లి తన సొంతూర్లో తమ్ముడు, మరదలి దగ్గర పెట్టింది. కూతురి అవసరాలకోసం నెలనెలకు తమ్ముడికి డబ్బులు పంపించి కూతురిని చదివించుకుంటోంది. రెండో బిడ్డ కోసం... ఢిల్లీలోని తానుంటున్న రెడ్లైట్ ఏరియా వదలాలనుకోలేదు సారిక. ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి తాను దూరంగా వెళ్లిపోతే తనను ఈ నరకంలోకి నెట్టిన వాళ్ల కదలికలు తెలుసుకోలేదు. దాంతో రెండో బిడ్డ జాడా తెలియదు. అందుకే మొండిగా అదే ప్రాంతంలో ఇంకో బ్రోతల్ హౌజ్లో పనిచేయడం మొదలుపెట్టింది. రాకేశ్తో ఇంకో కూతురూ పుట్టింది. ఓ వైపు ఆ బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూనే తన రెండో బిడ్డ జాడ గురించి ఆరా తీయడం మొదలుపెట్టింది. స్థానిక పోలీస్స్టేషన్లో బిడ్డ ఆచూకీ కోసం కంప్లయింట్ ఇచ్చింది. తనను వ్యభిచారిగా మార్చిన స్త్రీ వచ్చింది. ‘ఆమె బిడ్డను ఆమెనే ఇష్టపూర్వకంగా దత్తతకు ఇచ్చింది’ అంటూ సారిక సంతకం చేసిన పత్రాలను పోలీసులకు చూపించింది. ‘ఈ సంతకం నీదేనా?’ అని అడిగారు పోలీస్ అధికారులు. పరీక్షగా చూసింది. అవును తనదే! కానీ బెదిరించి, భయపెట్టి పెట్టించిన సంతకం అది. ఆ విషయాన్నే పోలీసులకు మొరపెట్టుకుంది. ‘నువ్వు మైనర్వి, తెలియనిదానివి కాదు కదా.. భయపెట్టి సంతకం పెట్టించుకోవడానికి. నీ సంతకం ఉంది కాబట్టి ఏం చేయలేం’ అంటూ పెదవి విరిచారు. అవమానం, దుఃఖం, కోపం, నిస్సహాయత, తనమీద తనకే పుట్టిన జాలితో వెనుదిరిగింది సారిక. ఇంటికి వచ్చి గుండెపగిలేలా ఏడ్చింది. భార్య బాధ రాకేశ్ గుండెను పిండేసింది. సారిక న్యాయ పోరాటం బంధించి, భయపెట్టి, బ్లాక్మెయిల్ చేస్తూ ఇలాంటి కాగితాల మీద సంతకాలు చేయించడం నేరం. అలాంటివి చెల్లవు కూడా. దీనికే కాదు సారికను బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్లను ట్రాఫికింగ్, ప్రాస్టిట్యూషన్ నేరాల కింద అరెస్ట్ చేయాలి. సారికది న్యాయ పోరాటం. ఆమె పోరాటానికి శక్తివాహిని మద్దతు ఎప్పటికీ ఉంటుంది. - రవికాంత్, శక్తివాహిని ప్రధానకార్యకర్త శక్తివాహిని సహాయంతో.. స్థానికంగా పనిచేస్తున్న శక్తివాహిని అనే ఎన్జీవోకు వెళ్లాడు రాకేశ్. ఆ సంస్థ అధికారి రవికాంత్ను కలిశాడు. సారిక పరిస్థితిని వివరించాడు. ఆమె కథ విన్ని రవికాంత్ ఆమె రెండో కూతురును విడిపించడంలో తనకు సహాయపడ్తామని మాటిచ్చాడు. ఆ మరుసటిరోజే సారికను తీసుకెళ్లి రవికాంత్కు పరిచయం చేశాడు రాకేశ్. శక్తివాహిని ఆమెకు ధైర్యమిచ్చింది. బిడ్డ కోసం ఢిల్లీ కోర్ట్లో పిటీషన్ వేయించింది. ఇప్పుడు ఆ పోరాటంలోనే ఉంది సారిక. ‘భర్త చనిపోయిన నా నిస్సహాయస్థితిని ఆసరాగా తీసుకొని నన్ను నమ్మించి ఢిల్లీ తీసుకొచ్చి.. ఈ కోపంలోకి నెట్టింది. నా రెండోబిడ్డనూ నెట్టాలని చూస్తోంది. అసలు హిందీరాని కొత్తలో నా చేత ఏవో హిందీపేపర్ల మీద సంతకం చేయించి ఇప్పుడు అవే దత్తత కాగితాలని, వాటి మీద నేను ఇష్టపూర్వకంగా సంతకం చేశానని చూపిస్తోంది. నా ఇద్దరు బిడ్డలనూ వ్యభిచారంలోకి నెడ్తామని బెదిరించి నా చేత బలవంతంగా సంతకాలు చేయించారు. ఈ పాపాలకు వాళ్లకు శిక్షపడేలా చేయందే నిద్రపోను. ఎన్నేళ్లయినా సరే పోరాడుతాను. నా బిడ్డను తెచ్చుకుంటాను. నెల పసిగుడ్డప్పుడు నా నుంచి దూరం చేశారు. ఇప్పుడు దానికి ఎనిమిదేళ్లు. కోర్టు వాయిదాలకు వాళ్లతో కలిసి వస్తోంది. అసలు నన్ను గుర్తే పట్టడం లేదు. నేను నీ అమ్మను తల్లీ.. అని ఏడుస్తున్నా పిచ్చిదాన్ని.. పరాయిదాన్ని చూస్తున్నట్టు చూస్తోంది. అన్నిటికన్నా ఈ బాధను తట్టుకోలేకపోతున్నా..!’అంటోంది సారిక ఉబికొస్తున్న దుఃఖాన్ని పంటి బిగువున్న ఆపుకుంటూ! ‘మా రెండో బిడ్డను తెచ్చుకోవడానికి మా ప్రాణాలను సైతం లెక్కచేయం. ఎంతదాకైనా పోరాడాతాం’ అంటున్నాడు రాకేశ్. -
ఇష్టారాజ్యంగా ఎర్రబుగ్గ కారులు వాడద్దు: సుప్రీం