stale food
-
పాడైన మిక్చర్ పెడతావా?.. కోర్టు ఉద్యోగికి జడ్జి లీగల్ నోటీసులు
అధికారి తలచుకుంటే దెబ్బలకు కొదవా ? అలాగే న్యాయస్థానం వాళ్ళు అనుకోవాలిగానీ ఏ అంశం మీదైనా నోటీసులు ఇవ్వగలరు.. చొక్కా గుండీలు పెట్టుకోలేదని.. నల్లకళ్లజోడు పెట్టుకున్నావని.. టిప్ టాప్ గా తయారై కోర్టుకు వచ్చావని కూడా శిక్ష విధించగలరు.. నోటీసు ఇవ్వగలరు. పాపం ఉత్తరప్రదేశ్ లోని గొండా జిల్లాలో ఇలాగే ఓ కోర్టు అటెండర్ తనకు తాజా స్నాక్స్ పెట్టలేదని.. చెడిపోయిన మిక్చర్ ఇచ్చాడన్న కారణంతో సదరు జడ్జి కోపానికి వచ్చి ఏకంగా ఆ ఉద్యోగికి లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇదిప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లా కోర్టులో అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి నాలుగురోజుల క్రితం మధ్యాహ్న విరామ సమయంలో, గోండాలోని సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులో కలిశారు. వారిద్దరూ కాసేపు ఛాంబర్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా అతిథికి చాయ్ బిస్కెట్స్ అందించాలని కోర్టు అటెండర్ ను సెషన్స్ జడ్జి చెప్పారు.అయితే పాపం ఆ ఉద్యోగి కేవలం చాయ్ తీసుకొచ్చాడు. దీంతో జడ్జిగారు కోపంతో బిస్కెట్స్ తీసుకురమ్మని ఆదేశించారు. వెంటనే ఆ అటెండర్ పరుగెత్తుకువెళ్లి బిస్కెట్స్ బదులు దాల్మోత్ అనే మిక్చర్ లాంటిది తెచ్చి ఇచ్చాడు. అయితే అది నాణ్యత లేకపోగా చెడిపోయిన వాసనా వచ్చింది. దీంతో జడ్జిగారికి చిర్రెత్తుకొచ్చింది.. వెంటనే టింగ్ టింగ్ అని బెల్లు కొట్టి టైపిస్టును పిలిచి ఈ అటెండర్ నాకు సరిగా స్నాక్స్ ఇవ్వలేదు.. ముందు ఆయనకు నోటీస్ టైప్ చేసివ్వు.. అయన దానికి సమాధానం ఇచ్చుకుంటాడో ఉద్యోగం మనుకుంటాడో చూద్దాం అని హుకుం జారే చేసారు. అయన ఆదేశించిన మరుక్షణం ఉద్యోగి పేరిట నోటీస్ సిద్ధమైంది. ఇంతకూ ఆ నోటీసులో ఏముందంటే..“నేను బిస్కెట్లు తీసుకురమ్మన్నాను. కానీ నీవు బిస్కెట్లు తీసుకురాకుండా, బదులుగా చెడిపోయిన దాల్మోత్ను సర్వ్ చేసావు. అయితే, రెండు డబ్బాల్లో మంచి నాణ్యత గల బిస్కెట్లు క్యాబినెట్లో సిద్ధంగా ఉండగా కూడా, నీవు అవన్నీ విస్మరించి, బయటపడేయాల్సిన స్థితిలో ఉన్న దాల్మోత్ను ఇచ్చావు. ఇది గౌరవానికి భంగం కలిగించే చర్యగా, తీవ్రమైన నిర్లక్ష్యంగా భావిస్తున్నాం. దీనికి నువ్వు వివరణ ఇవ్వాల్సిందే అంటూ నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.. అయ్యో జడ్జిగారికి కోపం వస్తే ఏమవుతుందో చూసారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు-సిమ్మాదిరప్పన్న -
అత్తపై కోడలు ఫిర్యాదు, షాకైయిన పోలీసులు!
