sri sailam dam
-
శ్రీశైలం ప్రాజెక్ట్ ఖాళీ!
సాక్షి, అమరావతి: నాగార్జునసాగర్లో శుక్రవారం 552.4 అడుగుల్లో 215.1 టీఎంసీలు నిల్వ ఉన్నాయి... కుడి, ఎడమ కాలువ కింద ఆయకట్టుకు సరఫరా చేయడానికి సరిపడా నీళ్లున్నాయి... అంటే.. సాగర్ ఆయకట్టుతోపాటు దిగువన కూడా ఎలాంటి నీటి అవసరాలు లేవన్నది స్పష్టమవుతోంది. అయినా శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ శుక్రవారం 14,126 క్యూసెక్కులను తరలిస్తోంది. కొన్నాళ్లుగా ఇదే తంతు కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ కనీస నీటి మట్టం(minimum water level) 854 అడుగులకంటే దిగువకు చేరుకుంది. శ్రీశైలం జలాశయం(Srisailam Reservoir) గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు 215.80 టీఎంసీలు కాగా, శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 853.2 అడుగుల్లో 87.24 టీఎంసీలకు నీటిమట్టం తగ్గిపోయింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టుకు నీళ్లందించలేని పరిస్థితి ఏర్పడింది. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ద్వారా కేవలం 1,600 క్యూసెక్కులను మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం తరలిస్తోంది. తెలంగాణ జెన్కో ఇదే రీతిలో నీటిని తోడేస్తే.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీటికి సైతం ఇబ్బందులు తప్పవని అధికారవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. కృష్ణా జలాలపై రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల హక్కులను తెలంగాణ జెన్కో కాలరాస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తోందని నీటిపారుదలరంగ నిపుణులు మండిపడుతున్నారు. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి 2019–20, 20–21, 21–22, 22–23 తరహాలోనే ఈ నీటి సంవత్సరంలోనూ శ్రీశైలానికి గరిష్టంగా 1,575.62 టీఎంసీల ప్రవాహం వచ్చింది. అయినా జనవరి ఆఖరుకే శ్రీశైలంలో నీటిమట్టం కనీస స్థాయికి దిగువకు చేరింది. రెండు రాష్ట్రాలను కృష్ణా బోర్డు సమన్వయం చేసి ఉంటే.. ప్రకాశం బ్యారేజీ నుంచి 869.72 టీఎంసీలు కడలిలో కలిసేవి కావని.. శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పటికీ గరిష్ట స్థాయిలో నీటి నిల్వ ఉండేదని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు.ఆది నుంచి ఇదే తీరు...నీటి సంవత్సరం ప్రారంభం నుంచే వరద ప్రవాహం మొదలు కాకపోయినా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జూన్ మొదటి వారంలో నీటిని తరలించే ప్రక్రియకు తెలంగాణ సర్కార్, జెన్కో శ్రీకారం చుట్టాయి. కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు లేకపోయినా యథేచ్ఛగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ వచ్చింది. రబీలో సాగు.. వేసవిలో తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని నిల్వ ఉంచాలని, విద్యుత్ ఉత్పత్తి చేయొద్దని కృష్ణా బోర్డు ఆదేశించినా... తెలంగాణ జెన్కో ఖాతరు చేయలేదు. తెలంగాణ జెన్కో యథేచ్ఛగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తున్నా మన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఈ ఏడాది శ్రీశైలానికి 1,575.62 టీఎంసీల ప్రవాహం వచ్చినా ఫలితం లేకపోయిందని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కృష్ణా బోర్డుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసి.. తెలంగాణ జెన్కోను కట్టడి చేసి ఉంటే శ్రీశైలంలో ఇప్పటికీ గరిష్ట స్థాయిలో నీటి నిల్వ ఉండేదని చెబుతున్నారు. -
శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తివేత
శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తింది. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు సోమవారం శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తివేశారు. 6,7,8 గేట్లు ఎత్తి దిగువకు నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 4.69లక్షల క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 58వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 878.4 అడుగులకు చేరుకుంది. దీంతో వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో మూడు గేట్లను ఎత్తిన అధికారులు.. ఒక్కో గేటు నుంచి 27వేల క్యూసెక్కులను విడుదల చేశారు. 6, 7, 8 గేట్లను ఎత్తడం ద్వారా మొత్తంగా 81వేల క్యూసెక్కుల నీటిని కర్నూలు చీఫ్ ఇంజినీర్ కబీర్ బాషా నాగార్జున సాగర్కు విడుదల చేశారు. -
గోదావరి తగ్గుముఖం
