breaking news
Supreme Court
-
చంద్రబాబు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మళ్లీ చిక్కొచ్చిపడింది. ఒకపక్క ఓటుకు నోటు కేసు నిందితుడు మత్తయ్య కేసు మొత్తం చంద్రబాబు ప్రోద్బలంతోనే జరిగిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాశారు. ఇంకోపక్క ఇంకోపక్క మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఈ రెండు సంఘటనలూ సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేవే. తెలుగుదేశం పార్టీ నేతలకూ ఇబ్బందికరమైనవే. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నందున అందరి నోళ్లు నొక్కేయవచ్చు. దబాయింపులతో నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఓటుకు నోటు కేసు మొత్తాన్ని మళ్లీ దర్యాప్తు చేయాలని మత్తయ్య సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాస్తారన్నది ఎవరూ ఊహించి ఉండరు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న ఈ కేసులో మత్తయ్యపై ఉన్న ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సీఎం నిందితుడిగా ఉన్నా అప్పీలుకు వచ్చిన కారణంగా న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించింది కూడా. ఈ నేపథ్యంలో మత్తయ్య తీవ్రంగా స్పందిస్తూ సీజేఐకి లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్ధికి ఓటు వేయించడానికి మత్తయ్య ద్వారా టీఆర్ఎస్ నామినెటేడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్తో రాయబారం చేయించారు. ఓటుకు గాను రూ.ఐదు కోట్లు ఇచ్చేందుకు చంద్రబాబు, రేవంత్లు ఒప్పుకున్నారన్నది అభియోగం. ఈ క్రమంలో రేవంత్ ఏభై లక్షల నగదుతో స్టీఫెన్సన్ ఇంటికి వెళ్లడం, ముందస్తు సమాచారంతో తెలంగాణ ఏసీబీ ఆయనను అరెస్టు చేయడం తెలిసిన సంగతే. ఇదంతా కుట్ర అని రేవంత్ వాదిస్తుంటారు. కాగా ఇదే కేసులో స్టీవెన్సన్తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి, ‘‘మనవాళ్లు బ్రీఫ్డ్ మీ..అంతా నేను చూసుకుంటా..’’ అంటూ భరోసా ఇచ్చిన ఆడియో అప్పట్లో పెను సంచలనం. అయితే కేంద్రంలోని బీజేపీ పెద్దల ద్వారా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్తో రాజీ చేసుకున్నారని చాలామంది చెబుతారు. అదే టైమ్లో కేసీఆర్పై ఏపీలో ఫోన్ టాపింగ్ కేసు పెట్టి హడావుడి చేశారు. ఈ కేసు ఛార్జ్షీట్లో చంద్రబాబు పేరు ముప్పై సార్లకు పైగా ఉన్నా, ఆయనను నిందితుడిగా చేర్చలేదు. ఇప్పుడు మత్తయ్య చంద్రబాబుపై ప్రత్యక్షంగా ఆరోపణలు చేయడం గమనార్హం.ఈ కేసులో చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని కేసీఆర్ అన్నప్పటికీ ఆ తరువాత ఏం జరిగిందో కానీ ఆయనను నిందితుడిగానూ చేర్చలేకపోయారు. మత్తయ్య చెబుతున్న దాని ప్రకారం ఈ వ్యవహారంలో చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేశ్, అతని సన్నిహితులు కొందరు, ఆనాటి ఇంటెలిజెన్స్ డిజి వెంకటేశ్వర రావుల పాత్ర ఉంది. మత్తయ్య తెలంగాణ పోలీసులకు చిక్కకుండా ఏపీకి తరలించారట. ప్రలోభాలకు గురి చేస్తూ.. ఇంకోపక్క బెదిరిస్తూ తాము