Supreme Court
-
బీమా సంస్థ బాధ్యత వహించదనే షరతు అసంబద్ధం
బీమా చేసిన వ్యక్తి ఆవరణలో కాకుండా మరెక్కడైనా వాహనాన్ని ఉపయోగించి ప్రమాదం జరిగితే బీమా(Insurance) సంస్థ బాధ్యత వహించదనే పాలసీ షరతు అసంబద్ధమని సుప్రీంకోర్టు(Supreme Court) ఇటీవల వ్యాఖ్యానించింది. ఇన్సూరెన్స్ చేసిన వాహనం క్రేన్ కావడంతో కోర్టు తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. నిర్మాణ ప్రదేశాల్లోనే క్రేన్లను ఉపయోగిస్తారని తెలియజేస్తూ, ఈ పరిస్థితిని ఇరు పక్షాలు వివిధ స్థాయుల్లో పరిష్కరించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది.పాలసీదారుడు తన టాటా హిటాచీ హెవీ డ్యూటీ క్రేన్కు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ బీమా తీసుకున్నాడు. 2007లో జంషెడ్పూర్లోని టాటా స్టీల్ వద్ద పనులు నిర్వహిస్తుంటే క్రేన్ ప్రమాదానికి గురైంది. దాంతో పాలసీ క్లెయిమ్ చేయాలని అర్జీ పెట్టుకున్నాడు. కానీ కంపెనీ తన పాలసీను తిరస్కరించింది. అందుకు పాలసీ షరతులను కారణంగా చూపింది. ప్రమాదం వల్ల నష్టం జరిగినప్పటికీ బీమా చేసిన వ్యక్తి ఆవరణ వెలుపల వాహనాన్ని ఉపయోగించినట్లయితే బీమా సంస్థ బాధ్యత వహించదనే షరతును ఉటంకిస్తూ క్లెయిమ్ను తిరస్కరించింది. దాంతో పాలసీదారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇటీవల ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఇలాంటి షరతు సహేతుకం కాదని, ముఖ్యంగా క్రేన్లను సాధారణంగా కార్యాలయ ఆవరణలో కాకుండా నిర్మాణ ప్రదేశాల్లోనే ఉపయోగిస్తారని వివరించింది. పాలసీ కొనుగోలు, రెన్యువల్ సమయంలో ఈ షరతును పరిష్కరించకపోవడంపై కోర్టు ఇరు పక్షాలపై అసహనం వ్యక్తి చేసింది. బీమా కంపెనీలు పాలసీదారులకు స్పష్టమైన, న్యాయమైన నిబంధనలు కల్పించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. పాలసీదారుకు వెంటనే క్లెయిమ్ మొత్తాన్ని సెటిల్ చేయాలని బీమా కంపెనీని ఆదేశించింది.ఇదీ చదవండి: ఎఫ్ఐఐల తీరుపై ఉదయ్కోటక్ స్పందనఈ తీర్పు బీమా పరిశ్రమలో అనుసరిస్తున్న కొన్ని షరతులను సడలించేలా చర్యలు తీసుకునేందుకు కీలకంగా మారిందని కొందరు భావిస్తున్నారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించడం, బీమా పాలసీల్లో పారదర్శకతను పెంపొందించడంలో సుప్రీంకోర్టు నిబద్ధతను ఈ తీర్పు హైలైట్ చేస్తోంది. -
యూట్యూబ్ ఛానళ్ల ఇష్టారాజ్యానికి కళ్లెం వేయనున్న సుప్రీంకోర్టు
-
రణ్వీర్కు సుప్రీం చీవాట్లు
న్యూఢిల్లీ: యూట్యూబ్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇన్ఫ్లూయెన్సర్ రణ్వీర్ అలహాబాదియా అలియాస్ బీర్బైసెప్స్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడి వ్యాఖ్యలు వక్రబుద్ధితో కూడినవంటూ మండిపడింది. ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ పేరుతో యూట్యూబ్లో కమెడియన్ సమయ్ రైనా నిర్వహించిన షోలో రణ్వీర్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడం తెలిసిందే. దీనిపై మహారాష్ట్ర, అసోంల్లో కేసులు నమోదయ్యాయి.ఆయన వ్యాఖ్యలను కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘మీ మనసులో ఉన్న నీచమైన ఆలోచనలను షోలో వెళ్లగక్కారు. మీరు వాడిన పదజాలం కుమార్తెలు, తోబుట్టువులు, తల్లిదండ్రులే గాక మొత్తంగా ఈ సమాజమే అవమానంగా భావించేలా ఉంది. ఇది అశ్లీలత కాకపోతే మరేమిటి? మీపై నమోదైన కేసులను ఎందుకు కొట్టివేయాలి? దేశవ్యాప్తంగా పలుచోట్ల మీపై నమోదవుతున్న ఎఫ్ఐఆర్లను ఎందుకు కలపాలి?’’ అని న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం నిలదీసింది.చౌకబారు ప్రచారం కోసం మీరు ఇలాంటివి చేస్తే, ఇలాగే చీప్ పబ్లిసిటీ కావాలనుకునేవారు బెదిరింపులకు పాల్పడతారంటూ ధర్మాసనం తలంటింది. వాక్ స్వాతంత్య్రం ఉందని సమాజ సహజ విలువలు, సూత్రాలకు విరుద్ధంగా మాట్లాడేందుకు ఎవరికీ లైసెన్సు లేదని స్పష్టం చేసింది. అతడు వాడిన భాషను మీరు సమర్థిస్తున్నారా? అని లాయర్ అభినవ్ చంద్రచూడ్ను ప్రశ్నించగా, వ్యక్తిగతంగా తనకూ అసహ్యం కలిగించాయంటూ ఆయన బదులిచ్చారు. ఆసే్ట్రలియా టీవీ ప్రోగ్రామ్లో ఓ నటుడి డైలాగ్ను కాపీ కొట్టి అలహాబాదియా ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తమకూ తెలుసునని ధర్మాసనం పేర్కొంది. ‘ఇలాంటి కార్యక్రమాలను ప్రసారం చేసేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకుంటారు. పెద్దలకు మాత్రమే అనే హెచ్చరిక కనిపిస్తుంది. ఆ్రస్టేలియా కార్యక్రమాన్ని కాపీ చేసిన ‘ఇండియాస్ గాట్ లాటెంట్’నిర్వాహకులు ఈ జాగ్రత్తలేవీ తీసుకోలేదు’అని ధర్మాసనం తెలిపింది. ఇకపై కేసులొద్దు అలహాబాదియాకు చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని, ఈ ఒక్క అంశంపైనే చాలా చోట్ల కేసులు నమోదయ్యాయంటూ లాయర్ అభినవ్ చంద్రచూడ్ తెలపడంతో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఆయనను ప్రస్తుతానికి అరెస్టు చేయరాదంటూ పోలీసులను ఆదేశించింది. అదేవిధంగా, ఇదే అంశంపై ఇకపై కేసులు నమోదు చేయవద్దని స్పష్టం చేసింది. ఇకపై ఆ యూట్యూబ్ షోను ప్రసారం చేయరాదని స్పష్టం చేసింది. కొంతకాలంపాటు ఇతర షోల్లో పాల్గొనవద్దని అలహాబాదియాకు స్పష్టం చేసింది.పాస్పోర్ట్ను థానే పోలీసులకు ఇవ్వాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, మహారాష్ట్ర, అసోం పోలీసులకు విచారణలో సహకరించాలని అతడిని ఆదేశించింది. తనపై నమోదైన పలు ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని, వాటన్నిటిపై ఒకే చోట విచారణ జరపాలంటూ అలహాబాదియా వేసిన పిటిషన్పై కేంద్రం, మహారాష్ట్ర, అసోం రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్ర సైబర్ పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.వివాదాస్పద కామెడీ షోకు సంబంధించిన మొత్తం 18 ఎపిసోడ్లను తొలగించాలని యూట్యూబ్ను కోరారు. ఖర్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాలంటూ అలహాబాదియాకు ముంబై పోలీసులు సమన్లు ఇచ్చారు. అయితే, అతడు తమతో టచ్లో లేడని ముంబై పోలీసులు తెలిపారు. అలహాబాదియాపై ఇండోర్, జైపూర్లలోనూ కేసులు నమోదయ్యాయి. ఆప్ నేత సత్యేందర్ జైన్పై విచారణకు రాష్ట్రపతి అనుమతిన్యూఢిల్లీ: మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్(60)ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతి మంజూరు చేశారు. ఆయనపై ఆరోపణలకు తగు ఆధారాలున్నందున దర్యాప్తునకు అనుమతివ్వాలంటూ హోం శాఖ రాష్ట్రపతిని కోరింది. ఈ మేరకు ఆమె భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 218 ప్రకారం అనుమతించారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు సమాచారంతో ఈడీ కోర్టులో తాజాగా సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేయనుంది. హవాలా లావాదేవీల ఆరోపణలపై మంత్రిగా ఉన్న జైన్ను ఈడీ 2022 మేలో అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. -
రెండో పెళ్లితో ‘చిక్కుల్లో’ ఐపీఎస్.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా..
జైపూర్ : రెండో వివాహం ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని చిక్కుల్లో పడేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి సీనియర్ ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఓ ఐపీఎస్ అధికారి హోదా తగ్గించింది. ఈ నిర్ణయంతో సీనియర్ ఐపీఎస్ అధికారిగా హోదాతో పాటు తీసుకునే పేస్కేలు సైతం తగ్గింది. కొత్తగా విధుల్లో చేరిన ఐపీఎస్ ఎంత వేతనం తీసుకుంటారో.. అంతే వేతనం సదరు సీనియర్ ఐపీఎస్ అధికారికి అందుతుంది.పలు నివేదికల ప్రకారం.. రాజస్థాన్ కేడర్ ఐపీఎస్ అధికారి పంకజ్ కుమార్ చౌదరి జైపూర్లో కమ్యూనిటీ పోలీసింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్నారు. అయితే పంకజ్ కుమార్ మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకుండా రెండో వివాహం చేసుకున్నారు. ఈ వివాదంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ పంకజ్ కుటుంబ సభ్యులు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టుకు చేరింది. విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని పంకజ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.ఈ తరుణంలో ఐపీఎస్ అధికారి పంకజ్ కుమార్ వివాహంపై రాజస్థాన్ రాష్ట్ర ఉన్నాతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో పంకజ్ కుమార్ దోషిగా తేల్చారు. విచారణ అనంతరం మూడు సంవత్సరాల పాటు ప్రస్తుతం ఉన్న తన డిజిగ్నేషన్ను తగ్గించారు. లెవల్ 11 సీనియర్ పే స్కేల్ నుండి లెవల్ 10 జూనియర్ పే స్కేల్కు కుదించారు. ఈ పేస్కేల్ కొత్తగా విధుల్లోకి చేరిన ఐపీఎస్లకు కేటాయిస్తారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా, 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పంకజ్ చౌదరి. ప్రస్తుతం,జైపూర్లో కమ్యూనిటీ పోలీసింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్నారు. హోదా తగ్గించడంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (లెవల్ 10)గా కొనసాగనున్నారు. -
నేడు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేల కేసుపై మంగళవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోసారి విచారించనుంది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతూ జనవరి 15న బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్లు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎం.సంజయ్కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీలపై బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ రెండు పిటిషన్లపై ఈనెల 10న సుప్రీం కోర్టు విచారించింది. విచారణ సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. రాజకీయ పారీ్టల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే చూస్తూ ఊరుకోం’అంటూ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం పేర్కొంది. అనంతరం ఈనెల 18కి విచారణను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. -
పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు.. కూటమి ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం
సాక్షి,అమరావతి : రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించింది. పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ టీవీ కెమెరాల ఏర్పాట్లపై కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1392 పోలీస్ స్టేషన్లు ఉంటే 1001 స్టేషన్లలోనే ఎందుకు సీసీ కెమెరాలు పెట్టారు? మిగిలిన స్టేషన్లలో ఎందుకు సీసీ కెమెరాలు పెట్టలేదు? సుప్రీంకోర్టు మార్గదర్శికాల ప్రకారం సీసీటీవీలు పెట్టరా..? పోలీస్ స్టేషన్ ప్రాంగణం మొత్తం కనిపించేలా సీసీటీవీలు ఏర్పాటు చేశారా..?అని ప్రశ్నలు సంధించింది. సీసీటీవీ కెమెరాల ఏర్పాట్లపై డీఎస్పీలందరి నుంచి నివేదిక తెప్పించుకోవాలని, ఆ నివేదికను కోర్టు ముందు ఉంచాలని సూచించింది. అదే సమయంలో జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాట్లపై వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ముగ్గురు అదనపు జడ్జీల శాశ్వత హోదాకు కేంద్రం ఓకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న ముగ్గురు అదనపు న్యాయమూర్తు లకు శాశ్వత న్యాయమూర్తి హోదా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 5న కేంద్ర ప్రభుత్వానికి వీరి హోదా గురించి సిఫారసు చేసింది.జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారా యణ, జస్టిస్ జూకంటి అనిల్కుమార్, జస్టిస్ కె.సుజనలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలన్న ప్రతిపాదనలకు కొలీజియం ఈ నెల 5వ తేదీనే ఆమోదం తెలిపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయగా, రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.ఈ ముగ్గురు న్యాయ మూర్తులు 2023, జూలై 31న హైకోర్టు అద నపు న్యాయమూర్తులుగా నియమితులైన విష యం తెలిసిందే. కాగా, శాశ్వత న్యాయ మూర్తు లుగా జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ జూకంటి అనిల్కుమార్, జస్టిస్ కె.సుజన శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు. -
బాబుతోనే సీఐడీ అటాచ్మెంట్!
సాక్షి, అమరావతి: ‘అవినీతి కేసు(Corruption Case)ల్లో ప్రధాన నిందితుడు చంద్రబాబు(Chandrababu)తోనే మాకు అటాచ్మెంట్.. అంతేతప్ప, అవినీతితో కొల్లగొట్టిన ఆస్తుల అటాచ్మెంట్ గురించి మాత్రం పట్టించుకోం’ అన్నట్లుంది రాష్ట్రంలో ప్రస్తుతం సీఐడీ పరిస్థితి. చంద్రబాబు అవినీతి కేసులను నీరుగార్చే కుట్రను సీఐడీ వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఈ కేసుల్లో అబద్ధపు వాంగ్మూలాల కోసం సాక్షులను వేధిస్తున్న సీఐడీ(CID).. మరోవైపు ఆ కేసుల్లో గతంలో అటాచ్ చేసిన ఆస్తులను నిందితులకు ఏకపక్షంగా ధారాదత్తం చేసేస్తోంది. గతంలో సీఐడీ అటాచ్ చేసిన కరకట్ట బంగ్లాను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ప్రకటించింది.అంతేకాకుండా గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరించినప్పుడు కూడా కరకట్ట బంగ్లానే ఆయన అధికారిక నివాసంగా కూడా గుర్తిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం న్యాయ నిపుణులను సైతం విస్మయ పరుస్తోంది. ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసి నిర్మించిన భవనాన్ని తన అధికారిక నివాసంగా సీఎం ప్రకటించడం విస్తుగొలుపుతోంది.2014–19 మధ్య టీడీపీ(TDP) ప్రభుత్వంలో రాజధాని అమరావతిలో అసైన్డ్ భూములు కొల్లగొట్టిన కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసుల్లో చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆ కేసుల్లో ఆయన ఏ1గా సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కేసులు నమోదు చేయడంతోపాటు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. చంద్రబాబు తన సన్నిహితుడు లింగమనేని రమేశ్తో కలిసి భారీ భూ దోపిడీకి పాల్పడినట్లు కీలక ఆధారాలు సేకరించింది.ఆ క్విడ్ ప్రో కో కుట్రలో భాగంగానే లింగమనేని రమేశ్ కుటుంబానికి చెందిన కరకట్ట బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చినట్లు నిగ్గు తేల్చింది. అందుకే ఆ బంగ్లాను సీఐడీ అటాచ్ చేసింది. ఆ మేరకు న్యాయస్థానం అనుమతి కోరుతూ పిటిషన్ కూడా దాఖలు చేసింది. గడువు ఏడాది పూర్తయిన తర్వాత దర్యాప్తు నిబంధనల మేరకు సీఐడీ కరకట్ట బంగ్లా అటాచ్మెంట్ గడువు పొడిగించాలని న్యాయస్థానాన్ని కోరాలి. ఎందుకంటే ఆ కేసులు ఇంకా కోర్టు విచారణలో ఉన్నాయి కాబట్టి. అలాగే, చంద్రబాబు బెయిల్ రద్దు కోసం సీఐడీ గతంలో దాఖలు చేసిన పిటిషన్పై కూడా సుప్రీంకోర్టు విచారణ కొనసాగుతోంది. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఐడీ ప్లేటు ఫిరాయించింది. చంద్రబాబు అవినీతి కేసులను నీరుగార్చడమే లక్ష్యంగా డీజీపీ, సీఐడీ చీఫ్లు వ్యవహరిస్తున్నారు. అందుకే కరకట్ట బంగ్లా అటాచ్మెంట్ గడువు పొడిగించాలని సీఐడీ న్యాయస్థానాన్ని కోరలేదు. దీంతో కరకట్ట బంగ్లాను సీఎం చంద్రబాబు అధికారిక నివాసంగా గుర్తిస్తూ ప్రభుత్వం గత నెల ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా గత ఏడాది జూన్ 12 నుంచి.. అంటే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం అధికారిక నివాసంగా గుర్తిస్తున్నట్లు పేర్కొంది. దీన్నిబట్టి ప్రధాన నిందితుడు చంద్రబాబుతో సీఐడీ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. న్యాయస్థానం ఆదేశాల ఉల్లంఘనటీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా మరోసారి నిబంధనలను ఉల్లంఘించింది. 2014–19 మధ్య చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వ్యవహరించినప్పుడు ఆయన అధికారిక నివాసంగా కరకట్ట బంగ్లాను గుర్తిస్తూ తాజాగా అంటే బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ బంగ్లాను అటాచ్మెంట్కు అనుమతిస్తూ గతంలో న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించింది. 2023 జూన్లో అటాచ్మెంట్కు అనుమతిస్తూ కరకట్ట బంగ్లా యాజమాన్య హక్కులు, అధికారిక గుర్తింపు తదితర విషయాల్లో ఎలాంటి మార్పులు, సవరణలు చేయడానికి వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.