Russia
-
నార్త్ కొరియా సైన్యం ఎక్కడ.. పుతిన్ ప్లాన్ మార్చాడా?
కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ దళాలతో ధీటుగా పోరాడలేక ఉత్తర కొరియా సైనికులు తమ దేశానికి వెనుదిరుగుతున్నట్టు ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. కిమ్ దళాలు దాదాపు ఉక్రెయిన్ నుంచి వెళ్లిపోయినట్టు తెలిపారు. ఈ క్రమంలో తాము పైచేయి సాధించినట్టు చెప్పుకొచ్చారు.తాజాగా ఉక్రెయిన్కు చెందిన స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ ప్రతినిధి ఒలెక్సాండర్ కిండ్రాటెంకో మాట్లాడుతూ.. ‘గత మూడు వారాలుగా మాతో యుద్ధంలో పాల్గొన్న ఉత్తర కొరియా సైనికులకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలను గుర్తించలేదు. మా సైనికుల చేతిలో ఓడిపోయి భారీ నష్టాలు చవిచూడటంతో వారు వెనుదిరిగినట్లు విశ్వసిస్తున్నాం. నార్త్ కొరియాకు చెందిన సైనికులు ఎక్కడా కనిపించడం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇక.. ఉక్రెయిన్తో జరుగుతోన్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా సైన్యం పోరాడుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 10 వేల మంది కిమ్ సైనికులు సాయపడుతున్నారు. ప్రత్యేక శిక్షణ అనంతరం వీరిని కదన రంగంలో దింపినప్పటికీ.. మాస్కో, కొరియన్ సైనికుల మధ్య భాష సమస్య కారణంగా సమన్వయం లోపించింది. ఈక్రమంలోనే కిమ్ సైనికులు తమ దళాల చేతిలో మృతి చెందుతున్నారని కీవ్ ప్రకటించింది.మరోవైపు.. ఉక్రెయిన్ అధికారుల వ్యాఖ్యలపై రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్ ఘాటు స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉక్రెయిన్ అధికారులు చెప్పిన వ్యాఖ్యల్లో నిజం లేదు. దీనిలో భిన్నమైన వాదనలు ఉన్నాయి. ప్రతిసారీ వ్యాఖ్యానించలేం అంటూ కొట్టిపారేశారు.ఇదిలా ఉండగా.. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ చేసిన తర్వాత ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానని చెప్పారు. అనంతరం.. యుద్ధం నిలిపేసేందుకు ఇరు దేశాధ్యక్షులు శాంతి చర్చలకు ముందుకు రావాలని కోరారు. ఇదే సమయంలో ఈ చర్చలకు వచ్చేందుకు రష్యా నిరాకరిస్తే వారిపై ఆంక్షలు విధిస్తానని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తికరంగా మారింది.North Korea sent troops to aid Russia in its war against Ukraine. But after months of severe losses, they have been taken off the front line. pic.twitter.com/l92MDNiW48— ☻Joanna (@joanna952544) January 31, 2025 -
‘నేనంటే పుతిన్కు భయం’
కీవ్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్పై (vladimir putin) ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్స్కీ (Volodymyr Zelenskyy) సెటైర్లు వేశారు. మూడేళ్లుగా యుద్ధం జరుగుతున్నా మాతో చర్చలు జరిపేందుకు పుతిన్ భయపడుతున్నారు. శక్తివంతమైన నేత భయపడుతున్నారు’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఉక్రెయిన్-రష్యాల దేశాల యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ (donald trump) స్పందించారు. ఇరు దేశాదినేతలు యుద్ధానికి ముగింపు పలికేలా శాంతి చర్చలు జరపాలని హితువు పలికారు. లేదంటే ఇరు దేశాలపై అమెరికా కఠిన ఆంక్షలు విధించాల్సి వస్తుందని హెచ్చరించారు.అయితే, ట్రంప్ హెచ్చరికలపై పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధమేనని తెలిపారు. కానీ, చట్టవిరుద్ధంగా మార్షల్లా విధించిన జెలెన్స్కీతో తాము చర్చలు జరపబోమన్నారు. ఉక్రెయిన్తో చర్చలు జరిపేందుకు మేం సిద్ధం. జెలెన్స్కీ మాతో జరిగే చర్చల్లో పాల్గొంటే. నేను పాల్గొనను. మా తరుఫున ప్రతినిధుల్ని పంపిస్తాం. చర్చలు కూడా మాకు అనుకూలంగా జరగగాలి’ అని వ్యాఖ్యనించారు. Today, Putin once again confirmed that he is afraid of negotiations, afraid of strong leaders, and does everything possible to prolong the war. Every move he makes and all his cynical tricks are aimed at making the war endless.In 2014, Russia started a hybrid war against…— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) January 28, 2025పుతిన్ నిర్ణయంపై జెలెన్ స్కీ మండి పడ్డారు. పుతిన్ స్వార్ధపరడు. మూడేళ్లుగా యుద్ధం జరగుతుంటే కనీసం మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. మాతో మాట్లాడేందుకు పుతిన్ .. అదే అత్యంత శక్తివంతమైన నేత భయపడుతున్నారు.యుద్ధంపై అమెరికా-రష్యాలు చర్చలు జరిపితే అందులో ఉక్రెయిన్ పాల్గొనకపోతే ఎలా? అదే జరిగితే మా ప్రయోజనాలు దెబ్బతినట్లే. తన స్వలాభం కోసం పుతిన్ తన చర్యల ద్వారా డొనాల్డ్ ట్రంప్ను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజమైన శాంతికి రష్యా కట్టుబడి ఉంటే యుద్ధానికి ముగింపు పలకొచ్చు. కానీ పుతిన్ ఆ పని మాత్రం చేయరు. ఉద్దేశ్యపూర్వకంగా చర్చలు జరపకుండా.. యుద్ధాన్ని కొనసాగించేందుకే ఇష్టపడతారని’ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 👉చదవండి : మతిలేని యుద్ధం ఆపండి -
‘పుతిన్ హత్యకు అమెరికా కుట్ర?’
వాషింగ్టన్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ను హతమార్చేందుకు అమెరికా ప్రయత్నించింది. ఇప్పుడీ వ్యాఖ్యలు అంతర్జాతీయ మీడియాలో చర్చాంశనీయంగా మారింది. అయితే ఈ వ్యాఖ్యల్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. అందుకు కారణం ప్రముఖ అమెరికన్ పండిట్, మాజీ ఫాక్స్ న్యూస్ యాంకర్ టక్కర్ కార్ల్సన్ (Tucker Carlson)..తన ‘ది టక్కర్ కార్లసన్ షో’ పాడ్కాస్ట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ రచయిత మాట్ తైబీతో పాడ్కాస్ట్లో కార్ల్సన్ మాట్లాడుతూ.. పుతిన్ను హత్య చేసేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్ ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపణలు చేశారు. జోబైడెన్ ప్రభుత్వం పుతిన్ను చంపేందుకు ప్రయత్నించింది. ఇది పిచ్చి, మతిలేని చర్య అని అన్నారు. 🇺🇸🇷🇺 Tucker Carlson said that the Biden administration tried to kill Vladimir PutinThe goal is to start World War III and sow chaos. Carlson said this during an interview with journalist Matt Taibbi. pic.twitter.com/k7STerZxFg— Маrina Wolf (@volkova_ma57183) January 28, 2025అయితే, కార్లసన్ వ్యాఖ్యల్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని జోబైడెన్ మద్దతు దారులు స్పష్టం చేస్తున్నారు. అందుకు ఊతం ఇచ్చేలా 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ మోసం జరిగిందని, అందుకు అర్ధం పర్ధంలేని ఆధారాల్ని టెలికాస్ట్ చేసి ఫాక్స్ న్యూస్లో ఉద్యోగం కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీనికితోడు పుతిన్ను హత్య చేసేందుకు జోబైడెన్ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించిన కార్లసన్ అందుకు తగిన ఆధారాల్ని ఎందుకు చూపించలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆరోపణలపై జోబైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా స్పందించలేదు, అయితే క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ విషయంపై వ్యాఖ్యానించారు, పుతిన్ భద్రతను నిర్ధారించడానికి రష్యన్ ప్రత్యేక సేవలు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. -
మతిలేని యుద్ధం ఆపండి
వాషింగ్టన్: ఉక్రెయిన్తో మతిలేని యుద్ధానికి ఇకనైనా తెరదించాలని రష్యా అధినేత పుతిన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హితవు పలికారు. యుద్ధాన్ని ముగించేలా ఉక్రెయిన్తో ఒప్పందానికి రావాలని సూచించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. పుతిన్తో సాధ్యమైనంత త్వరగా సమావేశమవుతానని చెప్పారు. యుద్ధం ఆపకపోతే రష్యాపై కఠిన ఆంక్షలు విధించక తప్పదని ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆంక్షల భయంతో పుతిన్ వెనక్కి తగ్గుతారని మీరు భావిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అది నాకు తెలియదు అని ట్రంప్ బదులిచ్చారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధక్షేత్రంలో అమాయకులు బలైపోతున్నారని, అందుకే తక్షణమే ఆ యుద్ధం ఆగిపోవాలని తాను కోరుకుంటున్నట్లు పునరుద్ఘాటించారు. రష్యాతో సంధికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సిద్ధంగా ఉన్నారని ట్రంప్ తెలిపారు. అబార్షన్ వ్యతిరేక ఉద్యమకారులకు ట్రంప్ క్షమాభిక్షషికాగో: అబార్షన్లకు వ్యతిరేకంగా క్లినిక్ల వద్ద నిరసన తెలిపిన ఉద్యమకారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫైల్పై సంతకం చేయడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. శాంతియుతంగా నిరసనలు చేపట్టిన వీరికి శిక్షలు విధించడం సరికాదని తెలిపారు. 2020 అక్టోబర్లో వాషింగ్టన్లోని అబార్షన్ క్లినిక్ను దిగ్బంధించి, తలుపులు మూసి తాళాలు వేసి నిరసన తెలిపిన లారెన్ హార్డీతోపాటు మరో 9 మంది సహ నిందితులకు ట్రంప్ క్షమాభిక్ష ప్రకటన వర్తించనుంది. -