అనుకున్న విధంగా కేసీఆర్పై ఫోన్ టాపింగ్ కేసు పెట్టించడం, 164 సెక్షన్ కింద సాక్ష్యం చెప్పడం వంటివి చేయించారని మత్తయ్య అంటున్నారు. మత్తయ్యకు, చంద్రబాబు బృందానికి మధ్య ఎక్కడ చెడిందో కాని, తదుపరి కాలంలో మత్తయ్య ఎదురు తిరిగినట్లు కనిపిస్తుంది. తాజాగా ఆయన చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు ఏ రకంగా చూస్తుందో చెప్పలేం. ఏపీ, తెలంగాణలలో చంద్రబాబు, రేవంత్లు ముఖ్యమంత్రులుగా ఉన్నందున ఈ కేసు విచారణ సజావుగా జరగదని మత్తయ్య ఆరోపిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీపై, ముఖ్యనేతలపై అదే రాష్ట్రంలో దర్యాప్తు అంత తేలికకాదు. కేసు నీరుకార్చేందుకు ప్రయత్నాలు జరుగుతూంటాయి. చంద్రబాబుపై వచ్చిన స్కిల్ స్కామ్, మద్యం కేసు, ఇతర కేసులపై విచారణ దాదాపు నిలిచిపోయిన సంగతి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఓటుకు కోట్లు కేసులో అరెస్టు అయి కొన్నాళ్లపాటు జైలులో ఉన్న రేవంత్ స్వయంగా సీఎంగా ఉన్నారు.ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరు కూడా పదవులలో ఉన్నారు. అందువల్ల ఈ కేసు ఎంతవరకు ముందుకు వెళుతుందన్నది అనుమానమే. గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసులను కర్ణాటకకు బదిలీ చేసిన రీతిలో వేరే రాష్ట్ర కోర్టుకు బదిలీ చేయడమో, లేక సీబీఐకి అప్పగించడమో చేస్తే తప్ప ఓటుకు కోట్లు కేసు ముందుకు వెళ్లదని ఒక న్యాయ నిపుణుడు అభిప్రాయపడ్డారు.ఇప్పటికైతే అలా జరిగే సూచనలు ఏమీ లేవు..సుప్రీంకోర్టులో మత్తయ్య అఫిడవిట్ వేస్తే, అది సీజే ముందుకు వస్తే, దేశ వ్యాప్తంగా ఇది ఒక పెద్ద కథనం అవుతుంది. భవిష్యత్తులో అధికారంలో ఉన్న నేతలపై కేసులు ఎలా డీల్ చేయాలన్న దానిపై ఒక సూచన రావచ్చేమో చూడాలి. ఇక వివేకా హత్య కేసుకు సంబంధించి చంద్రబాబు కాని, ఇతర కూటమి నేతలు కాని అధారం ఉన్నా, లేకపోయినా పలు ఆరోపణలు గుప్పిస్తుంటారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్గా విమర్శలు చేస్తుంటారు.అందులో భాగంగానే సీఐ శంకరయ్యపైన కూడా చంద్రబాబు అసెంబ్లీలో ఆరోపణలు చేశారు. తానేదో హత్యకేసులో ఆధారాలు తుడిచివేయడానికి సహకరించినట్లు సి.ఎమ్. చెప్పడం అన్యాయమని, సీబీఐ కూడా తనపై అలాంటి ఆరోపణలు చేయలేదని, తను సాక్షిగానే పరిగణించిందని, ఆయన అన్నారు. తనకు డీఎస్పీ ప్రమోషన్ వచ్చిందని చంద్రబాబు చెప్పడాన్ని తప్పుపట్టారు. తాను ఇంకా సీఐగానే ఉన్నానని అన్నారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఒక సీఐపై ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదంటే, ఏ అసత్యం చెప్పినా,తనను ఎవరూ ఏమీ చేయరులే అన్న ధీమా కావచ్చు.