అయితే అందుకు విరుద్ధంగా ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం గత కాలం నుంచి.. అంటే అటాచ్మెంట్లో ఉన్నప్పటి నుంచి వర్తించేలా కరకట్ట బంగ్లాను అధికారిక నివాసంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కచ్చితంగా న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించడమేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాధారణ పరిపాలన శాఖను సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్నారు. కరకట్ట బంగ్లాను అధికారిక నివాసంగా గుర్తిస్తూ ఆ శాఖే రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. అంటే చంద్రబాబే స్వయంగా న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించి మరీ ఉత్తర్వులు జారీ చేసినట్టేనని నిపుణులు తేల్చి చెబుతున్నారు.చంద్రబాబు, లింగమనేని పిల్లి మొగ్గలు⇒ రాజధాని అమరావతిలో భారీ భూ దోపిడీ సందర్భంగా జరిగిన క్విడ్ ప్రో కో లో భాగంగానే కరకట్ట బంగ్లాను లింగమనేని కుటుంబం చంద్రబాబుకు ఇచ్చింది. దీనిపై సీఐడీ విచారణలో లింగమనేని పొంతనలేని సమాధానాలు చెప్పి అడ్డంగా దొరికిపోయారు. ⇒ మొదట ఆ బంగ్లా సీఎం నివాసం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చినట్లు ఆయన విచారణలో చెప్పారు. మరి ఉచితంగా ఇస్తే సీఎంగా చంద్రబాబు తన అధికారిక నివాసానికి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) ఎలా తీసుకున్నారు? ప్రజాధనాన్ని ఎలా డ్రా చేసుకున్నారు? అని సీఐడీ ప్రశ్నించగా ఆయన నీళ్లు నమిలారు.⇒ దీంతో ఆ తర్వాత విచారణలో లింగమనేని ప్లేటు మార్చారు. రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ కింద ఆ కరకట్ట బంగ్లాను ‘సీఆర్డీఏ’కు ఇచ్చినట్లు చెప్పారు. మరి భూ సమీకరణ కింద ఇస్తే.. అందుకు ప్రతిఫలంగా మీకు సీఆర్డీఏ ఎక్కడ ప్లాట్లు కేటాయించిందని ప్రశ్నించగా లింగమనేని నోట మళ్లీ మాట రాలేదు. భూ సమీకరణ కింద ఇస్తే అది ప్రభుత్వ ఆస్తి అవుతుంది. మరి అప్పటి సీఎం చంద్రబాబు తన అధికారిక నివాసానికి హెచ్ఆర్ఏ ఎలా తీసుకున్నారు? ప్రజాధనాన్ని ఎలా డ్రా చేసుకున్నారని ప్రశ్నించేసరికి ఆయన నుంచి సౌండ్ లేదు.⇒ ఈ నేపథ్యంలో.. లింగమనేని రమేశ్ మరో కట్టుకథను తెరపైకి తెచ్చారు. ఆ కరకట్ట బంగ్లాను చంద్రబాబుకు అద్దెకిచ్చానని చెప్పారు. మరి అద్దెకిస్తే ఆ అద్దె ఆదాయాన్ని ఆదాయ పన్ను రిటర్న్లో ఎక్కడ చూపించారని సీఐడీ ప్రశ్నించడంతో ఆయన బిక్క మొహం వేశారు. ఎందుకంటే.. ఆయన తన ఆదాయ పన్ను రిటర్న్లలో ఎక్కడా కరకట్ట బంగ్లాను అద్దెకిచ్చినట్లుగా వెల్లడించలేదు. కారణం.. ఆయన కరకట్ట బంగ్లాను చంద్రబాబుకు అద్దెకివ్వనేలేదు.ఎఫ్టీఎల్ పరిధి దాటిన ఇంట్లో సీఎం ఉంటారా!?అసలు విషయం ఏమిటంటే.. క్విడ్ ప్రో కో కుట్రలో భాగంగానే లింగమనేని రమేశ్ కుటుంబం చంద్రబాబుకు కరకట్ట బంగ్లాను సమర్పించింది. లింగమనేని రమేశ్ కుటుంబంతో కలిసి చంద్రబాబు, నారాయణ అమరావతిలో అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ రూపొందించడంలో అక్రమాలకు పాల్పడి లింగమనేని రమేశ్ కుటుంబం భూముల విలువ భారీగా పెరిగేటట్లు చేశారు. అందుకు ఆ భూముల్లో వాటాతో పాటు కొసరుగా చంద్రబాబుకు కరకట్ట బంగ్లా దక్కింది. ఇదిలా ఉండగా.. ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు.ఆ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. నదీ పరివాహక ప్రాంతం పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఈ మేరకు కఠిన చట్టాలు చేశారు. కానీ, ఆ చట్టాలను అమలు చేయాల్సిన సీఎంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ కూడా చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఎఫ్టీఎల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మించిన కరకట్ట బంగ్లాను తన అధికారిక నివాసంగా చేసుకున్నారు. అంటే నదీ పరివాహక ప్రాంతాల పరిరక్షణ తనకు ఏమాత్రం పట్టదని స్పష్టంగా ప్రకటించినట్లే.కరకట్ట బంగ్లా అటాచ్మెంట్కు అనుమతినిస్తూ న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను కూడా ప్రస్తుత చంద్ర బాబు ప్రభుత్వం నిర్భీతిగా ఉల్లంఘించింది. అటాచ్మెంట్లో ఉన్న ఈ బంగ్లా గుర్తింపు, వాస్తవ పరిస్థితిలో ఎలాంటి మార్పులు చేయకూడదన్న న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానాల ఆదేశాలంటే ఏమాత్రం లెక్కలేనట్టు వ్యవహరించింది. -
ఈవీఎంలలో డేటాను చెరిపేయొద్దు
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లలో పోలింగ్కు సంబంధించిన సమాచారం(డేటా), ఎన్నికల గుర్తుల లోడింగ్ యూనిట్లలో సమాచారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు(Supreme Court) కీలక ఆదేశాలు జారీచేసింది. ఎన్నికలు పూర్తయ్యాక ఓడిన అభ్యర్థి అభ్యర్థన మేరకు ఈవీఎంల వెరిఫికేషన్లో భాగంగా ఆయా ఈవీఎంలలోని డేటాను చెరిపేయడం, రీలోడ్ చేసే సంస్కృతిని మానుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ఈసీకి సూచించింది. సింబల్ లోడింగ్ యూనిట్(ఎస్ఎల్యూ)ను తనిఖీ చేయాల్సి ఉందని పేర్కొంది. ఈవీఎంలలో మెమొరీని, ఎస్ఎల్యూలను తనిఖీచేసేందుకు అవకాశం ఇవ్వాలని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అనే ఎన్జీవో సంస్థ, ఓడిన అభ్యర్థి సర్వ్ మిట్టెర్ వేసిన పిటిషన్ను మంగళవారం విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు పై విధంగా ఆదేశాలిచ్చింది. డేటాను ఎందుకు తొలగిస్తున్నారు?ఈసీ జారీచేసిన ఈవీఎం వెరిఫికేషన్ ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్ఓపీ) అనేది ఈవీఎం–వీవీప్యాట్ కేసులో 2024 ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా లేదంటూ ఏడీఆర్ ఈ పిటిషన్ను దాఖలుచేసింది. ఈ కేసును విచారిస్తూ ధర్మాసనం ‘‘ ఎన్నికలయ్యాక అభ్యర్థి వచ్చి ఈవీఎంలోని మెమొరీని, మైక్రో కంట్రోలర్లను, ఎస్ఎల్యూలను ఇంజనీర్ను పిలిపించి తనిఖీచేయించాలని కోరితే ఈసీ ఆ ఈవీఎంలలో డేటాను వెరిఫికేషన్లో భాగంగా తొలగించకూడదు. అసలు మీరెందుకు డేటాను తొలగిస్తున్నారు?. పాత డేటాను అలాగే ఉంచండి. వెరిఫికేషన్ పేరిట డేటాను చెరిపేసి మళ్లీ అదే డేటాను రీలోడ్ చేయకూడదు. రీలోడింగ్ విధానాన్ని మానేయండి. ఎన్నికలయ్యాక ఇన్నాళ్లూ డేటాను తొలగించేందుకు మీరు అవలంభించిన విధానంపై వివరణ ఇవ్వండి.ఈ విషయంలో స్పందన తెలిపేందుకు మీకు 15 రోజుల గడువు ఇస్తున్నాం. కేసు విచారణను వచ్చే నెల మూడో తేదీతో మొదలయ్యే వారంలో విచారిస్తాం’’ అని కేంద్ర ఎన్నికల సంఘానికి ధర్మాసనం సూచించింది. ఈవీఎంల వెరిఫికేషన్ కోసం ఒక విధానాన్ని తీసుకు రావాలంటూ గతంలో మాజీ హరియాణా మంత్రి, ఐదుసార్లు ఎమ్మెల్యే కరణ్ సింగ్ దలాల్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి లఖాన్ కుమార్ సింగ్లాలు వేసిన మరో పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది. గతంలో కరణ్ ఇలాంటి పిటిషన్ వేశారని గుర్తుచేసింది. బ్యాలెట్ పేపర్ విధానంలోకి మళ్లుదామంటూ వేసిన పిటిషన్నూ గత ఏడాది ఏప్రిల్లో కోర్టు కొట్టేసింది.రూ.40 వేల ఫీజును తగ్గించండిఓడిన అభ్యర్థి ఒకవేళ ఈవీఎంలను తనిఖీ కోసం అభ్యర్థిస్తే అందుకోసం ఆయనపై వేసే ఫీజు భారాన్ని తగ్గించాలని కోర్టు సూచించింది. ఎన్నికల ఫలితాలొచ్చాక 45 రోజులపాటు సింబల్ లోడింగ్ యూనిట్లను, ఈవీఎంలతోపాటే స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచాలి. ‘‘అభ్యర్థి వచ్చి అడిగితే ఇంజనీర్తో ఈవీఎంలను వెరిఫై చేయించాలి. ఇందుకు ఏకంగా రూ.40,000 ఖర్చు అవుతుందా?. అంత ఫీజును అభ్యర్థిపై వేస్తారా?. ఇది చాలా ఎక్కువ మొత్తం. దీనిని తగ్గించండి’’ అని ఈసీ తరఫున హాజరైన న్యాయవాది మణీందర్ సింగ్ను ధర్మాసనం కోరింది. ‘‘ ఈవీఎంల వెరిఫికేషన్ పద్దతి అనేది కోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేదు. ఈవీఎం సాఫ్ట్వేర్, హార్డ్వేర్లో ఏదైనా మతలబు ఉందో లేదో తెల్సుకునే స్వేచ్ఛ ఉండాలి’’ అని ఏడీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. -
ఈవీఎంల డేటా డిలీట్ చేయొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియ ముగిసి ఫలితాలు వచ్చిన తర్వాత ఈవీఎం(Electronic Voting Machines)ల్లో నిక్షిప్తమై ఉన్న డేటాను డిలీట్ చేయవద్దని ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈవీఎంల్లో నిక్షిప్తమైన డేటాపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హరియాణా రాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్(ADR), కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. డేటా డిలీట్ చేసే ప్రక్రియను చేపట్టవద్దని ఎన్నికల కమిషన్కు ఆదేశించింది. అదే సమయంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారో చెప్పాలని ఈసీకి స్పష్టం చేసింది.‘ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిపోయిందని భావించి ఈవీఎంల్లో ఉన్న డేటా తొలగించకండి. ఏవిధమైన డేటాను ఈవీఎంల నుంచి తొలగించవద్దు. అదే సమయంలో ఏ తరహా డేటాను అందులో రీలోడ్ చేయవద్దు’ అని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈవీఎంల డేటా అవసరమైన పక్షంలో ఎన్నికల కమిషన్ కోర్టుకు సమర్పించాల్సి ఉండటంతో డేటా తొలిగిస్తే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.ఒకవేళ ఓటమి పాలైన అభ్యర్థి వివరణ కోరిన పక్షంలో ఈవీఎంల్లో ఎటువంటి ట్యాంపరింగ్ జరగలేదనే విషయాన్ని ఒక ఇంజనీర్ సాయంతో ధృవీకరించాల్సి ఉంటుందన్నారు చీప్ జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఈవీఎంల్లోని మైక్రో కంట్రోలర్, మెమొరీల్లో ఉన్న డేటాను తొలగించేందుకు ఏ విధానం అమలు చేస్తున్నారో 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. -
జనానికి తాగునీరే లేదు.. సైకిల్ ట్రాక్లు కావాలా!
న్యూఢిల్లీ: ప్రజలందరికీ గృహ వసతి, తాగునీటి వసతి కల్పించడానికి సరిపడా నిధుల్లేక రాష్ట్రాలు ఓ వైపు ఇబ్బందులు పడుతుంటే సైకిల్ ట్రాక్లంటూ కొందరు పగటి కలలు కంటున్నారంటూ సుప్రీంకోర్టు మండిపడింది. దేశ వ్యాప్తంగా ప్రత్యేకంగా సైకిల్ ట్రాక్లను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిల్ను కొట్టివేసింది. సోమవారం జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ అభయ్ ఎస్.ఓకాల ధర్మాసనం పిల్పై విచారణ చేపట్టింది. ‘మురికి వాడలకు వెళ్లండి అక్కడ జనం ఏ పరిస్థితిలో ఉంటున్నారో చూడండి. వారికి సరైన గృహ వసతి కల్పించేందుకు రాష్ట్రాల వద్ద నిధుల్లేవు. ప్రజలకు కనీసం వసతులు కల్పించాలి. మనమేమో ఇక్కడ సైకిల్ ట్రాక్లు ఉండాల్సిందేనంటూ పగటి కలలు కంటున్నాం’అని వ్యాఖ్యానించింది. ‘మనవి తప్పుడు ప్రాధాన్యతలు. మన ప్రాధాన్యతలను సరి చేసుకోవాల్సి ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అమలు విషయం మనం ఆలోచించాలి. ప్రజలకు తాగేందుకు మంచి నీరు లేదు. ప్రభుత్వ బడులు మూతబడుతున్నాయి. మీరేమో సైకిల్ ట్రాక్లు కావాలంటున్నారు’అని పేర్కొంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సైకిల్ ట్రాక్లున్నాయని, దేశవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయాలంటూ సైక్లింగ్ ప్రోత్సాహకుడు దేవీందర్ సింగ్ నేగి తన పిటిషన్లో కోరారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ వాయిదా
-
ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ వాయిదా
-
నేడు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టులో విచారణ
-
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై ‘సుప్రీం’ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ ఫిబ్రవరి 18కి వాయిదా పడింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఇవాళ (సోమవారం) సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సమయంలో తెలంగాణ స్పీకర్ తరుఫున ముకుల్ రోహ్గతి వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. తమకు వాదనలు వినిపించేందుకు రెండు మూడు రోజులు సమయం కావాలని కోరారు. రోహ్గతి విజ్ఞప్తిపై స్పందించిన అత్యున్నత న్యాయ స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంటరీ ప్రక్రియను ఫ్రస్ట్రేషన్కు గురి చేయొద్దు. ప్రజాస్వామ్యంలో పార్టీలకు హక్కులు ఉంటాయి. తగిన సమయం అంటే ఏంటి? అని ప్రశ్నించింది. పార్టీ మారి పది నెలలు అవుతుంది. ఇది రీజనబుల్ టైం కాదా? అని వ్యాఖ్యానించింది. అందుకు సుప్రీం కోర్టు ఇచ్చిన టైం ప్రకారం.. రీజనబుల్ టైం అంటే మూడు నెలలే అంటే బీఆర్ఎస్ తరుఫు న్యాయవాది తన వాదనల్ని వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణను వాయిదా వేసింది. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్,అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్లు కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు.ఇంతకు ముందు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లో చర్యలు తీసుకోవాలని గతంలోనే తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. -
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు.. రేపు సుప్రీం కోర్టులో విచారణ
ఢిల్లీ: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ సోమవారం సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.ఇంతకు ముందు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లో చర్యలు తీసుకోవాలని గతంలోనే తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.కేటీఆర్ రిట్ దాఖలుఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్ఎ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ నడుస్తోంది. ఈ క్రమంలో.. ఈ రెండు పిటిషన్లను కలిపి 10వ తేదీన విచారణ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్,అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్లు కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు.మరో పిటిషన్లో.. ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సహా పలువురు స్పెషల్ లీవ్ పిటిషన్(SLP) వేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్ను శుక్రవారం(జనవరి 31న) విచారణ జరిపింది. ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని కిందటి ఏడాది మార్చి తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని, అయితే కోర్టు ఆదేశాలను తెలంగాణ స్పీకర్ ధిక్కరించారని, కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని పాడి కౌశిక్రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే.. సంబంధిత ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారని అసెంబ్లీ సెక్రటరీ, తెలంగాణ స్పీకర్ తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఫిరాయింపుల వ్యవహారాల్లో స్పీకర్ తొందరపాటు నిర్ణయాలు సరికాదని గతంలో సుప్రీం కోర్టు చెప్పడాన్ని ఆయన బెంచ్ ముందు ప్రస్తావించారు. కాబట్టి, స్పీకర్ నిర్ణయానికి తగు సమయం కావాలని ఆయన కోరారు.అయితే.. ఇంకెంత కాలం ఎదురుచూస్తారని, మహారాష్ట్రలో లాగా ఎమ్మెల్యేల పదవికాలం అయ్యేదాకా ఎదురు చూస్తారా? అని సుప్రీం కోర్టు తెలంగాణ స్పీకర్పై అసహనం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ అడిగి చెప్తానని లాయర్ రోహత్గి చెప్పడంతో విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. రేపు (ఫిబ్రవరి 10న) కౌశిక్ రెడ్డి ఎస్ఎల్పీ, కేటీఆర్ రిట్ పిటిషన్లను కలిపి సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. -
గృహ హింస కేసుల్లోకి కుటుంబ సభ్యులను లాగొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: గృహ హింస కేసులను అత్యంత సున్నితంగా పరిశీలించాలని సుప్రీంకోర్టు (Supreme Court) అభిప్రాయపడింది. ఈ కేసుల్లో నిర్దిష్ట నేరారో పణలు లేకుండా నిందితుడి కుటుంబ సభ్యులను లాగడం తగదని పేర్కొంది.వివాహ సంబంధ కేసుల్లో భావోద్వేగాల పాలు ఎక్కువ. ఇలాంటి సమయాల్లో ఫిర్యాదుదారుని పక్షాన నిలబడని, మౌన సాక్షులుగా ఉండే కుటుంబసభ్యులను ఇరికించే ధోరణు లుంటాయని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం పేర్కొంది.నిందితుడి కుటుంబస భ్యులపై విచారణను నిలిపివేస్తూ తీర్పు వెలు వరించింది. గృహ హింస కేసులో ఒక మహిళ తన అత్తింటి వారిపై చేసిన ఆరోప ణలను కొ ట్టివేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. వారు సుప్రీంను ఆశ్రయించారు. ఇదీ చదవండి: గౌనును బట్టి గౌరవం లభించదు -
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టు లాయర్ ముఖీం వాగ్వాదం
-
కొల్లేరు ఆక్రమణలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
-
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు బిగ్ షాక్
-
ఫిరాయింపుల వ్యవహారం.. కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ!