ట్రంప్తో చర్చలకు పుతిన్ రెడీ: రష్యా
మాస్కో: డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడేందుకు తమ అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారని రష్యా ప్రకటించింది. అయితే ఈ విషయమై అమెరికా నుంచి స్పందన కోసం వేచి చేస్తున్నట్లు తెలిపింది. ఇరు దేశాల అధినేతల మధ్య భేటీ త్వరలో ఉంటుందా లేదా అన్న విషయంపై మాత్రం రష్యా స్పష్టత ఇవ్వలేదు.దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ట్రంప్ వర్చువల్గా మాట్లాడారు. అణ్వాయుధాలను తగ్గించే దిశగా ప్రపంచ దేశాలు పని చేయాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. రష్యా,చైనాలు కూడా వారి అణ్వాయుధ సామర్థ్యాలను తగ్గించుకోవడానికి మద్దతిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఉక్రెయిన్ యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలుకుతానన్న ఆయన చమురు ధరలు దిగివస్తే ఈ యుద్ధం మరింత వేగంగా ముగిసిపోతుందని చెప్పారు. అయితే ట్రంప్ చేస్తున్న ఈ వాదనతో రష్యా మాత్రం ఏకీభవించలేదు. చమురు ధరలకు తాము యుద్ధం ఆపడానికి సంబంధం లేదని స్పష్టం చేసింది.అమెరికా-రష్యా సంబంధాలు ఉక్రెయిన్ యుద్ధంతో అత్యంత దారుణంగా క్షీణించాయి. రష్యాతో పోరాడుతున్న జెలెన్స్కీ సైన్యానికి మాజీ అధ్యక్షుడు బైడెన్ హయాంలో అమెరికా భారీ స్థాయిలో ఆయుధ సాయంతో పాటు ఆర్థికంగానూ ఆదుకుంటోంది. -
రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్
-
ఉక్రెయిన్ యుద్ధంలో అంతిమ క్రీడలు
అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనుండగా, రష్యా–ఉక్రెయిన్లు... యుద్ధంలో చివరి దశ క్రీడలు సాగిస్తున్నాయి. ట్రంప్ ఈ సమస్య పరిష్కారానికి తన ప్రతినిధిగా జనరల్ కీత్ కెల్లోగ్ అనే అనుభవజ్ఞుడిని నియమించారు. ట్రంప్ మొదటి అధ్యక్ష కాలంలో జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారైన కెల్లోగ్, ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారంపై తన ఆలోచనలను ఇప్పటికే వివరించారు. ఈ పరిణామాల దృష్ట్యా రష్యా, ఉక్రెయిన్లు చర్చలకు సమ్మతిస్తూనే, అవి జరిగేలోగా యుద్ధంలో వీలైనంత పైచేయి కోసం ప్రయత్నిస్తున్నాయి.చర్చలు అంటేనే ఎవరి షరతులు వారు విధి స్తారు. మధ్యవర్తి అయినవారు ఇరుపక్షాల మధ్య రాజీ కోసం ప్రయత్నిస్తూనే, తమవైపు నుంచి కొన్ని ప్రతిపాద నలు చేస్తారు. వాటిపై చర్చల క్రమంలో ఒక రాజీ కుదురుతుంది. అయితే ప్రస్తుత అంశంపై చర్చలు త్వరలోనే ప్రారంభం కావచ్చు గానీ, రాజీ ఎప్పటికి జరిగేదీ ఎవరూ చెప్పలేరు. వంద రోజులన్న జనరల్ కెల్లోగ్ అయినా! ఉక్రెయిన్ తూర్పున తమ సరిహద్దుల వెంట గల డోన్ బాస్ ప్రాంతాన్నంతా పూర్తిగా తమకు వదలి వేయటం, 2014 నుంచితమ ఆక్రమణలో గల క్రిమియా దీవిని తిరిగి కోరక పోవటం, ఉక్రె యిన్ యూరోపియన్ యూనియన్లో చేరినా, ఎప్పటికీ నాటోలో చేరక పోవటం అన్నవి రష్యా షరతులు. బ్లాక్ సీలో గల క్రిమియా, ముఖ్యంగా చలికాలంలో ఆ సముద్రం ఘనీభవించదు గనుక నౌకా రవాణాకు రష్యాకు తప్పనిసరి అవసరం. ఉక్రెయిన్ నాటోలో చేరినట్ల యితే రష్యా భద్రతకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది. సోవియట్ యూనియన్, వారి నాయకత్వాన ఉండిన వార్సా సైనిక కూటమి 1991లో రద్దయిన తర్వాత, అమెరికన్ నాటో కూటమి మాత్రం మరింత విస్తరిస్తూ, రష్యా సరిహద్దునే గల ఉక్రెయిన్ను కూడా చేర్చుకొన జూస్తుండటం మాస్కో భయానికి కారణం. తక్షణం యుద్ధం ఆగితేనే చర్చలురష్యా దృష్టి నుంచి గల పరిస్థితులు ఇవి కాగా, ఉక్రెయిన్ షరతులు రెండు. ఒకటి–క్రిమియాను, ప్రస్తుత యుద్ధంలో రష్యా ఆక్ర మించిన డోన్ బాస్ భూభాగాలను తమకు తిరిగి అప్పగించటం. రెండవది–నాటోలో చేరే స్వేచ్ఛ తమకు ఉండటం. డోన్ బాస్లో రష్యా ఇప్పటికి 20 శాతానికి పైగా భాగాన్ని ఆక్రమించింది. ఇక ట్రంప్ ప్రతినిధిగా జనరల్ కెల్లోగ్ సూచిస్తున్నది, మొదట యుద్ధం వెంటనే ఆగిపోవాలి. ఇరు సైన్యాలు ఎక్కడివక్కడ నిలిచి పోవాలి. తర్వాత చర్చలు ఆరంభమవ్వాలి. రష్యా ఆక్రమణలో గల భూభా గాలు కనీసం కొన్నింటిని వదులుకునేందుకు ఉక్రెయిన్ సిద్ధపడాలి. దానికి నాటో సభ్యత్వ విషయం నిరవధికంగా, కనీసం 20 ఏళ్లపాటు, వాయిదా వేయాలి. ఇందుకు రష్యా అంగీకరించనట్లయితే ఉక్రెయి న్కు తమ సహాయం కొనసాగిస్తారు. ఉక్రెయిన్ కాదంటే వారికి అన్ని సహాయాలూ నిలిపివేస్తారు.వీటన్నింటిపై చర్చలు ఏ విధంగా పురోగమించవచ్చునన్నది అట్లుంచి కొన్ని విషయాలు గమనించాలి. యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్కు మద్దతునిస్తూ రష్యా ఆక్రమణలో గల డోన్ బాస్ ప్రాంతాన్ని, క్రిమియాను వదలుకునేందుకు జెలెన్ స్కీ సిద్ధపడవలసి ఉంటుందని సలహా ఇస్తున్నాయి. ఆ ప్రాంతాన్ని తిరిగి ఉక్రెయిన్ స్వాధీనం చేసేందుకు రష్యా ఎట్టి పరిస్థితులలోనూ అంగీకరించ బోదని, అటువంటి షరతు వస్తే యుద్ధాన్ని కొనసాగించగలదని, అపుడు అమెరికా కూటమి ఎంత సహాయం చేసినా రష్యా మరిన్ని భూభాగాలు ఆక్రమిస్తూ పోగలదని, ఉక్రెయిన్ పక్షాన తాము ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనే అవకాశం లేదని వారికి తెలుసు. తామూ, అమె రికా ఇప్పటికే ఎంత ఆధునిక ఆయుధాలనిచ్చినా రష్యాను ఉక్రెయిన్ నిలువరించలేక పోతున్నది. ఇప్పటికే రష్యా ఆక్రమణలో గల ప్రాంతా లను, క్రిమియాను వదులుకునేందుకు జెలెన్స్కీ సిద్ధంగా ఉన్న సూచనలున్నాయి. కానీ, రష్యా డిమాండ్ చేస్తున్నట్లు డోన్ బాస్ ప్రాంతం యావత్తునూ వదిలేందుకు ససేమిరా అంగీకరించక పోవచ్చు. అట్లాగే, తాము నాటోలో ఎన్నటికీ చేరక పోవటాన్ని.ఇందుకు బహుశా ట్రంప్ కూడా సమ్మతించకపోవచ్చు.ట్రంప్ గెలుపుతో కొత్త చిక్కులు!అమెరికా, యూరప్లకు కూడా కొన్ని ఆందోళనలున్నాయి. సోవి యట్ యూనియన్ పతనం తర్వాత 10–15 సంవత్సరాలకు తమ అపారమైన సహజ వనరుల బలంతో పుతిన్ నాయకత్వాన తిరిగి పుంజుకోవటం ప్రారంభించిన రష్యా.. చైనా, ఇండియా తదితర అనేక దేశాలతో మైత్రీ సంబంధాల అభివృద్ధితో ఆర్థికంగా, ఆయుధ బలం రీత్యా ఈసరికి శక్తిమంతంగా మారింది. అటువంటి స్థితిలో పుతిన్ ఉక్రెయిన్తో ఆగక తమకు కూడా సవాలుగా మారగలరన్నది అమెరికా, యూరప్ల సందేహం. అందువల్ల రష్యాను ఉక్రెయిన్ యుద్ధంలో ఓడించదలచారు గానీ అదీ సాధ్యం కాదని ఆంక్షల వైఫ ల్యంతో, తమ ఆయుధాల వైఫల్యంతో అర్థమైంది. అందుకే ఇపుడు రాజీ ప్రయత్నాలను సమర్థిస్తున్నారు. అనూహ్యంగా ట్రంప్ గెలుపు వారికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. రష్యా పట్ల కొంత మెతకదనం కలవాడనే పేరు తన మొదటి హయాంలోనూ కలిగి ఉండిన ఆయన, ప్రస్తుత యుద్ధం వల్ల అందరికీ నష్టమేనంటూ అసలు యుద్ధాన్నే వ్యతిరేకించారు. జెలెన్స్కీ వైఖరిని విమర్శించి ఆయన వాదనలను కొట్టివేశారు. ఉక్రెయిన్కు బైడెన్ ప్రభుత్వం ఆయుధాలు, నిధులు ఇవ్వటాన్ని తప్పుపట్టారు. అంతటితో ఆగక నాటోను, యూరో పియన్ యూనియన్ను సైతం వేర్వేరు విషయాలపై తప్పుపట్టడం మొదలు పెట్టారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) అనే తన నినాదానికి అనుగుణంగా ఫ్రాన్స్, జర్మనీ, కెనడా వంటి దేశాల నుంచి దిగుమతులపై సుంకాలు పెట్టించగలమని ప్రకటించారు. ఐరోపా దేశాలకు అమెరికా భయం!ఈ మార్పులను గమనించి, ఉక్రెయిన్ సందర్భంలోనే గాక ఇతరత్రా కూడా జంకిన యూరప్ నేతలు ట్రంప్కు నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికల ప్రచార సమయంలోనే కీడెంచి మేలెంచమన్నట్లు, ట్రంప్ రాక తర్వాత అమెరికా భాగస్వామ్యం పరిమితమైనప్పటికీ ఉక్రెయిన్కు సైనిక, ఆర్థిక సహాయాలు అదే స్థాయిలో కొనసాగించాలని తీర్మానాలు చేశారు. కానీ, తమ సైనిక, ఆర్థిక శక్తి రెండూ క్రమంగా బలహీన పడుతున్నందున అది సాధ్యం కాదని గ్రహించి రాజీ ఆలోచనలు మొదలు పెట్టారు. పాశ్చాత్య దేశాల నుంచి ఇప్పటికి ఉక్రెయిన్కు సుమారు 130 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందగా అందులో సగం అమెరికాదే. ఆయుధాలతో పాటు ఆర్థిక సహాయాన్ని ట్రంప్ నిలిపివేస్తే ఉక్రెయిన్ అక్షరాలా కుప్పకూలుతుంది. ఇది యూరోపియన్ దేశాలను భయపెడుతున్న అతి పెద్ద విషయం. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు, ఉభయుల మధ్య రాజీని కుదర్చటం కెల్లోగ్కు సమస్య కాబోదు. బేరసారాలకు ఇరు దేశాల ఎత్తుగడపోతే, పరిస్థితులు తనకు ప్రతికూలంగా మారే అవకాశా లున్నట్లు అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రచార సమయంలోనే అను మానించిన జెలెన్స్కీ రష్యాతో చర్చల సమయంలో పై చేయి సాధించలేక పోయినా కనీసం సమ ఉజ్జీ అయేందుకు కొన్ని ఎత్తుగడలను అనుసరించారు. తూర్పున విశాలమైన భూభాగాలను ఆక్రమించిన రష్యా, పోక్రొవ్ స్కీ అనే కీలకమైన నగరంపై దృష్టి కేంద్రీకరించింది. దానిని ఆక్రమిస్తే, ఆ మొత్తం ప్రాంతానికి గుండెకాయ వంటి కూడలి కేంద్రం తన అధీనమై ఉక్రెయిన్ తీవ్రంగా బలహీనపడుతుంది. ప్రస్తుతం ఆ నగరానికి కొద్ది కిలోమీటర్ల దూరానికి చేరిన రష్యన్ సేనలు, చర్చల లోగా దాని స్వాధీనానికి భీకర యుద్ధం సాగిస్తు న్నాయి. ఉక్రెయిన్ ఆ నగర రక్షణకు పోరాడుతూనే, రష్యాతో ఉత్తర సరిహద్దున గల కుర్స్క్ ప్రాంతంలోకి అకస్మాత్తుగా చొచ్చుకు పోయింది. చర్చలు జరిగినపుడు ఈ రెండు నగరాలు బేరసారాల కోసం ఉపయోగపడాలన్నది ఇరువురి ఎత్తుగడ. ఇటువంటి చివరి దశ యుద్ధ క్రీడలే మరికొన్ని సాగుతున్నాయి. రష్యా ఉత్తర కొరియన్ సేనలను రప్పించటం, ఉక్రెయిన్ యూరప్ సహాయంతో తన రాజ కీయ బేరసారాల శక్తిని పెంచుకోజూడటం, రష్యా పైకి దీర్ఘ శ్రేణి క్షిపణుల ప్రయోగం వంటివన్నీ అవే. మొత్తానికి ఈ చివరి దశ క్రీడ లకు జనవరి చివరిలోగా కొద్ది సమయమే మిగిలి ఉంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