కాని సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందన్నట్లుగా ఆ సీఐ ఏకంగా లీగల్ నోటీసు ఇచ్చి చంద్రబాబును ఇరకాటంలో పడేశారు. నిజంగానే పెద్ద పదవిలో ఉన్నవారు ఏ ఆరోపణ చేసినా ప్రభుత్వంలో ఉద్యోగంలో ఉన్నవారు భరించాలా? ఇలా నోటీసు ఇచ్చి ఎదుర్కోవచ్చా అన్నదానికి ఈ నోటీసు ఒక సమాధానం ఇవ్వవచ్చు. అయితే ఏదో రకంగా ఆ సీఐపై ఇప్పుడు ప్రభుత్వం చర్య తీసుకుని వేధించే అవకాశం కూడా ఉంది. ఇప్పిటికే సీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తనకే లీగల్ నోటీసు ఇస్తారా అని మండిపడ్డారు. మళ్లీ పాత ఆరోపణలనే చేయడానికి ఆయన వెనుకాడలేదు. అయితే శంకరయ్య చేసిన ఆరోపణలకు నేరుగా మాత్రం జవాబు ఇవ్వలేదు. శంకరయ్యపై తీవ్రంగా మాట్లాడిన చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుకు సంబందించి, మత్తయ్య చేసిన ఆరోపణలపైన ఎందుకు స్పందించలేకపోయారో అర్థం చేసుకోవడం కష్టం కాదు. ఆయన వద్ద దానికి సమాధానం లేదనే అనుకోవాలి. ఆయనే ఉపన్యసించినట్లు, ఈ ఉదంతం రాజకీయం ముసుగులో నేరం చేసినట్లు అవుతుందా? కాదా? అన్నది స్పష్టం చేస్తే ప్రజలకు విశదమవుతుంది కదా!.ఏది ఏమైనా ఈ రెండు కేసులలో చంద్రబాబుకు ఇబ్బంది కలుగుతుందో లేదో తెలియదు కాని, పరువు మాత్రం దెబ్బతిన్నట్లే భావించిల్సి ఉంటుందేమో!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తిరుమల లడ్డూ కేసు.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ కేసులో సీబీఐ పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. తిరుమల లడ్డు కేసులో సిట్ పనిచేయడం ఆపేసిందా? అంటూ సీజేఐ ప్రశ్నించారు. ‘‘సిట్ వేరొక అధికారికి అధికారాలు బదలాయించకూడదా?. చిన్నప్పన్నను ఇంటరాగేషన్లో వేధిస్తే ఫిర్యాదు చేయొచ్చు కదా’’ అంటూ సీజేఐ వ్యాఖ్యానించారు.చిన్నప్పన్నకు సిట్లో లేని అధికారి నోటీసు ఇవ్వడం సుప్రీంకోర్టు ఆదేశాలను అతిక్రమించడమేనని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేసింది. జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం.. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించింది. ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. -
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
-
ఈసారి తప్పించుకోలేవ్ బాబు.. ఓటుకు నోటు కేసులో సుప్రీంకు మత్తయ్య లేఖ
-
అంతా చంద్రబాబే చేశాడు.. ఓటుకు నోటు కేసులో సంచలన విషయాలు
-
‘నా తండ్రి మందు తాగి భూమి అమ్మాడు’
కుమార్తె పెళ్లి కోసం ఓ తండ్రి 1995లో భూమి అమ్మాడు. అయితే తన పెద్ద కుమారుడు తండ్రిపై చేసిన ఆరోపణను సుప్రీంకోర్టు కొట్టేసి.. హిందూ అవిభాజ్య చట్టంలోని అంశాలను ప్రస్తావిస్తూ తీర్పును వెలువరించింది. అసలు కుమారుడు తండ్రిపై చేసిన ఆరోపణ ఏమిటో.. కోర్టు ఏం చెప్పిందో ఈ కథనంలో తెలుసుకుందాం.అసలు కేసేంటి..?శరణప్ప అనే వ్యక్తికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె. తన కుమార్తె వివాహ ఖర్చుల నిమిత్తం కుటుంబానికి చెందిన భూమికి తానే యజమానిగా ఉండడంతో 1995లో ఓ వ్యక్తికి అమ్మేశాడు. అయితే ఈ సంఘటన జరిగిన నాలుగేళ్ల తర్వాత అంటే 1999లో అతని పెద్ద కుమారుడికి విషయం తెలిసి ఈ అమ్మకాన్ని కోర్టులో సవాలు చేశాడు. తన తండ్రి శరణప్ప మద్యపానానికి బానిసై, వృథా ఖర్చుల కోసం ఈమేరకు అమ్మకం చేశాడని, తిరిగి ఆ భూమిని తమకు ఇప్పించాలని కోర్టులో దావా వేశాడు.