సాక్షి,హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై సుప్రీం కోర్టు ఫిబ్రవరి 10న విచారణ చేపట్టనుంది. ఈ తరుణంలో కేటీఆర్ రేపటి నుంచి నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతుంది. కేటీఆర్తో పాటు మాజీ ఎంపీ వినోద్, దాసోజు శ్రవణ్లు వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై న్యాయవాదులతో చర్చించనున్నారు.బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్ , అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్లు కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. అంతకుముందు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై విచారణపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో.. ఈ రెండు పిటిషన్లను కలిపి 10వ తేదీన విచారణ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.మరో పిటిషన్లో.. ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సహా పలువురు స్పెషల్ లీవ్ పిటిషన్(SLP) వేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్ను శుక్రవారం(జనవరి 31న) విచారణ జరిపింది. ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని కిందటి ఏడాది మార్చి తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని, అయితే కోర్టు ఆదేశాలను తెలంగాణ స్పీకర్ ధిక్కరించారని, కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని పాడి కౌశిక్రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే.. సంబంధిత ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారని అసెంబ్లీ సెక్రటరీ, తెలంగాణ స్పీకర్ తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఫిరాయింపుల వ్యవహారాల్లో స్పీకర్ తొందరపాటు నిర్ణయాలు సరికాదని గతంలో సుప్రీం కోర్టు చెప్పడాన్ని ఆయన బెంచ్ ముందు ప్రస్తావించారు. కాబట్టి, స్పీకర్ నిర్ణయానికి తగు సమయం కావాలని ఆయన కోరారు. అయితే.. ఇంకెంత కాలం ఎదురుచూస్తారని, మహారాష్ట్రలో లాగా ఎమ్మెల్యేల పదవికాలం అయ్యేదాకా ఎదురు చూస్తారా? అని సుప్రీం కోర్టు తెలంగాణ స్పీకర్పై అసహనం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ అడిగి చెప్తానని లాయర్ రోహత్గి చెప్పడంతో విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. వచ్చే సోమవారం(ఫిబ్రవరి 10న) కౌశిక్ రెడ్డి ఎస్ఎల్పీ, కేటీఆర్ రిట్ పిటిషన్లను కలిపి సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. -
‘అందుకు ముహూర్తం కావాలా?.. అస్సాం సర్కారుపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: విదేశీయులుగా ప్రకటించిన వారిని రాష్ట్రం నుంచి బహిష్కరించకపోవడానికి తోడు వారిని నిర్బంధ కేంద్రాల్లో నిరవధికంగా ఉంచడంపై సుప్రీంకోర్టు అస్సాం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని పంపేందుకు ఏదైనా ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారా అని కూడా అస్సాం ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. నిర్బంధ కేంద్రాల్లో నివసిస్తున్న 63 మందిని రెండు వారాల్లోగా వారి దేశాలకు తిరిగి పంపించాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.అసోంనకు వచ్చిన వలసదారులు తమ విదేశీ చిరునామాలను వెల్లడించనందున వారి బహిష్కరణ సాధ్యం కాదన్న అస్సాం వాదనను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నిర్బంధ కేంద్రాల్లో ఉంచిన 63 మందిని రెండు వారాల్లోగా బహిష్కరించాలని అస్సాం ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశించింది. జస్టిస్ అభయ్ ఎస్. ఓకా, న్యాయమూర్తి ఉజ్వల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై స్పందిస్తూ నిర్బంధంలో ఉన్నవారు విదేశీయులని నిర్ధారించిన వెంటనే వారిని దేశం నుండి బహిష్కరించాలని పేర్కొంది.వారి చిరునామాలు తెలియవంటూ, వారి బహిష్కరణ ప్రక్రియను ప్రారంభించడానికి ఎందుకు నిరాకరించారని బెంచ్ ప్రశ్నించింది. దీనిపై ఆందోళన ఎందుకు? వారిని వారి దేశానికి తిరిగి పంపండి. రాజ్యాంగం(Constitution)లోని ఆర్టికల్ 21 ప్రకారం వారిని శాశ్వతంగా నిర్బంధ కేంద్రంలో ఉంచలేరని పేర్కొంది. అస్సాంలో విదేశీయుల కోసం అనేక నిర్బంధ కేంద్రాలు ఉన్నాయని, ఇప్పటి వరకూ ఎంత మందిని బహిష్కరించారని సుప్రీం కోర్టు అస్సాం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిర్బంధ కేంద్రాల్లో ఉంచిన 63 మందిని రెండు వారాల్లోగా బహిష్కరించడం ప్రారంభించాలని, దీనికి సమ్మతిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని అస్సాం ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. అస్సాంలో విదేశీయులుగా ప్రకటితమైన వ్యక్తుల బహిష్కరణ, నిర్బంధ కేంద్రాల్లోని సౌకర్యాలకు సంబంధించిన పిటిషన్పై సుప్రీం ధర్మాసనం విచారించింది.ఇది కూడా చదవండి: ఎన్కౌంటర్లో ట్విస్ట్.. కంగుతిన్న పోలీసులు -
సుప్రీం కోర్టులో కేటీఆర్ ‘ఫిరాయింపుల పిటిషన్’ వాయిదా
న్యూఢిల్లీ,సాక్షి: తెలంగాణ ఫిరాయింపుల ఎమ్మెల్యే వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు(KTR) వేసిన పిటిషన్ విచారణ వాయిదా పడింది. గతంలో ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్తో కలిపి విచారణ జరుపుతామని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం సోమవారం పేర్కొంది.ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్ఎ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ నడుస్తోంది. ఈ క్రమంలో.. ఈ రెండు పిటిషన్లను కలిపి 10వ తేదీన విచారణ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్ , అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్లు కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. మరో పిటిషన్లో.. ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సహా పలువురు స్పెషల్ లీవ్ పిటిషన్(SLP) వేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్ను శుక్రవారం(జనవరి 31న) విచారణ జరిపింది. ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని కిందటి ఏడాది మార్చి తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని, అయితే కోర్టు ఆదేశాలను తెలంగాణ స్పీకర్ ధిక్కరించారని, కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని పాడి కౌశిక్రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే.. సంబంధిత ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారని అసెంబ్లీ సెక్రటరీ, తెలంగాణ స్పీకర్ తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఫిరాయింపుల వ్యవహారాల్లో స్పీకర్ తొందరపాటు నిర్ణయాలు సరికాదని గతంలో సుప్రీం కోర్టు చెప్పడాన్ని ఆయన బెంచ్ ముందు ప్రస్తావించారు. కాబట్టి, స్పీకర్ నిర్ణయానికి తగు సమయం కావాలని ఆయన కోరారు. అయితే.. ఇంకెంత కాలం ఎదురుచూస్తారని, మహారాష్ట్రలో లాగా ఎమ్మెల్యేల పదవికాలం అయ్యేదాకా ఎదురు చూస్తారా? అని సుప్రీం కోర్టు తెలంగాణ స్పీకర్పై అసహనం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ అడిగి చెప్తానని లాయర్ రోహత్గి చెప్పడంతో విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. వచ్చే సోమవారం(ఫిబ్రవరి 10న) కౌశిక్ రెడ్డి ఎస్ఎల్పీ, కేటీఆర్ రిట్ పిటిషన్లను కలిపి సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. -
పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ ముగిసేంత సమయం కావాలా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు? అసలు మీకెంత సమయం కావాలి? అసెంబ్లీ కాలపరిమితి ముగిసేంత సమయం కావాలా?’అంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మీకెంత సమయం కావాలో చెప్పండంటూ ఆదేశించింది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి, పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా శాసనసభ స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఈనెల 15న సుప్రీం కోర్టును ఆశ్రయించింది.ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ పేర్లతో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పి)ను దాఖలు చేసింది. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎం.సంజయ్కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాం«దీలపై బీఆర్ఎస్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్రావు తదితరుల పేర్లతో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎస్ఎల్పిపై శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మసిహ్తో కూడిన ధర్మాసనం విచారించింది. పది నెలలుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై పది నెలలుగా స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు దామ శేషాద్రి నాయుడు, పొనుగోటి మోహిత్రావు సుప్రీంకోర్టుకు తెలిపారు. తమ పిటిషన్లపై హైకోర్టు ఉత్తర్వులు వచ్చి ఏడు నెలలైనా స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని నివేదించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారని స్పీకర్ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ చెప్పగా.. ఫిర్యాదులపై నోటీసులు ఇచ్చేందుకు స్పీకర్ కార్యాలయానికి పది నెలల సమయం పట్టిందా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. రీజనబుల్ టైం అంటే ఎంత? పార్టీ ఫిరాయింపులపై స్పందించేందుకు స్పీకర్ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఎంత అని న్యాయవాది రోహత్గీని జస్టిస్ గవాయి ప్రశ్నించారు. ఇందుకు రోహత్గీ బదులిస్తూ.. స్పీకర్ నిర్ణయానికి సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతంలో ఇచి్చన తీర్పును చదివి వినిపించారు. నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ ఎమ్మెల్యేలకు తగిన సమయం ఇవ్వాలని ఆ తీర్పులో ఆదేశాలు ఇచ్చిందన్నారు.జస్టిస్ గవాయి జోక్యం చేసుకుని ‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ కాలపరిమితి ముగింపు దశలో నిర్ణయం తీసుకుంటారా? అనర్హత విషయంలో మహారాష్ట్ర స్పీకర్ మాదిరిగా వ్యవహరిస్తారా?’అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపులపై స్పందించేందుకు ఎంత సమయం కావాలో అసెంబ్లీ సెక్రటరీ కనుక్కుని చెప్పాలని ధర్మాసనం సూచించింది. ఇందుకు మీకెంత సమయం కావాలో చెప్పాలని ధర్మాసనం రోహత్గీని అడగ్గా.. రెండు వారాలు కావాలని బదులిచ్చారు. రోహత్గీ విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ.. ‘ఈ అంశం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరమైతే లేదు. ఫోన్ కాల్ సరిపోతుంది’అంటూ జస్టిస్ గవాయి చమత్కరించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి ధర్మాసనం వాయిదా వేసింది. -
గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ
-
రఘురామ సీఐడీ కేసులో డాక్టర్ ప్రభావతికి సుప్రీంకోర్టులో ఊరట
-
మెడికల్ పీజీలో లోకల్ కోటా రాజ్యాంగ విరుద్ధం... సుప్రీంకోర్టు స్పష్టీకరణ
-
చంచల్గూడ జైలు నుంచి తిరుపతన్న విడుదల
సాక్షి,హైదారబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం మాజీ అడిషినల్ ఎస్పీ మేకల తిరుపతన్న చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ4గా ఉన్న తిరుపతన్నకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో పదినెలల తర్వాత తిరుపతన్న బెయిల్పై విడుదలయ్యారు. బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందించిన అనంతరం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. -
ఏపీ యువతి కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
సాక్షి,ఢిల్లీ : ముంబైలో హత్యకు గురైన తెలుగు యువతి సింగవరపు ఎస్తేర్ అనూహ్య (Singavarapu Esther Anuhya) హత్యకేసులో సుప్రీం కోర్టు (supreme court) సంచలన తీర్పును వెలువరించింది. ఎస్తేర్ కేసులో నిందితుణ్ని సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మచిలీపట్నానికి చెందిన అనూహ్య జనవరి 4,2014న విజయవాడలో లోక్మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్లో బయల్దేరిన 2014,జనవరి 16న (గురువారం సాయంత్రం) ముంబైలోని కుంజూర్ మార్గ్ వద్ద శవంగా కనిపించింది. ఎస్తేర్ను కిడ్నాప్ చేసి అత్యాచారం తర్వాత.. హత్యచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఎస్తేర్ హత్యకేసులో ముంబైకి చెందిన చంద్రభానుకు 2015లో ఉమెన్స్ కోర్టు ఉరిశిక్ష వేసింది.కేసు విచారణలో భాగంగా 2018లో ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు సైతం సమర్ధించింది. అయితే హైకోర్టును తీర్పును సవాలు చేస్తూ చంద్రభాను సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తాజాగా, మంగళవారం ఈ కేసును జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా చంద్రభానే ఈ హత్య చేశాడని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని అత్యున్నత న్యాయ స్థానం వ్యాఖ్యానించింది.ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. సుధీర్ఘ కాలంగా కొనసాగుతున్న కేసు విచారణలో కీలక తీర్పును వెలువరించింది. ఎస్తేర్ కేసులో చంద్రభాను నిర్ధోషి’ అని తేల్చేసింది.👉చదవండి : గురుమూర్తి మనిషి కాదు.. మనిషి రూపంలో ఉన్న నర రూప రాక్షసుడు -
హక్కుల రక్షణలో ‘సుప్రీం’
అరవింద్రెడ్డి గండ్రాతిసామాజిక న్యాయానికి విఘాతం కలిగినా.. రాజ్యాంగానికి భంగం వాటిల్లినా.. ప్రజాప్రయోజనాలు హరించినా.. రాజకీయాలు హద్దు దాటినా.. దేశ సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంటుంది. రాజ్యాంగ పరిరక్షణకు ఉపక్రమిస్తుంది. పౌర హక్కులను, సమానత్వాన్ని, ప్రజా స్వేచ్ఛను కంటికి రెప్పలా కాపాడుతుంది. సామాన్యుడి నుంచి దేశాధినేత వరకు అందరినీ సమానంగా పరిగణిస్తుంది.ప్రజా ప్రయోజనాలు కాపాడటంలో ‘సుప్రీం’ కమాండర్గా, రాజ్యాంగం, సమానత్వ పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్న సుప్రీంకోర్టు(Supreme Court) ఏర్పాటై జనవరి 28తో 75 ఏళ్లు పూర్తయింది. 1950, జనవరి 28న 8 మంది (సీజేతో కలిపి)తో ప్రారంభమైంది.. నేడు 34కి చేరింది. ఇప్పటివరకు ఇద్దరు తెలుగు వారు జస్టిస్ కోకా సుబ్బారావు, జస్టిస్ ఎన్వీ రమణ ప్రధాన న్యాయమూర్తి పీఠాన్ని అధిష్టించారు.రాజ్యాంగ పరిరక్షణకర్త..సుప్రీంకోర్టు(Supreme Court) దేశంలో సర్వోన్నత న్యాయస్థానం. సమాఖ్య కోర్టుగా, రాజ్యాంగ పరిరక్షణకర్తగా, అత్యున్నత ధర్మాసనంగా విధులు నిర్వర్తిస్తోంది. రాజ్యాంగంలోని 5వ భాగంలో అధికరణలు 124 నుంచి 147 వరకు సర్వోన్నత న్యాయస్థానం కూర్పు, అధికార పరిధిని తెలియజేస్తాయి. ముఖ్యంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని హైకోర్టులు ఇచ్చే తీర్పులపై అప్పీళ్లను స్వీకరిస్తుంది. అందుకే దీన్ని పునర్విచారణ ధర్మాసనం అని కూడా అంటారు.తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనల కేసుల్లో ఒరిజినల్ పిటిషన్లను, తక్షణ పరిష్కారం అవసరమైన తీవ్రమైన వివాదాల కేసులపైనా నేరుగా విచారణ జరుపుతుంది. తొలుత భారత సమాఖ్య న్యాయస్థానంగా పార్లమెంట్ భవనంలోని ప్రిన్సెస్ చాంబర్లో ప్రారంభించారు. ప్రిన్సెస్ చాంబర్లో 1937 నుంచి 1950 వరకు నడిపారు. భారతదేశం సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించిన రెండు రోజుల తరువాత సర్వోన్నత న్యాయస్థానం 1950, జనవరి 28న ఏర్పాటైంది. సుప్రీంకోర్టుగా రూపాంతరం చెందిన తర్వాత 1958 వరకు పాత పార్లమెంట్ భవనంలోని ఓ భాగంలో నడిపారు.ఇండో–బ్రిటిష్ వాస్తు శైలిలో..⇒ సుప్రీంకోర్టు భవన ప్రధాన భాగం 17 ఎకరాల స్థలంలో ఇండో–బ్రిటిష్ వాస్తు శైలిలో నిర్మించారు. ప్రముఖ వాస్తుశిల్పి గణేశ్ భైకాజీ డియోలాలీకర్ దీని నమూనా రూపొందించారు. శ్రీధర్ కృష్ణ జోగ్లేకర్ భవన నిర్మాణానికి నేతృత్వం వహించారు. ప్రస్తుత భవనంలోకి 1958లో న్యాయస్థానం మారింది. త్రాసు ఆకారాన్ని ప్రతిబింబించేలా భవన నమూనా రూపొందించారు. భవన మధ్య భాగం త్రాసుకోలను ప్రతిబింబిస్తుంది. 1979లో తూర్పు, పశ్చిమ భాగాలను ఈ సముదాయానికి జోడించారు. మొత్తం 19 కోర్టు గదులున్నాయి. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం పెద్దగా, మధ్య భాగంలో ఉంటుంది.న్యాయమూర్తుల సంఖ్య పెరిగిందిలా..సుప్రీంకోర్టును ఓ ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు న్యాయమూర్తులతో ఏర్పాటు చేసేందుకు 1950లో రాజ్యాంగం వీలు కల్పించింది. తదుపరి పరిస్థితుల మేరకు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అవకాశాన్ని పార్లమెంట్కు దఖలుపరిచింది. న్యాయమూర్తుల సంఖ్య (చీఫ్ జస్టిస్తో కలిపి) 1956లో 11కు, 1960లో 14కు, 1978లో 18కి, 1986లో 26కు, 2008లో 31కి, 2019లో 34 మందికి పెరిగింది. తొలుత సింగిల్ బెంచ్ విచారణలు ఉండగా. ఆ తర్వాత ఇద్దరు, ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనాల విచారణలు ప్రారంభమయ్యాయి.అత్యంత కీలకమైన వివాదాల సమయంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం (రాజ్యాంగ ధర్మాసనం) కొలువుదీరుతుంది. అవసరం మేరకు ఏ చిన్న ధర్మాసనమైనా పెద్ద ధర్మాసనానికి కేసును బదిలీ చేయొచ్చు. న్యాయమూర్తులను నియమించేందుకు సర్వోన్నత న్యాయస్థానంతో రాష్ట్రపతి తప్పనిసరిగా సంప్రదింపులు జరపాలి. ఇవి ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేకుండా జరుగుతాయి. న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లు. భారతీయుడై ఉండి ఐదేళ్ల పాటు హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉండాలి.అవీ ఇవీ...⇒ హైకోర్టు న్యాయమూర్తినిగాని, సుప్రీంకోర్టు లేదా హైకోర్టుల్లో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తిని గానీ సుప్రీంకోర్టులో తాత్కాలిక (ప్రత్యేక) న్యాయమూర్తిగా నియమించేందుకు అవకాశం ఉంది.⇒ అత్యున్నత న్యాయస్థానంలో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పిస్తారు.⇒మతం, కులంతో సంబంధం లేకుండా న్యాయమూర్తుల నియామకం జరుగుతుంది.⇒ప్రధాన న్యాయమూర్తి పదవీకాలం ముగియడానికి నెల రోజుల ముందే తర్వాతి సీజేను ప్రకటించాలి.⇒ప్రసుత్తం 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.⇒మాస్టర్ ఆఫ్ ది రోస్టర్గా ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తారు. అంటే.. ఏ బెంచ్ ఏ కేసు విచారణ చేపట్టాలనేది నిర్ణయించే అధికారం సీజేకు ఉంటుంది.⇒ ప్రస్తుతం 33 మంది న్యాయమూర్తులున్న సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులు ఇద్దరు మాత్రమే. సుప్రీంకోర్టు ఏర్పాటు నుంచి దాదాపు 277 మంది న్యాయమూర్తులు నియమితులు కాగా, వీరిలో 11 మంది (దాదాపు 4 శాతం) మాత్రమే మహిళలు.⇒ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (1973) కేసును ఎక్కువ మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం విచారించింది.సుప్రీం కోర్టులో తొలిసారి..⇒తొలి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హరిలాల్ జె. కానియా (1947, ఆగస్టు 14 – 1951, నవంబర్ 5)⇒ తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ (1989)⇒ తొలి దళిత న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ (2000)⇒ తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ (2007)⇒ బార్ నుంచి తొలిసారి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన వ్యక్తి జస్టిస్ ఎస్ఎం సిక్రి (1971)⇒ బార్ నుంచి న్యాయమూర్తిగా పదోన్నతి పొంది సీజే అయిన వ్యక్తి జస్టిస్ యూయూ లలిత్ (2022, ఆగస్టు 27)అత్యధిక కాలం పనిచేసిన టాప్–5 సీజేలు1. జస్టిస్ వైవీ చంద్రచూడ్ఏడేళ్ల 139 రోజులు (1978, ఫిబ్రవరి 22 నుంచి 1985, జూలై 11 వరకు)2. జస్టిస్ భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా నాలుగేళ్ల 122 రోజులు (1959, అక్టోబర్ 1 నుంచి 1964, జనవరి 31 వరకు)3. జస్టిస్ అజిత్ నాథ్ రేమూడేళ్ల 276 రోజులు (1973, ఏప్రిల్ 26 నుంచి 1977, జనవరి 28 వరకు)4. జస్టిస్ సుధీ రంజన్ దాస్మూడేళ్ల 241 రోజులు (1956, ఫిబ్రవరి 1 నుంచి 1959, సెప్టెంబర్ 30 వరకు) 5. జస్టిస్ కేజీ బాలకృష్ణన్మూడేళ్ల 117 రోజులు (2007, జనవరి 14 నుంచి 2010, మే 11 వరకు)ప్రధాన న్యాయమూర్తులుగా తెలుగువారు1) జస్టిస్ కోకా సుబ్బారావు తొమ్మిదో చీఫ్ జస్టిస్ (1966, జూన్ 30 నుంచి 1967, ఏప్రిల్ 11 వరకు (285 రోజులు) 2). జస్టిస్ ఎన్వీ రమణ48వ చీఫ్ జస్టిస్ (2021, ఏప్రిల్ 24 నుంచి 2022, ఆగస్టు 26 వరకు (సంవత్సరం 124 రోజులు)ప్రస్తుతం సుప్రీంకోర్టులో తెలుగు న్యాయమూర్తులుజస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహహైదరాబాద్కు చెందిన ఈయన 1988లో న్యాయవిద్య పూర్తి చేసి న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2021, ఆగస్టు 31న నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.