breaking news
seaplane
-
ఆకాశ వీధిలో ఆర్భాటం చేసి.. పాతాళంలో వదిలేసి!
శ్రీశైలంటెంపుల్: ‘దట్టమైన నల్లమల అటవీ మధ్యలో ప్రవహించే కృష్ణమ్మ పరవళ్లపై ప్లేన్లో ప్రయాణించి మధురానుభూతి పొందే అవకాశం కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా విజయవాడ నుంచి శ్రీశైలానికి తక్కువ సమయంలో వచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఏపీని టూరిజం హబ్గా మారుస్తాం’ అంటూ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శ్రీశైలంలో సీ ప్లేన్ ట్రయరల్ రన్ వేళ అన్న మాటలు. ఇక సీన్ కట్ చేస్తే.. సీప్లేన్ ట్రయల్రన్ చేపట్టి ఇప్పటికి పది నెలలు గడుస్తోంది. ఇంకా సర్వేలు, సమీక్షలకే అధికారులు పరిమితమయ్యారు. ఇప్పటికీ డీపీఆర్ సిద్ధం కాకపోవడంతో సీప్లేన్ ప్రయాణం మరింత ఆలస్యమవుతుందని తెలుస్తోంది. సీఎం ప్రచార ఆర్భాటానికే సీప్లేన్ ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చి ట్రయల్రన్ చేసి వదిలేశారని, ఆచరణ చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మల్లన్న భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం టూరిజం అభివృద్ధిలో భాగంగా శ్రీశైలానికి గతేడాది నవంబరు 9న సీప్లేన్ ట్రయల్రన్ చేపట్టారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కె.రామ్మోహన్నాయుడు, టూరిజం శాఖ మంత్రి దుర్గేశ్ తదితరులు విజయవాడ పున్నమి ఘాట్ నుంచి సీప్లేన్లో శ్రీశైలం పాతాళగంగకు చేరుకున్నారు. సీప్లేన్ ప్రారంభమైతే విజయవాడ నుంచే కాకుండా హైదరాబాద్, బెంగ ళూర్ తదితర రాష్ట్రాల నుంచి సైతం సీప్లేన్ నడిపేందుకు అవకాశం ఉందని అప్పట్లో పాలకులు, పర్యాటక అధికారులు ప్రకటించారు. భక్తులు, పర్యాటకులు, ప్రభుత్వ ఉద్యోగులు, వారాంతపు సెలవులు ఉంటే ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు తమ సమయాన్ని వృథా చేసుకోకుండా సీప్లేన్ ద్వారా త్వరగా వచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకుని త్వరగా వెళ్లే అవకాశం ఉండేదని భావించారు. అయితే పది నెలలుగా గడుస్తున్నా ట్రయల్ రన్కు పరిమితం కావడంతో కూటమి ప్రభుత్వానికి ప్రారంభంలో హడావుడి చేయడం, ఆ తర్వాత వదిలేయడం సర్వ సాధారణమేనని పలువురు విమర్శిస్తున్నారు. ఇరిగేషన్, అటవీశాఖ అనుమతులు లభించేనా..?సీప్లేన్ నిర్వహించే ప్రదేశంలో శ్రీశైలం పూర్తిగా నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంది. ఇది పూర్తిగా వన్యప్రాణులు, చిరుతలు, పెద్దపులులు అవాసానికి అనువైన ప్రదేశం. ఇక్కడ సీప్లేన్ సేవలు నిర్వహించాలంటే అటవీశాఖ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. అలాగే సీప్లేన్ టేక్ ఆఫ్, ల్యాండింగ్కు డ్యామ్ పరిధిలో ఉండటంతో ఇరిగేషన్ శాఖ అధికారుల అనుమతి కూడా తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. అలాగే ఏవియేషన్, ఇతర శాఖల అనుమతులు తప్పనిసరి. కూటమి ప్రభుత్వం విజయవాడ టూ శ్రీశైలం సీ ప్లేన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించి త్వరితగతిన అనుమతులు అన్ని తీసుకుని సేవలను అందుబాటులోకి తేవాలని పలువురు పర్యాటకులు కోరుతున్నారు. సర్వేలు, సమీక్షలకే పరిమితంవిజయవాడ నుంచి శ్రీశైలానికి వచ్చే సీప్లేన్ ప్రయాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఐడీసీ) అధికారులు డిటేల్డ్ ప్రాజెక్టు రిపొర్టు తయారు చేస్తున్నారు. శ్రీశైలంతో పాటు అరకు, లంబసింగి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, గండికోట, నర్సాపూర్, తిరుపతి, ప్రకాశం బ్యారేజ్ మొత్తం 10 ప్రదేశాలలో టూరిజం పరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ ప్రాజెక్టు రిపోర్టు తయారీకి నాలుగు నెలల క్రితం ఓ ప్రైవేట్ కన్పల్టెన్సీకి నియమించారు. వారు మే నెల నుంచి డీపీఆర్ తయారు చేసేందుకు పనులు ప్రారంభించారు. ఏపీఐడీసీ అధికారులు వారానికి ఒకసారి