రష్యా యుద్ధంలో భారతీయుడు మృతి.. కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య పోరు కారణంగా పలువురు మృత్యువాత పడుతున్నారు. తాజాగా రష్యా తరఫున యుద్దంలో పాల్గొన్న భారతీయుడు మృతిచెందడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ క్రమంలో భారతీయుడి మృతిని దేశ విదేశాంగశాఖ తీవ్రంగా పరిగణించింది. దీంతో, రష్యా యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది.ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో రష్యాకు మద్దతుగా యుద్ధం చేస్తున్న కేరళకు చెందిన బినిల్ బాబు(32) మృతిచెందాడు. అలాగే, అతడి సమీప బంధువు టీకే జైన్ (27)కు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో బినిల్ చనిపోయిన విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసిందని అతడి బంధువులు మీడియాతో చెప్పారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ క్రమంలో భారతీయుడి మృతిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.రష్యాకు మద్దతుగా యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది. ఈ విషయాన్ని మాస్కోలోని రష్యన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపింది. అలాగే, ఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయం అధికారులతోనూ మాట్లాడినట్టు స్పష్టం చేసింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మిగిలిన భారతీయులను అక్కడి నుంచి పంపించాలని కోరినట్టు ప్రకటన విడుదల చేసింది.మరోవైపు.. ఈ ఘటనపై కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. ‘మాస్కోలోని భారత రాయబార కార్యాలయం మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోంది. మృతదేహాన్ని త్వరగా భారత్కు రప్పించేందుకు రష్యన్ అధికారులతో మాట్లాడుతున్నాం. గాయపడిన జైన్ను కూడా విడుదల చేసి, ఇండియాకు పంపించాలని కోరాం’ అని వెల్లడించారు. -
సైనికుల్ని మార్చుకుందాం
కీవ్: నిర్బంధంలో ఉన్న సైనికులను మార్చుకుందామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యాకు ప్రతిపాదించారు. రష్యా నిర్బంధంలోని తమ సైనికులను వదిలేస్తే పట్టుబడ్డ ఉత్తర కొరియా సైనికులను ఆ దేశానికి అప్పగించేందుకు సంసిద్ధత వెలిబుచ్చారు. ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను పట్టుకున్నామన్న ఉక్రెయిన్ ప్రకటనను దక్షిణ కొరియా ధ్రువీకరించడం తెలిసిందే. ‘‘మా దగ్గర మరింతమంది కొరియా సైనికులున్నారు. రష్యా పట్టుకున్న మా సైనికులను అప్పగిస్తే ఉత్తర కొరియాకు వారి సైనికులను అప్పగించడానికి సిద్ధం’’అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధాన్ని గురించిన వాస్తవాలను బయట పెట్టేవారికి, శాంతి స్థాపనకు ప్రయత్నించే వారికి అవకాశం కల్పిస్తామన్నారు. బెడ్పై పడుకొన్న, దవడకు బ్యాండేజ్తో మంచంపై కూర్చున్న ఇద్దరు ఉత్తర కొరియా యుద్ధ ఖైదీల వీడియోను పోస్ట్ చేశారు. అందులో అనువాదకుల సహాయంతో జెలెన్స్కీ వారితో మాట్లాడుతూ కన్పించారు. ‘‘ఉక్రెయిన్తో పోరాడతామని నాకు తెలియదు. శిక్షణ మాత్రమేనని మా కమాండర్లు చెప్పారు’’అని ఆ సైనికులు చెప్పుకొచ్చారు. వారిలో ఒకరు ఉత్తరకొరియా తిరిగి వెళ్లాలని భావిస్తుండగా, అవకాశమిస్తే ఉక్రెయిన్లోనే ఉండిపోతానని రెండో సైనికుడు చెప్పాడు. 2022లో ఉక్రెయిన్పై దాడి మొదలైనప్పటి నుంచి రష్యా, ఉత్తర కొరియా సైనిక సహకారాన్ని పెంచుకుంటున్నాయి. రష్యాకు దన్నుగా ఉత్తర కొరియా ఇప్పటికే 10,000 మందికి పైగా సైనికులను పంపిందని ఉక్రెయిన్, అమెరికా, దక్షిణ కొరియా ఆరోపించాయి. దీన్ని ఆ దేశాలు కొట్టిపారేశాయి. కానీ రష్యా సైన్యం ఉత్తర కొరియా సైనిక సాయంపైనే ఆధారపడి ఉందనడంలో సందేహం లేదని జెలెన్స్కీ అన్నారు. -
ఈ ఏడాది మన ముందున్న సవాళ్లు
గత సంవత్సరం రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 11,973 మంది పౌరులు మరణించారు; ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో పిల్లలతో సహా 45,000 మంది చనిపోయారు. మానవ జాతి చరిత్రలోనే 2024 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. రికార్డు స్థాయిలో చలికాలం కూడా మొదలైంది. కృత్రిమ మేధ అబద్ధాలు చెప్పగలదనీ, కాబట్టి అది ప్రాణాంతకమనీ యువల్ నోవా హరారీ లాంటి మేధావులు నొక్కి చెబుతున్నారు. మానవ జాతి అంతం కోసం సైన్స్ సృష్టించిన రాక్షసి ఏఐ కానుందనే భయాందోళనలు కలుగుతున్నాయి. ఈ కొత్త సంవత్సరం ఎదుర్కోవాల్సిన ప్రధాన సవాళ్లు ఇవే. యుద్ధాలు, వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధ విపరిణామం నుంచి ఎదురయ్యే సమస్యలను ప్రపంచ నాయకులు పరిష్కరించాల్సిన అవసరం ఉంది.నూతన సంవత్సరం రోజున కొన్ని పతాక శీర్షికలను చూద్దాం. అమెరికాలోని న్యూ ఓర్లి యన్స్లో సంబరాల్లో మునిగి తేలుతున్న వారిమీదికి ఓ ఉగ్రవాది బండిని నడిపించి 15 మంది చనిపోవడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత డ్రైవర్ షంషుద్దీన్ జబ్బార్ ఆ గుంపుపై కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు అతడిని హతమార్చారు. ఒకప్పుడు జబ్బార్ అమెరికన్ సైన్యంలో పనిచేశాడు. జరగనున్న ఉపద్రవ సంకేతాలను పసిగట్టడంలో ఇది అమెరికన్ నిఘా ఏజెన్సీల వైఫల్యమేనని చెప్పాలి. అతడికి నేరమయమైన గతం ఉంది. అయినా కఠినమైన భద్రతా తనిఖీ నుంచి తప్పించుకున్నాడు. ఈ నిర్లక్ష్యానికి అమాయకులైన అమెరికన్ పౌరులు మూల్యం చెల్లించారు.ఈ విషాదం అక్కడితో ముగిసిపోలేదు. న్యూ ఓర్లియన్స్ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే లాస్ వెగాస్లోని ట్రంప్ హోటల్ ముందు ఒక ట్రక్కు పేలింది. ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే, ఒక పాదచారి మరణానికి కారణమైన ఆ ట్రక్కు, అమెరికన్ అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ సన్నిహత సహచరుడు ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా ఫ్యాక్టరీలో తయారైనది. ఇక మూడో ఘటన న్యూయార్క్లోని క్వీన్స్ బరోలో చోటుచేసుకుంది. అక్కడ నైట్ క్లబ్లో జరిగిన కాల్పుల ఘటనలో 11 మంది గాయపడ్డారు. ఈ ఘటనలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యాసాన్ని రాసే సమయానికి అమెరికన్ పోలీసులు వాటిని స్పష్టమైన ఉగ్రవాద చర్యలుగా పేర్కొనలేదు. కానైతే ఈ వరుస ఘటనలు అమెరికన్ సమాజంలో పెరుగుతున్న అశాంతిని మరోసారి వెలుగులోకి తెచ్చాయి.ఈ మూడు ఘటనలే కాకుండా, ఇతర ప్రాంతాలలో జరిగిన మరో రెండు, మన ప్రపంచంలో దీర్ఘకాలిక ప్రతికూల పరిణామాలు జరగనున్నట్లు చెబుతున్నాయి. అవేమిటంటే, నూతన సంవత్సరం రాత్రి పూట, గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసి 12 మందిని చంపేసింది. రెండవ ఘటనలో, గ్యాస్ పైప్లైన్ను స్వాధీనం చేసు కున్న ఉక్రెయిన్, రష్యా నుండి మిగిలిన యూరప్కు గ్యాస్ సరఫరాను నిలిపివేసింది. ఇది రష్యన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. ఈ సమయంలో ఎముకలు కొరికే చలిని ఎదుర్కొనే యూరప్పై దాని ప్రభావం మాటేమిటి?ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనున్న డోనాల్డ్ ట్రంప్ కోసం ముళ్ల కిరీటం ఎదురుచూస్తోంది. ట్రంప్ అంతర్జాతీయంగానే కాకుండా, దేశీయ రంగాలలో కూడా సవాళ్లతో పోరాడవలసి ఉంటుంది. న్యూ ఓర్లియన్స్, న్యూయార్క్, లాస్ వెగాస్ ఘటనలు మరోసారి అమెరికా అజేయం అనే భావనను దాని లోపలి నుండే ఛేదించవచ్చని స్పష్టంగా చెప్పాయి. అలాంటి పరిస్థితుల్లో, ఇజ్రాయెల్–హమాస్, రష్యా–ఉక్రెయిన్ వివాదాన్ని ట్రంప్ సంతృప్తికరంగా ఎలా పరిష్కరించగలరు?నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న రష్యా–ఉక్రె యిన్ సైనిక ఘర్షణ రష్యా సైనిక శక్తిపై, దాని ఆధిపత్యంపై సందేహా లను రేకెత్తిస్తోంది. బలమైన నాయకుడైన వ్లాదిమిర్ పుతిన్ సైనిక శక్తిలో కూడా బలహీనతలు ఉన్నాయని గత మూడేళ్ల పరిణామాలు చూపిస్తున్నాయి. ఆయన పెంచుకున్న ప్రతిష్ఠకూ, సంవత్సరాలుగా ఆయన శ్రద్ధగా నిర్మించుకున్న ఖ్యాతికీ బీటలు వారుతున్నాయి. పతనమవుతున్న ఏకఛత్రాధిపతి ఇతరులను నాశనం చేయడానికి ఉన్న ప్రతి కిటుకునూ ఉపయోగిస్తాడనే వాస్తవానికి చరిత్ర సాక్ష్యంగా ఉంది. గ్యాస్ పైప్లైన్ స్వాధీన ఘటన జరిగినప్పటి నుండి, పుతిన్ తొందరపాటు నిర్ణయం తీసుకునే అవకాశం గురించి ఆందోళన కలుగుతోంది.