జస్టిస్ సంజయ్కుమార్ హైదరాబాద్కు చెందిన ఈయన 1988లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2008లో ఏపీ హైకోర్టు అడిషనల్ న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2010లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019లో తెలంగాణ హైకోర్టుకు కేటాయించబడిన ఈయన 2019లో పంజాబ్– హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021లో మణిపూర్ చీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టారు. 2023, ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వెళ్లారు.జస్టిస్ సరసి వెంకటనారాయణ భట్టిఆంధ్రప్రదేశ్కు చెందిన ఈయన 1987లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2013లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టారు. విభజనలో భాగంగా ఏపీ హైకోర్టుకు వెళ్లారు. 2019లో కేరళకు బదిలీపై వెళ్లి 2023 జూన్లో చీఫ్గా పదోన్నతి పొందారు. 2023, జూలైలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.నేరుగా బార్ నుంచి సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి పొందిన వారు..జస్టిస్ ఎస్ఎం సిక్రి (1971లో– 9.1 ఏళ్లు), జస్టిస్ ఎస్సీ రాయ్ (1971లో–3 నెలలు), జస్టిస్ కుల్దీప్సింగ్ (1988లో–8.1 ఏళ్లు), జస్టిస్ సంతోష్ హెగ్డే (1999లో–6.4 ఏళ్లు), జస్టిస్ రోహింటన్ నారిమన్ (2014లో–7.1ఏళ్లు), జస్టిస్ యూయూ లలిత్ (2014లో–8.2 ఏళ్లు), జస్టిస్ నాగేశ్వర్రావు (2016లో–6.1ఏళ్లు), జస్టిస్ ఇందు మల్హోత్రా (2018లో –2.8 ఏళ్లు), జస్టిస్ కేవీ విశ్వనాథన్ (2023లో–8 ఏళ్లు), జస్టిస్ పీఎస్ నరసింహ (2021లో–6.6 ఏళ్లు) (జస్టిస్ విశ్వనాథన్, జస్టిస్ నరసింహ ప్రస్తుతం న్యాయమూర్తులుగా కొనసాగుతున్నారు)తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలక తీర్పులు కొన్ని..1993 ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ప్రాథమిక హక్కుల్లో విద్యాహక్కు లేకపోతే జీవించే హక్కుకు, వ్యక్తి గౌరవానికి అర్థం లేదని.. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. లాభాపేక్ష లేకుండా, సమాజానికి ఉప యోగకరంగా విద్యాసంస్థల నిర్వహణ ఉండాలి. ఆర్టికల్ 19(1) ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థలను నెలకొల్పే హక్కు ఉన్నా..19(6) ప్రకారం నియంత్రించే హక్కు సర్కార్కు ఉంది.1997 సమతా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్దేశంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నివసించే గిరిజన, ఆదివాసీల జీవనో పాధి హక్కులను రక్షిస్తూనే స్థిరమైన అభివృద్ధికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. అటవీ భూములకు భంగం కలగకుండా, పర్యావరణం దెబ్బతిన కుండా గిరిజనులు వ్యక్తిగతంగా లేదా సంఘంగా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఖనిజాలను వెలికితీయొచ్చని పేర్కొంది. గిరిజనేతరులకు హక్కులు ఉండవని స్పష్టం చేసింది. సమతా అనే స్వచ్ఛంద సంస్థ పిటిషన్ వేసి పోరాటం చేయడంతో ఆ పేరుతో ఈ కేసు ప్రసిద్ధికెక్కింది.ఆ రెండు సందర్భాల్లోఅమలవుతున్న సంప్రదాయం ప్రకారం.. పదవీ విరమణ చేయబోయే ప్రధాన న్యాయమూర్తి సిఫారసు చేసిన న్యాయ మూర్తే తదుపరి ప్రధాన న్యాయ మూర్తి అవుతారు. దాదాపుగా సుప్రీం కోర్టులో రెండవ స్థానంలో ఉండే అత్యంత సీనియర్ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తి పదవికి సూచిస్తారు. అయితే ఈ సంప్రదాయం రెండు సందర్భాల్లో అమలు కాలేదు. 1973లో జస్టిస్ ఎ.ఎన్.రే ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులను అధిగమిస్తూ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అలాగే 1977లో జస్టిస్ హన్స్రాజ్ ఖన్నా కాకుండా ఆయనకు జూనియర్ అయిన జస్టిస్ మీర్జా హమీదుల్లా బేగ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.హైదరాబాద్లో బెంచ్ ఎప్పుడో..సుప్రీంకోర్టు ప్రారంభించినప్పుడు దేశ జనాభా 36 కోట్లు మాత్రమే. ఇప్పుడది 140 కోట్లు దాటింది. ఇన్ని కోట్ల మందికి న్యాయం జరగాలంటే పలు రాష్ట్రాల్లో సుప్రీంబెంచ్ ఏర్పాటు చేయాలన్న అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. సుప్రీంకోర్టును కాలాను గుణంగా విస్తరించవచ్చని అధికరణం 130లో బీఆర్ అంబేడ్కర్ క్లుప్తంగా పేర్కొ న్నారు. దక్షిణాన హైదరాబాద్, తూర్పున కోల్కతా, పశ్చిమాన ముంబైలో ప్రాంతీయ బెంచ్ల ఆవశ్యకత ఉందని 18వ లా కమిషన్ 2009లోనే కేంద్రానికి తెలిపింది. దీనిపై పార్లమెంట్లో 2023లో నాటి ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి ప్రైవేట్ బిల్లు పెట్టారు. ప్రాంతీయ బెంచ్ల ఏర్పాటుకు పార్లమెంట్లో సాధారణ మెజారిటీ సరిపోతుంది. సుప్రీంకోర్టు సీజే ప్రతిపా దిస్తే.. రాష్ట్రపతి ఆమోదించినా ఏర్పాటు చేయొచ్చు. తెలంగాణ సరిహద్దుగా ఏపీ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలు న్నాయి. ఏపీ సరిహద్దుగా తమిళనాడు, ఒడిశా ఉన్నాయి. హైదరాబాద్ బెంచ్ తో ఈ రాష్ట్రాలకు ‘న్యాయం’ అందుతుందనే అభిప్రాయం ఉంది.ధిక్కారాన్ని శిక్షించే అధికారం..ఏ న్యాయస్థానాన్నైనా ధిక్కరించిన వారిని శిక్షించే అధికారం రాజ్యాంగంలోని 129, 142 అధికరణల ద్వారా సుప్రీంకోర్టుకు ఉంది. మహారాష్ట్ర మాజీ మంత్రి స్వరూప్ సింగ్ నాయక్పై సుప్రీంకోర్టు ఈ అధికారంతో ఒక అసాధారణ చర్య తీసుకుంది. 2006, మే 12న కోర్టు ధిక్కార నేరంపై ఆయనకు నెలరోజులపాటు జైలు శిక్ష విధించింది. మంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని జైలుకు పంపడం దేశంలో ఇదే తొలిసారి.స్వతంత్ర పటిష్టతతోనే విశ్వాసం..⇒ శాసన, కార్యనిర్వాహక విభాగాలకు సుప్రీంకోర్టు అంతరం పాటించాలి. ఈ వైఖరిని కొనసాగించపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. దేశం పురోగతి సాధించదు. ప్రజల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను పరిరక్షించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటైంది. రాజ్యాంగాన్ని దృఢమైన శరీరంగా కాకుండా.. స్వపరిపాలన, శక్తి కలిగిన జీవిగా వ్యాఖ్యానించే ప్రయత్నం చేద్దాం. అత్యున్నత న్యాయస్థానానికి విస్తృతాధికారాలు కల్పించడంలో రాజ్యాంగం కీలకప్రాత పోషించింది. హైకోర్టులు బలంగా ఉంటేనే సుప్రీంకోర్టు భారం తగ్గుతుంది. మెరిట్పై మాత్రమే న్యాయమూర్తుల నియామకాలు జరగాలి. రాజకీయాలు దీన్ని ప్రభావితం చేయలేవని భావిస్తున్నా. స్వతంత్ర పటిష్టతే న్యాయవ్యవస్థకు ప్రజల్లో విశ్వాసాన్ని పొందేలా చేస్తుంది. న్యాయస్థానాలు ఎవరి సొత్తూ కాదు. సద్భావన, సానుభూతిని ఆచరిస్తాయి. – జస్టిస్ హరిలాల్ జె. కానియా (సుప్రీంకోర్టు ఏర్పాటు సందర్భంగా..)లిల్లీ థామస్ గీ యూనియన్ ఆఫ్ ఇండియా (2013)పిటిషన్: రెండేళ్లు.. అంతకంటే ఎక్కువ కఠిన కారాగార శిక్ష పడిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీకి అనర్హులని ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ, సిట్టింగ్ చట్టసభల సభ్యులకు వర్తించదని పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు.బెంచ్: జస్టిస్ ఆర్పీ సేథి, జస్టిస్ ఎస్.సగీర్ అహ్మ తీర్పు: ‘సిట్టింగ్ చట్టసభల సభ్యులకు ఇస్తున్న మినహాయింపు చెల్లదు’ఎస్ఆర్ బొమ్మై గీ యూనియన్ ఆఫ్ ఇండియా (1994)పిటిషన్: కర్ణాటక (1988–89)లో తన మద్దతుకు సంబంధించి జనతాదళ్ శాసనసభాపక్షం ఆమోదించిన తీర్మాన కాపీని నాటి సీఎం బొమ్మై అప్పటి గవర్నర్ పి.వెంకటసుబ్బయ్యకు సమర్పించినా అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వలేదు. తీర్మాన కాపీని తిరస్కరిస్తూ రాష్ట్రపతి పాలన విధించాలన్న గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బొమ్మై పిటిషన్ వేశారు. బెంచ్: జస్టిస్ కుల్దీప్ సింగ్, జస్టిస్ పీబీ సావంత్, జస్టిస్ కే రామస్వామి, జస్టిస్ ఎస్సీ అగర్వాల్, జస్టిస్ యోగేశ్వర్ దయాల్, జస్టిస్ బీపీ జీవన్రెడ్డి, జస్టిస్ ఎస్ఆర్ పాండియన్, జస్టిస్ ఏఎం అహ్మదీతీర్పు: ‘సమాఖ్య వ్యవస్థ అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే ముందు అసెంబ్లీలో బల నిరూపణకు గవర్నర్ అవకాశం కల్పించాలి. రాజ్యాంగంలోని 356 అధికరణం కింద గవర్నర్ సర్కార్ను డిస్మిస్ చేయడం నిరంకుశత్వం. ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకునేందుకు అసలైన వేదిక శాసనసభే. గవర్నర్ సొంత అభిప్రాయానికి తావు లేదు’దేశవ్యాప్త సంచలన తీర్పులు..శంకరీ ప్రసాద్ సింగ్ గీ యూనియన్ ఆఫ్ ఇండియా గీ బిహార్ (1951)పిటిషన్: పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేయడాన్ని సవాల్ చేస్తూ శంకరీ ప్రసాద్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. బెంచ్: జస్టిస్ హీరాలాల్ జె. కనియా, జస్టిస్ బీకే ముఖర్జీ, జస్టిస్ చంద్రశేఖర అయ్యర్ తీర్పు: ‘ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంట్కు ఉంది’. తొలిసారిగా న్యాయ సమీక్షాధికారం వినియోగం.స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ గీ బేలా బెనర్జీ (1953)పిటిషన్: భూ సేకరణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. బెంచ్: జస్టిస్ పతంజలి శాస్త్రి, జస్టిస్ మెహర్ చంద్ మహా జన్, జస్టిస్ గులాం హసన్, జస్టిస్ బి.జగన్నాథ దాస్తీర్పు: ‘ప్రజల ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు మార్కెట్ విలువతో కూడిన నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందే’గోలక్నాథ్ గీ స్టేట్ ఆఫ్ పంజాబ్ (1967)పిటిషన్: పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ సంస్కరణలను సవాల్ చేస్తూ గోలక్నాథ్ పిటిషన్ వేశారు.బెంచ్: జస్టిస్ కె.సుబ్బారావు, జస్టిస్ కెఎన్ వాంచూ, జస్టిస్ ఎం. హిదాయతుల్లా, జస్టిస్ జేసీ షా, జస్టిస్ ఎస్ఎం సిక్రి, జస్టిస్ ఆర్ ఎస్ బచావత్, జస్టిస్ వి.రామస్వామి, జస్టిస్ జేఎం షెలత్, జస్టి స్ విశిష్ఠ భార్గవ, జస్టిస్ జీకే మిట్టర్, జస్టిస్ సీఏ వైద్యలింగం. తీర్పు: ‘‘ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్కు లేదు. రాజ్యాంగ సవరణలపైనా ఆర్టికల్ 13 ప్రకారం న్యాయసమీక్ష జరుగుతుంది. ఈ తీర్పు గత తీర్పులకు వర్తించదు. రాబోయే వాటికి వర్తిస్తుంది (దీన్ని ‘ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్’ అంటారు). రాజ్యాంగంలోని 1వ, 4వ, 17వ సవరణలు చెల్లుబాటు అవుతాయి. ప్రాథమిక హక్కులను పార్లమెంట్ సవరించాలంటే ‘ప్రత్యేక రాజ్యాంగ పరిషత్’ను ఏర్పాటు చేయాలి’’.కేశవానంద భారతి గీ స్టేట్ ఆఫ్ కేరళ (1973)పిటిషన్: ఐదు దశాబ్దాల క్రితం మఠం ఆస్తుల విషయంలో కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో ఎడనీర్ మఠాధిపతి కేశవానంద స్వామి పిటిషన్ వేశారు. బెంచ్: జస్టిస్ ఎస్ఎం సిక్రి అధ్యక్షతన జస్టిస్ ఏఎన్ గ్రోవర్, జస్టిస్ ఏఎన్ రే, జస్టిస్ డీజీ పాలేకర్, జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా, జస్టిస్ జేఎం షెలత్, జస్టిస్ కేకే మాథ్యూ, జస్టిస్ కేఎస్ హెగ్డే, జస్టిస్ ఎంహెచ్ బేగ్, జస్టిస్ పి.జగన్మోహన్రెడ్డి, జస్టిస్ ఎస్ఎన్ ద్వివేది, జస్టిస్ వైవీ చంద్రచూడ్ తీర్పు: ‘రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, మౌలిక స్వరూ పాన్ని మార్చలేం. సుప్రీంకోర్టు వాటి రక్షణ బాధ్యతను నిర్వర్తిస్తుంది. రాజ్యాంగ సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందిగానీ, మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం లేదు. రాజ్యాంగ ఆత్మను మార్చడం సాధ్యంకాదు.’మేనకాగాంధీ గీ యూనియన్ ఆఫ్ ఇండియా (1978) పిటిషన్: తన పాస్పోర్టును అధికారులు స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ మేనకాగాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.బెంచ్: జస్టిస్ ఎం.హమీదుల్లా బేగ్, జస్టిస్ వైవీ చంద్రచూడ్, జస్టిస్ పీఎన్ భగవతి, జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్, జస్టిస్ ఎన్ఎల్ ఉంత్వాలియా, జస్టిస్ సయ్యద్ ముర్తజా ఫజలాలి, జస్టిస్ పీఎస్ కైలాసంతీర్పు: ‘ప్రజాప్రయోజనం అనేది బహుళ విస్తృతమైనది. పాస్పోర్టు చట్టం 1967 పేరుతో అధికారులు 14, 19, 21 అధికరణాలను ఉల్లంఘించారు. వ్యక్తుల ప్రాథమిక హక్కులను భంగపర్చలేరు. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను చట్టబద్ధమైన ప్రక్రియతో ఆటంకపర్చలేరు’మినర్వా మిల్స్ గీ యూనియన్ ఆఫ్ ఇండియా (1980)పిటిషన్: ఇందిరాగాంధీ సర్కార్ చేసిన 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మినర్వా మిల్స్ లిమిటెడ్ సవాల్ చేసింది.బెంచ్: జస్టిస్ వైవీ చంద్రచూడ్, జస్టిస్ పీఎన్ భగవతి, జస్టిస్ ఏసీ గుప్తా, జస్టిస్ ఎన్ఎల్ ఉంట్వాలియా, జస్టిస్ పీఎస్ కైలాసంతీర్పు: రాజ్యాంగ సవరణ చట్టాలను న్యాయస్థానాల్లో సవాల్ చేయకూడదంటూ అధికరణం 368(4), రాజ్యాంగ సవరణ అధికారంపై పార్లమెంట్కు ఎలాంటి పరిమితులు ఉండొద్దంటూ అధికరణం 368(5)కు చేసిన సవరణ రద్దు చేస్తున్నాం. ఈ క్లాజ్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం.మహమ్మద్ అహ్మద్ ఖాన్ గీ షా బానో బేగం (1985)పిటిషన్: మహమ్మద్ అహ్మద్ ఖాన్ నుంచి భరణం కోరుతూ ట్రయల్ కోర్టును ఆశ్రయించిన 65 ఏళ్ల షాబానో బేగం. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973లోని సెక్షన్ 123 ప్రకారం తనకు, తన ఐదుగురు పిల్లలకు భరణం ఇవ్వాలని కోరారు. అహ్మద్ ఖాన్ అప్పీల్పై విచారణ. బెంచ్: జస్టిస్ వైవీ చంద్రచూడ్, జస్టిస్ మిశ్రా రంగానాథ్, జస్టిస్ డీఏ దేశాయ్, జస్టిస్ ఓ.చిన్నపరెడ్డి, జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్యతీర్పు: ‘ముస్లిం మహిళలకు కూడా భరణం చెల్లించాల్సిందే. ఇద్దత్ గడువు (విడాకుల తర్వాత 3 నెలలు) ముగిసిన తర్వాత కూడా ముస్లిం భర్త.. భరణం చెల్లించాల్సిందే. భరణం చారిటీ కాదు.. హక్కు’ఇందిరా సహాని గీ యూనియన్ ఆఫ్ ఇండియా (1992)పిటిషన్: మండల కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) 27 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేశారు.బెంచ్: జస్టిస్ ఎంహెచ్ కనియా, జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య, జస్టిస్ ఎస్.రణవేల్ పాండియన్, జస్టిస్ టీకే తొమ్మెన్, జస్టిస్ ఏఎం అహ్మదీ, జస్టిస్ కుల్దీప్ సింగ్, జస్టిస్ పీబీ సావంత్, జస్టిస్ ఆర్ఎం సహాయ్, జస్టిస్ బీపీ జీవన్రెడ్డితీర్పు: ‘ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) 27 శాతం రిజర్వేషన్లు సమర్థనీయం’ -
ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు బెయిల్
-
సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణంరాజుకు షాక్
-
భారత్ కస్టడికి ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రాణా..
-
సుప్రీంకోర్టులో YSRCP నేత గౌతంరెడ్డికి ఊరట
-
సుప్రీంకోర్టు చివాట్లు పెడితే ఇంత దిగజారి రాస్తారా..!
-
జగన్ కేసులతో మీకేం పని?
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులతో మీకేం పనంటూ మాజీ ఎంపీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు అక్షింతలు వేసింది. ఈ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదలాయించాలన్న ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. ఆ కేసులను మరో రాష్ట్రానికి బదలాయించే ప్రసక్తే లేదని, మహా అయితే ఈ కేసుల్లో విచారణను వేగవంతం చేయాలని కింది కోర్టుకు చెప్పగలమని స్పష్టం చేసింది.అంతే తప్ప ఎలా పడితే అలా ఆదేశాలు ఇవ్వలేమంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు కోరుతున్న నేపథ్యంలో, అసలు ఆ కేసులతో మీకేం సంబంధమని ఆయన్ని నిలదీసింది. వాదనలు వినిపించేందుకు సీఐడీ గడువు కోరడంతో విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీ‹Ùచంద్ర శర్మ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రఘురామకృష్ణరాజుకు ప్రత్యేక కోర్టు, హైకోర్టుల్లో చుక్కెదురు.. జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీఐడీ, ఈడీ పలువురిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో జగన్కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జగన్పై నమోదైన కేసుల్లో సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా, జగన్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని ఆ కోర్టు కొట్టేసింది. ఆ తరువాత హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో సైతం రఘురామకృష్ణరాజుకు చుక్కెదురైంది. దీంతో జగన్ బెయిల్ను రద్దు చేయడంతో పాటు, ఆయనపై నమోదైన కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఆయన 2023లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా సోమవారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అసలు జగన్ కేసులతో మీకేం సంబంధమంటూ రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేసే ప్రసక్తేలేదని తేల్చి చెప్పింది.రాజకీయ విద్వేషంతోనే పిటిషన్ అనంతరం జగన్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. రాజకీయపరమైన విద్వేషంతోనే రఘురామకృష్ణరాజు ఈ పిటిషన్ దాఖలు చేశారన్నారు. సీఐబీ, ఈడీ నమోదు చేసిన కేసులపై సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణను హైకోర్టు పర్యవేక్షిస్తోందని తెలిపారు. ప్రత్యేక కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. కేసుల వివరాలు, వాటి ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేశామని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సీబీఐ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) మరో కేసులో వాదనలు వినిపిస్తున్నారని, అందువల్ల ఈ వ్యాజ్యంలో వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. -
చిక్కుల్లో బాబా రామ్దేవ్
తిరువనంతపురం: ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్పై బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యింది. వినియోగదారుల్ని తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారంటూ బాబా రామ్దేవ్తో పాటు ఆచార్య బాలకృష్ణ, దివ్య ఫార్మసీలపై కేరళ కోర్టు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.మోసపూరిత వ్యాపార ప్రకటనపై నమోదైన కేసులపై పాలక్కాడ్లోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ II కోర్టులో విచారణ జరిగింది. జనవరి 16న జరిగిన విచారణలో.. రామ్ దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ, దివ్య ఫార్మసీల ప్రతినిధులు కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సి ఉంది. కానీ కోర్టుకు రాలేదు. అందుకే నిందితులందరికీ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తున్నామని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది.డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం, 1954ను ఉల్లంఘించినట్లు పతంజలి ఆయుర్వేద అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీలు ప్రచారం చేసిన ప్రకటనలపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతుంది. గత రెండేళ్లుగా పతంజలి, దాని వ్యవస్థాపకులు అనేక చట్టపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. పతంజలి ఆయుర్వేద్కు వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ఫిర్యాదు చేసింది. నాటి నుంచి రామ్ దేవ్ బాబా సంస్థలు సమస్యలతో సహవాసం చేస్తున్నాయి. పతంజలి ఇస్తున్న యాడ్స్పై సుప్రీం కోర్టు సైతం నిర్వాహకులకు మొట్టికాయలు వేసింది. తప్పుదారి పట్టించే ప్రకటనలను తాత్కాలికంగా నిషేధించాలని సూచించింది. కోర్టు నిర్ణయాన్ని ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, రామ్ దేవ్ బాబా సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాల కోసం వ్యాధులను నయం చేయడం గురించి, అల్లోపతితో సహా, ఆధునిక వైద్యాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. -
‘సుప్రీం’ ఆదేశాలు.. తల్లి వద్దే అతుల్ సుభాష్ కుమారుడు!
