Salman Moinuddin
-
‘ఐసిస్ త్రయం’పై మరో కేసు
టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్లో వివాదాస్పద వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: ఓ జాతీయ చానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో వివాదా స్పద, తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఐసిస్ సానుభూతిపరులు అబ్దుల్లా బాసిత్ తోపాటు సల్మాన్ మొయినుద్దీన్, హన్నన్ ఖురేషీపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. సదరు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన చానల్తోపాటు రిపోర్టర్కు కూడా గురువారం నోటీసులు జారీ చేశారు. ఆపరేషన్కు సంబంధించిన పూర్తి ఫీడ్ పరి శీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసు కోవాలని నిర్ణయించామని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. బీటెక్ విద్యార్థి అబ్దుల్లా బాసిత్ స్వస్థలం హైదరా బాద్లోని చాంద్రాయణగుట్ట. దేశ సరిహద్దు లు దాటి బంగ్లాదేశ్లోకి వెళ్లేందుకు యత్నిం చిన బాసిత్, అతడి స్నేహితుడు హన్నన్ ఖురేషీతోసహా నలుగురు నగర యువకు లను పోలీసులు గతంలో కోల్కతాలో పట్టు కున్నారు. నగరానికి చెందిన సల్మాన్ మొహి యుద్దీన్ సిరియాకు వెళ్లే క్రమంలో 2015 జనవరి 16న శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు సల్మాన్ను అరెస్టు చేశారు. ప్రస్తుతం బెయిల్పై ఉన్న బాసిత్, సల్మా న్తోపాటు హన్నన్ ఖురేషీలపై ఓ జాతీయ చానల్ స్టింగ్ ఆపరేషన్ చేసి ప్రసారం చేసింది. ఇందులో బాసిత్ చేసిన అభ్యం తరకర వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ వీడియోల్లో కనిపించి, మాట్లాడిన సల్మాన్, ఖరేషీలపై పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. -
పోలీసుల కస్టడీకి సల్మాన్
-
పోలీసుల కస్టడీకి సల్మాన్
హైదరాబాద్: అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కు చెందిన తీవ్రవాది సల్మాన్ మొహియుద్దీన్ను శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్ర నగర్ కోర్టు తీర్పు మేరకు చర్లపల్లి జైలు నుంచి అతడిని అదుపులోకి విచారిస్తున్నారు. కాగా ఐఎస్ఐఎస్లో చేరడానికి దుబాయ్ మీదుగా సిరియా వెళ్లేందుకు వచ్చిన సల్మాన్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సల్మాన్ మొహియుద్దీన్ గత ఏడాది సిరియా వెళ్లేందుకు విఫలయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే అతడు గత ఏడాది అక్టోబర్లో హైదరాబాద్కు తిరిగి వచ్చాడు. తాజాగా వీసా రావడంతో దుబాయ్ వెళ్లి ఐఎస్లో చేరాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసమే ఈనెల 16వ తేదీ తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి పోలీసులకు చిక్కాడు. వారి విచారణలో తాను ఐఎస్లో చేరేందుకు వెళ్తున్నానని సల్మాన్ అంగీకరించాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. salman moinuddin, ISIS, dubai, hyderabadi engineer arrested, సల్మాన్ మొయినుద్దీన్, హైదరాబాదీ ఇంజనీర్ అరెస్టు, పేస్ బుక్, ఐఎస్ఐఎస్ -
సల్మాన్.. ఉగ్రవాదం వైపు మళ్ళాడిలా..!
-
'నా వాళ్లకు అండగా ఉండాలనే సిరియా బయల్దేరా'
సిరియాలో ఉన్న తన వర్గం వారికి అండగా నిలిచేందుకే తాను అక్కడకు బయల్దేరినట్లు పోలీసులు అరెస్టు చేసిన సల్మాన్ మొయినుద్దీన్ వెల్లడించాడు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు అతడు వెళ్లబోతుండగా, శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడిని శంషాబాద్ పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకోనున్నారు. పోలీసుల విచారణలో ఐఎస్ఐఎస్పై మరిన్ని వివరాలను మొయినుద్దీన్ వెల్లడించాడు. తాను విజిటింగ్ వీసాపై దుబాయ్ వెళ్లాలనుకున్నానని, అక్కడ తన ప్రియురాలిని పెళ్లి చేసుకుని, ఆ తర్వాత సిరియా వెళ్లాలని భావించానని చెప్పాడు. ఐఎస్ఐఎస్ కోసం ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసినట్లు అమెరికన్ అధికారులు గుర్తించారని, తాను దుబాయ్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వకుండా, వీసా గడువు కూడా పొడిగించకుండా ఇండియాకు తిప్పి పంపేశారని మొయినుద్దీన్ చెప్పాడు. దౌలానా న్యూస్ అనే ఫేస్బుక్ అకౌంట్లో చాలామంది చేరారని వివరించారు. కాగా, ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల ద్వారా ఐఎస్ఐఎస్ గురించి పోస్టింగులు చేసిన వారిని కూడా పోలీసులు విచారించనున్నారు. విచారణ కోసం జాతీయ దర్యాప్తు సంస్థల సహకారాన్ని పోలీసులు కోరనున్నారు. -