అంటే 2025 సంవత్సరానికి ఉన్న ముఖ్యమైన ప్రాధాన్యత యుద్ధాలను ఆపడమేనా? ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన మానవ హక్కుల గణాంకా లను చూస్తే, యుద్ధాలు మానవాళిని ఎలా రక్తమోడిస్తున్నాయో స్పష్టంగా తెలుస్తుంది. ఆ డేటా ప్రకారం, 2024 జనవరి నుండి అక్టోబర్ 21 వరకు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 622 మంది పిల్లలతో సహా కనీసం 11,973 మంది పౌరులు మరణించారు. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనల ప్రకారం, ఇజ్రా యెల్–హమాస్ యుద్ధంలో గత 14 నెలల్లో 17,000 మంది పిల్లలతో సహా 45,000 మంది చనిపోయారు.ఇప్పుడు మానవ జాతి ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య అయిన వాతావరణ సంక్షోభాన్ని చూద్దాం. మానవ జాతి చరిత్రలో 2024 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. వాతా వరణ సదస్సు విఫలమైనప్పటి నుండి, వాతావరణ చర్యలపై ఏకాభిప్రాయానికి రాబోయే సంవత్సరాల్లో సవాళ్లు తీవ్రమవుతా యనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో చలి కాలం ప్రారంభమవడం కూడా దీనికి సూచన. ఈ సవాలును మరింతగా ఎదుర్కొనే ప్రయత్నాన్ని ట్రంప్ గెలుపు బలహీనపరుస్తుంది. వాతా వరణ సంక్షోభంపై ఆయనకున్న తీవ్రమైన అభిప్రాయాలు అందరికీ తెలిసినవే.మన దృష్టిని ఆకర్షించిన మరో సమస్య ఆర్టిఫిషియల్ ఇంటె లిజెన్స్. కృత్రిమ మేధ బలాలు, నష్టాల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ రచయిత, జెరూసలేం హీబ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ యువల్ నోవా హరారీ కొన్ని సందర్భోచి తమైన ప్రశ్నలను లేవనెత్తారు. కృత్రిమ మేధ అబద్ధం చెప్పగలదని ఆయన నొక్కి చెప్పారు. చాట్జీపీటీ4ని ఓపెన్ ఏఐ ప్రారంభించి నప్పుడు, దాని సామర్థ్యాన్ని పరీక్షించడానికి ‘కాప్చా’ను పరిష్కరించమని వారు కోరినట్లు హరారీ సోదాహరణ పూర్వకంగా తెలిపారు. అయితే చాట్జీపీటీ4, ఆ కాప్చాను పరిష్కరించలేక పోయింది. తర్వాత దాన్ని టాస్క్రాబిట్ అనే వెబ్ పేజీకి యాక్సెస్ ఇచ్చారు. కాప్చాను ఛేదించే పనిని చాట్జీపీటీ4 ఔట్సోర్స్ చేసి, సర్వీస్ ప్రొవైడర్కు తనకు సరిగ్గా కళ్లు కనబడవనీ(మనిషి లాగే), తనకోసం చేసిపెట్టమనీ అడిగింది. దాంతో అల్గోరిథమ్ను రూపొందించిన ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. కృత్రిమ మేధ అబద్ధాలు చెప్పడం ఎలా నేర్చుకుందో వారు అర్థం చేసుకోలేకపోయారు.హరారీ, ఇతర ప్రజా మేధావులు కృత్రిమ మేధ పాత్రను ప్రశ్నించడానికి ఇదే కారణం. ఇది మానవులు రూపొందించిన స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల మొదటి సాధనం. కాబట్టి కృత్రిమ మేధ ప్రాణాంతకం అని వారు నొక్కిచెబుతున్నారు.దురుద్దేశాలు ఉన్న వ్యక్తులు కృత్రిమ మేధను దుర్వినియోగం చేస్తారనడంలో సందేహమే లేదు. 2024 సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి 21న, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వరాన్ని క్లోన్ చేయడానికి కృత్రిమ మేధను ఉపయోగించారు. దానిద్వారా న్యూ హాంప్షైర్ రాష్ట్రంలోని ఓటర్లకు వేలకొద్దీ ఆటోమేటెడ్ కాల్స్ చేశారు. ఈ ఆపరేషన్ను చేపట్టిన లింగో టెలికాం కంపెనీకి తర్వాత 1 మిలియన్ అమెరికన్ డాలర్ల జరిమానా పడింది. భారతదేశంలో కూడా, నటి రష్మిక మందాన ఫొటోను మార్ఫింగ్ చేసిన ఉదంతాన్ని చూశాం. ప్రశ్న ఏమిటంటే, మానవ జాతి అంతం కోసం సైన్స్ ఒక రాక్షసిని సృష్టించిందా?మానవాళికి ముప్పు కలిగించే యుద్ధాలు, వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధ అనే మూడు సవాళ్లపై 2025 సంవత్సరం ఒక ఏకాభిప్రాయాన్ని సాధించగలదా?శశి శేఖర్ వ్యాసకర్త ‘హిందుస్థాన్’ ప్రధాన సంపాదకుడు(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
యూరప్లో శాంతి తక్షణావసరం
ఒకప్పుడు ఉక్రెయిన్ తుది విజయం వరకూ మద్దతునిద్దామనే పశ్చిమ దేశాల ప్రజల అభిప్రాయం ఇప్పుడు క్రమేపీ తగ్గుతోంది. యూగోవ్ సర్వే సంస్థ తాజాగా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, స్వీడన్, డెన్మార్క్, యూకేలలో ప్రజాభి ప్రాయాన్ని సేకరించింది. ఈ ఏడు దేశాల ప్రజలు సంవత్సరం క్రితం ఇచ్చిన మద్దతుకు కట్టుబడి లేరు. ఉక్రెయిన్కు మద్దతునిచ్చే వారి సంఖ్య స్వీడన్లో 57 శాతం నుంచి 50 శాతానికి, యూకేలో 50 శాతం నుంచి 36 శాతానికి, డెన్మార్క్లో 51 శాతం నుంచి 40 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో శాంతి చర్చల ద్వారా ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం వెతకాలనే వారి సంఖ్య ఇటలీలో 45 శాతం నుంచి 55 శాతానికి, స్పెయిన్లో 38 నుంచి 46 శాతా నికి, ఫ్రాన్స్లో 35 నుంచి 43 శాతానికి, జర్మనీలో 38 నుంచి 45 శాతానికి పెరిగింది. జనవరి 20 నాడు అమెరికా అధ్యక్ష అధికార పగ్గాలు చేపట్టనున్న ట్రంప్ ఉక్రెయిన్కు మద్దతు ఉప సంహరించుకొనే అవకాశాలు ఉన్నాయని 62 శాతం జర్మనీ ప్రజలు, 60 శాతం స్పెయిన్ వాసులు, 56 శాతం బ్రిటన్ ప్రజలు, 52 శాతం ఫ్రెంచ్ జనాలు అభిప్రాయ పడ్తున్నారని యూగోవ్ వెల్లడించింది.ఉక్రెయిన్ – రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమై మూడేళ్లు నిండనున్నాయి. ఆర్థిక ఆంక్షలతో రష్యాను అదుపులోకి తెచ్చుకోవచ్చునని రష్యాపై ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాల అంచనాలకు విరుద్ధంగా రష్యా చమురు వాణిజ్యంతో ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగానే ఉంచుకొంది. రష్యాపై ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాలే ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాల్లో ద్రవ్యోల్భణం, నిరుద్యోగం పెరుగుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో ఫ్రాన్స్, జర్మనీ, యూకే, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ప్రభుత్వాలు పతనమైపోతు న్నాయి. డిసెంబర్ ప్రారంభంలో ఫ్రెంచ్ ప్రధాని మైకెల్ బార్నియర్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో నెగ్గలేక కూలిపోయింది. జర్మన్ ఛాన్సలర్ షోల్జ్ తన ఆర్థిక మంత్రిని బర్తరఫ్ చేయటంతో 3 సంవత్సరాల సోషల్ డెమాక్రాట్స్–గ్రీన్స్–ఫ్రీ డెమాక్రటిక్ పార్టీల కూటమి ప్రభుత్వం పడిపోయింది. ఓక్స్ వాగెన్, ఆడీ వంటి అనేక కార్ల కంపెనీలు మూత పడుతున్నాయి. దీనికి తోడు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్కు జర్మనీ మద్దతు కూడా జర్మనీ ప్రజలు స్వాగతించటం లేదు.బ్రిటన్లో 22 నెలలు ఏలిన కన్సర్వేటివ్ ప్రధాని రిషి సునాక్ రాజీనామా చేసి ఎన్నికలకు పిలుపునివ్వగా లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. దక్షిణ కొరియాలో అధ్యక్షుడు యూన్ సుక్ అవినీతి ఊబిలో కూరుకుపోయి, నేషనల్ అసెంబ్లీ తీర్మానాలను తన వీటో ద్వారా నిరోధించటంతో జనాగ్రహానికి గురై రాజీనామా చేయక తప్పలేదు. పశ్చిమాసియాలో గాజాపై యుద్ధం చేయిస్తూ 50 వేల వరకూ సామాన్య ప్రజల్ని చంపిన ఇజ్రాయెల్కు మద్దతు పలికిన అమెరికా అధ్య క్షుడు జో బైడెన్ ట్రంప్ చేతిలో ఓటమి చెందారు. 2023లో ఉక్రెయిన్ విషయంలో బైడెన్ తప్పుడు నిర్ణయం తీసుకొన్నారని అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్ బహిరంగంగానే ప్రకటించారు. సుదీర్ఘ కాలం పాటు యుద్ధం జరిగేలా చేసి... రష్యా, ఉక్రెయిన్ ప్రజలు ఒకరినొకరు చంపుకునేలా చూడటమే పశ్చిమ దేశాల లక్ష్యంగా ఉంది. అమెరికా ప్రత్యర్థి రష్యాను బలహీన పర్చటమే తమ ధ్యేయమని, అన్ని రంగాలలో నిర్వీర్యం చేస్తామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇప్ప టికే అనేకసార్లు ప్రకటించారు. రష్యాతో నాటో దేశాలు దౌత్య సంబంధాల్ని తెగతెంపులు చేసుకొన్నాయి. రష్యా సంపదను కొల్లగొట్టి దేశాన్ని ముక్కలు ముక్కలు చేయటమే అమెరికా ధ్యేయం.యుద్ధం ప్రారంభంలో శాంతి ఒప్పందాలకు ఉక్రె యిన్–రష్యాలు అంగీకరించాయని టర్కీ, ఇజ్రాయిల్ తెలిపాయి. రష్యా యుద్ధం విరమిస్తే, ఉక్రెయిన్ తటస్థ దేశంగా నాటో సభ్యత్వాన్ని కోరదనేది సారాంశం. అయితే అప్పటి యూకే ప్రధాని జాన్సన్ ఆఘ మేఘా లపై కీవ్ వెళ్లి ఉక్రెయిన్ ఆధ్యక్షుడు జెలెన్స్కీని ఒప్పందానికి దూరంగా ఉంచగలిగాడు. 9 ఏళ్ల క్రితం జరిగిన మిన్స్కు ఒప్పందాన్ని పశ్చిమ దేశాలు ఎప్పుడూ గౌర వించలేదు. ఉక్రెయిన్ మిలిటరీ పరంగా బలం పుంజు కోటానికే మిన్స్కు ఒప్పందాన్ని ఎర వేశామని సాక్షాత్తు ఒకప్పటి జర్మనీ ఛాన్సలర్ మెర్కల్ ప్రకటించారు కూడా. ఫ్రాన్స్ కూడా ఈ ఒప్పందానికి కట్టుబడి లేమని ఒప్పుకొంది. నాటో దేశాలు యుద్ధానికే మొగ్గు చూపా యని టర్కీ విదేశాంగ మంత్రి, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని కూడ తెలియజేశారు. లిండేగ్రాహం వంటి అమె రికా కాంగ్రెస్ సభ్యుడు ‘చివరి ఉక్రేనియన్’ వరకూ రష్యాతో పోరాటానికి బహిరంగ మద్దతు ఉంటుందని, ‘అమెరికా ప్రాణాలను పణంగా పెట్టకుండా ఉక్రెయి న్కు ఆయుధ సహాయం చేయటం అమెరికా ‘తెలివైన పెట్టుబడి’ అని అన్నారు.ఉక్రెయిన్లో ఏ ప్రాంత ప్రజలు కూడా నిరంతర యుద్ధానికి మద్దతు పలకటం లేదు. ఒకప్పుడు ఉక్రెయిన్ నాయకుల విజయంపై ఉన్న ఆశలను నేడు క్రమేపీ వదులుకొంటున్నారు. తాజా సర్వేల్లో ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీపై భ్రమల్ని ప్రజలు వదులుకుంటున్నారు. ఉక్రెయిన్ ఫ్రంట్లైన్లు కుప్పకూలిపోతున్నాయి. నాటో భౌగోళిక విస్తరణకు ఉక్రెయిన్ భారీ మూల్యం చెల్లిస్తున్నది. సంఘర్షణ ఎంత ఎక్కువ కాలం కొనసాగితే ఉక్రెయిన్ ప్రజలు మరిన్ని ప్రాణ నష్టాలతో, ఆర్థిక నష్టాలతో అంత ఎక్కువ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఈ స్పష్టతతో పశ్చిమ దేశాల వ్యూహం భవి ష్యత్తులో విఫలమవుతుంది. రష్యాపై ఉక్రెయిన్ శత్రు వైఖరిని విడిచిపెట్టినప్పుడు మాత్రమే యుద్ధం ముగు స్తుంది. రష్యా కూడా శాంతి మార్గాలు వెతకాలి.బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్,కేఎల్ యూనివర్సిటీ ‘ 98494 91969 -