సాక్షి, హైదరాబాద్/భద్రాచలం: ఎగువ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా వర్షాలు తగ్గడంతో గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం వద్ద వరద తగ్గినప్పటికీ, ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసాని, వాగులు, వంకల్లో వరద కొనసాగుతోంది. దీంతో భద్రాచలంతో పాటు దాని దిగువ ప్రాంతాల్లో గోదావరి ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ప్రవహిస్తోంది. శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 90.3 టీఎంసీలు కాగా, ఎగువ గోదావరిలో 25వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో నీటి నిల్వలు 23.31 టీఎంసీలకు చేరాయి. కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు, మేడిగడ్డ, సమ్మక్క బరాజ్లకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వలు 12.13 టీఎంసీలకు పెరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్లోకి సోమవారం సాయంత్రం 9,54,130 క్యూసెక్కుల వరద రాగా, శనివారం సాయంత్రానికి 7,71,580 క్యూసెక్కులకు తగ్గింది. మేడిగడ్డలోకి చేరుతున్న వరదను చేరుతున్నట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. తుపాకులగూడెం(సమ్మక్క) బరాజ్లోకి సోమవారం సాయంత్రం 10,15,170 క్యూసెక్కులు రాగా, శనివారం సాయంత్రం 9,36,570 క్యూసెక్కులకు తగ్గాయి. మేడిగడ్డ, సమ్మక్క బరాజ్లకు వచి్చన వరదను వచ్చినట్టే కిందికి విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద శాంతిస్తున్న గోదావరి దిగువ గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని దుమ్ముగూడెం(సీతమ్మసాగర్) బరాజ్లోకి సోమవారం సాయంత్రం 11,86,801 క్యూసెక్కుల వరద రాగా, మంగళవారం సాయంత్రానికి 12,88,481 క్యూసెక్కులకు పెరిగింది. అంతేస్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదకు కిన్నెరసాని, తాలిపేరు, పెద్దవాగు వరద తోడవుతుండటంతో భద్రాచలం వద్ద సోమవారం రాత్రి 7 గంటలకు 12,17,861 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, మంగళవారానికి స్వల్పంగా పెరిగి 12,58,826 క్యూసెక్కులకు చేరింది. మంగళవారం ఉదయం 51.06 అడుగులుగా ఉన్న నీటిమట్టం కొంతసేపు నిలకడగా ఉంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ.. సాయంత్రం 6 గంటలకు 50.04 అడుగులకు చేరింది. మంగళవారం రాత్రి 12 గంటల సమయానికి 49.03 అడుగులకు నీటి మట్టం చేరింది. కాగా, రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉండగా 48 అడుగుల కంటే తగ్గితే రెండవ, 43 అడుగులకు తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరిస్తారు. బుధవారం గోదావరిలో వరద ఉధృతి మరింతగా తగ్గనుందని సీడబ్ల్యూసీ అంచనా వేస్తోంది. పూర్తిస్థాయిలో వరద తగ్గకపోవడంతో ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు భద్రాచలం నుంచి రాకపోకల్ని ఇంకా పునరుద్ధరించలేదు.శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి» 1,51,481 క్యూసెక్కుల నీటి రాకతో 842.42 అడుగులకు చేరిన నీటిమట్టం» ఎగువన కృష్ణా ప్రధానపాయలో కొనసాగుతున్న వరద » ఆల్మట్టి నుంచి 1.50, నారాయణపూర్ నుంచి 1.43 లక్షలు, జూరాల నుంచి 1,51,790 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల » శ్రీశైలంలోకి గంటగంటకూ పెరుగుతున్న కృష్ణా ప్రవాహం సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టుకు 1.09లక్షల క్యూసెక్కుల వరద రాగా, మంగళవారం సరిగ్గా ఇదే సమయానికి 1,51,481 క్యూసెక్కుల వరద వచి్చంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 832.5 అడుగుల నుంచి 842.42 అడుగులకు, నీటినిల్వ సామర్థ్యం 52.14 నుంచి 63.81 టీఎంసీలకు పెరిగింది. కృష్ణా పరీవాహక ప్రాంతం(బేసిన్)లో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రధానపాయతో పాటు ఉపనదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ల నుంచి వచ్చిన వరదను వచి్చనట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా 1.65లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, విద్యుదుత్పత్తి చేస్తూ.. గేట్లు ఎత్తి దిగువకు వదిలేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్న వరద క్రమేపీ పెరుగుతోంది. పరీవాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి మంగళవారం తగ్గుముఖం పట్టింది. తుంగభద్ర డ్యామ్లోకి సోమవారం సాయంత్రం 6 గంటలకు 1,04,972 క్యూసెక్కుల వరద రాగా, మంగళవారం సాయంత్రానికి 85,148 క్యూసెక్కులకు తగ్గింది. డ్యామ్ నీటి నిల్వ 93.46 టీఎంసీలకు చేరుకోగా, 9149 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదల చేసే జలాలు సుంకేశుల బ్యారేజీ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరనున్నాయి. ఇటు జూరాల నుంచి కృష్ణా.. అటు సుంకేశుల నుంచి తుంగభద్ర జలాలు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి మరింతగా పెరగనుంది. -
శ్రీశైలం డ్యామ్కు తప్పిన ప్రమాదం
కర్నూలు: శ్రీశైలం డ్యామ్కు పెనుప్రమాదం తప్పింది. డ్యామ్ గ్యాలరీలో షార్ట్ సర్క్యూట్తో మోటార్లు కాలిపోయాయి. సీకేజ్ వాటర్ తక్కువగా ఉండటంతో డ్యామ్కు ప్రమాదం తప్పింది. మరోపక్క, మెయిన్ గ్యాలరీ సెక్షన్ సీకేజ్ వాటర్తో పూర్తిగా నిండిపోయింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పలువురు అంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన డ్యామ్ సిబ్బంది మరమ్మత్తులు ప్రారంభించారు.