న్యూఢిల్లీ: భార్య వేదింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ నాలుగేళ్ల కుమారుడి సంరక్షణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే అంశంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. బాలుడి తల్లి నిఖితా సింఘానియా సంరక్షణలోనే ఉంచాలని సుప్రీం కోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది. తన మనువడిని తనకు అప్పగించాలని కోరుతూ అతుల్ సుభాష్ తల్లి అంజు దేవి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై దేశ అత్యున్నత న్యాయ స్థానంలో ఇవాళ విచారణ జరిగింది. బాలుడి కస్టడీని కోరిన సుభాష్ తల్లి అంజు దేవి చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా సుప్రీం కోర్టు ధర్మాసనం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎస్సీ శర్మ సోమవారం అతుల్ సుభాష్ కుమారుడు ఆన్లైన్లో వీడియో ద్వారా మాట్లాడారు. అనంతరం తీర్పును వెలువరించారు.విచారణ సందర్భంగా అతుల్ సుభాష్ కుమారుణ్ని న్యాయమూర్తులకు చూపించేందుకు నిఖితా సింఘానియా నిరాకరించారు. దీనిపై జస్టిస్ బీవీ నాగర్నత ధర్మాసనం మాట్లాడుతూ.. ఇది హెబియస్ కార్పస్ పిటిషన్. మేం ఆ పిల్లాడిని చూడాలనుకుంటున్నాం. వెంటనే మాకు చూపించండి. బాలుడిని విచారణ చేపట్టిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. విచారణ సందర్భంగా అతుల్ సుభాష్ కుమారుణ్ని న్యాయమూర్తులకు చూపించేందుకు నిఖితా సింఘానియా నిరాకరించారు. దీనిపై జస్టిస్ బీవీ నాగర్నత ధర్మాసనం మాట్లాడుతూ.. ఇది హెబియస్ కార్పస్ పిటిషన్. మేం ఆ పిల్లాడిని చూడాలనుకుంటున్నాం. వెంటనే మాకు చూపించండి. బాలుడిని విచారణ చేపట్టిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కోర్టు వ్యాఖ్యలపై 45 నిమిషాల విరామం తర్వాత బాలుడు వీడియో లింక్లో ప్రత్యక్షమయ్యాడు. వీడియోలో కనిపిస్తున్న అతుల్ సుభాష్ కుమారుడితో మాట్లాడారు. ఆ సమయంలో కోర్టు విచారణను ఆఫ్ లైన్ చేసింది. ఇక బాలుడితో మాట్లాడిన తర్వాత అతుల్ సుభాష్ భార్య నిఖితా సింఘానియా కుటుంబసభ్యుల సమక్షంలో ఉండాలని సుప్రీం అత్యున్నత న్యాయ స్థానం తీర్పును వెలువరించింది. అతుల్ సుభాష్ కేసేంటి?ఉత్తర ప్రదేశ్కు చెందిన అతుల్ సుభాష్, నిఖిత 2019లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ జంట బెంగళూరుకు వెళ్లి తమ తమ ఉద్యోగాల్లో చేరింది. ఆ మరుసటి ఏడాది వారికి బాబు పుట్టాడు. 2021లో నిఖిత బెంగళూరులోని భర్తను విడిచిపెట్టి కొడుకుతో సహా పుట్టింటికి చేరింది. ఆపై భర్త, అతని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. అలా.. విచారణ కోసం అతుల్ను భార్య స్వస్థలం జౌన్పురలోని ఫ్యామిలీ కోర్టుకు కోసం వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో.. మానసికంగా, శారీరకంగా అలసిపోయిన అతుల్ సుభాష్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే క్రమంలో తన భార్య, ఆమె కుటుంబం ఏ స్థాయిలో మానసికంగా వేధించిందో పేజీల కొద్దీ రాసిన సూసైడ్ లేఖ, 90 నిమిషాల నిడివితో తీసిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. కొడుకును అడ్డుపెట్టుకుని తన భార్య ఆర్థికంగా తనను దోచుకుందని.. న్యాయస్థానంలోనూ తనకు అన్యాయం జరిగిందని, ఇంక తన వల్ల కాకనే ఇలా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడతను. అంతేకాదు.. తన కొడుకును తన తల్లిదండ్రులకు అప్పగించాలని ఆఖరికి కోరికగా కోరాడు. ఈ ఘటన తర్వాత.. లక్షల మంది మద్ధతుతో మెన్టూతో పాటు జస్టిస్ ఈజ్ డ్యూ, జస్టిస్ ఫర్ అతుల్ ట్యాగ్స్ ట్రెండింగ్లో కొనసాగాయి.అతుల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు.. పరారీలో ఉన్న నిఖితా సింఘానియాను, ఆమె తల్లీ, సోదరుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది. -
రఘురామ కృష్ణంరాజు లాయర్కు సుప్రీంకోర్టు అక్షింతలు
-
రఘురామ కృష్ణంరాజు లాయర్ కు సుప్రీంకోర్టు అక్షింతలు
-
రఘురామ కృష్ణంరాజు లాయర్కు సుప్రీంకోర్టు అక్షింతలు
సాక్షి, ఢిల్లీ: వైఎస్ జగన్ కేసుల విచారణ బదిలీ చేయాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం విచారణ జరిపింది. కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయలేమని జస్టిస్ బీవీ నాగరత్న స్పష్టం చేశారు. ఈ కేసులను హైకోర్టు చూసుకుంటుందన్నారు. త్వరగా విచారణ జరపాలని కోరుతామని వెల్లడించారు.ఈ కేసుతో మీకు సంబంధం ఏంటని రఘురామ కృష్ణంరాజు తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సీబీఐ తరఫు న్యాయవాది ఈ కేసులో వాదనలకు సమయం కోరారు. దాంతో విచారణను వచ్చే సోమవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కేసులు విచారణను హైకోర్టు పర్యవేక్షిస్తుందని సీనియర్ న్యాయవాది ముకుల్.. కోర్టుకు తెలిపారు. ట్రయల్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని ముకుల్ తెలిపారు. రాజకీయపరమైన పిటిషన్గా ముకుల్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: తనది రాక్షసపాలనే అని చెప్పడమే బాబు ఆంతర్యమా? -
సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ తరఫు న్యాయవాదుల పిటిషన్
-
పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్
సాక్షి, ఢిల్లీ: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ (BRS Party).. సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించింది. రెండు పిటిషన్లను బీఆర్ఎస్ దాఖలు చేసింది. ఏడుగురు ఎమ్మెల్యేల ఫిరాయింపు(Defections)పై రిట్ పిటిషన్ వేసింది. పోచారం, కాలె యాదయ్య, సంజయ్కుమార్, కృష్ణమోహన్రెడ్డి, మహిపాల్రెడ్డి, ప్రకాష్గౌడ్, గాంధీలపై రిట్ వేయగా, ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎస్ఎల్పీ వేసింది. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై ఎస్ఎల్పీ దాఖలు చేసింది. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ స్పీకర్ కనీసం ఎమ్మెల్యేలకు నోటీసు ఇవ్వలేదని పిటిషన్లో బీఆర్ఎస్ పేర్కొంది. స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనర్హత పిటిషన్లపై వెంటనే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని బీఆర్ఎస్ కోరింది. కాగా, ప్రస్తుతం ఢిల్లీలోనే బీఆర్ఎస్ నేత హరీష్రావు ఉన్నట్లు సమాచారం.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది.. స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. అయితే, మూడు నెలలు గడిచినా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లింది.2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించగా, ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. దీంతో పార్టీ బలం 38 మంది ఎమ్మెల్యేలకు తగ్గింది. కాగా.. భద్రాచలం, బాన్సువాడ, ఖైరతాబాద్, స్టేషన్ ఘన్ పూర్, జగిత్యాల, చేవెళ్ల, గద్వాల్, రాజేంద్రనగర్, పటాన్ చెరువు, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఇదీ చదవండి: ఫార్ములా కేసులో ఈడీ ముందుకు కేటీఆర్.. -
నేడు కేటీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ
-
వారు జేఈఈ–అడ్వాన్స్డ్కు రిజిస్టర్ చేసుకోవచ్చు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఐఐటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు వీలు కల్పించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)–అడ్వాన్స్డ్ పరీక్షను అభ్యర్థులు కేవలం రెండుసార్లు రాసుకొనేలా జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఏబీ) తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకొనేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జేఈఈ– అడ్వాన్స్డ్ ప్రయత్నాల సంఖ్యను మూడు నుంచి హఠాత్తుగా రెండుకు తగ్గించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసిహ్తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. 2024 నవంబర్ 5 నుంచి 18వ తేదీ వరకు తమ కోర్సుల నుంచి డ్రాప్ అయిన అభ్యర్థులు జేఈఈ–అడ్వాన్స్డ్–2025 పరీక్ష రాసేందుకు రిజిస్టర్ చేసుకోవచ్చని స్పష్టంచేసింది. ఈ మేరకు ధర్మాసనం ఉత్తర్వు జారీ చేసింది. ప్రయత్నాల సంఖ్యను మూడు నుంచి రెండుకు తగ్గించడం వల్ల తాము నష్టపోతామని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అలహాబాద్ హైకోర్టు నిర్ణయంతో అన్యాయం జరగదు
న్యూఢిల్లీ: శ్రీ కృష్ణ జన్మభూమి– షాహి ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి హిందూ పిటిషనర్లు వేసిన 15 పిటిషన్లపై ఒకేసారి విచారణ చేపట్టాలన్న అలహాబాద్ హైకోర్టు నిర్ణయం సహేతుకంగానే ఉందని, ఇరువర్గాల వారికీ న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. 1991నాటి ప్రార్థనాస్థలాల చట్టానికి సంబంధించిన కేసుల విచారణలో ఉన్నామని, ఈ దశలో ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అవసరమనిపిస్తే తర్వాత దీనిపై విచారణ చేపడతామని పేర్కొంది. అయితే, హైకోర్టులో దాఖలైన పిటిషన్లన్నీ ఒకే అంశానికి సంబంధించినవి కాకున్నా అన్నిటినీ కలిపి విచారించనుండటంతో తమకు అన్యాయం జరుగుతుందని మసీదు తరఫు లాయర్ వాదించారు. ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులు తలెత్తేందుకు అవకాశం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం.. ఏప్రిల్ మొదటి వారంలో ఈ పిటిషన్పై విచారణ చేపడతామని తెలిపింది. మసీ దులు, దర్గాలు తదితర ప్రార్థనాస్థలాలకు సంబంధించిన పిటిషన్లపై ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వొద్దని అన్ని కోర్టులకు సుప్రీంకోర్టు డిసెంబర్ 12న ఆదేశాలివ్వడం తెలిసిందే. అదేవిధంగా, మందిరం– మసీదు వివాదంపై హిందూ పక్షం వేసిన 15 అప్పీళ్లపై ఒకే దఫాలో విచారణ చేపడతామని గతేడాది జనవరి 11వ తేదీన అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది. -
న్యాయం నా వైపే ఉంది.. సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటా: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: చెవిరెడ్డి భాస్కర్రెడ్డి క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. న్యాయం తన వైపే ఉందని.. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు. ఘటన జరిగిన రోజు బాలిక తండ్రి పిలిస్తేనే తాను వెళ్లానని.. కానీ తనపై అనవసరంగా ఫోక్సో కేసు పెట్టారని చెవిరెడ్డి అన్నారు. ఈ కేసును సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటానని చెవిరెడ్డి స్పష్టం చేశారు.అసలు జరిగింది ఇదే..కాగా, తిరుపతి జిల్లాలో ఓ బాధిత బాలికకు అండగా నిలిచినందుకు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై ఏకంగా 11 సెక్షన్ల కింద అక్రమ కేసు నమోదు చేయడం చంద్రబాబు సర్కారు అరాచక పాలన, దుర్మార్గాలకు పరాకాష్టగా నిలుస్తోంది. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక పాఠశాల నుంచి వస్తుండగా కొద్ది రోజుల క్రితం కొందరు యువకులు దాడి చేసి అపహరించుకుపోయారు.కుమార్తె కోసం గాలిస్తూ వచ్చిన ఆమె తండ్రి ముళ్ల పొదల్లో బాధితురాలిని గుర్తించినట్లు చెప్పారు. ‘బడి నుంచి వస్తున్న నా బిడ్డపై దుర్మార్గులు దాడి చేశారు. ముళ్ల పొదల్లో పడవేశారు. ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు అడ్డగించి కత్తితో దాడిచేశారు. నీళ్లలో మత్తు బిళ్లలు కలిపి తాగించారు. చేతిపై, కడుపుపై కత్తితో కోశారు. గంటవరకు బాలిక సృహలో లేదు.నా పరువు పోయినా పరవాలేదు.. పోలీసులు నిందితులను పట్టుకుని స్టేషన్కు తెచ్చి ఉరితీయాలి.. అప్పుడే మాకు న్యాయం జరిగినట్లు..’ అంటూ బాధిత బాలిక తండ్రి విలపించాడు (ఆ వీడియో కూడా ఉంది). ఈ ఘటన గురించి తెలియడంతో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చలించిపోయారు. వెంటనే 80 కిలోమీటర్లు దూరం ప్రయాణించి బాధిత బాలికను, కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. పరామర్శించేందుకు వెళ్లి న్యాయం కోసం నిలబడిన చెవిరెడ్డిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
నిబంధనలు పాటిస్తే బ్యాంకులదే బాధ్యత
అనధికార లావాదేవీలను గుర్తించడానికి, వాటిని నిరోధించడానికి బ్యాంకులు సాంకేతిక సామర్థ్యాలను ఉపయోగించాలని గువాహటి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court) ఇటీవల సమర్థించింది. థర్డ్ పార్టీ యాప్స్, టూల్స్ ఉల్లంఘనల వల్ల తలెత్తే అనధికార లావాదేవీలను బ్యాంకులే కట్టడి చేయాలని తేల్చి చెప్పింది. ఈ విషయంలో నిబంధనల ప్రకారం నడుచుకున్న వినియోగదారులపై ఎలాంటి భారం మోపకూడదని, పూర్తి బాధ్యత బ్యాంకులదేనని ఆర్బీఐ మార్గదర్శకాలను ఉటంకించింది. తన ఖాతాలో మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు నివేదించిన భౌమిక్ అనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినియోగదారుడికి రూ.94,204.80 తిరిగి చెల్లించాలని భారత సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది.అసలేం జరిగిందంటే..పల్లబ్ భౌమిక్ అనే ఎస్బీఐ కస్టమర్ ఆన్లైన్లో ఓ వస్తువు కొనుగోలు చేశాడు. అది డెలివరీ అయ్యాక తనకు కొన్ని కారణాల వల్ల ప్రోడక్ట్ రిటర్న్ పెట్టాడు. రిటర్న్ ప్రాసెస్ పూర్తవ్వడానికి, తన పేమెంట్ రిటర్న్ చేయడానికి కొన్ని వివరాలు చెప్పాలంటూ కస్టమర్ సర్వీస్గా నటిస్తూ భౌమిక్కు ఒక వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అతను అనధికార లావాదేవీలను సులభతరం చేసే మొబైల్ యాప్(Mobile App)ను డౌన్లోడ్ చేయమని ఆదేశించాడు. కానీ తాను ఎలాంటి నగదును తిరిగి పొందలేదని భౌమిక్ చెప్పాడు. దీనికి సంబంధించి 24 గంటల్లోనే బ్యాంకుకు సమాచారం అందించాడు. కానీ బ్యాంకు రీఫండ్ ఇవ్వలేదు. దాంతో భౌమిక్ కోర్డును ఆశ్రయించాడు. ఆ క్రమంలో భౌమిక్ ఓటీపీలు, ఎంపీఐఎన్లు వంటి సున్నితమైన సమాచారాన్ని సైబర్ మోసగాళ్లతో షేర్ చేసుకున్నాడని ఎస్బీఐ మొదట్లో వాధించింది. అయితే, తాను ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదని, రిటైలర్ వెబ్సైట్లో డేటా ఉల్లంఘన కారణంగానే ఈ మోసం జరిగిందని భౌమిక్ పేర్కొన్నాడు.ఇదీ చదవండి: ఆహార వృథాను తగ్గిస్తూ.. ఆకలి తీరుస్తూ..థర్డ్ పార్టీ యాప్లు, ఆన్లైన్ టూల్స్(Online Tools) ఉల్లంఘనల వల్ల జరిగే అనధికార లావాదేవీలకు వినియోగదారులను బాధ్యులను చూయకూడదని ఆర్బీఐ మార్గదర్శకాలను ఉటంకిస్తూ గౌహతి హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ భౌమిక్కు అనుకూలంగా తీర్పు ఇచ్చాయి. దీన్ని సవాలు చేస్తూ ఎస్బీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థించింది. వినియోగదారుడికి రూ.94,204.80 తిరిగి చెల్లించాలని ఇటీవల తీర్పు ఇచ్చింది. -
లోపలకు వచ్చినంత మాత్రాన దాడి చేస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఇంటి లోపలకు వచ్చినంత మాత్రాన జర్నలిస్ట్పై దాడి చేస్తారా’అంటూ సినీనటుడు మంచు మోహన్బాబును సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మరోపక్క మోహన్బాబుపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ రాష్ట్ర పోలీసులకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది డిసెంబర్ 10న జల్పల్లిలోని తన నివాసం వద్ద జర్నలిస్ట్పై దాడి కేసులో మోహన్బాబుకు హైకోర్టులో ముందస్తు బెయిల్ రాలేదు. దీంతో ఆయన డిసెంబర్ 24న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను గురువారం జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. జర్న లిస్ట్పై దాడి జరిగిన సందర్భాన్ని మోహన్బాబు తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాస నానికి తెలిపారు. క్షణికావేశంలో మోహన్బాబు జర్నలిస్ట్ మైక్ లాక్కొని, అదే మైక్ను విసిరారన్నారు. అయితే ఈ ఘటనపై బహిరంగ క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, అవసరమైతే బాధిత జర్నలిస్ట్కు నష్టపరిహారం చెల్లించేందుకు సుముఖంగా ఉన్నారని అభ్యర్థించారు. దవడ విరగడంతో.. పైపు ద్వారా ఆహారంమోహన్బాబు దాడి చేయడం వల్లే జర్నలిస్ట్ దవడ విరిగిందని ఆయన తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసు కెళ్లారు. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని కోరేందుకే మోహన్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రికి వెళ్లారని ధర్మాస నానికి గుర్తు చేశారు. ఈ సందర్భంగా ముకుల్ రోహత్గీ జోక్యం చేసుకొని మోహన్బాబు జర్నలిస్ట్ను బెదిరించలేదని, అయినా హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారన్నారు. మోహన్బాబు ఇంటిపైకి 20–30 మంది వచ్చారని, ఇది అతిక్రమణ కిందకు వస్తుందని చెప్పారు. మోహన్బాబు పేరున్న నటుడని, ఎవరినైనా చంపడం, బాధపెట్టడం ఆయనకు ఇష్టం లేదని ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి తెలిపారు. ప్రతివాదులకు నోటీసులు జారీ ఈ వాదనలపై జస్టిస్ దులియా స్పందిస్తూ..ఎవరైనా ఇంటిలోపలకు వచ్చినంత మాత్రాన దాడి చేస్తారా అని మోహన్బాబు తరపు అడ్వొకేట్ రోహిత్గీని ప్రశ్నించారు. అయితే ఇరుపక్షాలు వాదనలు విన్న ధర్మాసనం..ప్రతివా దిగా ఉన్న బాధితుడు పరిహారం కోరుకుంటున్నారా చెప్పాలని కోరింది. దీనిపై జర్నలిస్ట్ న్యాయవాదితో మాట్లాడి, ఆయనకు ఏం కావాలో చేస్తానని ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణ వరకు మోహన్బాబుపై బలవంతపు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి, జర్నలిస్ట్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 13కు వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. -
మోహన్ బాబును జైలుకు పంపాలా..? నష్టపరిహారం కావాలా..?: సుప్రీంకోర్టు
కొద్దిరోజుల క్రితం జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో సినీ నటుడు మోహన్బాబుకు సుప్రీంకోర్టులో (Supreme Court ) స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ జరిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ జరిగే వరకు మోహన్బాబుపై (Mohan Babu) ఎలాంటి చర్యలు తీసుకోకవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.అయితే, విచారణలో భాగంగా న్యాయస్థానం పలు ప్రశ్నలు అడిగింది. జర్నలిస్టులు లోపలికి వచ్చినంత మాత్రాన దాడి చేస్తారా.. ? అంటూ నటుడు మోహన్ బాబును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అది ఆవేశంలో జరిగిన ఘటన అని, బాధితుడికి పూర్తి నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోహన్ బాబు తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి తెలిపారు. అయితే, ఈ కేసుకు సంబంధించి నష్టపరిహారం కావాలా.. ? మోహన్ బాబును జైలుకు పంపాలా..? అని జర్నలిస్టు తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు అడిగింది. అయితే, ఈ అంశం గురించి తదుపరి విచారణలో సమాధానం ఇస్తామని జర్నలిస్ట్ తరఫు న్యాయవాది చెప్పడంతో మూడు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని రంజిత్ కుమార్ను కోర్టు ఆదేశించింది.(ఇదీ చదవండి: 400 ఏళ్ల నాటి గుడి కాన్సెప్ట్తో సినిమా.. గ్లింప్స్తోనే హైప్)మోహన్ బాబు తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇలా వాదనలు వినిపించారు. జర్నలిస్టులకు ఆహ్వానం లేకుండానే ఎందుకు ఇంటికి వచ్చారని న్యాయవాది ప్రశ్నించారు. అయినప్పటికీ ఇది ఆవేశంలో జరిగిన ఘటనగా చూడాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ సంఘటనతో జర్నలిస్ట్కు క్షమాపణలు చెపుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే, నష్టపరిహారం చెల్లించేందుకు మోహన్ బాబు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఆయన వయసు 76 సంవత్సరాలు కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని ముకుల్ కోరారు. అయితే, మోహన్ బాబు దాడిలో తీవ్రంగా గాయపడ్డానని జర్నలిస్ట్ కోర్టుకు తెలిపారు. ఆ కారణంగా ఐదు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఈ దాడి వల్ల వృత్తిపరంగా తనకు నష్టం జరిగిందని జర్నలిస్ట్ తెలిపారు. -
సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్
-
సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు(Formula E Car Race Case)లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court)లో ఆయన సవాల్ చేశారు.ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ కేసును కొట్టేయాలని కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ దర్యాప్తులో మేం జోక్యం చేసుకోం అని తీర్పు సందర్భంగా పేర్కొంది. అయితే ఆ సమయంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరగా.. ఆ విజ్ఞప్తిని ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు.ఈ కేసులో తాజా పరిణామాలపై ఏసీబీ ఆఫీసులో అధికారులు భేటీ అయ్యారు. ఎఫ్ఈవో, హెచ్డీఏతో పాటు రెవెన్యూ అధికారుల పాత్రపై చర్చించడంతో పాటు సుప్రీం కోర్టును కేటీఆర్ ఆశ్రయించడంతో.. అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించారు.మరో వైపు.. అధికారులు అరవింద్కుమార్, బీఎల్ఎన్రెడ్డి నోటీసులపై చర్చతో పాటు, మొదటి రేసు తర్వాత తప్పుకున్న కంపెనీలపై కూడా చర్చించారు. ఏసీబీ ఉన్నతాధికారులతో బంజారాహిల్స్ ఏసీపీ,సీఐతో పాటు కొంతమంది సిబ్బంది సమావేశమయ్యారు. క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. కాగా, తమ వాదన కూడా వినాలని ప్రభుత్వం.. కేవీయట్ వేసింది.ఇదీ చదవండి: కేటీఆర్దే బాధ్యత.. ఎఫ్ఐఆర్ క్వాష్ అరుదైన నిర్ణయం: హైకోర్టు -
సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా
కొద్దిరోజుల క్రితం జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో చిక్కుకున్న సినీ నటుడు మోహన్బాబు ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే, ఇదే కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్పై జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ జరిపారు. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అందుబాటులో లేకపోవడంతో మోహన్ బాబు తరపు న్యాయవాది పాస్ ఓవర్ కోరారు. అందుకు అంగీకరించని న్యాయస్థానం విచారణను గురువారానికి వాయిదా వేసింది.ఏం జరిగిందంటే?ఇటీవల మోహన్బాబు, మనోజ్ మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు జల్పల్లిలోని ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో జర్నలిస్టు రంజిత్పై మోహన్బాబు మైక్తో దాడి చేశారు. దీంతో ఆయన పహడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోహన్బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.మోహన్ బాబు, మంచు మనోజ్ వివాదంలో ఇప్పటికే మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో జర్నలిస్ట్పై దాడికి సంబంధించిన కేసులో ఆయన తెలంగాణ హైకోర్టును గతంలో ఆశ్రయించారు. అయితే, డిసెంబర్ 24న పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు జారీ చేసిన ఆదేశాలను ఆయన ఉల్లంఘించడంతో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వబోమని న్యాయస్థానం తెలిపింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నేడు ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలో విచారణ జరగనుంది. -
వాంగ్మూలాలు మార్చేసి.. ‘సుప్రీం’ను ఏమార్చాలి
సాక్షి, అమరావతి : సీఆర్పీసీ 164 వాంగ్మూలాలు మార్చాలి.. సుప్రీంకోర్టును ఏమార్చాలి.. ఏం చేసినా ఈ నెల 21లోగా చేసేయాలి.. అందుకు ఎంతకైనా బరితెగించాలన్నది టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రగా స్పష్టమవుతోంది. సీఐడీని అడ్డుపెట్టుకుని ఈ కుతంత్రానికి పాల్పడుతోంది. చంద్రబాబుపై అవీనీతి కేసులను నీరుగార్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. న్యాయస్థానంలో సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల సంగతి తేలుస్తామని ఎన్నికల ముందు లోకేశ్ హెచ్చరించినట్టుగానే.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం న్యాయస్థానాల్లో ఉన్న కేసులను ప్రభావితం చేసేలా అక్రమాలకు పాల్పడుతోంది. అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించి ఏకంగా సుప్రీంకోర్టునే ఏమార్చేందుకు బరితెగిస్తోంది. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై ప్రస్తుతం సీఐడీ వరుసగా వాయిదాలు కోరుతుండటంపై సుప్రీంకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం హడలిపోతోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టు అయిన చంద్రబాబు.. ప్రస్తుతం బెయిల్పై ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని గతంలోనే సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పిటిషన్ అంశంలో సీఐడీ ప్లేటు ఫిరాయించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణకు ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీ వరుసగా వాయిదాలు కోరుతుండటం గమనార్హం. గత విచారణకు కూడా ఆయన నేరుగా హాజరు కాకుండా వర్చువల్గా పాల్గొని వాదనలు వినిపించకుండా మరోసారి వాయిదా కోరారు. వరుస వాయిదాలు కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి వాయిదా ఇవ్వమని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. దాంతో ఈ నెల 21న సుప్రీంకోర్టు విచారణకు హాజరై చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సీఐడీ తరఫు న్యాయవాది తప్పనిసరిగా తన వాదనలు వినిపించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఆ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన కేసునే ఆయన వాదిస్తున్నారు. అంటే నిబంధనల ప్రకారం చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఆయన వాదనలు వినిపించాలి. కానీ ఈ పిటిషన్ వీగిపోయేలా చేసేందుకే ప్రస్తుత సీఐడీ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు కుట్రలకు పదును పెడుతున్నారు. ఈ నెల 21లోగా తిమ్మిని బమ్మి చేసేందుకు బరితెగిస్తున్నారు. అబద్ధపు వాంగ్మూలాలతో ‘సుప్రీం’ను ఏమార్చే కుట్ర 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కుంభకోణాలకు చంద్రబాబే ప్రధాన కుట్రదారు అని ఐఏఎస్ అధికారులు చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్, కాంతిలాల్ దండే స్పష్టం చేశారు. ఆమేరకు 164 సీఆర్పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ కేసులో ఆ వాంగ్మూలాలు కీలక సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అందుకే వారిపై టీడీపీ కూటమి ప్రభుత్వం గురి పెట్టింది. గతంలో ఇచ్చిన వాంగ్మూలాలకు పూర్తి విరుద్ధంగా అబద్ధపు వాంగ్మూలాలను సీఆర్పీసీ 164 కింద మరోసారి నమోదు చేయించేందుకు కుతంత్రం పన్నుతోంది.సీఆర్పీసీ 164 కింద ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇవ్వడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయినా సరే ఈ నెల 8న ఆ అధికారులతో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించాలని సీఐడీ పట్టుబడుతోంది. ఈ నెల 21లోగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించి, ఆ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా సుప్రీంకోర్టును ఏమార్చేందుకు పన్నాగం పన్నింది. అప్పుడే హెచ్చరించిన లోకేశ్సీఆర్పీసీ 164 కింద న్యాయస్థానంలో వాంగ్మూలం ఇవ్వడమన్నది రాజ్యాంగం కల్పించిన అవకాశం. ప్రమాణ పూర్తిగా ఇచ్చే ఆ వాంగ్మూలాలకు న్యాయస్థానం రక్షణ కల్పిస్తోంది. కానీ అంతటి కీలకమైన 164 వాంగ్మూలాలను కూడా నారా లోకేశ్ ప్రశ్నించడం విభ్రాంతికరం. ఎన్నికల ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేస్తూ ఐఏఎస్ అధికారులు 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలాలు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. అందుకే రెడ్బుక్ రాస్తున్నామని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారుల సంగతి తేలుస్తామని హెచ్చరించారు.అప్పటికే న్యాయస్థానంలో విచారణలో ఉన్న అంశంపై ఆయన మాట్లాడటం, సాక్షులను బెదిరించడం న్యాయ ధిక్కారమేనని పరిశీలకులు స్పష్టం చేశారు. లోకేశ్ ముందుగా చెప్పినట్టుగానే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. గతంలో 164 సీఆర్పీసీ వాంగ్మూలాలు ఇచ్చిన అధికారులను ప్రభుత్వం వేధిస్తోంది. వారితో అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించేందుకు సీఐడీ ద్వారా బరితెగిస్తోంది. ఇది కచ్చితంగా చంద్రబాబుపై అవినీతి కేసుల విచారణను ప్రభావితం చేయడమేనని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. దీన్ని న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణించాలని కోరుతున్నారు. -
సుప్రీంకోర్టు రిఫర్ చేసిన కేసులో ఇంత నిర్లక్ష్యమా? మార్గదర్శి’ వ్యవహారంపై ఇంకెన్నాళ్లకు కౌంటర్లు దాఖలు చేస్తారు?
-
డేరా బాబాకు ‘సుప్రీం’ నోటీసులు
ఛండీగఢ్: ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ (dera baba)కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 2002లో డేరా బాబా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసుకు సంబంధించి డేరా బాబాతో పాటు మరో నలుగురికి సుప్రీం కోర్టు (supreme court) ధర్మాసనం శుక్రవారం నోటీసులు జారీ చేసింది.రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా బాబా, అతని సహ నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీబీఐ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. కేసులో విచారణకు కోర్టు ఎదుట హాజరు కావడం లేదంటే, విచారణకు సహకరించాలని సూచించింది. ఈ కేసును సుప్రీం కోర్టు జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. 24ఏళ్ల నాటి కేసు పూర్వా పరాల్ని పరిశీలిస్తే 2002లో పంజాబ్ విద్యార్థిని, డేరాబాబా శిష్యురాలు పేరుతో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ (atal bihari vajpayee), కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు, సీబీఐ, జాతీయ మానవ హక్కుల కమిషన్ (nhrc), పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రులకు హిందీలో ఓ ఆకాశ రామన్న ఉత్తరం అందింది. ఆ లేఖలో సిర్సా కేంద్రంగా డేరా సచ్చా సౌదా నిర్వహిస్తున్న గుర్మీత్ దైవత్వం పొందే మార్గమంటూ దాదాపు 400 మంది శిష్యులను నంపుసకులుగా మార్చారని, సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డారని, తిరగబడిన వారిని హత్య చేసేవారంటూ పలు ఆధారాల్ని ఆ లేఖలో పొందుపరిచింది. అప్పటి వరకు కోట్లాది మంది భక్తులకు దైవంగా విరాజిల్లిన డేరాబాబాకు ఆ లేఖతో పతనం మొదలైంది. ఆయన భక్తులు డేరా బాబాపై తిరగబడ్డారు.ఆకాశ రామన్న ఉత్తరం రాసింది ఎవరంటే అయితే అదే సమయంలో 2002, జులై 10న డేరా బాబా మేనేజర్ రంజిత్ సింగ్ హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర నగరానికి చెందిన కాన్పూర్ కాలనీలో అనుమానాస్పద రీతిలో మరణించారు. డేరాబాబా ఆకృత్యాలను ఎదిరించేలా రాసింది శిష్యురాలు కాదని, మేనేజర్ రంజిత్ సింగేనన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. హత్యకేసులో దోషులుగాఅదే సమయంలో రంజిత్ సింగ్ దారుణు హత్యకు గురయ్యాడు. అనుమానాస్పద మృతి కేసును 2021లో హర్యానా పంచాకుల సీబీఐ విచారించింది. విచారణలో రంజిత్ సింగ్ మృతిలో డేరాబాబాతో పాటు అవతార్ సింగ్, కృష్ణలాల్, జస్బీర్ సింగ్, సబ్దీల్ సింగ్లను దోషులుగా పరిగణించింది. నిందితులకు జీవిత ఖైదు విధించింది.కేసుల నుంచి విముక్తి కల్పించండిఈ నేపథ్యంలో మే 2024లో డేరాబాబా తనపై నమోదైన అత్యాచార కేసులు, జర్నలిస్ట్ రామచందర్ ఛత్రపతి హత్యకేసులో తనని నిర్ధోషిగా ప్రకటించాలని కోరుతూ కోర్టులలో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన పంజాబ్, హర్యానా హైకోర్టు, సీబీఐ కోర్టు డేరాబాకుకు విధించిన శిక్షను రద్దు చేసింది. రంజిత్ సింగ్ హత్య కేసులో మొత్తం ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.తాజాగా, ఈ కేసులో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీం కోర్టు సైతం కేసు తదుపరి విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. 2017 నుంచి జైలు జీవితం2017లో ఇద్దరు శిష్యులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా నిర్ధారణ అయిన తరువాత సీబీఐ కోర్టు అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. రెండు అత్యాచారాలకు సంబంధించిన కేసులో దోషిగా శిక్ష అనుభవించడంతో పాటు పలు హత్యల్లో హర్యానాలోని రోహ్తక్ జైలులో జీవిత ఖైదు ఎదుర్కొంటున్నాడు. రోహ్తక్ జైలులో శిక్ష అనుభవిస్తుండగా రంజిత్ సింగ్ కేసులో సీబీఐ జీవిత ఖైదు విధించింది. -
దర్యాప్తు ఎప్పుడు పూర్తి చేస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ కేసులో తిరుపతన్న గతేడాది అక్టోబర్లో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై గురువారం జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్సింగ్ ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న ప్రధాన నిందితుడని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.ఫోన్ ట్యాపింగ్తో పాటు ఆధారాలు చెరిపివేయడంలోనూ తిరుపతన్న కీలకంగా వ్యవహరించారని.. 2023 డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే ఆధారాలు ధ్వంసం చే శారని లూథ్రా తెలిపారు. రాజకీయ నేతల ఆదేశాల మేరకు పలువురి ఫోన్లను ట్యాప్ చేశారని, హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయని వివరించారు. మరోవైపు తిరుపతన్న 9 నెలలుగా జైలులో ఉన్నారని.. ఆయన పాత్రపై ఇప్పటికే చార్జిïÙట్ దాఖలైందని తిరుపతన్న తరఫు న్యాయవాది సిద్ధార్థ దవే వాదించారు. బెయిల్ పొందడం హక్కు అని.. తప్పనిసరైతేనే జైలులో ఉంచాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పులిచి్చందని దవే ప్రస్తావించారు. కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు సుదీర్ఘకాలం కొనసాగడం సరికాదన్న ధర్మాసనం... విచారణను ఎప్పటికి పూర్తిచేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.అంతేగాక దర్యాప్తు పేరుతో పిటిషనర్ స్వేచ్ఛను అడ్డుకోలేరని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు పూర్తికి ఇంకా ఎంత సమయం పడుతుందో రాతపూర్వకంగా తమకు ఇవ్వాలని ఆదేశించింది. అయితే విచారణ పూర్తయ్యేందుకు మరో 4 నెలలు సమయం పడుతుందని, అఫిడవిట్ దాఖలుకు సమయం కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. దీంతో తదుపరి విచారణను జస్టిస్ నాగరత్న ధర్మాసనం జనవరి 27కు వాయిదా వేసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీం సీరియస్
-
సుప్రీమ్ కోర్టులో అసదుద్దీన్ ఒవైసీ పిటిషన్
-
ప్రార్థనా స్థలాల చట్టంపై సుప్రీంకోర్టులో ఒవైసీ పిటిషన్
సాక్షి, ఢిల్లీ: దేశంలో ప్రార్థనా స్థలాల అంశంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల చట్టం 1991 అమలు చేయాలని కోర్టును ఒవైసీ కోరారు. దీంతో, ఇదే అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లతో ఒవైసీ పిటిషన్ జత చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అన్ని పిటిషన్లపై వచ్చే నెల 17న విచారణ చేపట్టనున్నట్టు కోర్టు తెలిపింది.ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల చట్టం 1991 అమలు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నేడు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ఇదే అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లతో ఒవైసీ పిటిషన్ జత చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతర, అన్ని పిటిషన్లపై ఫిబ్రవరి 17న విచారణ జరుపుతామని సంజీవ్ ఖన్నా ధర్మాసనం వెల్లడించింది. -
సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ నేత గౌతమ్ రెడ్డికి ఊరట
-
అలా చేయొద్దు.. రైతు సంఘాల నేతలపై సుప్రీం కోర్టు సీరియస్
ఢిల్లీ: పంజాబ్లో రైతు సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ గత నెల 26 నుంచి నిరాహారదీక్ష చేపట్టిన రైతు నేత జగ్జీత్ సింగ్ దలేవాల్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు వైద్య సహాయం అందకుండా అడ్డుకుంటున్న రైతు సంఘాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజంగా ఆయన క్షేమం కోరుకునేవారైతే అలా అడ్డుకోరంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.దల్లేవాల్కు వైద్య సహాయం అందించాలన్న ఆదేశాలను అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు శనివారం విచారణ చేపట్టింది. దలేవాల్ను ఆస్పత్రికి తరలించకుండా రైతు నేతలు అడ్డుకుంటున్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.దీంతో కోర్టు ఆ రైతు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దలేవాల్ క్షేమం కోరేవారు ఆవిధంగా ప్రవర్తించరని వ్యాఖ్యానించింది. రైతు నేతలతో మాట్లాడి దలేవాల్ను వెంటనే ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. ఈ విషయంలో పంజాబ్ రాష్ట్రానికి ఏదైనా సహాయం అవసరమైతే, కేంద్ర ప్రభుత్వం మద్దతివ్వాలంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను డిసెంబర్ 31కి వాయిదా వేసింది.ఇదీ చదవండి: Year Ender 2024: ఎన్నటికీ మరువలేని ఐదు విషాదాలు -
టిక్టాక్పై నిషేధం ఆపండి: ట్రంప్
వాషింగ్టన్:అమెరికాలో అధికారం చేతులు మారనున్న వేళ టిక్టాక్(TikTok) యాప్ నిషేధం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పదవీ బాధ్యతలు చేపట్టేవరకు టిక్టాక్పై నిషేధం విధించవద్దని ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు.వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్టాక్పై నిషేధం కేసులో మరింత సమయం ఇవ్వాలని ట్రంప్ న్యాయవాదులు సుప్రీం కోర్టు(Supreme Court)ను కోరారు.దీనిపై రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వారు కోర్టుకు తెలియజేశారు. కాగా,యాప్ వినియోగదారుల డేటా సేకరిస్తున్నారనే ఆరోపణలతో భారత్ సహా పలు దేశాలు చైనాకు చెందిన టిక్టాక్పై ఇప్పటికే నిషేధం విధించాయి. గతంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికాలో టిక్టాక్ నిషేధానికి ప్రయత్నాలు జరిగాయి. న్యాయపరమైన చిక్కుల వల్ల నిషేధం ఆచరణలోకి రాలేదు.అప్పట్లో ట్రంప్ టిక్టాక్ నిషేధానికి తీవ్రంగా ప్రయత్నించారు. జాతీయ భద్రతకు టిక్టాక్ పెద్ద ముప్పుగా పరిణమించిందని ఆరోపణలు చేశారు.ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ టిక్టాక్పై నిషేధంపై బిల్లు ప్రవేశపెట్టారు.నిషేధానికి మద్దతుగా 352 మంది ఓటు వేయగా 65 మంది వ్యతిరేకించారు.దీంతో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు ట్రంప్ కూడా పరోక్షంగా మద్దతు పలికారు. అయితే,కొన్ని రోజుల తర్వాత అనూహ్యంగా ఆయన టిక్టాక్ వాడకం మొదలుపెట్టారు. దీంతో యాప్ నిషేధంపై తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ టిక్టాక్ నిషేధంపై మాట మార్చారు. తాను అధికారంలోకి వస్తే టిక్టాక్ను నిషేధించబోనని స్పష్టం చేశారు. -
టీడీఎస్ వ్యవస్థ రద్దుకు సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: ట్యాక్స్ డిడక్షన్ యట్ సోర్స్ (TDS) వ్యవస్థను ‘ఏకపక్షం, అసంబద్ధమైనది’గా పేర్కొంటూ సుప్రీంకోర్టు(Supreme Court)లో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం(PIL) దాఖలైంది. సమానత్వంసహా వివిధ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేదిగా పేర్కొంటూ టీడీఎస్ను రద్దు చేయాలని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.మూలం వద్దే పన్నును మినహాయించడం, ఆదాయపు పన్ను శాఖలో డిపాజిట్ చేయడం తగిన విధానం కాదని పిటిషన్ వివరించింది. అశ్విని ఉపాధ్యాయ్ అనే లాయర్, అడ్వొకేట్ అశ్వనీ దూబే ద్వారా దాఖలు చేసిన ఈ పిటిషన్లో కేంద్రం, న్యాయ మంత్రిత్వ శాఖ, లా కమిషన్, నీతి ఆయోగ్లు ప్రతివాదులుగా ఉన్నారు. రాజ్యాంగంలోని 14 (సమానత్వపు హక్కు), 19 (వృత్తి చేసే హక్కు), 21 (జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ) ఆర్టికల్స్కు వ్యతిరేకంగా టీడీఎస్ ఉందని, ఈ వ్యవస్థ ఏకపక్షంగా, అసంబద్ధంగా ఉందని ప్రకటించాలని పిల్ ద్వారా సుప్రీంకోర్టును కోరారు.ఇదీ చదవండి: ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడుటీడీఎస్ అంటే ఏమిటి?టీడీఎస్ అనేది ఆదాయ వనరు వద్దే పన్ను వసూలు చేసే పద్ధతి.. పేమెంట్ సమయంలోనే పన్నును మినహాయించి పన్ను చెల్లింపుదారు తరఫున ప్రభుత్వానికి పంపుతారు. జీతభత్యాలు, బ్యాంకుల ద్వారా వడ్డీ చెల్లింపులు, అద్దె చెల్లింపులు, ప్రొఫెషనల్ ఫీజులు, కమీషన్ వంటి విభిన్న చెల్లింపులు చేసేప్పుడు టీడీఎస్ కట్ అవుతుంది. -