ఫేస్బుక్ ద్వారా గాలం వేసిన దుబాయ్ లేడీ
‘ఉగ్ర’ సంస్థలో చేరేందుకు వెళ్తూ శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డ నగర విద్యార్థి ఫేస్బుక్ ద్వారా గాలం వేసిన దుబాయ్ లేడీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ‘‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)’’ ఉగ్రవాద సంస్థ జాడలు విస్తరిస్తున్నాయి. ఆరు నెలల వ్యవధిలో ఈ ఉగ్రవాదం వైపు ఆకర్షితులైన 18 మంది నగర యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి కుటుంబ సభ్యులతో కలిపి కౌన్సెలింగ్ చేసి పంపించారు. వీరంతా ఉన్నత చదువులు చదువుకున్న వారే కావడం గమనార్హం. తాజాగా ఐఎస్ఐఎస్లో చేరడానికి దుబాయ్ మీదుగా సిరియా వెళ్లేందుకు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్జీఐఏ) శుక్రవారం తెల్లవారుజామున చేరుకున్నాడు. ఇది పసిగట్టిన సైబరాబాద్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. హబీబ్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బజార్ఘాట్కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి సల్మాన్ మొహియుద్దీన్ (32) వికారాబాద్లోని అన్వర్-ఉల్-ఉలూం కళాశాలలో 2002-08లో బీటెక్ (ఈసీఈ) చేశాడు. ఆ తరువాత ఎంఎస్ (ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్) టెక్సాస్ సౌతెర్న్ యూనివర్సిటీలో చేశాడు. ఆ తర్వాత అమెరికాలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేశాడు. ఈ సమయంలోనే అతనికి ఫేస్బుక్ ద్వారా ఇంగ్లండ్కు చెందిన జోసఫ్ అలియాస్ ఆయేషా (26) (ఇస్లాం మతం స్వీకరించి దుబాయ్లో ఉంటుంది) తో పరిచయం అయింది. అది వారిద్దరి మధ్యా ప్రేమకు దారి తీసింది. ఆ తరువాత ఆమె సల్మాన్ను ఉగ్రవాదం వైపు నెమ్మదిగా లాగింది. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ రాజ్యం స్థాపించేందుకు పవిత్ర యుద్ధం చేయాలంటూ ఆమె సల్మాన్ను ఒప్పించింది. ఈ క్రమంలో ముందుగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరాలని కోరడంతో అతడు అందుకు అంగీకరించాడు. గత ఏడాది సిరియా వెళ్లేందుకు విఫలయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే అతడు గత ఏడాది అక్టోబర్లో హైదరాబాద్కు తిరిగి వచ్చాడు. తాజాగా వీసా రావడంతో దుబాయ్ వెళ్లి ఐఎస్లో చేరాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసమే శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి పోలీసులకు చిక్కాడు. వారి విచారణలో తాను ఐఎస్లో చేరేందుకు వెళ్తున్నానని సల్మాన్ అంగీకరించాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
'నా కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదు'
హైదరాబాద్: తన కుమారుడు నిజాయితీపరుడని ఎలాంటి తప్పు చేయలేదని సల్మాన్ మొయినుద్దీన్ తండ్రి అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ జేఎన్ టీయూలో బీటెక్ పూర్తిచేసి లండన్ లో ఎమ్మెస్ చేశాడని తెలిపారు. దుబాయ్ లో ఉద్యోగం కోసం వెళుతున్న తన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారని వాపోయారు. సల్మాన్ కు ఏడేళ్ల క్రితం వివాహం అయిందని పాప, బాబు ఉన్నారని తెలిపారు. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో హైదరాబాద్ కు చెందిన సల్మాన్ మొయినుద్దీన్ ను తెలంగాణ పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అతడు అమెరికాలో ఇస్లామిక్ స్టేట్ శిక్షణ పొందినట్లు చెబుతున్నారు. -
ఐఎస్తో సంబంధం: హైదరాబాదీ ఇంజనీర్ అరెస్టు!
-
ఐఎస్తో సంబంధం: హైదరాబాదీ ఇంజనీర్ అరెస్టు!
ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో.. హైదరాబాద్కు చెందిన ఓ ఇంజనీర్ను తెలంగాణ పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అతడు అమెరికాలో ఇస్లామిక్ స్టేట్ శిక్షణ పొందినట్లు చెబుతున్నారు. ఆసిఫ్నగర్ ప్రాంతానికి చెందిన సల్మాన్ మొయినుద్దీన్ (22)ను నిఘావర్గాల సమాచారం ఆధారంగా భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నాయి. మొయినుద్దీన్ హ్యూస్టన్లో ఎంఎస్ డిగ్రీ చేశాడు. తాను ఇస్లామిక్ స్టేట్ సంస్థలో చేరాలని నిర్ణయించుకున్నట్లు అతడు ఒప్పుకొన్నాడని పోలీసులు చెప్పారు. అతడు బ్రిటిష్ జాతీయురాలైన తన స్నేహితురాలితో కలిసి దుబాయ్ వెళ్లి, అక్కడినుంచి సిరియా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.