లక్నో: ఉత్తరప్రదేశ్లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అత్త తనకు వేడి వేడి అన్నం వడ్డించడంలేదంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరస్తోంది. గోరఖ్పూర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఇక ఈ విషయం తెలిసిన వారంత ఒకప్పుడు అత్తలకు కోడళ్లు సపర్యలు చేయడం చుశాము కానీ ఇలా అత్త తనకు సేవలు చేయడం లేదని కోడలు ఫిర్యాదు చేయడమెంటని అందరూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. వివరాలు.. గజహా పోలీసు స్టేషన్ పరిధిలోని మంజ్గన్వాలో అత్త, కోడళ్లు ఒకే ఇంట్లో ఉంటున్నారు. వీరిద్దరి భర్తలు ఉద్యోగాల రీత్యా వేరే ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో అత్త సమయానికి ఆహారం వడ్డించలేదంటూ కోడలు ఇటీవల పోలీసు హెల్ప్లైన్ నంబర్ 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిందట. దీంతో పోలీసులు వారింటికి చేరుకుని దర్యాప్తు చేయగా... ఆమె అత్త రోజంతా టీవీ సీరియల్స్లో లీనమైపోతోందని, తనకు వేడి వేడి ఆహారం వడ్డించడం లేదంటూ సదరు కోడలు పోలీసులకు చెప్పింది. అంతేగాక తనకు పాడైన ఆహారం పెట్టడం వల్ల ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని కోడలు పోలీసులతో వాపోయింది. ఇక ఆమె మాటలు విన్న పోలీసులు కూడా షాక్ అయ్యారు. కోడలు తనపై ఫిర్యాదు చేయడం చూసి అత్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కోడలు పనులు చేయకుండా రోజంతా ఫోన్ పట్టుకునే ఉంటుందని, ఇంటి పనుల్లో తనకు సాయం చేయడం లేదంటు పోలీసులకు చెప్పింది. అలాగే వంటింటి పనుల్లో కూడా తోడుగా ఉండటంలేదని వివరించింది. ఇక వారిద్దరి వాదనలు విన్న పోలీసులు.. అత్తకోడళ్లను మందలించారు. ఇలాంటి చిన్న విషయాలకే ఫోన్ చేసి పోలీసుల సమయం వృథా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చదవండి: మెగాస్టార్ పాటకు ఓ రేంజ్లో స్టెప్పులేసిన అనసూయ లైంగిక వేధింపులు: రాఖీ కడితే సరిపోతుందా?! -
ఎయిర్ఇండియాకు లక్ష జరిమానా
ఎయిర్ఇండియా సంస్థ ప్రయాణికుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వ్యవహరించి పాడైపోయిన ఆహారాన్ని సర్వ్ చేసినందుకు అత్యున్నత వినియోగదారుల కమిషన్ మొట్టికాయలు వేసింది. లక్ష రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాలంటూ ఆదేశాలు జారీచేసింది. ముంబాయి నుంచి న్యూయార్క్ వెళ్లే ఎయిర్ఇండియా విమానంలో ప్రయాణికులకు పాడైపోయిన ఆహారాన్ని సరఫరా చేసింది. దీనిపై మాలతీ మధుకర్ పహాడే అనే మహిళ ఎయిర్ ఇండియాలో పాడైపోయిన ఆహారాన్ని ప్రయాణికులకు సరఫరా చేసినట్టు వినియోగదారుల ఫోరమ్లో ఫిర్యాదు దాఖలు చేసింది. తన రైస్ బౌల్లో వెంట్రుకలు ఉన్నట్టు పేర్కొంది. ఈ ఫిర్యాదుపై విచారించిన మహారాష్ట్ర స్టేట్ కమిషన్ ఎయిర్ఇండియాకు జరిమానా విధించి, ప్రయాణికులకు కనీస మర్యాద ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చింది. మంచి ఆహారాన్ని అందించాలని పేర్కొంది. అయితే దీనిపై అత్యున్నత వినియోగదారుల కమిషన్లో ఎయిర్ ఇండియా రివ్యూ పిటిషన్ 2015లో దాఖలు చేసింది. ఈ వివాదాన్ని విచారించిన జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్, రివిజన్ పిటిషన్ కొట్టేసింది. ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం వహిస్తూ పాడైపోయిన ఆహారం సరఫరా చేయడం ప్రయాణికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని తీర్పునిచ్చింది. లక్షరూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. సర్వీసులోని నిర్లక్ష్యం బట్టి జరిమానా విధించినట్టు బెంచ్ అధినేత జస్టిస్ అజిత్ బారిహోక్ తెలిపారు. వ్యాజ్యాల ఖర్చుల కింద రూ.10వేలు చెల్లించాలని కూడా ఆదేశాలు జారీచేశారు.