repalle sub jail
-
అనారోగ్యంతో ఖైదీ మృతి
సాక్షి, గుంటూరు : రేపల్లె కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న శంకర్ర్రావు అనే ఖైదీ అనారోగ్యంతో మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ... మృతుడు గత నేలలో జరిగిన మహీవర్ధన్ హత్య కేసులో శంకర్రావు మూడోవ ముద్దాయి ఉన్నాడని పోలీసులు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న శంకర్రావును దగ్గరలోని జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తుండగా, శంకర్రావు మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. -
రేపల్లె సబ్జైలు నుంచి ఖైదీ పరారీ
రేపల్లె: గుంటూరు జిల్లా రేపల్లె సబ్జైలు నుంచి ఓ ఖైదీ పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కళ్లుగప్పి కుంచాల నాగరాజు(26) అనే ఖైదీ బుధవారం సాయంత్రం తప్పించుకున్నాడు. నాగరాజు స్వస్థలం సత్తెనపల్లి మండలం బడుగుబండ గ్రామం. దొంగతనం కేసుల్లో 5 నెలల నుంచి రేపల్లె సబ్జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. పరారైన ఖైదీ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.