సర్వేలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. డీపీఆర్లో సీప్లేన్ ల్యాండ్ అయ్యే ప్రదేశం, సీప్లేన్ టేక్ఆఫ్, టేక్ ఆన్కు నీటిలో సుమారు 1.16 కిలోమీటర్ల పోడవు, 120 మీటర్ల వెడల్పు ఉండే ప్రదేశం, పర్యాటకులు సీప్లేన్ ఎక్కేందుకు, దిగేందుకు నీటిపై ప్రత్యేక జెట్టీల ఏర్పాటు, టికెట్టు ధరలు, ఎన్ని ప్లేన్ సర్వీసులను తిప్పాలి, రోజుకు ఎన్ని ట్రిప్పులు, సీప్లేన్ ల్యాండింగ్ వద్ద పర్యాటకులకు విశ్రాంతి తీసుకునేందుకు గదులు, టికెట్టు కౌంటర్, సిబ్బంది తదితర పూర్తి వివరాలను డీపీఆర్లో పొందుపరుచనున్నారు. వచ్చే జనవరి నాటికి డీపీఆర్ పూర్తి చేయాలని కన్సల్టెన్సీకి ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. -
సీప్లేన్ ఏరోడ్రోమ్ నిబంధనల సడలింపు
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సీప్లేన్ కార్యకలాపాల కోసం నిబంధనలను సరళీకృతం చేసింది. నాన్-షెడ్యూల్డ్ సంస్థలు సీప్లేన్ సేవలు నిర్వహించేలా అనుమతులను సవరించింది. ఏరోడ్రోన్ సర్టిఫికేట్ ప్రక్రియను సులభతరం చేసింది. ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పథకం ఉడాన్ పథకం కింద సీప్లేన్ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ..‘సీప్లేన్ కార్యకలాపాలు పర్యాటకం అభివృద్ధికి దోహదం చేస్తాయి. గతంలో వీటి నిర్వహణకు ఉన్న నిబంధనలను సవరిస్తున్నాం. సాధారణంగా సీప్లేన్లు సముద్రంలో టేకాఫ్, ల్యాండ్ అవ్వాలంటే ఇప్పటివరకు ఉన్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిబంధనల ప్రకారం వాటర్డ్రోమ్ లైసెన్స్ తప్పనిసరి. కానీ ఇకపై ఈ లైసెన్స్ అవసరం లేకపోయినా టేకాఫ్, ల్యాండ్ అవ్వొచ్చు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్) కలిగినవారు నేరుగా సీప్లేన్ రేటింగ్లను పొందవచ్చు. దాంతో పైలట్ల కొరత తీరుతుంది. నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్లు సీప్లేన్ కార్యకలాపాలను నిర్వహించవచ్చు’ అన్నారు.ఇదీ చదవండి: ‘లెజెండ్స్’ సర్వీసు నిలిపేత‘గతంలో అండమాన్ & నికోబార్ దీవులతో పాటు గుజరాత్లో సీప్లేన్ కార్యకలాపాలు జరిగేవి. కానీ అవి ఎక్కువ కాలం కొనసాగలేదు. తిరిగి వీటిని ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 100 మార్గాల్లో ఈ సీప్లేన్లు ఎగరనున్నాయి. ఇప్పటికే వీటికి అనువైన మార్గాలను కనుగొనాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరాం. అండమాన్ & నికోబార్, గుజరాత్, లక్షద్వీప్, గోవా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ల్లో విస్తరించి ఉన్న 18 ప్రదేశాల్లో వాటర్ సీప్లేన్ ఏరోడ్రోమ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది’ అని మంత్రి పేర్కొన్నారు. -
సమస్యల నుంచి తప్పించుకునేందుకే సీప్లేన్ విహారం
సాక్షి, అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీప్లేన్ను ఉపయోగించడంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. ప్రధాని సీప్లేన్లో ప్రయాణించాలనుకోవడంలో తప్పులేదని, గుజరాత్ ప్రజలకు 22 ఏళ్ల పాలనలో బీజేపీ ఏం చేసిందనే ప్రశ్నకు దూరంగా ఉండేందుకే ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం విజయ్ రూపాని కేవలం 5 నుంచి 10 మంది సన్నిహితులకు ఉపయోగపడే అభివృద్ధి నమూనాను చేపట్టారని, సామాన్యుల సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. ప్రధాని తన ర్యాలీల్లో రైతుల సమస్యలు, అవినీతిని ప్రస్తావించడం లేదని గుజరాతీలు గ్రహించారని, ప్రజల్లో పాలక సర్కార్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. బీజేపీ తమను మరింత గట్టిగా ప్రతిఘటిస్తుందనుకున్నామని, అయితే ఆ పార్టీ తీరు తనను విస్మయానికి గురిచేసిందని రాహుల్ అన్నారు. తాను ఎప్పుడు దేవాలయాన్ని సందర్శించినా గుజరాతీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రార్ధనలు చేశానన్నారు. -
తాజ్ మహల్ చూడాలా? ఇక ఈ దారైతే బెటరేమో!