నీట్ పీజీ అడ్మిషన్లలో జాప్యం..ఆందోళనలో విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే ఆలస్యమైన నీట్–పీజీ ప్రవేశాల అంశం సుప్రీంకోర్టు ముందుకెళ్లడంతో తెలంగాణ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ స్థానికత అంశంపై జీవోలు 148, 149ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టుకు వెళ్లడంతో నవంబర్లో మొదలు కావాల్సిన పీజీ కౌన్సెలింగ్ ఆల స్యమైంది. ఇటీవల హైకోర్టు ఆ జీవోలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించడంతో సర్కా ర్ సుప్రీంకోర్టు తలుపుతట్టింది.తెలంగాణలోని పీజీ సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కాలని, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని కోరింది. ఇది సుప్రీంకోర్టులో జనవరి 7న విచారణకు రానుంది. సుప్రీం విచారణ ముగిస్తే గానీ తెలంగాణ విద్యార్థుల కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలయ్యేలా లేదు. ఇప్పటికే అఖిల భారత కోటా (ఏఐక్యూ) కింద మొదటి రౌండ్ ప్రవేశాల ప్రక్రియ పూర్తికాగా, రెండో రౌండ్ రిజిగ్నేషన్ పీరియడ్ ఈనెల 26తో ముగియనుంది. ఆ తరువాత మూడో రౌండ్ ఓపెన్ అవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి పీజీ ప్రవేశ పరీక్ష రాసిన సుమారు 8 వేల మంది విద్యార్థుల్లో ఆందోళన పెరిగింది. ఫిబ్రవరి 5లోగా పూర్తికావాల్సిన ప్రక్రియ నీట్–పీజీ ప్రవేశాలకు సంబంధించి అన్ని రకాల ప్రవేశాలను ఫిబ్రవరి 5లోగా పూర్తి చేయాలనేది నిబంధన. సుప్రీంకోర్టు గతంలో ఇచి్చన మార్గదర్శకాల మేరకు ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఒకవేళ జనవరి 7న సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే... అప్పటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించినా ఫిబ్రవరి 5లోగా పూర్తి చేయడం సాధ్యంకాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రవేశాలకు సంబంధించి మొత్తం నాలుగు రౌండ్స్ ఉంటాయి. కన్వినర్ కోటా, యాజమాన్య కోటా, ఎన్ఆర్ఐ (సీ కేటగిరి) కోటాతోపాటు స్ట్రే వెకెన్సీ ఉంటుంది. ఒక్కో విడతకు కనీసం వారం రోజుల సమయమివ్వాలి.ఎందుకంటే విద్యారి్థకి సీటు కేటాయించిన తర్వాత వారు జాయిన్ అయ్యేవరకు ఆగాలి. అనంతరం మరోవిడత కౌన్సెలింగ్ చేపట్టాలి. ఇలా తక్కువ సమయంలోనే అన్ని రకాల కౌన్సెలింగ్లను ఎలా చేపడతారని మెడికోలు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పటివరకు వరంగల్లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పీజీ విద్యార్థులకు సంబంధించిన ర్యాంకు కార్డులను గానీ, జాతీయస్థాయి మెరిట్ కార్డులను గానీ విడుదల చేయలేదు. దీంతో ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ సీటు కోసం ఎదురు చూస్తున్న మెడికల్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అఖిల భారత కోటాలో సగం సీట్లు భర్తీ రాష్ట్రంలో 2,886 మెడికల్ పీజీ సీట్లున్నాయి. వీటిలో 1,300 సీట్లు ప్రభుత్వ కళాశాలల్లో ఉన్నాయి. వీటిల్లోని 50 శాతం సీట్లు ఆలిండియా కోటాకు వెళ్తాయి. మన రాష్ట్ర విద్యార్థులకు మిగిలేవి 650 సీట్లే. వీటిలో రెండు రౌండ్ల కౌన్సెలింగ్లో దాదాపుగా అన్ని సీట్లు నిండిపోయాయని విద్యార్థులు చెబుతున్నారు. మిగతా 650 సీట్ల విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడేదాకా వేచి చూడాలని అంటున్నారు. కాగా, ప్రైవేటులో 1,500కు పైగా సీట్లలో 50 శాతం కన్వినర్ కోటా కిందకు వస్తాయి. 35 శాతం మేనేజ్మెంట్ కోటా, 15 శాతం ఎన్నారై కోటాకు వెళ్తాయి. స్టేట్ రౌండ్ 1ను ప్రకటించాలి: టీ–జుడా అఖిలభారత కోటా మూడో రౌండ్ నిర్వహణ ప్రారంభమయ్యేలోగా తెలంగాణలో స్టేట్ కౌన్సెలింగ్ ద్వారా రెండు రౌండ్లలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొమ్ము రాహుల్, ఇసాక్ న్యూటన్, చైర్పర్సన్ డి. శ్రీనాథ్ ప్రభుత్వాన్ని కోరారు. ఏఐక్యూ రెండో రౌండ్ రిజిగ్నేషన్ డెడ్లైన్ పూర్తయ్యేలోపు స్టేట్ మొదటి కౌన్సెలింగ్ పూర్తి చేయాలన్నారు. మెడికో డి.వెంకటేష్ కుమార్ విద్యార్థుల తరపున మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెంటనే రాష్ట్రంలో కౌన్సెలింగ్ ప్రారంభించాలని కోరారు. -
క్రెడిట్ కార్డు యూజర్లకు అలెర్ట్
గడువు ముగిసిన క్రెడిట్ కార్డు చెల్లింపులపై వడ్డీ రేట్లకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. గడువు ముగిసిన కార్డు చెల్లింపులపై ఏటా 30 శాతానికి వడ్డీరేట్లను పరిమితం చేస్తూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎస్సీడీఆర్సీ) 2008లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ తీర్పువల్ల కార్డు చెల్లింపులపై వడ్డీ రేట్లను నిర్ణయించడంలో బ్యాంకులకు ఎక్కువ స్వయంప్రతిపత్తిని ఇచ్చినట్లు అవుతుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.అసలేం జరిగిందంటే..క్రెడిట్ కార్డు లేట్ పేమెంట్ చెల్లింపులపై వడ్డీ రేట్లను సంవత్సరానికి 30 శాతానికి పరిమితం చేస్తూ ఎస్సీడీఆర్సీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆవాజ్ ఫౌండేషన్ అనే ఎన్జీఓ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కార్డు బకాయిలపై ఏడాదికి 36 శాతం నుంచి 49 శాతం వరకు వడ్డీ రేట్లను వసూలు చేయడం వడ్డీ విధానాల కిందకు వస్తుందని పిటిషన్లో పేర్కొంది. కాగా, ఇటువంటి అధిక వడ్డీరేట్లు మితిమీరినవని, అన్యాయమైన వాణిజ్య పద్ధతని ఎస్సీడీఆర్సీ గతంలో తీర్పు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఇటీవల ఈ నిర్ణయాన్ని కొట్టివేస్తూ, ప్రస్తుత నిబంధనలకు లోబడి బ్యాంకులు తమ సొంత వడ్డీ రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించింది.ఇదీ చదవండి: రియల్టీలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులుఈ మేరకు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఎస్సీడీఆర్సీ నిర్ణయాన్ని కొట్టివేసింది. వడ్డీ రేట్లను మార్కెట్ డైనమిక్స్, ఆర్బీఐ నియంత్రణ పర్యవేక్షణ ద్వారా నియంత్రిస్తారని కోర్టు నొక్కి చెప్పింది. భారతదేశంలోని చాలా క్రెడిట్ కార్డు కంపెనీలు ప్రస్తుతం వార్షిక వడ్డీ రేట్లను ప్రత్యేక పరిస్థితుల్లో 22% నుంచి 49% వరకు వసూలు చేస్తున్నాయి. -
పెళ్లి కమర్షియల్ వెంచర్ కాదు
న్యూఢిల్లీ: మహిళల సంక్షేమం కోసం రూపొందించిన చట్టాలను భర్తలపై వేధింపులకు, దోపిడీకి సాధనాలుగా దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘‘భరణం మహిళకు సహేతుకమైన జీవన ప్రమాణాలను అందించడానికి ఉద్దేశించింది. అంతే తప్ప మాజీ జీవిత భాగస్వామితో సమానమైన ఆర్థిక స్థితిని కల్పించడానికి కాదు’’ అని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ పంకజ్ మిత్తల్తో కూడిన ధర్మాసనం నొక్కి చెప్పింది. ఒక మహిళ దాఖలు చేసుకున్న విడాకుల కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. తన భర్తకు రూ.5,000 కోట్ల నికర ఆస్తులున్నాయని, మొదటి భార్యకు ఏకంగా రూ.500 కోట్ల భరణం చెల్లించాడని ఆమె పేర్కొంది. తనకూ భారీగా భరణం ఇప్పించాలని కోరింది. దీనిపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చింది. ‘‘మాజీ భార్యకు తన ప్రస్తుత ఆర్థిక స్థితి ఆధారంగా నిరవధికంగా మద్దతివ్వాల్సిన అవసరం పురుషునికి లేదు. వివాహం కుటుంబానికి పునాది మాత్రమే తప్ప కమర్షియల్ వెంచర్ కాదు. మహిళలు తమ మేలు కోసం కోరే చట్టాలను జాగ్రత్తగా ఉపయోగించాలి’’ అని సూచించింది. వివాహాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్కు శాశ్వత భరణం కింద నెల రోజుల్లో రూ.12 కోట్లు చెల్లించాలని మాజీ భర్తకు ఆదేశించింది. అతనిపై దాఖలు చేసిన క్రిమినల్ కేసులను కొట్టేసింది. ‘‘విడాకుల కేసుల్లో భార్యలు తమ జీవిత భాగస్వామి ఆస్తులు, హోదా, ఆదాయాలను హైలైట్ చేయడం, వాటిలో సమాన వాటా కోరడం బాగా పెరుగుతోంది. ఇది సమర్థనీయం కాదు. భరణం విషయంలో భర్త ఆదాయాన్ని మాత్రమే కాకుండా, భార్య ఆదాయం, అవసరాలు తదితర అంశాలెన్నింటినో పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ విడాకుల తర్వాత దురదృష్టం కొద్దీ భర్త నిరుపేదగా మారితే? అప్పుడు తామిద్దరి సంపదను సమానం చేసుకోవడానికి సిద్ధపడుతుందా?’’ అని ప్రశ్నించింది. భార్య, ఆమె కుటుంబ సభ్యులు క్రిమినల్ చట్టాలను బేరసారాల సాధనంగా దుర్వినియోగం చేయరాదని హెచ్చరించింది. -
SC: మాజీ భర్త కష్టాల్లో భాగం పంచుకుంటారా?
వివాహ వ్యవస్థపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు. చట్టాలు భర్తలను బెదిరించి ఆస్తి గుంజుకోవడానికి కాదని మరోమారు స్పష్టం చేసింది.చట్టాలు మహిళల సంక్షేమం కోసమే.. భర్తలను శిక్షించడానికి, బెదిరించడానికి కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వైవాహిక వ్యవస్థలో హింస, భరణం అంశాలపై దేశవ్యాప్త చర్చ నడుస్తున్న వేళ.. మరోమారు కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.వివాహ వ్యవస్థను..హిందువులు పవిత్రమైనదిగా, కుటుంబానికి బలమైన పునాదిగా భావిస్తారు. అదేం కమర్షియల్ వెంక్చర్ లాంటిది ఏం కాదని జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది.ప్రభుత్వాలు కఠినమైన చట్ట నిబంధనలను రూపొందించింది మహిళల సంక్షేమం కోసమే. అంతేకాని భర్తలను వేధించి, బెదిరించి, శిక్షించి, ఆస్తిని దండుకోవడానికి కాదు. భార్యను క్రూరంగా హింసించారని, వేధింపులకు గురిచేశారని, అత్యాచారం చేశారనే ఆరోపణలన్నింటినీ ఒక ప్యాకేజీగా చేసి.. నేర శిక్షాస్మృతిలోని సెక్షన్ల ప్రకారం భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసులు పెడుతున్నారు. భార్య తరఫున గట్టిగా బేరసారాలు చేసేందుకు భర్త, అతని కుటుంబ సభ్యులపై తీవ్రమైన నేరారోపణలు చేయటం కూడా పరిపాటిగా మారింది అని ధర్మాసనం ఆక్షేపించింది. ఈ డిమాండ్లలో అత్యధికంగా ఆర్థికపరమైనవే ఉంటున్నాయని ధర్మాసనం ప్రస్తావించింది.గృహ హింస ఫిర్యాదులతో రంగంలోకి దిగే పోలీసులు కూడా భర్త తరఫు బంధువుల్లో వృద్ధులను, అనారోగ్యంతో ఉన్నవారిని సైతం అరెస్టు చేసి బెయిల్ రాకుండా చేస్తున్నారని, ఈ ఘటలన్నీ ఒకే చైన్ సిస్టమ్ మాదిరిగా ఉంటాయని పేర్కొంది.విడాకులు తీసుకున్న తర్వాత మాజీ భర్తకు వ్యాపారంలో నష్టాలు వచ్చి దివాలా తీస్తే మాజీ భార్య వచ్చి ఆ కష్టాల్లో ఏమైనా భాగం పంచుకుంటుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది... తీవ్ర మనస్పర్థలతో విడివిడిగా నివసిస్తోన్న దంపతుల వైవాహిక బంధాన్ని రద్దు చేస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో భార్యకు శాశ్వత భరణం నెలలోగా చెల్లించాలన్న కింది కోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ క్రమంలో ఆ భర్త పై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయడం గమనార్హం.తన భర్తకు రూ.5వేల కోట్ల ఆస్తులున్నాయని, అతని తొలి భార్యకు రూ500 కోట్లను భరణంగా ఇచ్చారు కనుక తనకూ అదే స్థాయిలో చెల్లించాలన్న పిటిషనర్ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఫ్యామిలీ కోర్టు నిర్ణయించిన రూ.12 కోట్ల భరణాన్ని ఖరారు చేసింది. -
బాబు అవినీతి బాగోతాన్ని మడతెట్టేద్దాం..
సాక్షి, అమరావతి: నారా చంద్రబాబు నాయుడు కుట్రదారు, లబ్ధిదారుగా సాగించిన కుంభకోణాల కేసులను పూర్తిగా నీరుగార్చే కుతంత్రానికి టీడీపీ కూటమి ప్రభుత్వం పదును పెడుతోంది! అందుకోసం ఇప్పటికే డీజీపీ, సీఐడీ కార్యాలయాలను పూర్తిగా ఆ పనిలో నిమగ్నం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా ఢిల్లీ నుంచి ఓ ప్రముఖ సీనియర్ న్యాయవాదిని రప్పించి కేసుల కొట్టివేత కుట్రలను వేగవంతం చేయడం గమనార్హం. 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు సూత్రధారిగా పాల్పడిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల దోపిడీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం ఆధారాలతో సహా బట్టబయలయ్యాయి. వాటిని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చింది. అందులో స్కిల్ స్కామ్ కేసులో గతంలో చంద్రబాబును అరెస్ట్ చేయగా... ఏసీబీ న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. 52 రోజులపాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ నాలుగు కేసులూ సీఐడీ విచారణలోనే ఉన్నాయి. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆ కేసుల దర్యాప్తును నీరుగార్చి ఏకంగా కేసులను కొట్టి వేసేందుకు కార్యాచరణ చేపట్టారు. అన్ని కేసుల నుంచి చంద్రబాబు పేరును తొలగించాలని సీఐడీ, పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వ పెద్దలు హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆ కేసులను ఎప్పటిలోగా నీరుగార్చాలో కూడా దర్యాప్తు అధికారులకు గడువు కూడా విధించినట్లు తెలిసింది.నేను చెప్పినట్టు చేయండి.. ఆ కేసులను మూసేద్దాంస్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు తరపున వాదించిన ఢిల్లీకి చెందిన సీనియర్ న్యాయవాది అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమయ్యారు. ఏకంగా రోజుకు రూ.కోటికి పైగా ఫీజు చెల్లించి మరీ ఆయన్ను ప్రత్యేకంగా రప్పించారు. కానీ ఆయన వాదనను ఏసీబీ న్యాయస్థానం సమ్మతించలేదు. చంద్రబాబుకు రిమాండ్ విధించింది. అయినా సరే అదే న్యాయవాది చంద్రబాబు కేసుల విచారణను ఇటు విజయవాడలో అటు ఢిల్లీలో స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆ సీనియర్ న్యాయవాది సోమవారం హఠాత్తుగా విజయవాడలో వాలారు. జీ హుజూర్ అంటూ రాష్ట్ర పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులు ఆయనతో ప్రత్యేకంగా భేటీ కావడం గమనార్హం. అసలు ఓ ప్రైవేట్ న్యాయవాదితో పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులు సమావేశం కావడం ఏమిటని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. చంద్రబాబు అవినీతి కేసులను మూసివేయడమే ఏకైక అజెండాగా ఆ సమావేశం సాగింది.స్కిల్స్కామ్, అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్ అక్రమాలు, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల నుంచి చంద్రబాబు పేరును తప్పించడం... అనంతరం ఆ కేసులను మూసివేయడం... అందుకు ఆ కేసుల్లో సాక్షులను ఎలా వేధించాలి.... ఎలా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయాలి...? న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డదారులు తొక్కాలి? అనే విషయాలను ఆ సీనియర్ న్యాయవాది అంశాలవారీగా వివరించారని తెలుస్తోంది. రానున్న రెండు నెలల్లోనే ఆ కేసులను క్లోజ్ చేసేలా పోలీసు, సీఐడీ వ్యవస్థలు పూర్తిగా సహకరించాలని ఆయన తేల్చిచెప్పారు. అందుకు పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులు తలూపినట్లు తెలుస్తోంది. ఆ సీనియర్ న్యాయవాది పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులతో మంగళవారం కూడా సమావేశం నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఇప్పటికే దర్యాప్తును అటకెక్కించిన ప్రభుత్వంచంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న స్కిల్ స్కామ్ కేసు దర్యాప్తును టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే అటకెక్కించేసింది. స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం కేసుల చార్జిషీట్లను సీఐడీ గతంలో న్యాయస్థానానికి సమర్పించింది. దీనిపై కొన్ని వివరణలు కోరుతూ న్యాయస్థానం వాటిని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య సీఐడీకి పంపింది.అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాటిని కేస్ స్టడీలతో సీఐడీ అధికారులకు అందచేశారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ కేసులను నీరుగార్చేలా కూటమి పెద్దలు సీఐడీపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో సీఐడీ ఆ చార్జిషీట్లను న్యాయస్థానానికి సమర్పించలేదు. కేసుల దర్యాప్తును పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయడం లేదు.‘సుప్రీం’లో విచారణకు సహాయ నిరాకరణస్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోంది. 2023లో బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు, హైకోర్టు విధించిన షరతులను చంద్రబాబు నిర్భీతిగా ఉల్లంఘించారు. కేసుల గురించి బహిరంగంగా, మీడియాతో మాట్లాడవద్దని న్యాయస్థానాలు స్పష్టమైన షరతులు విధించాయి. అయితే చంద్రబాబు దర్యాప్తు అధికారులను బెదిరిస్తూ.. రెడ్బుక్ పేరిట హెచ్చరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.షరతులు ఉల్లంఘించినందున చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని సీఐడీ 2023 డిసెంబర్లోనే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ కొనసాగుతోంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఐడీ హఠాత్తుగా రూటు మార్చేసింది. సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్పై విచారణకు సహకరించడం లేదు. సుప్రీం కోర్టులో సీఐడీ వాదనను వినిపించాల్సిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు.అది సరైన పద్ధతి కాదని సుప్రీం కోర్టు చెప్పినా తీరు మారడం లేదు. కొద్దిరోజుల క్రితం చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణకు ఆయన నేరుగా హాజరు కాకుండా వర్చువల్గా పాల్గొన్నారు. వాదనలు వినిపించకుండా.. తాను ఢిల్లీలో లేనందున వాయిదా వేయాలని కోరారు. దీనిపై సుప్రీంకోర్టు మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిసారీ వాయిదాలు కోరడం సరైన చర్య కాదని వ్యాఖ్యానిస్తూ కేసు విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.సీబీఐకి అప్పగించాలి.. న్యాయస్థానం పర్యవేక్షణలోనే దర్యాప్తు జరగాలిన్యాయ నిపుణుల సూచనస్కిల్ స్కామ్, ఇతర కేసుల దర్యాప్తు, తాజా పరిణామాలను గమనిస్తున్న న్యాయ నిపుణులు చంద్రబాబుపై ఉన్న కేసుల విచారణను సీబీఐకి అప్పగించాలని సూచిస్తున్నారు. సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలుకు టీడీపీ కూటమి ప్రభుత్వం గడువు కోరిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబుపై కేసుల దర్యాప్తును న్యాయస్థానం పర్యవేక్షించాలని స్పష్టం చేస్తున్నారు. గతంలో ఉమ్మడి ఏపీలో మద్యం సిండికేట్ కేసు దర్యాప్తును హైకోర్టు పర్యవేక్షించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.షరతులు ఉల్లంఘిస్తున్న బాబు⇒ స్కిల్ స్కామ్ కేసులో న్యాయస్థానం విధించిన బెయిల్ షరతులను ఎన్నికల ముందు, ఆ తర్వాత చంద్రబాబు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా బేఖాతర్ చేస్తున్నారు. తన బావమరిది, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ ఓటీటీ చానల్ కోసం నిర్వహిస్తున్న టాక్ షోలో పాల్గొన్న చంద్రబాబు న్యాయస్థానాల షరతులంటే ఏమాత్రం లెక్కలేదనే రీతిలో షరతులను ఉల్లంఘిస్తూ మాట్లాడారు. ఏ ఒక్క అధికారినీ విడిచిపెట్టబోనని బెదిరింపులకు దిగడం గమనార్హం.⇒ హిందుస్థాన్ టైమ్స్ సంస్థ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన సదస్సులోనూ చంద్రబాబు బెయిల్ షరతులను ఉల్లంఘించి స్కిల్ స్కామ్ కేసు గురించి మాట్లాడారు. అధికారులను బెదిరించే రీతిలో వ్యాఖ్యలు చేస్తూ కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నించారు. -
సుప్రీం కోర్టు ఆమోదంతో రూ.4,025 కోట్ల ఆస్తులు అప్పగింత
సుప్రీం కోర్టు ఆమోదం మేరకు భూషణ్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్కు చెందిన రూ.4,025 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జేఎస్డబ్ల్యూ స్టీల్కు అందజేసింది. దీనికి సంబంధించి ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ తాజాగా వివరాలు వెల్లడించింది. ఎన్సీఎల్టీ ఆమోదం మేరకే జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీలో మేజర్ వాటాలు కొనుగోలు చేసినట్లు గుర్తించడంతో ఆస్తులు అందజేస్తున్నట్లు పేర్కొంది.బ్యాంకు రుణ చెల్లింపుల్లో మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై 2019లో భూషణ్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్పై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆస్తులను జప్తు చేసింది. అంతకుముందు నెలలో ఆ రుణాలు చెల్లించలేక కంపెనీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించింది. ఆ సమయంలో భూషణ్ పవర్ అండ్ స్టీల్ సమస్యకు సంబంధించి జేఎస్డబ్ల్యూ స్టీల్ పరిష్కార ప్రణాళికను ఎన్సీఎల్టీ ఆమోదించింది. తర్వాత ఈడీ ఆస్తులను జప్తు చేసింది. ఎన్సీఎల్టీ ఆమోదంతోనే కంపెనీలో వాటాను చేజిక్కించుకునేందుకు బిడ్ వేసినట్లు సుప్రీం కోర్టులో జేఎస్డబ్ల్యూ స్టీల్ స్పష్టం చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది.ఇదీ చదవండి: రైలు నుంచి కింద పడిన వస్తువులను ఈజీగా పొందండిలా..జేఎస్డబ్ల్యు స్టీల్ను 1982లో సజ్జన్ జిందాల్ స్థాపించారు. జిందాల్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (జిస్కో), జిందాల్ విజయనగర్ స్టీల్ లిమిటెడ్ (జేవీఎస్ఎల్) కలిసి జిందాల్ స్టీల్గా ఏర్పడ్డాయి. ఈ కంపెనీ యూఎస్లో ఏటా 35.7 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని అతిపెద్ద తయారీ యూనిట్ కర్ణాటకలోని విజయనగరలో ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద సింగిల్ లొకేషన్ ఉక్కు ఉత్పత్తి కేంద్రం. -
అబ్బే! మీరు చేసే పనులకు వివరణ ఇవ్వలేక కాద్సార్!
