sivalingam
-
ఎత్తైన పంచముఖ మహాశివలింగం, కొలువైన శివపరివారం ఎక్కడో తెలుసా?
36 అడుగుల పంచముఖ మహాశివలింగం 12 అడుగుల ఎత్తులో నందీశ్వరుడు, 40 అడుగుల ఎత్తున్న ఓంకార స్థూపం, అర్ధనారీశ్వరుడు, దత్తాత్రేయుడు, హరిహరుడు, శివపరివారం విగ్రహాలు ఇవన్ని ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా.. అదేనండీ అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ కొలువైన విజయవాడ మొగల్రాజ పురంలోని శివగిరిపైన కొలువుదీరి భక్తులతో పూజలందుకుంటున్నాయి. శివపరివారాన్ని సాధారణంగా చిత్రపటాల్లోనే చూస్తు ఉంటాం కాని ఇక్కడ విగ్రహాల రూపంలో శివ పరివారాన్ని దర్శించుకోవచ్చు. అదెక్కడంటే విజయవాడ మొగల్రాజపురంలోని శ్రీవాగ్దేవీ జ్యోతిర్లింగ క్షేత్రం (శివగిరి)పై 36 అడుగుల ఎత్తు ఉన్న పంచముఖ మహాశివలింగం, శివలింగానికి ఎదురుగా 12 అడుగుల ఎత్తులో నందీశ్వరుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. 40 అడుగుల ఎత్తు్తన్న ఓంకార స్థూపం విజయవాడ నగరం మొత్తం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ఇవే కాకుండా 36 అడుగుల పంచముఖ శివలింగం చుట్టూ దాద్వశ జ్యోతిర్లింగాలను శైవాగమం ప్రకారం ప్రతిష్టించారు. శివగిరిపైన శివపార్వతులు, కుమారస్వామి, విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, అయ్యప్ప, నంది, శృంగి, భృంగి, అర్ధనారీశ్వరుడు, నందీశ్వరుడు, దత్తాత్రేయుడు, హరిహరుడు, కనకదుర్గ, గజలక్ష్మి, సరస్వతి అమ్మవార్ల విగ్రహాలు కూడా కొలువుతీరాయి. గోశాలతోపాటుగా హోమగుండం కూడా ఉన్నాయి. శ్రీ చక్ర ఆకారంలో అష్టాదశ శక్తిపీఠాలను కూడా శివగిరిపై ప్రతిష్టించారు. (ప్రదోష కాలం అంటే ఏంటి, ప్రదోష పూజ ఎలా చేయాలి?) ఏడు అడుగుల నాగ పడగ, నాగదేవత విగ్రహాలు కూడా ఇక్కడ భక్తులతో పూజులు అందుకుంటున్నాయి. ప్రతి ఏడాది మహా శివరాత్రి రోజున చితాభస్మంతో శివలింగానికి అభిషేకం, కపాల హారతి నిర్వహిస్తుంటారు. ఉజ్జయిని నుంచి నాగసాధువులు, అఘోరాలు వివిధ అఖండాల (అఘోరాలు ఉండే అశ్రమాలు) నుంచి శివగిరిపై పూజలు నిర్వహిస్తారు. శివగిరి కొండపైన మరో వైపున 27 అడుగుల ఎత్తులో అభయ ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. కొండ దిగువ నుంచి ఈ విగ్రహాన్ని చూసినప్పుడు కొండపై నుంచి ఆంజనేయస్వామి భక్తులకు అభయాన్ని అందిస్తున్నట్లుగా ఉంటుంది. పూజ చేస్తున్న ముస్లిం మహిళఎలా వెళ్ళాలంటే...ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల దగ్గర ఉన్న సున్నపుబట్టీల సెంటర్ నుంచి శివగిరిపైకి చేరుకోడానికి మెట్ల మార్గం ఉంది. శివగిరిపైనే పూజలకు అవసరమైన పూజాద్రవ్యాలతో పాటుగా తాగునీటి సౌకర్యం కూడా కల్పించారు. కార్తికమాసం అన్ని రోజులు శివగిరిపై ప్రత్యేక పూజలతో పాటుగా ప్రతిరోజూ అన్నదానం నిర్వహిస్తారు. శివరాత్రి రోజున హిమాలయ నాగసాధువులచే చితాభస్మాభిషేకం, శివకళ్యాణంతోపాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శివరాత్రి నాటితో పాటుగా కార్తికమాసంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలను విజయవాడలోని రహదారులపై ఊరేగింపు జరుగుతుంది. ఈ విధంగా ఊరేగింపు జరుగుతున్న సమయంలో అక్కడ ఉండే ఒక ముస్లిం మహిళ వచ్చి శివుడుకి హారతులు ఇస్తారు. శివగిరిపైన భక్తులు వారి సొంత ఖర్చులతో శివలింగాన్ని ప్రతిష్టించుకోవచ్చునని శివగిరి వ్యవస్థాపకుడు మల్లికార్జునశర్మ చెప్పారు. (అన్నీ వింత సందేహాలే...బుర్ర తిరిగిపోతోంది..!) అంతా శివయ్య మహిమే!మా తల్లిదండ్రులు శివయ్యను పూజించేవారు. నేను వృత్తిరీత్యా న్యాయవాదిని, నాకు ఒకరోజు కలలో స్వామి వారు దర్శనం ఇచ్చి కొండపై పంచముఖ శివలింగాన్ని ప్రతిష్టించు, నీకు సాధ్యం అవుతుంది, అంతా నేను చూసుకుంటా అని చెప్పినట్లుగా అనిపించింది. అప్పటి నుంచి ఇంటి దగ్గర ఉన్న కొండపై ఈ పంచముఖ శివలింగాన్ని ప్రతిష్టించాను. శివయ్యే నా ద్వారా ఇదంతా చేయిస్తున్నాడు. మల్లికార్జున శర్మ, శివగిరి వ్యవస్థాపకుడు మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి శివయ్యను దర్శించుకుని వద్దాం. .పదండి...– కొండిబోయిన సుబ్రమణ్యం – సాక్షి, మొగల్రాజపురం, విజయవాడ తూర్పు -
శివ శివా.. శివలింగంపై కాళ్లా!
