Severe road accident
-
హిమాచల్లో లోయలోపడ్డ బస్సు
20 మంది మృతి సిమ్లా: హిమాచల్ప్రదేశ్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమ్లా నుంచి 30 మందికిపైగా ప్రయాణికులతో సవేరాఖుడ్కు వెళ్తున్న హిమాచల్ ఆర్టీసీ బస్సు కతార్ఘాట్ వద్ద అదుపుతప్పి లోయలో పడింది. బసంత్పూర్-కింగాల్ జాతీయ రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో 20 మంది మృతిచెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో డ్రైవర్ బస్సులోంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తునాతునకలైన బస్సులోంచి మృతదేహాలను వెలికి తీశారు. సహాయ చర్యలను ముమ్మరంగా చేపట్టాలని ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. బీహార్లో 12 మందిని చిదిమేసిన కంటెయినర్ ఔరంగాబాద్: బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున అదుపు తప్పిన ఓ కంటెయినర్ రోడ్డు పక్కన నిద్రిస్తున్న భక్తులపై దూసుకెళ్లడంతో 12 మంది మృతిచెందారు. మరో 22 మంది గాయపడ్డారు. న్యూఢిల్లీ-కోల్కతా రెండో నంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వీరంతా జార్ఖండ్లోని దేవ్గఢ్ ఆలయంలో దర్శనం చేసుకొని ఇళ్లకు తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగింది. కంటెయినర్ భక్తుల పైనుంచి దూసుకెళ్లాక పక్కన ఉన్న వారి బస్సును ఢీకొని ఆగింది. -
జీపు-బైక్ ఢీ.. ఇద్దరి మృతి
చోడవరం టౌన్, న్యూస్లైన్ : మండలంలోని వెంకన్నపాలెం-నర్సాపురం రోడ్డులో మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రమాదంలో సంఘటన స్థలం వద్ద ఒకరు మృతిచెందగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్ను మూశారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం దబ్బిరాజుపేటకు చెందిన కోన గోవిందరావు (38), జొన్నపల్లి నాగరాజు (30)లు అనకాపల్లిలో ఉంటూ అచ్యుతాపురంలో చిన్నచిన్న కూలీ పనులు చేస్తుంటారు. రోజూ మాదిరిగా బైక్పై అచ్యుతాపురం వెళ్తుండగా, చోడవరం నుంచి విశాఖపట్నం వెళ్తున్న జీపు బలంగా ఢీకొంది. దీంతో కోన గోవిందరావు అక్కడికక్కడే మరణించాడు. నాగరాజును 108లో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. సంఘటన స్థలంలోని చేరుకున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. గోవిందరావుకు భార్య మోనిక, ఒక కుమార్తె, కుమారుడు, నాగరాజుకు భార్య గౌరి, ఒక కుమార్తె ఉన్నట్లు బంధువులు తెలిపారు. దీనిపై చోడవరం ఎస్ఐ ఎ.ఆదినారాయణరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.