Rs 1000 cr budget
-
మూడు రోజులు.. వెయ్యి కోట్లు! అంబానీ అంటే అట్లుంటది మరి..
ధనవంతుల ఇళ్లలో పెళ్లి అంటే ఖర్చు భారీగా ఉంటుందని అందరికి తెలుసు.. అలాంటిది ప్రపంచ కుబేరులలో ఒకరు, భారతదేశంలో అత్యంత సంపన్నులు అయిన 'ముఖేష్ అంబానీ' ఇంట పెళ్లి అంటే మాటలా? ఈ రోజు చాలా మంది మనసులో మెదిలే ప్రశ్న అంబానీ ఇంట జరుగుతున్న ప్రీవెడ్డింగ్ కార్యక్రమాలకు ఎంత ఖర్చు చేయనున్నారు. ఈ కథనంలో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. లక్షల కోట్లకు అధిపతి అయిన ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్, ఎన్కోర్ హెల్త్కేర్ అధినేత 'వీరెన్ మర్చంట్' కుమార్తె రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలైపోయాయి. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు హాజరవుతున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలలో ఫుడ్ లిస్ట్ చూస్తేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. తినడటానికి 2500 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో బ్రేక్ఫాస్ట్, లంచ్, రాత్రి డిన్నర్ కోసం ఇలా చాలానే వంటకాలను తయారు చేస్తున్నారు. గుజరాత్లోని జామ్నగర్లో ఈ రోజు నుంచి మొదలైన 'అనంత్, రాధిక' ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలకు 1000 మంది సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇందులో స్టార్ క్రికెటర్స్, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు. వీరి కోసం ఇప్పటికే ప్రత్యేక వసతులను ఏర్పాటు చేశారు. అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు 120 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 1000 కోట్లు) ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రీవెడ్డింగ్గా రికార్డ్ క్రియేట్ చేస్తుంది. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా ఆయన ఆస్తిలో అది కేవలం 0.1శాతం మాత్రమే అని పలువురు చెబుతున్నారు. ఇదీ చదవండి: 10 భారతీయ కంపెనీ యాప్లపై కన్నెర్రజేసిన గూగుల్! అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పర్ఫామెన్స్ చేయనున్న 'రిహాన్నా'కు ఏకంగా 8 నుంచి 9 బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 66 కోట్ల నుంచి రూ. 74 కోట్లు. దీన్ని బట్టి చూస్తే అంబానీ తన కొడుకు పెళ్లి కోసం ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. -
వెయ్యికోట్ల ’మహాభారత్’ ఖరారు.. లీడ్ రోల్ ఎవరిది?
-
మహాభారతాన్ని నిర్మించబోతున్న దుబాయ్ బిలియనీర్
కొచీ: ప్రతిష్టాత్మక వెయ్యికోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న మహాభారత్ చిత్రానికి నిర్మాత ఖరారయ్యాడు. యూఏఈకి చెందిన భారత వ్యాపారవేత్త బీఆర్ శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారతదేశంలోనే అతిపెద్ద మోషన్ ప్రాజెక్టుగా భావిస్తున్న ఈ ప్రాజెక్టులో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ముందుకొచ్చారు. మరోవైపు ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ కీలక పాత్రపోషించనున్నారు. ప్రముఖ యాడ్ ఫిలిం రూపకర్త వి.ఎ. శ్రీకుమార్ మేనన్ దర్శకత్వంలో మోహన్లాల్ ఎంటీ ప్రాజెక్ట్ ఈ మూవీని రూపొందించనుంది. ఈ చిత్రంలో కీలకమైన భీముడి పాత్రలో సౌత్ ఇండియన్ సూపర్స్టార్ మోహన్ లాల్ కనిపించనున్నారు. ఈ విషయాన్ని తన ఫేస్బుక్ ఖాతాలో అధికారికంగా ప్రకటించారు. దీంతోపాటు ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో భీమ పాత్రకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని మోహన్ లాల్ తెలిపారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్య వాదాలు తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్, ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళిల డ్రీమ్ సినిమా మహాభారత్ మూవీని, ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎం.టి వాసుదేవన్ నాయర్ రాసిన ‘రాందమూళం’ నవల ఆధారంగా ఈ సినిమాను 150 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 2018న మొదలుపెట్టి 2020కి రిలీజ్ చేయనున్నారు. అలాగే మొదటి భాగం విడుదలైన 90 రోజుల్లోనే రెండవ భాగాన్ని విడుదల చేయనున్నారని సమాచారం. అంతే కాకుండా ఈ సినిమా కోసం నటీనటులను టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎంపికచేయనుండగా, వారిని ఒక అంతర్జాతీయ దర్శకుడు ఎంపిక చేయనుండడం విశేషం. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రపంచ సినిమా లో గొప్ప పేర్లు ఉత్తమ ప్రతిభగల, సాంకేతిక సిబ్బంది, ఇతర అకాడమీ అవార్డు విజేతలు సహా పాపులర్ నటులతో రూపొందనున్న ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, మలయాళం, కన్నడ, తెలుగు, తమిళంతోపాటు ఇతర విదేశీ భాషల్లోకి డబ్బింగ్ చేయనున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.