sreenidhi
-
స్త్రీనిధి.. రూ.45 కోట్లు
చుంచుపల్లి: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) 2018–19 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళికలను సిద్ధం చేసింది. జిల్లాలోని 18,121 మహిళా సంఘాలకు రూ. 45 కోట్లు అందించేందుకు గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు వార్షిక ప్రణాళిక రూపొందించారు. 2017–18లో రుణ లక్ష్యం రూ.25.14 కోట్లు పెట్టుకోగా, మహిళా సంఘాలకు రూ.32.35 కోట్లు పంపిణీ చేశారు. లక్ష్యానికి మించి రూ.7.21 కోట్లు అధికంగా రుణాలు ఇచ్చారు. సాధికారత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇస్తున్న స్త్రీ నిధి రుణాలతో మహిళలు ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. జిల్లాలోని 18,121 మహిళా సంఘాల్లో 1,64,867 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరందరికీ ప్రయోజనం కలగనుంది. ఈ ఏడాది రూ.20 కోట్లు పెరిగిన లక్ష్యం మహిళా సంఘాలకు ప్రభుత్వం అందించే రుణాల లక్ష్యం పెరుగుతోంది. స్త్రీనిధి ద్వారా కేవలం రుణ అర్హత సాధించిన సంఘాలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. 2016–17లో మహిళా సంఘాలకు రూ.19.52 కోట్ల రుణం లక్ష్యం పెట్టుకోగా రూ.16.95 కోట్లను అందజేశారు. 3,479 సంఘాలకు అందజేసి లక్ష్యంలో 86.84 శాతం నమోదు చేశారు. 2017–18లో రూ.25.14 కోట్లను లక్ష్యంగా పెట్టుకోగా, రూ.32.35 కోట్లను అందించారు. 5,779 గ్రూపులకు రుణాలు ఇచ్చి లక్ష్యానికి మించి 128 శాతం నమోదు చేశారు. ఇక 2018–19లో గతేడాది కంటే రూ.20 కోట్లు అధికంగా రూ.45 కోట్లు అందించేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మైక్రో, జనరల్, టైనీ రుణాల రూపంలో రూ.1.25 కోట్లను 312 గ్రూపులకు చెల్లించారు. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల పంపిణీకి అధికారులు ఇప్పటికే చేపట్టారు. -
హెచ్పీఎస్, శ్రీనిధి జట్ల శుభారంభం
సాక్షి, హైదరాబాద్: వీవీఎస్ కప్ అండర్-14 ఇంటర్స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్, హెచ్పీఎస్ రామంతపూర్ జట్లు శుభారంభం చేశారుు. శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ మైదానం వేదికగా శుక్రవారం హిల్సైడ్ స్కూల్తో జరిగిన మ్యాచ్లో ఆతిథ్య శ్రీనిధి జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హిల్సైడ్ స్కూల్ 7.3 ఓవర్లలో 30 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి బౌలర్లలో నిమిష్ 3 వికెట్లు దక్కించుకోగా... నితిన్ కేవలం 3 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీనిధి జట్టు 2.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 31పరుగులు చేసి గెలిచింది. 4 వికెట్లతో రాణించిన నితిన్ సారుుకి బెస్ట్ ప్లేయర్ పురస్కారం లభించింది. మెరిడియన్ (మాదాపూర్)స్కూల్తో జరిగిన మరో మ్యాచ్లో హెచ్పీఎస్ రామంతపూర్ జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన మెరిడియన్ జట్టు 10.3 ఓవర్లలో 41 పరుగులకు ఆలౌటైంది. హెచ్పీఎస్ బౌలర్ బాలాజీ 4 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి అద్భుతంగా రాణించాడు. అనంతరం హెచ్పీఎస్ జట్టు 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసి గెలిచింది. ధనుశ్ (19 నాటౌట్), వ్యాస్ (14 నాటౌట్) రాణిం చారు. బౌలింగ్లో రాణించిన బాలాజీకి బెస్ట్ ప్లేయర్ అవార్డు దక్కింది. -
స్వశక్తి సంఘాల మహిళలకు రూ.1600 కోట్ల రుణాలు
చిగురుమామిడి : రాష్ట్రంలో స్వశక్తి మహిళలకు రూ.1600 కోట్ల రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీనిధి రాష్ట్ర మేనేజంగ్ డైరెక్టర్ జి.విద్యాసాగర్రెడ్డి తెలిపారు. మండలంలోని ముఖ్యమంత్రి దత్తత గ్రామం చిన్నముల్కనూర్లో స్వశక్తి సంఘ మహిళలతో బుధవారం సమావేశం నిర్వహించారు. విద్యాసాగర్రెడ్డి మాట్లాడుతూ మైక్రో, టిన్నీల కింద రూ.600 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. మైక్రో పథకం కింద ప్రతి మహిళకు రూ.25వేల నుంచి రూ.50వేల వరకు, టిన్నీ కింద రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 4.50 లక్షల స్వశక్తి సంఘాలకు 2.25 లక్షల సంఘాలకు స్రీనిధి ద్వారా రుణాలు ఇచ్చినట్లు వివరించారు. గతేడాది 99శాతం రికవరీ సాధించగా.. కరీంనగర్ జిల్లా ముందంజలో ఉందన్నారు. ఈ సంవత్సరం 20వేల పాడిపశువుల కొనుగోలుకు రూ.100 కోట్లు కేటాయించామన్నారు. రుణాల మంజూరు, రికవరీ పారదర్శకంగా ఉండేందుకు ఆధార్కార్డుల లింకేజీకి ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ.350 కోట్ల శ్రీనిధి డిపాజిట్లు సేకరించినట్లు తెలిపారు. డీజీఎం ఎల్లయ్య, ఏజీఎం రవికుమార్, హుస్నాబాద్ ఏసీ శ్రీనివాస్, ఏపీఎం సంపత్, సీసీలు సంపత్, వెంకటమల్లు, వెంకటేశ్వర్లు, స్వశక్తి సంఘాల మహిళలు పాల్గొన్నారు. -
చెప్పుల కోసం వెళ్లి....