సాక్షి, బెంగళూరు: శివలింగంపై ఒక స్వామీజీ పాదాలు మోపి పూజలు చేయించుకున్న ఘటన కర్ణాటకలో సంచలనమైంది. ఆయన తీరుపై శైవ భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నెల 5న బెంగళూరు శివారు రంగనబెట్ట సమీపంలో శాంతలింగేశ్వర మఠానికి చెందిన మరో శాఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా శివలింగానికి ప్రాణప్రతిష్ట చేసే సమయంలో మఠానికి చెందిన శాంతలింగేశ్వర స్వామి తన పాదాలను ఆ శివలింగంపై పెట్టగా, ఆయన శిష్యులు పూజలు చేశారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏడాదిలో ఉగాది రోజు మాత్రమే మాట్లాడే శాంతలింగేశ్వర స్వామీజీ ఈ విషయమై తన శిష్యుల ద్వారా మీడియాకు వివరణ ఇప్పించారు. వీరశైవ విధానం ప్రకారమే పూజలు జరిగాయని చెప్పారు. -
శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు
ఎన్పీకుంట (కదిరి) : మండల కేంద్రంలోని మల్లిఖార్జునస్వామి ఆలయంలోని శివలింగాన్ని గురువారం సూర్యకిరణాలు తాకాయి. ఆలయ అర్చకులు నాగేశ్వరస్వామి యథావిధిగా స్వామివారి తలుపులు తెరిచి పూజలు చేస్తుండగా ఈ దృశ్యం చోటు చేసుకున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా రెండుసార్లు ఇలా జరుగుతుందన్నారు. ఉత్తరాయణం నుంచి దక్షిణాయానికి వెళ్లేటప్పుడు.. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సూర్యడు పయనించేటప్పుడు ఇలా జరుగుతుందని అర్చకులు తెలిపారు. -
శివలింగం @ 75 అడుగులు
పుట్టపర్తి అర్బన్ : పుట్టపర్తి పరిధిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సమీపంలో భారీ శివలింగ మందిర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దేశంలోనే అతిపెద్ద శివలింగ మందిరం పుట్టపర్తిలో ఏర్పాటు కానుండటంతో బాబా భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి పొందిన పుట్టపర్తిలో కోటి రూపాయల వ్యయంతో నిర్మితమైన ఈ శివలింగ మందిరం సుమారు 75 అడుగుల ఎత్తు ఉంది. ఇందులో మూడు అంతస్తులు ఉంటాయని, అందులో లేజర్ షో, మెడిటేషన్ గది నిర్మాణం పూర్తయినట్లు ప్రజాపిత బ్రహ్మకుమారి ట్రస్ట్ సభ్యులు తెలిపారు. మహా శివరాత్రి పర్వదినం రోజున ఈ శివలింగ మందిరాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. పెయింటింగ్ పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఇది దేశంలోనే అతి పెద్ద శివలింగ మందిరమని ఫౌండర్ రతన్దాదా తెలిపారు. లండన్ నుంచి విచ్చేసిన ఆయన మూడు రోజుల నుంచి పుట్టపర్తిలో ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. -
హెచ్సీయూలో శివలింగం ప్రత్యక్షం
రాజ్యాంగ విరుద్ధం : విద్యార్థి జేఏసీ హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హఠాత్తుగా శివలింగం, నంది, నాగ ప్రతిమలు ప్రత్యక్షమయ్యాయి. గతంలో వాటిని అక్కడ చూడలేదని, హఠాత్తుగా ఎక్కడినుంచి వచ్చాయో అర్థం కావడంలేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. క్యాంపస్ పరిధిలోని మెయిన్ గేట్ వెలుపల రాత్రికి రాత్రి విగ్రహాలు వెలియడం చర్చనీయాంశంగా మారింది. లౌకికత్వానికి ప్రతీకగా నిలవాల్సిన వర్సిటీల్లో దేవుడి విగ్రహాలను ఏర్పాటు చేయడం సరైంది కాదని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబేడ్కర్ విగ్ర హం ఏర్పాటుకు అనుమతించని అధికారులు, ఒక మతానికి సంబంధించిన విగ్రహాలను ఎలా కొనసాగిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఓ వైపు అంబేడ్కర్ 125వ జయంతిని ఘనంగా నిర్వహిస్తూనే మరోవైపు అంబేడ్కర్ గుర్తులు లేకుండా చేసేందుకు కుట్రపన్నుతున్నారని వారు పేర్కొన్నారు. క్యాంపస్లో నిర్భందాన్ని ప్రయోగిస్తూ ఒక వర్గం అభిప్రాయాలు, భావాలను అందరిపై రుద్దడం సరి కాదన్నారు. -
శివలింగం ఇంటిపై ఏసీబీ దాడి
హైదరాబాద్ : సరూర్నగర్లోని అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివలింగంతోపాటు ఆయన బంధువుల నివాసంపై ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంలో దాడి చేశారు. వారి నివాసాల్లో ఏసీబీ అధికారులు సొదాలు నిర్వహిస్తున్నారు. ఏఎంవీఐగా విధులు నిర్వహిస్తున్న శివలింగం ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ఆగంతకులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దాంతో ఏసీబీ అధికారులు గురువారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు కీలక పత్రాలతోపాటు భారీగా నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. -
భూమిలో పురాతన శివలింగం