కోర్టు తీర్పుకొనుగోలు దారుడు అప్పటికే పక్కాగా ధ్రువపత్రాలను సిద్ధం చేసుకున్నాడు. కుమారుడు వేసిన దావా కారణంగా 2000 సంవత్సరం నుంచి వివిధ కోర్టుల్లో, వివిధ దశల్లో వాదోపవాదాలు జరిగాయి. చివరగా ఈ కేసు కిందిస్థాయి కోర్టుల నుంచి సుప్రీంకోర్టు చేరింది. ఇటీవల హిందూ అవిభాజ్య కుటుంబ(హెచ్యూఎఫ్) చట్టంలోని అంశాలను ప్రస్థావిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ‘కుటుంబంలోని వ్యక్తుల వివాహ ఖర్చుల కోసం యజమానికి చెందిన భూమిని తాను అమ్మే హక్కు ఉంటుంది. హెచ్యూఎఫ్ ప్రకారం కుటుంబ కర్తగా తండ్రి ఉంటాడు. నిజమైన కుటుంబ అవసరాల కోసం ఆస్తిని అమ్మే సర్వహక్కులు శరణప్పకు ఉన్నాయి. అందుకు ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదు’ అని ధర్మాసనం తెలిపింది. తండ్రి మద్యపానం సేవించి ఈ లావాదేవీ చేశాడు అనడానికి ఎలాంటి రుజువులు చూపకపోవడంతో కుమారుడి దావాను కోర్టు కొట్టేసింది. జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ జాయ్యాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.ఇదీ చదవండి: వర్షంలో ఫుడ్ ఆర్డర్ చేస్తే ‘రెయిన్ ఫీజు’పై జీఎస్టీ -
AI-171 విమాన ప్రమాదం ప్రాథమిక నివేదికపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
లంబాడీల ఎస్టీ హోదాపై సుప్రీంలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: బంజారా, లంబాడీ, సుగాలీ కులాలను షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో చేర్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది.పిటిషనర్లు పోడియం బాలరాజు, మోడి యం శ్రీనివాసరావు సహా మరో ఇద్దరి తరఫున సీనియర్ న్యాయవాది పరమేశ్వరన్తో పాటు న్యాయవాదులు అల్లంకి రమేశ్, ఉండవల్లి అరుణ్ కుమార్, ఆర్.మమత వాదనలు వినిపించారు. లంబాడీ, సుగాలీ, బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 342కు పూర్తిగా విరుద్ధమని వారు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అసలైన ఆదివాసీ తెగలతో పోలిస్తే ఈ వర్గాలు ఇప్పటికే ఆర్థికంగా, సామాజికంగాఅభివృద్ధి చెందాయని పిటిషన్లో పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, ఈ అంశంపై ఇప్పటికే పెండింగ్లో ఉన్న ప్రధాన పిటిషన్లతో ఈ వ్యాజ్యాలను జత చేయా లని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది. -
అన్ని మతాలనూ గౌరవిస్తా
న్యూఢిల్లీ: తాను అన్ని మతాలనూ గౌరవిస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ స్పష్టంచేశారు. విష్ణుమూర్తిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణల పట్ల ఆయన గురువారం స్పందించారు. ఆరోపణలను ఖండించారు. తన వ్యాఖ్య లను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చారు. మధ్యప్రదేశ్లో యునె స్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన ఖజు రహో ఆలయ ప్రాంగణంలో ఉన్న జవేరీ టెంపుల్లో భగవాన్ విష్ణుమూర్తి వి గ్రహం దెబ్బతిన్నదని, ఆలయాన్ని పునర్ నిర్మించి, అక్కడ మరో విగ్రహాన్ని ఏర్పా టు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాకేశ్ దలాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ గవాయ్తోపాటు జస్టిస్ కె.