ఉక్రెయిన్ డ్రోన్ దాడి..రష్యా జర్నలిస్టు మృతి
మాస్కో: ఉక్రెయిన్(Ukraine) చేసిన డ్రోన్ దాడిలో తమ జర్నలిస్టు అలెగ్జాండర్ మరణించారని రష్యా(Russia)కు చెందిన మీడియా సంస్థ ఇజ్వెస్టియా తెలిపింది. డోనెస్క్ ప్రాంతంలో హైవేపై కారులో వెళుతుండగా అలెగ్జాండర్పై ఉక్రెయిన్ డ్రోన్తో దాడి చేసినట్లు వెల్లడించింది. ఈ దాడిలో అలెగ్జాండర్తో పాటు మరో న్యూస్ ఏజెన్సీకి చెందిన ఇద్దరు జర్నలిస్టులు గాయపడ్డారు. ఇది కావాలని చేసిన దాడేనని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఓ ప్రకటనలో తెలిపారు. ఇది జెలెన్స్కీ ప్రభుత్వం చేసిన మరో దారుణ హత్య అని మండిపడ్డారు. ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 15 మంది రష్యా జర్నలిస్టులు హత్యకు గురయ్యారని జర్నలిస్టుల పరిరక్షణ కమిటీ తన నివేదికలో తెలిపింది.2022 ఫిబ్రవరిలో మెదలైన రష్యా,ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ యుద్ధం కొత్త ఏడాదిలో ముగుస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవలే ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ ఈ యుద్ధం విషయంలో ఏం చర్యలు తీసుకుంటారన్నది కీలకంగా మారింది. -
యుద్ధభూమిలో రక్తమోడుతున్న రష్యా
గుడ్లురిమి చూస్తూ పొరుగుదేశం ఉక్రెయిన్పైకి దురాక్రమణ జెండాతో దూసుకొచ్చిన రష్యా ఇప్పుడు యుద్ధభూమిలో నెత్తురోడుతోంది. రష్యా సేనలు రక్తమోడుతున్నా పుతిన్ పటాలానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని యుద్ధ విశ్లేషకులు తాజాగా ప్రకటించారు. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా దళాలు 2024 సంవత్సరంలో భారీ మూల్యం చెల్లించుకున్నాయని, ఏకంగా 4,30,790 మంది రష్యా సైనికులు అంటే రోజుకు 1,180 మంది సైనికులు రణక్షేత్రంలో ప్రాణాలు పోగొట్టుకున్నారని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే యుద్ధరంగ మేథోసంస్థ ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్’తాజాగా వెల్లడించింది. యుద్ధం మొదలవడానికి ముందు, ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లోని వీడియో ఫుటేజీలు, భౌగోళిక మార్పులకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను విశ్లేషించి సంస్థ ఈ అంచనాకు వచ్చింది. గత ఏడాది ఒక్క నవంబర్ నెలలోనే 45,720 మంది రష్యా సైనికులు చనిపోయారు. డిసెంబర్లో ఏకంగా 48,670 మంది మృతిచెందారని సంస్థ పేర్కొంది. ‘‘యుద్ధం మొదలైననాటి నుంచి చూస్తే దురాక్రమణకు గతేడాది రష్యా సైన్యం భారీ మూల్యం చెల్లించుకుంది. రష్యా ఆయుధాలు, డ్రోన్లు, యుద్ధట్యాంక్లు, సైనికులను అంతంచేశాం’’అని ఉక్రెయిన్ కమాండర్ ఇన్ చీఫ్ ఒలెస్కాండర్ సిరిస్కీ చెప్పారు. కొన్ని గ్రామాల నుంచి తిరుగుముఖం గత ఏడాది తూర్పు ఉక్రెయిన్లోని డోనెట్స్క్ ప్రాంతంలోని 4,168 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని భూభాగాన్ని రష్యా ఆక్రమించు కుంది. అయితే ఉక్రెయిన్ బలగాల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో కొన్ని గ్రామాల నుంచి రష్యా సేనలు వెనుతిరిగాయి. ఈ గ్రామాల విస్తీర్ణం ఉక్రెయిన్ మొత్తం విస్తీర్ణంలో 0.69 శాతం ఉండటం గమనార్హం. 31,000 జనాభా ఉన్న కురకోవ్తోపాటు అవ్దీవ్కా, సెలిడోవ్, వులేదార్లు రష్యా వశమయ్యాయి. అవ్దీవ్కాను ఆక్రమించడానికి రష్యా చెమటోడ్చింది. అవ్దీవ్కా ఆక్రమణకు రష్యాకు నాలుగు నెలలు, సెలిడోవ్, కురకోవ్ల ఆక్రమణకు రెండు నెలల సమయం పట్టింది. ఇంతచేసినా వీటి గుండా మరింతగా ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చు కుపోయే అవకాశం రష్యాకు దక్కలేదు. ఇంత నెమ్మదిగా ముందుకు సాగుతున్న రష్యాకు ఒక్క డోనెట్స్క్ ఆక్రమణకే మరో రెండు సంవత్సరాల సమయం పట్టొచ్చు. ఈ లెక్కన మొత్తం ఉక్రేయిన్పై ఆధిపత్యం సాధించాలంటే ఇంకెంత కాలంపడుతుందో మరి. రోజుకు 28 చదరపు కి.మీ.ల ఆక్రమణ గత ఏడాది నవంబర్లో అధిక సైన్యంతో రష్యా ఆక్రమణ స్థాయిని పెంచింది. దీంతో అక్టోబర్లో రోజుకు 14 చదరపు కి.మీ.లుగా ఉన్న ఆక్రమణ స్థాయి నవంబర్కొచ్చేసరికి రెట్టింపైంది. అంటే రోజుకు 28 చదరపు కి.మీ.లకు పెరిగింది. అయితే డిసెంబర్లో ఉక్రెయిన్ సేనల ప్రతిఘటన పెరగడంతో రష్యా బలగాలు కాస్తంత నెమ్మదించి రోజుకు 18 చదరపు కి.మీ.ల స్థాయిలోనే ఆక్రమించుకోవడడం మొదలెట్టాయి. అయినాసరే డిసెంబర్ 29వ నాటికి లెక్కేస్తే ఏకంగా 2,100 మంది రష్యా సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ పేర్కొంది. డిసెంబర్ 19వ తేదీన 191 చోట్ల భీకర యుద్ధం జరిగిందని ఒలెక్సాండర్ చెప్పారు. వేల సైనిక వాహనాలు ధ్వంసం రష్యాకు చెందిన వేల సైనిక వాహనాలను ఉక్రెయిన్ ధ్వంసంచేసింది. 3,689 యుద్ధట్యాంక్లను పేల్చేసింది. 13,000 యుద్ధట్యాంక్ మందుగుండును నాశనంచేసింది. ‘‘సముద్రజలాల్లో ఐదు రష్యా యుద్ధనౌకలను దాడిచేసి ముంచేశాం. 458 చిన్నపాటి యుద్ధ పడవలను పేల్చేశాం’’అని ఉక్రెయిన్ నేవీ విభాగం తెలిపింది. ‘‘మిత్రదేశం ఉత్తరకొరియా నుంచి రప్పించిన సైనికులను రణరంగంలోకి పంపినా లాభంలేకుండా పోయింది. ఉ.కొరియా సైనికుల్లో పావు శాతం మంది ప్రాణంతీశాం. ఒక్క కురŠస్క్ రీజియన్లో 3,000 మందిని మట్టుబెట్టాం. వారిని సజీవంగా పట్టుకోవడం కుదరట్లేదు. చిక్కే అవకాశమున్న వాళ్లను తోటి రష్యన్లే ముఖాలు కాల్చేసి చంపేస్తున్నారు’’అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల ప్రకటించారు. సైన్యంలోకి మరింతగా జనం ఉపాధి, మెరుగైన జీవనం కోసం అనధికారికంగా రష్యాలోకి చొరబడుతున్న శరణార్థులు, వలసదారులను ఈ ఏడాది ఏప్రిల్కల్లా పంపేస్తానని పుతిన్ చెప్పారు. అయితే రష్యా సైన్యంలో చేరితే మాత్రం వారికి చట్టబద్ధంగా ఇక్కడే ఉండనిస్తామని పుతిన్ ప్రభుత్వం చెబుతోంది. దీంతో సైన్యంలోకి ఎక్కువ మంది చేరుతారని, వాళ్లందర్నీ ఉక్రెయిన్ యుద్దక్షేత్రంలోకి తరలించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. చమురు అమ్మకాలతో వస్తున్న అధిక లాభాలను యుద్దం కోసం రష్యా ఖర్చుచేస్తోంటే, పశ్చిమదేశాలు అందిస్తున్న ఆయుధాలు, ఆర్థికసాయంతో ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడుతోంది. లక్షలాది శ్రామికశక్తి లోటుతో రష్యా ఆర్థికవ్యవస్థ పలచబారుతుంటే, ప్రాణభయంతో కోట్లాది మంది ఉక్రేనియన్లు పోలండ్, హంగేరీ, రొమేనియా, స్లోవేకియా తదితర దేశాలకు వలసపోతూ దేశాన్ని ‘తక్కువజనాభాగల దేశం’గా మార్చేస్తున్నారు. ఇలాంటి యుద్ధం ఇంకెంతకాలం కొనసాగుతుందో మరి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బందీల విడుదల..జెలెన్స్కీ కీలక ట్వీట్
కీవ్:గత ఏడాదిలో తమ దేశానికి చెందిన 1358 మంది సైనికులు,పౌరులు రష్యా నుంచి సురక్షితంగా తిరిగొచ్చారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. వారిని విడిపించేందుకు ఉక్రెయిన్ అధికారులు తీవ్రంగా శ్రమించారని కొనియాడారు. కొత్త ఏడాది 2025లోనూ ఇలాంటి శుభవార్తలు వినాలని ఉందని జెలెన్స్కీ తాజాగా ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టారు.రష్యా వద్ద బందీలుగా ఉన్న తమ సైనికులు,పౌరుల విడుదలలో మిత్ర దేశాల పాత్ర కీలకమని తెలిపారు. రష్యాతో యుద్ధం కూడా ఈ ఏడాది ముగియాలని ఈ సందర్భంగా జెలెన్స్కీ ఆకాంక్షించారు.2022లో ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా,ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది.ఈ యుద్ధంలో ఉక్రెయిన్కు చెందిన 30 వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు.ఉక్రెయిన్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది.In 2024, we managed to bring 1,358 of our people back home to Ukraine from Russian captivity. These are our soldiers and civilians.Their fates are different, but they are equally happy to return home. Each and every one of them for the sake of whom a large Ukrainian team… pic.twitter.com/AxTPYlmYhv— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) January 3, 2025 ఇదీ చదవండి: షినవత్రకు అన్ని ఆస్తులా..? -
బషర్ అసద్పై విష ప్రయోగం?