-
బెంగాల్ మాజీ మంత్రికి భవిష్యత్ బెయిల్!
న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఒక బెయిల్ కేసులో వినూత్న పోకడకు శ్రీకారం చుట్టింది. బెయిల్కు ముందు పూర్తిచేయాల్సిన విధివిధానాలపై కిందికోర్టు సంతృప్తి చెందితే వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటోతేదీ లోపు మాజీ మంత్రి పార్థా ఛటర్జీని షరతులతో కూడిన బెయిల్పై విడుదల చేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల సుప్రీంకోర్టు ధర్మాసనం కింది కోర్టుకు వినూత్న ఉత్తర్వులు జారీచేసింది. సాధారణంగా ఏదైనా కేసులో ఇరువైపులా వాదనలు విన్నాక బెయిల్కు అవకాశం ఉంటే వెంటనే బెయిల్ ఉత్తర్వులు ఇస్తారుగానీ ఇలా కొద్దిరోజుల తర్వాతనే బెయిల్పై విడుదల చేయాలని సూచించడం ఇదే తొలిసారి అని కోర్టు వర్గాలు పేర్కొన్నాయి. నగదుకు ఉద్యోగం కుంభకోణంలో 2022 జూలై 22న అరెస్టయి ఇన్నాళ్లుగా విచారణ ఖైదీగా జైళ్లో గడుపుతున్న పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత పార్థా ఛటర్జీ బెయిల్ కేసులో విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వినూత్న ఉత్తర్వులు జారీచేసింది. #SupremeCourt to shortly pronounce judgment on the #bail plea of former West Bengal Education Minister and now MLA #ParthaChatterjee in the money laundering case arising out of the West Bengal cash-for-jobs scamBench: Justices Surya Kant and Ujjal Bhuyan pic.twitter.com/IB9mOBSFHI— Live Law (@LiveLawIndia) December 13, 2024‘‘జనవరి రెండో, మూడో, నాలుగో వారా ల్లో సాక్షుల వాంగ్మూలాలతోపాటు నేరాభి యోగాల సమర్పణ ట్రయల్ కోర్టులో పూ ర్తవ్వాలి. ఇదంతా పూర్తయితే ఫిబ్రవరి ఒకటి లోపు ఆయనకు బెయిల్ ఇవ్వండి’’ అని జడ్జి సూర్యకాంత్ తీర్పు రాశారు. భవిష్యత్ బెయిల్గా అభివర్ణించిన ఈ కేసులో ఫిబ్రవరిలో కూడా ఆయన బెయిల్పై బయటికొచ్చే అవకాశం లేకపోవడం గమనార్హం. ఈ కుంభకోణానికి సంబంధించిన వేరే కేసుల్లోనూ ఆయనను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేయడమే ఇందుకు కారణం. మనీలాండరింగ్, ఇతర అక్ర మాల కోణాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లు పలు ఎఫ్ఐఆర్లు నమోదుచేసి విచారిస్తున్నాయి. ఈయనపై ఈడీ 3, సీబీఐ 5 కేసులను నమోదు చేశాయి. అరెస్ట్ సమయంలో మంత్రిగా ఉన్నా రన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న ఛటర్జీ తరఫు లాయర్ల వాదనను కోర్టు తప్పుబట్టింది. ‘‘ఎవరైనా నిందితుడు మంత్రి వంటి పదవులు, హోదాల్లో ఉన్నంత మాత్రాన వారికి బెయిల్ ఇచ్చే విషయంలో ప్రత్యేక మినహాయింపులు అంటూ ఏవీ ఉండవు’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. -
ప్రార్థనా స్థలాలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
-
మేం చెప్పేదాకా సర్వేలపై ఉత్తర్వులు, తీర్పులు ఆపండి
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం సిద్ధించిన నాటికి ఉన్న ప్రార్థనాస్థలాలను యథాతథ స్థితిలోనే కొనసాగించాలని నిర్దేశించే 1991నాటి చట్టంలోని సెక్షన్లను సవాల్చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలకమైన సూచనలు చేసింది. ప్రార్థనాస్థలాల్లో సర్వేలపై వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంగానీ, తీర్పులు చెప్పడంగానీ చేయొద్దని సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసులపై తమ తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా తమ ఆదేశాలే అమల్లో ఉంటాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం స్పష్టంచేసింది. ప్రార్థనాస్థలాలు ముఖ్యంగా మసీదులు, దర్గాల వద్ద సర్వేలు చేపట్టడాన్ని సవాల్చేస్తూ, సమరి్థస్తూ కొత్తగా ఎలాంటి ఫిర్యాదులు, కేసులను తీసుకోవద్దని ధర్మాసనం దేశంలోని అన్ని కోర్టులకు సూచించింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, మథురలోని షాహీ ఈద్గా మసీదు, సంభాల్లోని షాహీ జామా మసీదు, ఢిల్లీలోని కుతుబ్ మినార్ దగ్గర్లోని ఖ్వాత్– ఉల్–ఇస్లామ్ మసీదు, మధ్యప్రదేశ్లోని కమల్ మౌలా మసీదు సహా 10 మసీదులు ఉన్న ప్రాంతాల్లో గతంలో హిందూ ఆలయాలు ఉండేవని, ఆయా స్థలాల్లో సర్వే చేపట్టి ఆ ప్రాంతాల వాస్తవిక మత విశిష్టతను తేల్చాలంటూ 18 కేసులు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిని విచారించిన సందర్భంగా గురువారం సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. ప్రార్థనాస్థలాల(ప్రత్యేక అధికారాల)చట్టం, 1991లోని 2, 3, 4వ సెక్షన్ల చట్టబద్ధతను సవాల్చేస్తూ న్యాయవాది అశ్వినీ వైష్ణవ్ తదితరులు దాఖలుచేసిన ఆరు పిటిషన్లనూ ఈ స్పెషల్ బెంచ్ గురువారమే విచారించింది. 1947 ఆగస్ట్ 15నాటికి ఉన్న ప్రార్థనాస్థలాల యథాతథస్థితిని మార్చడానికి వీల్లేదంటూ 1991 చట్టంలో పలు సెక్షన్లు పొందుపరిచారు. ఈ సెక్షన్లు అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదానికి వర్తించవంటూ గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు చెప్పి ఆ స్థలాన్ని హిందూవర్గానికి కేటాయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే వారణాసి, మథుర, సంభాల్ తదితర ప్రాంతాల్లో దశాబ్దాల నాటి మసీదులు, దర్గాలున్న స్థలాల వాస్తవిక మత లక్షణాన్ని తేల్చాలని కొత్తగా పిటిషన్లు పుట్టుకొచి్చన విషయం విదితమే. కేంద్రానికి 4 వారాల గడువు ‘‘ ఉత్తర్వులను నిలుపుదలచేస్తూ అన్ని కోర్టులను ఆదేశించడానికి ముందే సంబంధిత కేసుల్లో కక్షిదారుల వాదనలను సుప్రీంకోర్టు వినాలి’’ అని హిందువుల తరఫున హాజరైన సీనియర్ లాయర్ జే.సాయి దీపక్ కోరారు. దీనిపై సీజేఐ ‘‘ కింది కోర్టులు సుప్రీంకోర్టు కంటే పెద్దవైతే కాదుకదా. ఈ అంశంపై సుప్రీంకోర్టు విస్తృతస్థాయిలో పరిశీలిస్తున్నపుడు కింది కోర్టులకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం సహజమే. అయినా ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం స్పందన లేకుండా ముందుకు వెళ్లలేం. నాలుగు వారాల్లోపు కేంద్రం తన స్పందనను తెలియజేయాలి. కేంద్రం స్పందన తెలిపాక మరో నాలుగు వారాల్లోపు సంబంధిత కక్షిదారులు వారి స్పందననూ కోర్టుకు తెలియజేయాలి’’ అని సూచించారు. ఈ అంశానికి సంబంధించి 2022 సెపె్టంబర్లో దాఖలైన ప్రధాన పిటిషన్ విషయంలో కోర్టు కేంద్రానికి నోటీసులు పంపింది. 1991 చట్టాన్ని సవాల్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ జ్ఞానవాపి మసీదు మేనేజ్మెంట్ కమిటీ తదితర సంస్థలు ముస్లింల తరఫున కేసులు వేశాయి. 1991 చట్టాన్ని తప్పుబట్టి తద్వారా మసీదుల ప్రాచీన ఉనికిని ప్రశ్నార్థకం చేయాలని చూస్తున్నారని మసీదు కమిటీలు వాదిస్తున్నాయి. -
నేడు సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ
ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణకు రానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఏకైక రాజధాని అని ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం చేస్తామని తెలిపింది. కేసు విచారణను ముగించాలని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. చదవండి : ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు! -
Year Ender 2024: దేశగతిని మార్చిన 10 సుప్రీం తీర్పులు
2024 కొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ ఏడాది దేశ అత్యున్నత న్యాయస్థానం పలు కీలక తీర్పులను వెలువరించింది. ఇవి దేశ రాజ్యాంగంలోని న్యాయ వ్యవస్థకు మైలురాళ్లుగా నిలిచాయి. ఈ ఏడాది సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులలో 10 తీర్పులు దేశగతిపై ప్రభావం చూపాయి. ఆ వివరాలు..1. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఈ ఏడాది ఫిబ్రవరి 15న లోక్సభ ఎన్నికల తేదీలను ప్రకటించే ముందు, సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక తీర్పులో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ను ఏకగ్రీవంగా తిరస్కరించింది. ఇది ‘రాజ్యాంగ విరుద్ధం,ఏకపక్షం’ అని సుప్రీంకోర్టు ప్రకటించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ నిధుల మూలాన్ని వెల్లడించకపోవడం అవినీతికి దారితీసిందని కోర్టు పేర్కొంది.2. ఎన్నికల కమిషనర్ల నియామకం ఈ ఏడాది మేలో సుప్రీం ఇచ్చిన ప్రధాన తీర్పులో లోక్సభ ఎన్నికలకు ముందు ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించాలనే నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికలు సమీపిస్తున్నాయని, అలాంటి పిటిషన్లు గందరగోళాన్ని, అనిశ్చితిని సృష్టిస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్,ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు, కార్యాలయ షరతులు) చట్టం 2023 ఆపరేషన్పై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.3. ఆర్టికల్ 370 పునరుద్ధరణకు నోజమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370లోని నిబంధనలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏకగ్రీవంగా సమర్థిస్తూ 2023, డిసెంబరు 11న ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఛాంబర్లో పిటిషన్లను పరిశీలించింది. ఈ రికార్డులలో ఎలాంటి లోపం కనిపించడం లేదని, అందుకే రివ్యూ పిటిషన్లు కొట్టివేస్తున్నట్లు బెంచ్ స్పష్టం చేసింది.4.షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ)ఉప-వర్గీకరణపై తీర్పుఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ 2024 జూలైలో షెడ్యూల్డ్ కులాలలో (ఎస్సీ) మరింత వెనుకబడిన తరగతులకు ప్రత్యేక కోటాను నిర్ధారించాల్సిన అవసరం ఉందని తీర్పునిచ్చింది. షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణను సమర్థించింది. ఈ నిర్ణయం దరిమిలా దళితుల్లో మరింత వెనుకబడిన వారిని గుర్తించి, వారికి ఇచ్చే రిజర్వేషన్లో ప్రత్యేక కోటాను కల్పించవచ్చు.5. జైళ్లలో కుల వివక్ష తగదుజైళ్లలో కుల ప్రాతిపదికన వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని 2024, అక్టోబర్ 3న సుప్రీంకోర్టు పేర్కొంది. వివక్ష, కులాల ఆధారంగా విభజన అనేవి రాజ్యాంగంలోని 15వ అధికరణను ఉల్లంఘించడమేనని తెలిపింది. ఒక నిర్దిష్ట కులానికి చెందిన పారిశుధ్య కార్మికులను ఎంపిక చేయడం సమానత్వానికి పూర్తిగా విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. జైళ్లలో ఇలాంటి వివక్షను అనుమతించబోమని కోర్టు స్పష్టం చేసింది.6. క్షమాభిక్ష పిటిషన్లపై మార్గదర్శకాలు మరణశిక్ష పడిన ఖైదీల క్షమాభిక్ష పిటిషన్లపై త్వరితగతిన సరైన చర్యలు తీసుకునేందుకు 2024 డిసెంబర్ 9న సర్వోన్నత న్యాయస్థానం సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. క్షమాభిక్ష పిటిషన్లకు సంబంధించిన అంశాలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను సిద్ధం చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.7. బుల్డోజర్ జస్టిస్కు బ్రేక్ ఈ ఏడాది నవంబర్ 13న సుప్రీం కోర్టు తన ప్రధాన నిర్ణయంలో బుల్డోజర్ జస్టిస్ వ్యవస్థకు బ్రేక్ వేసింది. నిందితులు, దోషులపైన కూడా బుల్డోజర్ చర్య చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను నిర్దేశించింది. దాని ప్రకారం 15 రోజుల ముందుగానే సంబంధీకులకు నోటీసు ఇవ్వాలి.8) బిల్కిస్ బానో కేసులో..గుజరాత్ ప్రభుత్వం బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు ముందస్తుగా విడుదల చేసింది. ఈ దోషులంతా 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేశారు. వీరికి బాధితురాలి కుటుంబ సభ్యులలో ఏడుగురిని హత్య చేయడంలో ప్రమేయం ఉంది. దీనిపై 2024 జనవరి 8న సుప్రీం ఇచ్చిన తీర్పులో దోషులను విడుదల చేయడం న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంటూ గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది.9) మనీష్ సిసోడాయా కేసులోలిక్కర్ స్కామ్ ఆరోపణలపై 2023 ఫిబ్రవరిలో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు ఈ ఏడాది ఆగస్టు 9న సుప్రీంకోర్టు బెయిల్పై విడుదల చేసింది. ఈ కేసులో విచారణ జరుగుతున్నందున నిందితుడిని నిరవధికంగా జైల్లో ఉంచలేమని కోర్టు పేర్కొంది. ఎక్కువ కాలం జైలులో ఉంచడం ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది.10) చైల్డ్ పోర్నోగ్రఫీసుప్రీంకోర్టు 2024, సెప్టెంబరు 23న ఇచ్చిన తీర్పులో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన మెటీరియల్ని డౌన్లోడ్ చేయడం, వీటిని సేవ్ చేయడం నేరం కిందకు వస్తుందని పేర్కొంది. సంబంధిత వ్యక్తి అటువంటి వీడియోలు లేదా సమాచారాన్ని తొలగించకపోయినా లేదా పోలీసులకు తెలియజేయకపోయినా అది పాక్సో చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం నేరమని పేర్కొంది. పిల్లల అశ్లీల చిత్రాలను ఎవరికైనా పంపితే తప్ప, వాటిని కలిగి ఉండటం లేదా డౌన్లోడ్ చేయడం నేరం కాదని మద్రాస్ హైకోర్టు వెలిబుచ్చిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.ఇది కూడా చదవండి: ‘ఇండియా’కు ఎవరు బెస్ట్? రాహుల్.. మమత బలాబలాలేమిటి? -
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు ఊరట కల్పించింది. మద్యం పాలసీ కేసులో తాను వారంలో సోమవారం, బుధవారం పోలీస్స్టేషన్కు హాజరవ్వాల్సి వస్తుందని, ఈ అంశంలో తనకు వెసులు బాటు కల్పించాలని కోరుతూ సిసోడియా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.సిసోడియా పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సిసోడియా పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం తెలిపింది. అయితే, కేసుకు సంబంధించిన విచారణకు మాత్రం తప్పని సరిగా హాజరు కావాలని సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 17కి వాయిదా వేసింది. माननीय सुप्रीम कोर्ट का हृदय से आभार, जिसने ज़मानत की शर्त को हटाकर राहत प्रदान की है। यह निर्णय न केवल न्यायपालिका में मेरी आस्था को और मजबूत करता है, बल्कि हमारे संवैधानिक मूल्यों की शक्ति को भी दर्शाता है। मैं हमेशा न्यायपालिका और संविधान के प्रति अपने कर्तव्यों का सम्मान करता… https://t.co/er7qTn2QMU— Manish Sisodia (@msisodia) December 11, 2024 మద్యం పాలసీ కేసులో 17నెలల జైలు జీవితంఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు అప్పటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. అరెస్టయిన రెండు రోజుల తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి గత 17 నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ కోరుతూ ఆ మధ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్ట్ 9న పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా రూ.10లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి ఇద్దరు షూరిటీలతో ఆయనను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. తన పాస్పోర్ట్ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. -
‘మహా’ ఎన్నికల్లో ట్యాంపరింగ్.. సుప్రీం కోర్టుకు ఇండియా కూటమి నేతలు
ముంబై : మహరాష్ట్ర ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ప్రతిపక్ష ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వేళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వినియోగంపై సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం ఓటింగ్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఇండియా కూటమి పార్టీ ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అత్యున్నత న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇదే అంశంపై చర్చలు జరిపేందుకు శరద్ పవార్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్లు మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఇరువురి నేతల భేటీలో మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన తీరు, త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మహా ఎన్నికల తరహాలో ఫలితాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ దిశగా కార్యకర్తలకు, నేతలకు భవిష్యత్ కార్యచరణపై దిశానిర్ధేశం చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో ఇండియా కూటమి తరుఫున మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలపై శరద్ పవార్ సుప్రీం కోర్టు ఆశ్రయించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. మహా ఎన్నికల్లో ఘోర పరాజయంఈ నవంబర్ 20న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన, బీజేపీ, ఎన్సీపీలతో కూడిన మహాయుతి 288 అసెంబ్లీ స్థానాల్లో 230 స్థానాల్లో విజయం సాధించగా, ప్రతిపక్ష మహావికాస్ అఘాడి కేవలం 46 సీట్లు మాత్రమే గెలుచుకుంది. Maharashtra: At the anti-EVM event at Markadwadi village in Solapur district, NCP-SCP chief Sharad Pawar says, "Elections happen...some win some lose...but in recently concluded election in Maharashtra, people have doubt over the election process and voters are not feeling… pic.twitter.com/QkmKK5XNQU— ANI (@ANI) December 8, 2024అయితే, ఈ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ విజయం సాధిస్తుందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఇదే కూటమిలో తమ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎన్సీపీ నేతలు అంచనా వేశారు. కానీ నేతల అంచనాలు తారుమారయ్యాయి. ఊహించని విధంగా ఎన్సీపీ కేవలం 10 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ ఫలితాలపై దేశంలో ఇంతకు ముందెన్నడూ చూడనివిధంగా మహారాష్ట్ర ఎన్నికల్లో దుర్వినియోగం జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈవీఎం ఓటింగ్పై సుప్రీం కోర్టు తలుపు తట్టనున్నారు. -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వివాదం..‘సుప్రీం’ తుది తీర్పు అప్పుడే!
సాక్షి,ఢిల్లీ: గవర్నర్కోటా ఎమ్మెల్సీల వ్యవహారంలో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ వేసిన పిటిషన్పై సోమవారం(డిసెంబర్ 9) విచారణ జరిగింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్నలతో కూడిన ధర్మాసనం కేసు విచారించింది.తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు కోర్టు వాయిదా వేసింది. ఆ రోజు తుది వాదనలు వినడంతో పాటు ఫైనల్ ఆర్డర్ ఉంటుందని తెలిపింది. దాసోజు శ్రవణ్ తరపున సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు ఈ కేసులో స్టే ఇచ్చినప్పటికీ, కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి ముకుల్ రోహిత్గి తీసుకువచ్చారు.కాగా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్ను నామినేట్ చేసినప్పటికీ అప్పటి గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంతో ఆయన ఎమ్మెల్సీ కాలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీజేఎస్ చీఫ్ కోదండరాం సహా ఇతరులను పెద్దల సభకు పంపించింది.దీంతో శ్రవణ్ తన న్యాయపోరాటాన్ని కొనసాగిస్తున్నారు.