వినో ద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం ఈ నెల 16న విచారణ చేపట్టింది. పిటిషన్ను తిరస్కరించింది. అది ప్రచార ప్రయోజన వ్యాజ్యం అంటూ ఆక్షేపించింది. విగ్రహం విషయంలో మీరు ఆరాధిస్తున్న విష్ణుమూర్తినే ఏదో ఒకటి చేయమని అడగండి అంటూ పిటిషనర్కు జస్టిస్ గవాయ్ సూచించారు. అలా చేస్తే మీరు నిజమైన విష్ణు భక్తులవుతారు అని చెప్పారు. దేవుడిని ప్రార్థించి, తర్వాత యోగా చేయండి అని పేర్కొన్నారు. శివుడికి మీరు వ్యతిరేకం కాకపోతే అక్కడే ఖజురహోలో పెద్ద శివలింగం ఉంది, దాన్ని పూజించండి అని జస్టిస్ గవాయ్ చెప్పారు. విష్ణుమూర్తి విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో జనం తప్పుపట్టారు. జస్టిస్ గవాయ్కి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అండగా నిలిచారు. జస్టిస్ గవాయ్ తనకు చాలా ఏళ్లుగా తెలుసని, ఆయన అన్ని మతాల ఆధ్యాత్మిక, పవిత్ర క్షేత్రాలను దర్శిస్తుంటారని చెప్పారు. అన్ని మతాలను సమానంగా భావిస్తుంటారని తెలిపారు. భగవంతుడిని కించపర్చడం ఆయన ఉద్దేశం కాదని అన్నారు. న్యూటన్ నియమం ప్రకారం ఒక చర్యకు అంతే సమానమైన ప్రతిచర్య ఉంటుందని వివరించారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా కాలంలో ఒక చర్యకు తప్పుడు అతి ప్రతిస్పందన ఉంటుందని పేర్కొన్నారు. జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలను వక్రీకరించడం దురదృష్టకరమని స్పష్టంచేశారు. సోషల్ మీడియా పోస్టులను జస్టిస్ వినోద్ చంద్రన్ ఖండించారు. సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా మారిందని విమర్శించారు. -
కొందరు రైతులనైనా జైలుకు పంపండి
సాక్షి, న్యూఢిల్లీ: పంట వ్యర్థాలను తగలబెడుతూ వాయుకాలుష్యానికి కారణమవుతున్న రైతులను ఎందుకు అరెస్ట్ చేయట్లేదని పంజాబ్ ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం నిలదీసింది. కొందరు రైతులను కటకటాల వెనక్కి నెడితేనే ఇతర రైతుల్లో భయం ఉంటుందని, వ్యర్థాలను తగలబెట్టే రైతులకు గట్టి సందేశం ఇచ్చిన వాళ్లమవుతామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్తాన్, పంజాబ్లలో రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లలో పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల ధర్మాసనం పై విధంగా స్పందించింది. ‘రైతులు నిజంగా ప్రత్యేకమైనవాళ్లే. వాళ్ల కారణంగానే మనం ఆహారం తినగల్గుతున్నాం. అంతమాత్రాన మనం పర్యావరణాన్ని కాపాడకుండా మౌనంగా కూర్చోలేం కదా. పంట వ్యర్థాలను తగలబెడుతున్న రైతులను శిక్షించే సెక్షన్లు ఉన్నాయి కదా? వాయుకాలుష్యంతో పర్యావరణానికి హాని తలపెడుతున్న కొందరు రైతులను అరెస్ట్చేస్తేనే మిగతా వాళ్లకు గట్టి సందేశం వెళుతుంది. తప్పు చేసిన రైతులను శిక్షించేందుకు చట్టంలో నిబంధనలు ఉన్నాయని మీకు తెలియదా? పర్యావ రణాన్ని కాపాడాలనే సత్సంకల్పం మీకు ఉంటే రైతులను అరెస్ట్చేయడానికి ఎందుకు జంకుతున్నారు?’’ అని న్యాయస్థానం నిలదీసింది. ‘‘పంట వ్యర్థ్యాలను జీవఇంధనంగా ఉపయోగంచవచ్చన్న వార్తలను మేం కూడా వార్తాపత్రికల్లో చదివాం. ఇలా సద్వినియోగం చేసుకోండి అని మేం పదేపదే చెప్పలేం’’ అని సీజేఐ గవాయ్ అసహనం వ్యక్తంచేశారు. ‘సీఏక్యూఎం, సీపీసీబీల్లో పోస్ట్లను మూడు నెలల్లోపు భర్తీచేయండి. పదోన్నతి పోస్ట్లను ఆరు నెలల్లోపు భర్తీచేయండి’ అని కోర్టు ఆదేశించింది. రైతులు కథలు చెబుతున్నారుఈ కేసులో పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాహుల్ మెహ్రా, అమికస్ క్యూరీ(కోర్టు సహాయకురాలు)గా అపరంజిత హాజరయ్యారు. గతేడాదితో పోల్చితే పంట వ్యర్థాల దహనం తగ్గుముఖం పట్టిందని మెహ్రా న్యాయస్థానానికి తెలిపారు. ఈ ఏడాది వ్యర్థాల దహనాలను మరింతగా అడ్డుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ వాదనలతో అమికస్ క్యూరీ అపరంజిత విభేదించారు. రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టకుండా ఉండటానికి ప్రభుత్వం రైతులకు నగదు ప్రోత్సాహకాలు, ఇతర పరికరాలు అందిస్తున్నప్పటికీ పెద్దగా మార్పు లేదని ఆమె న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఉపగ్రహాలు తమ పంటపొలాల మీదుగా వెళ్లిన సమయాల్లో పంట వ్యర్థాలకు నిప్పు పెట్టొద్దని వ్యవసాయశాఖ అధికారులే తమకు ఉప్పందించారని రైతులు అవే కథలు మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆమె కోర్టుకు వివరించారు. పంట వ్యర్థాల దహనంపై 2018లోనే సుప్రీంకోర్టు విస్తృతమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. అయినప్పటికీ మరోసారి రాష్ట్ర ప్రభుత్వాలు నిస్సహాయ స్థితిలో కోర్టు ముందు నిలిచాయని వ్యాఖ్యానించారు.లేదంటే మేమే నిర్ణయం తీసుకుంటాం‘పర్యావరణానికి నష్టం కలిగించే రైతులపై చర్యలు తీసుకోవాలి. ఒక వేళ కఠిన చర్యలు తీసుకోవడానికి మీకు మనసురాకపోతే ఆ విషయాన్ని అయినా లిఖితపూర్వకంగా మాకు తెలపండి. మీరు ఒక నిర్ణయం తీసుకోండి. లేకుంటే మేమే తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని సీజేఐ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ముందుగా అరెస్టులు, చర్యలు తీసుకున్నాం. కానీ వీరిలో హెక్టార్ సాగుభూమి ఉన్న రైతులే ఎక్కువ. వీళ్లను జైల్లో పెడితే, వీళ్లపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి ఏంటి? గడిచిన సంవత్సరాల్లో పంట వ్యర్థాలకు నిప్పు పెట్టిన ఘటనలు 77,000 జరిగితే అవి ఏకంగా 10,000 స్థాయికి దిగొచ్చాయి’ అని రాహుల్ మెహ్రా కోర్టుకు నివేదించారు. దీనిపై సీజేఐ స్పందించారు. ‘ఎప్పట్లాగా రోటీన్గా రైతులకు సూచనలు చేయడం మానేసి ఈసారి అరెస్టులు, జైలుకు పంపడానికి కూడా మేం వెనకాడము అనే గట్టి సందేశాన్ని ఇవ్వండి. వచ్చే పంటకాలంలోపు పొలాల్లో వ్యర్థాలు పర్యావరణహితంగా తొలగించాలి’ అని ఆయా రాష్ట్రాలకు సీజేఐ సూచించారు. -
సుప్రీంకోర్టులో వివేకా హత్య కేసు విచారణ
-