లండన్: రష్యాలో ఆశ్రయం పొందిన సిరియా పదవీచ్యుత అధ్యక్షుడు బషర్ అసద్(59)పై విష ప్రయోగం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. గత ఆదివారం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు రష్యా మాజీ గూఢచారిగా భావిస్తున్న జనరల్ ఎస్వీఆర్ అనే ఆన్లైన్ ఎకౌంట్లో ఈ విషయం బయటకు పొక్కిందని ‘ది సన్’పేర్కొంది. అసద్కు తీవ్రమైన దగ్గు, ఊపిరాడకపోవడంతో వైద్యం అందించారని తెలిపింది. అసద్పై హత్యా ప్రయత్నం జరిగిందనేందుకు ఇదే ఉదాహరణ అని సన్ పేర్కొంది. డిసెంబర్ మొదటి వారం కుటుంబం సహా వెళ్లిన అసద్ మాస్కోలోని సొంత అపార్టుమెంట్లోనే ఉంటున్నారు. అక్కడే ఆయనకు వైద్యం అందుతోందని, సోమవారానికి పరిస్థితి కుదుటపడిందని సన్ తెలిపింది. -
రష్యాకు ఉక్రెయిన్ గ్యాస్ షాక్
మాస్కో/కీవ్: రష్యా నుంచి చౌకగా గ్యాస్ను సరఫరా చేసుకుంటూ లబ్ధి పొందుతున్న యూరప్ దేశాలకు కొత్త కష్టాలు వచ్చిపడే అవకాశం కనిపిస్తోంది. రష్యా నుంచి తమ భూభాగం నుంచి గ్యాస్ సరఫరాను ఉక్రెయిన్ నిలిపివేసింది. ఈ విషయంలో రష్యాతో కుదిరిన ఐదేళ్ల ఒప్పందం బుధవారం ముగిసింది. ఇకపై తమ భూభాగం నుంచి గ్యాస్ సరఫరాను అనుమతించే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తేల్చిచెప్పారు. ఒకవైపు ఉక్రెయిన్ ప్రజల రక్తాన్ని పీలుస్తూ మరోవైపు అదనపు బిలియన్ డాలర్లు రష్యా సంపాదిస్తామంటే అనుమతించబోమని అన్నారు. మూడేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఇదొక కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఉక్రెయిన్ గుండా ఐరోపా ఖండానికి గ్యాస్ సరఫరా ఆగిపోవడాన్ని రష్యాపై మరో విజయంగా పోలాండ్ ప్రభుత్వం అభివరి్ణంచింది. రష్యా 1991 నుంచి ఉక్రెయిన్ భూభాగం ద్వారా యూరప్కు గ్యాస్ సరఫరా చేస్తోంది. ఈ మేరకు ఉక్రెయిన్తో ఒప్పందం కుదుర్చుకుంది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఒప్పందం పొడిగింపునకు ఉక్రెయిన్ అంగీకరించలేదు. ఒప్పందం ముగిసిపోవడం, రష్యా నుంచి సహజవాయువు సరఫరా ఆగిపోవడం చరిత్రాత్మక ఘట్టమని ఉక్రెయిన్ ఇంధన శాఖ స్పష్టంచేసింది. → గ్యాస్ సరఫరా ఒప్పందాన్ని ఉక్రెయిన్ పొడిగించకపోవడం ఊహించిన పరిణామమే. దీనివల్ల యూరప్ దేశాలకు ఆర్థికంగా కొంత నష్టం వాటిల్లక తప్పదు. రష్యా నుంచి చౌకగా వచ్చే గ్యాస్ స్థానంలో ఇకపై ఖరీదైన గ్యాస్ను ఇతర దేశాల నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది.→ యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరా ఇప్పటికే తగ్గుముఖం పట్టింది. దీనివల్ల రష్యాకు నష్టం జరుగుతోంది. రష్యా గ్యాస్ దిగ్గజం గాజ్ప్రోమ్ గత ఏడాది 6.9 బిలియన్ డాలర్లు నష్టపోయింది. ఇలా జరగడం గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. → రష్యా నుంచి ఉక్రెయిన్ మార్గం కాకుండా టర్క్స్ట్రీమ్ లైన్ కూడా ఉంది. ఇది తుర్కియే, బల్గేరియా, సెర్బియా, హంగేరీ నుంచి యూరప్నకు చేరుతోంది. → యూరప్లో గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉందని యూరేíÙయా గ్రూప్ ఎనర్జీ హెడ్ హెనింగ్ గ్లోస్టీన్ చెప్పారు. గ్యాస్ ధరల భారంతో విద్యుత్ చార్జీలు అమాంతం పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. రష్యా గ్యాస్తో యూరప్ దేశాలు విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. → 2022లో ఉక్రెయిన్పై దండయాత్ర ప్రారంభం కాకముందు యూరోపియన్ యూనియన్ దేశాలకు అతిపెద్ద గ్యాస్ సరఫరాదారు రష్యా. 2021లో ఆయా దేశాలు తమ అవసరాల్లో 40 శాతం గ్యాస్ను రష్యా నుంచే పైప్లైన్ ద్వారా దిగుమతి చేసుకున్నాయి. యుద్ధం మొదలైన తర్వాత 2023 నాటికి అది 8 శాతానికి పడిపోయింది. → అయితే యూరప్కు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్ ప్రజలకు జెలెన్స్కీ కీలక సందేశం -
ఉక్రెయిన్ ప్రజలకు జెలెన్స్కీ కీలక సందేశం
కీవ్:కొత్త ఏడాది సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దేశ ప్రజలకు కీలక సందేశమిచ్చారు. రాజధాని కీవ్ నుంచి ఆయన మాట్లాడారు. మూడు సంవత్సరాలుగా తమ దేశంపై కొనసాగుతున్న రష్యా దురాక్రమణను అడ్డుకుని తీరుతామన్నారు.‘శాంతి మాకు బహుమతిగా రాదని తెలుసు. అన్ని వనరులున్న రష్యాను అడ్డుకుని శాంతిని సాధించేందుకు ఈ ఏడాది గట్టిగా పోరాడతాం.అమెరికాకు కొత్తగా రానున్న అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్కు అన్ని విధాలా అండగా ఉంటారని ఆశిస్తున్నా. పుతిన్ దురాక్రమణను ఆయన ఆపుతారనడంలో నాకెలాంటి సందేహం లేదు’అని జెలెన్స్కీ అన్నారు.కాగా, రష్యాతో జరుగుతున్న యుద్ధంలో 2023తో పోలిస్తే 2024లో ఉక్రెయిన్ ఏడు రెట్ల భూభాగాన్ని నష్టపోయింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టాక ఉక్రెయిన్కు సహకారం తగ్గొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తమకు సహకరిస్తారని జెలెన్స్కీ వ్యాఖ్యానించడం గమనార్హం. -
రివైండ్ 2024: ప్రపంచం ఓటేసింది..
అత్యధిక దేశాల్లో ఎన్నికలు జరిగిన సంవత్సరంగా 2024 చరిత్రలో నిలిచిపోనుంది. అమెరికా నుంచి భారత్ దాకా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 73 దేశాలు ఓట్ల పండుగ జరుపుకోవడం విశేషం. 27 సభ్య దేశాలున్న యూరోపియన్ యూనియన్కు జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు వీటికి అదనం! ఈ దేశాల్లో దాదాపు 400 కోట్ల పై చిలుకు జనాభా ఉంది. అంటే ప్రపంచ జనాభాలో దాదాపుగా సగం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఏడాది ఎన్నికల క్రతువులో పాల్గొన్నారు. వీటిలో చాలా ఎన్నికలు ఓటర్ల పరిణతికి అద్దం పట్టాయి. ఒక్కో దేశంలో ఒక్కోలా ప్రజలు తీర్పు వెలువరించడం విశేషం. పలు ఫలితాలు ఊహించినట్టు రాగా కొన్ని మాత్రం అనూహ్యాలతో ఆశ్చర్యపరిచాయి. అధికార పార్టీల అక్రమాల నడుమ ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసినవీ ఉన్నాయి... భారత ఓటర్ల పరిణతి భారత్లో సాధారణ ఎన్నికలు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామిక క్రతువుగా ఎప్పుడో రికార్డు సృష్టించాయి. ఇంతటి బృహత్తర కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ లేకుండా ప్రశాంతంగా జరిగే తీరు చూసి ప్రపంచమంతా ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటుంది. ఈసారి కూడా అందుకు తగ్గట్టే ఏప్రిల్ నుంచి ఆరు వారాల వ్యవధిలో ఏడు విడతల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 64.64 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఈసారి ఏకంగా ‘400కు మించి’అన్న బీజేపీ చివరికి మెజారిటీకీ కాస్త తక్కువగా 240 లోక్సభ స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలా ఈసారి ఫలితాలు కూడా అందరినీ ఆశ్చర్యపరచడమే గాక భారత ఓటర్ల పరిణతికి అద్దం పట్టాయి.ట్రంప్.. తగ్గేదేలే...! నానారకాల వాదాలతో విడిపోయిన అమెరికాలో ఈసారి జరిగిన అధ్యక్ష ఎన్నికలు ప్రపంచమంతటినీ అమితంగా ఆకర్షించాయి. డొనాల్డ్ ట్రంప్ హవాకు అద్దం పట్టిన ఎన్నికలుగా నిలిచిపోయాయి. రిపబ్లికన్ల అభ్యరి్థత్వం సాధించడం మొదలుకుని ప్రధాన పోరు దాకా ఆద్యంతం ఆయన కనబరిచిన దూకుడు ఓటర్లను అమితంగా ఆకర్షించింది. ఆయన ‘అమెరికా ఫస్ట్’నినాదం రెండోసారి ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తిమంతమైన అధికార పీఠం ఎక్కించింది. డెమొక్రాట్లకు అధ్యక్షుడు జో బైడెనే భారంగా మారారు. సకాలంలో తప్పుకోకపోవడం ద్వారా పార్టీ విజయావకాశాలకు తీవ్రంగా గండి కొట్టిన అప్రతిష్టను మూటగట్టుకున్నారు. భారత మూలాలున్న వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ శాయశక్తులా ప్రయత్నించినా, ఆమెదే పైచేయి అని ప్రధాన మీడియా ఎంతగా హోరెత్తించినా ట్రంప్ ‘తగ్గేదే లే’అన్నారు. 538 ఎలక్టోరల్ ఓట్లలో ఏకంగా 312 ఓట్లను ఒడిసిపట్టి భారీ మెజారిటీతో విజయ దరహాసం చేశారు. రిషికి ఓటమి సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్ ప్రజలు తమ ఆగ్రహమంతటినీ అధికార కన్జర్వేటివ్ పార్టీపై చూపించారు. ఆ పార్టీ 14 ఏళ్ల ఏలుబడికి తెర దించారు. భారత మూలాలున్న తొలి బ్రిటన్ ప్రధానిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్ సారథ్యంలో కన్జర్వేటివ్లు దారుణ ఓటమి మూటగట్టుకున్నారు. లేబర్ పార్టీ నేత కియర్స్టార్మర్కు జనం పట్టం కట్టారు.