దేశరాజధాని ఢిల్లీ నుంచి ఆగ్రాకు ప్రయాణించే యాత్రికులు కలలో కూడా ఊహించని విధంగా ఆ మార్గం మారనుంది. యమునా నది మీద సీ-ప్లేన్ సర్వీసును తెచ్చి ఇరు ప్రాంతాలను కలిపేందుకు కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. వచ్చే మూడు నెలల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సీ-ప్లేన్లను ఈ మార్గంలో ఉపయోగించడానికి ఇప్పటికే ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అనుమతి కోరామని, ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను కూడా ఇవ్వాలని తెలిపినట్లు వివరించారు. మార్చి 11న భారతీయ వాటర్ వేస్ బిల్లును పార్లమెంటులో ఆమోదించిన తర్వాత రవాణా వ్యవస్థను బలపరచడానికి ప్రభుత్వం చేపట్టిన తొలి ప్రాజెక్టు ఇది. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న నీటివనరులపై దాదాపు 106 రవాణా వ్యవస్థలను నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఒక్క యమున మీదే కాకుండా మిగతా నదులపై హోవర్ క్రాఫ్ట్, సీ-బస్ లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఉత్తరప్రదేశ్ లో చేపట్టనున్న ప్రాజెక్టులను ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ(డీడీఏ), ఢిల్లీ జల్ బోర్డు, రవాణా శాఖలు చేపడతాయని గడ్కారీ తెలిపారు. కెనడా, రష్యాలకు చెందిన కొన్ని కంపెనీలు ఇప్పటికే సీ-ప్లేన్లను అందించేందుకు ముందుకు వచ్చినట్లు వివరించారు. -
మూడు పుణ్యక్షేత్రాలకు త్వరలో సీ ప్లేన్ సేవలు
ముంబై: షిర్డీవాసులతోపాటు సాయిభక్తులకు శుభవార్త. ఈ నెల 19వ తేదీనుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి సమీపంలోని ములా డ్యాంతోపాటు శనిసింగణాపూర్, మెహరాబాద్లకు సీ ప్లేన్ సేవలు ప్రారంభం కానున్నాయి. మహారాష్ట్ర పర్యాటక సంస్థ సహకారంతో మారీటైమ్ ఎనర్జీ హెలీ ఎయిర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఈహెచ్ఏఐఆర్) సంస్థ ఈ సేవలను అందించనుంది. ఈ విషయాన్ని ఎంఈహెచ్ఏఐఆర్ డెరైక్టర్ సిద్ధార్థ్ వర్మ వెల్లడించారు. అహ్మద్నగర్ జిల్లాలోని ములా డ్యాంవరకు ఈ సేవలను అందిస్తామని, అందువల్ల సాయి భక్తులు వీలైనంత తక్కువ సమయంలో షిర్డీకి చేరుకోగలుగుతారన్నారు. గత నెల 25వ తేదీన ముంబై నుంచి లోణావాల మధ్య తాము ప్రారంభించిన సీప్లేన్ సేవలకు విశేష స్పందన లభించిందన్నారు. తాము ములా డ్యాం వరకూ ప్రారంభించనున్న తాజా సేవల వల్ల ఆయా పుణ్యక్షేత్రాలకు భక్తులు అత్యంత తక్కువ సమయంలోనే చేరుకుంటారన్నారు. దీంతోపాటు నాసిక్లోని గంగాపూర్ డ్యాం, మహాబలేశ్వర్ సమీపంలోని ధూమ్ డ్యాంలకు కూడా త్వరలోనే సీ ప్లేన్ సేవలను ప్రారంభిస్తామన్నారు.