వివేకా కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.ఈ కేసులో తదుపరి దర్యాప్తు అంశంపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసిందని అడిషనల్ సొలిసిటర్ జనరల్.. సుప్రీంకోర్టుకు తెలిపారు. తదుపరి దర్యాప్తు అంశంపై కోర్టుదే నిర్ణయం అని ఏఎస్జీ తెలిపారు.‘‘దర్యాప్తు చేయాలన్న పిటిషనర్ వాదనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మీరు బస్ మిస్సయ్యారు.. ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైంది. ఆ దశలోనే ఈ అంశాలు చెప్పాలి కదా?. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఈ అంశాలన్నీ ట్రయల్ కోర్టులో ఎందుకు చెప్పలేదు?. ఇలాగే పిటిషన్లు వేస్తూ వెళ్తే ట్రయల్ రన్ పూర్తి కావడానికి దశాబ్దం పడుతుంది. ఈ దశలో మేం చేసేది ఏం లేదు’’ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, గత నెలలో వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తోందా.. రాష్ట్ర ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై సీబీఐ అభిప్రాయమేంటి.. కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏక కాలంలో కొనసాగించే అవకాశం ఉందా..’అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆదేశించింది.ఈ నేపథ్యంలో గత నెల ఆగస్టు5న మరోసారి జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టగా.. వివేకా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని సుప్రీం కోర్టుకు సీబీఐ వివరించింది.ఇవాళ(మంగళవారం) ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని.. తదుపరి దర్యాప్తు అంశంపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. -
పెన్షన్కు సర్వీస్ బ్రేక్ అడ్డంకి కాదు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో పాక్షిక ఊరట లభించింది. ఉద్యోగంలో చేరడంలో పరిపాలన పరంగా జరిగిన జాప్యం వల్ల ఏర్పడిన సర్వీస్ అంతరాయాన్ని(సర్వీస్ బ్రేక్) పెన్షన్ ప్రయోజనాల కోసం పరిగణనలోకి తీసుకోవాలని, వారి సర్వీసును నిరంతరంగానే భావించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, పనిచేయని ఆ కాలానికి కూడా పూర్తి జీతం చెల్లించాలన్న ఉద్యోగుల అభ్యర్థనను మాత్రం తోసిపుచ్చింది. ‘నో వర్క్–నో పే’ అనే సూత్రం వర్తిస్తుందని తేల్చిచెబుతూ వారి పిటిషన్ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టిలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. పనిచేయని కాలానికి జీతం ఇవ్వాలనే నిబంధన లేదు..2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 58 ఏళ్లకు పదవీ విరమణ చేసిన కొందరు ఉద్యోగులను.. ఏపీలో 60 ఏళ్ల పదవీ విరమణ వయసు ఉన్నందున తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అయితే, తెలంగాణ నుంచి రిలీవ్ అవ్వడానికి, ఏపీలో పోస్టింగ్ ఇవ్వడానికి మధ్య.. కొన్ని నెలల నుంచి ఏడాదికి పైగా సమయం పట్టింది. ఈ కాలాన్ని సర్వీసుగా పరిగణించి పూర్తి జీతం చెల్లించాలని ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.