పాక్లో ప్రహసనం పాకిస్తాన్లో ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలు అత్యంత వివాదాస్పదంగా నిలిచాయి. ప్రధాని షహబాజ్ షరీఫ్ కుటుంబ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్–ఎన్) ఆద్యంతం ఎన్నికల అక్రమాలకు పాల్పడిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్ని చేసినా జైలుపాలైన ఇమ్రా న్ఖాన్ ఆధ్వర్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ)ను అడ్డుకోలేకపోయింది. పీటీఐ గుర్తింపునే రద్దు చేసినా స్వతంత్రులుగానే నిలబడి అన్ని పారీ్టల కంటే ఎక్కువ సీట్లు నెగ్గి సత్తా చాటారు. దాంతో నానా పారీ్టలను కలుపుకుని షహబాజ్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచి్చంది. లంకలో నవోదయం : కల్లోల శ్రీలంకలో సుదీర్ఘ వాయిదాల తర్వాత ఎట్టకేలకు నవంబర్లో జరిగిన ఎన్నికల్లో వామపక్షవాది అనూర కుమార దిస్సనాయకే సాధించిన విజయం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దేశ దుస్థితికి ప్రధాన కారకులని భావించిన రాజపక్స కుటుంబాన్ని జనం రాజకీయంగా సమాధి చేశారు. పుతిన్ ఐదోసారి చెప్పుకోదగ్గ ప్రత్యర్థే లేకుండా జరిగిన ఎన్నికల్లో రష్యాలో పుతిన్ రికార్డు స్థాయిలో ఐదోసారి అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గారు. అది కూడా ఏకంగా 87 శాతం ఓట్లు సాధించారు. సోవియట్ అనంతర కాలంలో రష్యాలో ఇదే అత్యధిక మెజారిటీ. పుతిన్కు ప్రధాన అడ్డంకిగా మారడం ఖాయమని భావించిన విపక్ష నేత అలెక్సీ నావల్సీ ఎన్నికలకు ముందు జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించడం పెను దుమారమే రేపింది. వెనెజువెలాలో అధ్యక్షుడు నికొలస్ మదురో విజయమూ వివాదాస్పదమైంది. పారిపోయిన నేతలుపొరుగు దేశం బంగ్లాదేశ్లో అనూ హ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అది కూడా జనవరిలో సాధారణ ఎన్నికలు ముగిసి షేక్ హసీనా రికార్డు స్థాయిలో ఐదోసారి ప్రధాని కావడం ద్వారా అధికారాన్ని నిలబెట్టు్టకున్న ఐదు నెలలకే! అజ్ఞాత శక్తి కనుసన్నల్లో సాగినట్టు కని్పంచిన ‘ప్రజా ఉద్యమం’దెబ్బకు ఆమె పదవీచ్యుతురాలయ్యారు. అధికార నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో దాదాపుగా కట్టుబట్టలతో ఉన్నపళంగా దేశం వీడి భారత్లో రాజకీయ ఆశ్రయం పొందారు. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక సర్కా రు కొలువుదీరింది. నాడు మొదలైన అల్లర్లు, అరాచకాలు బంగ్లాలో నేటికీ కొనసాగుతున్నా యి. హిందువులతో పాటు మైనారిటీల భద్రతను ప్రమాదంలో పడేశాయి. అసద్లకు అల్విదా సిరియాలో అసద్ల 50 ఏళ్ల కుటుంబ పాలనకు తిరుగుబాటుదారులు డిసెంబర్లో తెర దించారు. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కుటుంబంతో పాటు రష్యాకు పారిపోయారు. అలా నియంతృత్వ పాలనకు తెర పడ్డా దేశం మాత్రం అనిశ్చితితో కూరుకుపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ఘోర విమానం ప్రమాదంలో రష్యాదే తప్పు’.. ఇదిగో సాక్ష్యం
బాకో: ల్యాండింగ్ సమయంలో అజర్ బైజాన్ ఎయిర్లైన్స్ (Azerbaijan Airlines)కు చెందిన జె2-8243 విమానం కజకిస్థాన్ కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 38 మంది మృతి చెందగా..29 మంది తీవ్రంగా గాయపడ్డారు.అయితే, ఈ ప్రమాదంపై ఆదివారం (డిసెంబర్ 29) అజర్ బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హామ్ అలీయేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా ప్రాంతం నుంచి జరిపిన కాల్పుల వల్లే అజర్ బైజాన్ విమానం ప్రమాదానికి గురైందని చెప్పారు. విమాన ప్రమాదానికి గల కారణాల్ని మాస్కో దాచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అమాయకుల ప్రాణాల్ని బలి తీసుకున్న రష్యా అందుకు బాధ్యత వహిస్తూ.. చేసిన తప్పును ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.‘అజర్ బైజాన్ ఎయిర్లైన్స్ ప్రమాదానికి గల కారణాల్ని దాచేందుకు రష్యాలోని ఓ వర్గం అసత్య ప్రచారం చేస్తుందని, తప్పుడు కథనాలతో మసిపూసి మారేడు కాయ చేస్తుంది. విమాన ప్రమాదం జరిగిన కారణ వేరయితే, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మాస్కో చెబుతున్న కారణాలు వేరేలా ఉన్నాయి. చేసిన తప్పును అంగీకరించడం, అజర్ బైజాన్కు క్షమాపణలు చెప్పడం, విమాన ప్రమాదం జరిగిన తీరుతెన్నుల గురించి ప్రజలకు వివరించాలి అని’ఇల్హామ్ అలీయేవ్ రష్యాకు సూచించారు. President Aliyev: “First, Russia must apologize to Azerbaijan. Second, it must admit its guilt. Third, it must punish the culprits, hold them criminally responsible, and pay compensation to the Azerbaijani state as well as to the affected passengers and crew members. These are… pic.twitter.com/5N16w4Zhfw— Nasimi Aghayev🇦🇿 (@NasimiAghayev) December 29, 2024కాగా, ప్రమాదం జరిగిన రోజున ఉక్రెయిన్ డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు గ్రోజ్ని సమీపంలో రష్యా గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఆ సమయంలో రష్యా క్షిపణి తాకడం కారణంగా విమానం కూలిందంటూ ఉక్రెయిన్తో పాటు అజర్ బైజాన్ కూడా ఆరోపించింది. ఈ క్రమంలోనే అజర్ బైజాన్ విమాన ప్రమాదాన్ని రష్యా ‘విషాదకరమైన సంఘటన’ అని పిలిచినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అజర్బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హామ్ అలీయేవ్ను క్షమాపణలు కోరారు. కానీ, రష్యా జరిపిన క్షిపణుల ప్రయోగం వల్లే విమానం కూలినట్లు ఎక్కడా ప్రస్తావించలేదు. -
రష్యానే కూల్చిందా..?
-
రష్యా క్షిపణి వల్లే కూలిందా?
న్యూఢిల్లీ: కజకిస్తాన్లోని అక్తావ్ సమీపంలో బుధవారం విమానం కూలడానికి వెలుపలి శక్తుల ప్రమేయమే కారణమని అజెర్బైజాన్ ఎయిర్లైన్స్ తెలిపింది. వెలుపలి భౌతిక, సాంకేతిక పరమైన ప్రమేయం వల్లే విమానం కూలినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని శుక్రవారం వెల్లడించింది. ఈ విమానం కుప్పకూలడానికి రష్యా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థే కారణమని అంతకు ముందు వార్తలొచ్చాయి. రష్యా వైమానిక విభాగం ప్రతినిధి యడ్రోవ్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రోజ్నీ, వ్లాడికవ్కాజ్లలోని మౌలిక వసతులు, జనావాసాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులు జరుగుతున్నాయి. అందుకే గ్రోజ్నీలో ల్యాండ్ చేయకుండా విమానాన్ని దారి మళ్లించారని తెలిపారు. ‘దీన్నిబట్టి చూస్తే, ఆ ప్రాంతంలోని గగనతలాన్ని మూసివేసినట్లు అర్థమవుతోంది. అంటే, ఆ జోన్లోకి వచ్చే ఏదైనా విమానం తక్షణమే బయటకు రావాల్సి ఉంటుంది. లేకుంటే ప్రమాదమే’అని విశ్లేషకులు అంటున్నారు. ‘విమానం గ్రోజ్నీలో ల్యాండయ్యేందుకు రెండుసార్లు ప్రయత్నించింది. అయితే, డ్రోన్ దాడుల భయంతో వేరే విమానాశ్రయాల్లో ల్యాండ్ చేయాలని అధికారులు పైలట్కు సూచించారు. అందుకే, పైలట్ అక్తావ్ ఎయిర్పోర్టు దిశగా విమానాన్ని మళ్లించారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో కురుస్తున్న దట్టమైన మంచు ప్రమాదానికి కారణమైంది’అని యడ్రోవ్ వివరించారు. కానీ, రష్యా మీడియా విమాన ప్రమాదం గురించిన అసత్యాలు ప్రచారం చేస్తోందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి సిబిహా ఆరోపించారు. క్షిపణి దాడిలో దెబ్బతిన్న విమానంలో ఆనవాళ్లు దొరక్కుండా చేయడానికి రష్యా అధికారులు సముద్రం దాటాలని పైలట్పై ఒత్తిడి చేశారని విమర్శించారు. విమానం కూలిన తర్వాత కేబిన్ నుంచి భారీగా పొగలు వస్తున్నట్లుగా చూపే వీడియోలు, ఫొటోలు కూడా ఇందుకు సాక్ష్యంగా ఉన్నాయన్నారు. విమానం ముక్కలై మంటలు అంటుకోవడం, కాస్పియన్ సముద్ర తీరానికి సమీపంలో నేలను తాకి నల్లని పొగలు కమ్ముకుంటున్న వీడియో ఒకటి ఆన్లైన్లో కనిపిస్తోంది. ఘటనా ప్రాంతంలో విమానం ధ్వంసమైన తీరును గమనిస్తే రష్యా మిలటరీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్లే నేలకూలినట్లు కనిపిస్తోందని యూకేకు చెందిన ఓస్ప్రే ఫ్లైట్ సొల్యూషన్స్ సంస్థ చీఫ్ మ్యాట్ బోరీ విశ్లేషించారని వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. రష్యన్లే ఆ విమానాన్ని కూల్చేశారని ఉక్రెయిన్ జాతీయ భద్రతాధికారి అండ్రీ కొవలెంకో చెప్పారు. యుద్ధం జరుగుతున్న వేళ గ్రోజ్నీ గగనతలాన్ని రష్యా మూసివేయకపోవడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందన్నారు. -
ఉక్రెయిన్లో బందీగా ఉత్తరకొరియా సైనికుడు
సియోల్:రష్యా(Russia) తరపున యుద్ధం చేసేందుకు వెళ్లిన ఉత్తరకొరియా(NorthKorea) సైనికుడొకరిని ఉక్రెయిన్ బలగాలు బందీగా తీసుకువెళ్లాయని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది.ఉక్రెయిన్(Ukraine)పై యుద్ధం చేసేందుకు వేలాది మంది సైనికులను ఉత్తరకొరియా రష్యాకు పంపిన విషయం తెలిసిందే.రష్యాలోని క్రస్క్ సరిహద్దు వద్ద గతంలో ఉక్రెయిన్ సైనికులు ఒక్కసారిగా రష్యాలోకి చొచ్చుకువచ్చి దాడి చేశారు.ఈ సమయంలోనే ఉత్తరకొరియా సైనికుడిని ఉక్రెయిన్ బలగాలు తీసుకువెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.రష్యాతో జరిగిన యుద్ధంలో వెయ్యి మంది ఉత్తరకొరియా సైనికులు మరణించారని ఇప్పటికే దక్షిణకొరియా ఇంటెలిజెన్స్ సంస్థ వెల్లడించింది.రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉత్తరకొరియా సైనికులను రష్యా ముందుంచి పోరాడుతోందని తెలిపింది.ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు కౌంటర్ ఇచ్చే సామర్థ్యం లేకపోవడంతో ఉత్తరకొరియా సైనికులు భారీగా మృత్యువాత పడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
కజకిస్తాన్ విమాన ప్రమాదం..రష్యా కీలక ప్రకటన
మాస్కో:కజకిస్తాన్లో జరిగిన విమానప్రమాదానికి తామే కారణమని జరుగుతున్న ఊహాజనిత ప్రచారాన్ని రష్యా ఖండించింది. విమాన ప్రమాదంపై ఊహాగానాలు ఆపాలని కోరింది. ఈ మేరకు రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మీడియాతో మాట్లాడారు. ప్రమాదంపై విచారణ పూర్తయ్యేదాకా ప్రమాదానికి గల కారణాలపై ఊహాగానాలు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం కుప్పకూలడానికి రష్యా ఎయిర్డిఫెన్స్ వ్యవస్థే కారణమన అజర్బైజాన్ మీడియాలో కథనాలు ప్రచురితమవడంపై రష్యా స్పందించింది. బుధవారం(డిసెంబర్ 25) అజర్బైజాన్లోని బాకు నుంచి బయలుదేరిన విమానాన్ని పొగమంచు కారణంగా తొలుత కజకిస్తాన్లోని అక్తౌకు మళ్లించారు. ఇక్కడే విమానం కుప్పకూలింది. ప్రమాదానికి ముందు విమానం కాస్పియన్ సముద్రంపై కాసేపు ఎగిరింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 67 మందిలో 29 మంది మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డారు. -
ఉక్రెయిన్పై 70 మిసైళ్లు, 100 డ్రోన్లతో రష్యా దాడి
కీవ్ : ఈ వారం ప్రారంభంలో రష్యా వెన్నులో భయం పుట్టించేలా 9/11 దాడుల తరహాలో ఉక్రెయిన్ దాడి చేసింది. కజాన్ నగరంలోని బహుళ అంతస్తుల భవనాలపై మొత్తం 8 డ్రోన్లు చొచ్చుకెళ్లాయి. ఈ దాడికి రష్యా తాజాగా ప్రతీకారం తీర్చుకుంది. ఉక్రెయిన్పై 70మిసైళ్లు,100 డ్రోన్లతో విరుచుకుపడింది.క్రిస్టమస్ పర్వదినాన రష్యా చేసిన దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఖండించారు. తమ దేశ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై అమానవీయంగా దాడి చేసిందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.‘ప్రపంచం మొత్తం క్రిస్టమస్ వేడుకల్లో ఉంటే ఉక్రెయిన్పై రష్యా భారీ ఎత్తున దాడికి దిగింది. దాడి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ముందస్తు ప్రణాళికలో భాగంగా వ్యూహాత్మకంగా జరిగింది. దాడి మాత్రమే కాదు. దాడి ఎప్పుడు చేయాలనేది ముందే నిర్ణయించుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉద్దేశ్యపూర్వకంగా ఈ విధ్వంసానికి తెరలేపారు. ఇంతకంటే అమానుషం ఏముంటుంది?’ అని జెలెన్స్కీ ప్రశ్నించారు. Every massive Russian strike requires time for preparation. It is never a spontaneous decision. It is a deliberate choice – not only of targets but also of timing and date.Today, Putin deliberately chose Christmas for an attack. What could be more inhumane? Over 70 missiles,… pic.twitter.com/GMD8rTomoX— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) December 25, 2024ఉక్రెయిన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై రష్యా భారీ దాడి చేసిందని ఉక్రెయిన్ ఇంధన మంత్రి జర్మన్ గలుష్చెంకో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శత్రువు(రష్యా) మళ్లీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై భారీగా దాడి చేస్తోంది. శత్రు దాడి నుంచి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ప్రతికూల ప్రభావం పడకుండా రక్షణ చర్యలు తీసుకుంటునట్లు చెప్పారు. నగరాలపై దాడులుఒక బాలిస్టిక్ క్షిపణి మంగళవారం సెంట్రల్ ఉక్రెయిన్ నగరమైన క్రివీ రిహ్లోని అపార్ట్మెంట్ భవనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. 15మంది గాయపడ్డారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 32 అపార్ట్మెంట్లతో కూడిన నాలుగు అంతస్తుల రెసిడెన్షియల్ బ్లాక్పై దాడి జరిగినట్లు మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఒలెక్సాండర్ విల్కుల్ టెలిగ్రామ్లో వెల్లడించారు.అదే సమయంలో రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. తమ బలగాలు 59 ఉక్రేనియన్ డ్రోన్లను రాత్రిపూట కూల్చివేసాయని, ఉక్రేనియన్ వైమానిక దళం నల్ల సముద్రం నుండి కాలిబర్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని, అయితే వాటిని వేటిపై ప్రయోగించారనే విషయంపై స్పష్టత లేదని పేర్కొంది. -
World Year Ender 2024: నిత్యం వెంటాడిన మూడో ప్రపంచ యుద్ధ భయం
2024.. ప్రపంచమంతటినీ యుద్ధ భయం వెంటాడింది. ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలు మూడో ప్రపంచ యుద్ధానికి నాందిగా నిలిచాయి. దీనికితోడు భీకర విధ్వంసాన్ని సృష్టించే అణ్వాయుధాల ముప్పు కూడా తొంగిచూసింది. 2024లో ప్రపంచాన్ని అనునిత్యం భయానికి గురిచేసిన యుద్ధాలివే..రష్యా-ఉక్రెయిన్ 2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 2024లో మరింత తీవ్ర స్థాయికి చేరింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్కు రష్యా అంతర్భాగంలో యూఎస్ఏ ఆయుధాలను ఉపయోగించడానికి అనుమతించడం ద్వారా మూడవ ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదిగా భావించే హైపర్సోనిక్ ఐసీబీఎం క్షిపణిని ఉక్రెయిన్పై ప్రయోగించడం ద్వారా రష్యా అవసరమైతే అణుదాడికి కూడా వెనుకాడబోదన్న సందేశాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్కు సహాయం చేస్తున్న నాటో, అమెరికా, బ్రిటన్లపై దాడి చేస్తామని రష్యా పలుమార్లు హెచ్చరించింది. ఇది మూడో ప్రపంచ యుద్ధ భయాన్ని మరింతగా పెంచింది.ఇజ్రాయెల్-హమాస్ 2023 అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం క్రమంగా లెబనాన్, యెమెన్, ఇరాన్, సిరియాలను చుట్టుముట్టింది. గాజాలో ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా యెమెన్ హౌతీలు.. ఏడెన్ గల్ఫ్లోని ఓడలను లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఇజ్రాయెల్ హమాస్తో పాటు హౌతీలతోనూ పోరాడాల్సి వచ్చింది. హౌతీల దాడులను అరికట్టేందుకు అమెరికా, బ్రిటన్ కలిసి యెమెన్పై పలుమార్లు భారీ వైమానిక దాడులు నిర్వహించి, హౌతీల కీలక స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్ కూడా హౌతీలపై బలమైన ప్రతీకార దాడులను చేపట్టింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, యాహ్యా సిన్వార్లను హతమార్చడం ద్వారా ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మనోధైర్యాన్ని దెబ్బతీసింది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటివరకు 45 వేల మందికి పైగా జనం మృతిచెందారు.ఇజ్రాయెల్-హెజ్బొల్లా ఇజ్రాయెల్ దళాలు హమాస్ నేతలను హతమార్చిన దరిమిలా ఇజ్రాయెల్ సైన్యం హెజ్బొల్లా స్థావరాలపై వైమానిక దాడి చేపట్టింది. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఈ వైమానిక దాడిలో మరణించాడు. దీని తరువాత, కొత్త చీఫ్ సఫీద్దీన్ కూడా ఇజ్రాయెల్ సైన్యం చేతుల్లో హతమయ్యాడు. తరువాత గాజా తరహాలో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లో భూ ఆక్రమణకు పాల్పడింది. పేజర్లు, బ్యాటరీ బ్లాస్ట్లను ఉపయోగించి వేలాది మంది హెజ్బొల్లా యోధులను ఇజ్రాయెల్ అంతమొందించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది.ఇజ్రాయెల్-ఇరాన్ ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణకు ముందు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, యాహ్యా సిన్వార్, హిజ్బుల్లా చీఫ్లు హసన్ నస్రల్లా, హషీమ్ సఫీద్దీన్లను అంతమొందించడంతో ఇరాన్ షాక్నకు గురయ్యింది. 2024 అక్టోబర్లో ఇరాన్ అకస్మాత్తుగా 180 క్షిపణులతో ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఇది ప్రపంచమంతటినీ కలవరానికి గురిచేసింది. ఈ దాడి తరువాత, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య నెలకొన్న ప్రత్యక్ష యుద్ధం ముప్పు మధ్యప్రాచ్యాన్ని మరింత ఆందోళనలోకి నెట్టేసింది. ఇప్పటికే యూరప్లో జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధ ప్రమాద ముప్పును మరింత పెంచింది. ఈ తరుణంలోనే ఇజ్రాయెల్.. ఇరాన్పై వైమానిక దాడులతో ప్రతీకారం తీర్చుకుంది. ఇరాన్ సైనిక స్థావరాలను నాశనం చేసింది.సూడాన్- బంగ్లాదేశ్2024లో సూడాన్- బంగ్లాదేశ్లలో జరిగిన తిరుగుబాట్లు చరిత్రలో నిలిచిపోతాయి. ఏప్రిల్ 2023 నుంచి సూడాన్ భీకర అంతర్యుద్ధంలో మునిగితేలుతోంది. జుంటా సైన్యం తిరుగుబాటు దరిమిలా సూడాన్ పారామిలిటరీ దళాలు రంగంలోకి దిగాయి. ఈ రెండింటి మధ్య సంవత్సరాల తరబడి భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు వేలాది మంది సైనికులు, ప్రజలు మరణించారు. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం సూడాన్లో జరిగిన ఈ అంతర్యుద్ధంలో 27 వేల మందికి పైగా జనం మరణించారు. మరోవైపు బంగ్లాదేశ్లో ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం కారణంగా ప్రధాని షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి మొహమ్మద్ యూనస్ సారధ్యం వహిస్తున్నారు. అదిమొదలు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు పెరిగాయి.సిరియాలో.. సిరియాలో సాయుధ తిరుగుబాటుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. వారు సిరియా రాజధాని డమాస్కస్తో సహా అనేక స్థావరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో సిరియా అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశం నుండి పారిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపధ్యంలో రష్యా అసద్కు ఆశ్రయం ఇచ్చింది. అనంతరం ఇజ్రాయెల్ సిరియాలోని పలు ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి, ఆ దేశంలోని బఫర్ జోన్ను స్వాధీనం చేసుకుంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: భారతీయులు అలెక్సాను అడిగిన ప్రశ్నలివే.. జాబితా షేర్ చేసిన అమెజాన్