పనిచేయని కాలానికి కూడా జీతం చెల్లించడానికి చట్టంలో ఎలాంటి నిబంధన లేదని.. అందువల్ల ఆ డిమాండ్కు చట్టపరమైన బలం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉద్యోగుల తప్పు లేకుండా జరిగిన పరిపాలన జాప్యం వల్ల.. వారి పెన్షన్ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకూడదని అభిప్రాయపడింది. ఆ ఖాళీ సమయాన్ని కూడా పెన్షన్ లెక్కింపు కోసం పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. తద్వారా వారి 60 ఏళ్ల సర్వీస్కు గాను పూర్తి పెన్షన్ ప్రయోజనాలు పొందుతారని పేర్కొంది. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే.. తాము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ ఖాళీ సమయంలో ఉద్యోగులు ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చి ఉండాలని కోర్టు వ్యాఖ్యానించింది. -
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
నకిలీ పత్రంతో లబ్ధి పొందితేనే చీటింగ్
సాక్షి, న్యూఢిల్లీ: మోసం (చీటింగ్) కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. నకిలీ (ఫోర్జరీ) పత్రాలను సమర్పించినప్పటికీ, కేవలం ఆ పత్రాల వల్లే ఎదుటి వ్యక్తి మోసపోయి, దానిద్వారా నిందితుడు ఏదైనా భౌతిక ప్రయోజనం పొందితేనే ఐపీసీ సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఫోర్జరీ పత్రానికి, పొందిన ప్రయోజనానికి మధ్య ప్రత్యక్ష సంబంధం (ప్రేరేపణ) లేనప్పుడు దానిని మోసంగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. కళాశాల గుర్తింపు కోసం నకిలీ ఫైర్ ఎన్వోసీ సమర్పించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యాసంస్థ అధినేత జూపల్లి లక్ష్మీకాంతరెడ్డిపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టేసింది. జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.అసలు కేసు..: జూపల్లి లక్ష్మీకాంతరెడ్డి జె.వి.ఆర్.ఆర్.ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున నంద్యాలలో కళాశాల నిర్వహిస్తున్నారు. కళాశాల గుర్తింపునకు ఆయన విద్యాశాఖకు నకిలీ ఫైర్ సేఫ్టీ ఎన్వోసీని సమర్పించారని జిల్లా ఫైర్ ఆఫీసర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనపై ఐపీసీ సెక్షన్ 420 కింద చార్జిషీట్ దాఖలు చేశారు. ఆయన ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించగా ఊరట లభించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక అంశాలను ప్రస్తావించింది. ‘చీటింగ్ నేరం రుజువు కావాలంటే కొన్ని ప్రధానమైన అంశాలు ఉండాలి.తప్పుడు పత్రం చూపి ఎదుటివారిని నమ్మించి, మోసపూరితంగా వారిని ప్రేరేపించి, వారినుంచి ఏదైనా ఆస్తిని పొందడం లేదా వారికి నష్టం కలిగించడం జరగాలి..’ అని జస్టిస్ నాగరత్న ధర్మాసనం పేర్కొంది. ‘నేషనల్ బిల్డింగ్ కోడ్–2016 ప్రకారం 15 మీటర్ల లోపు ఎత్తున్న విద్యాసంస్థల భవనాలకు ఫైర్ సేఫ్టీ ఎన్వోసీ తప్పనిసరి కాదు. ఇదే విషయాన్ని గతంలో హైకోర్టు కూడా స్పష్టం చేసింది. చట్టప్రకారం అవసరం లేని ఒక పత్రాన్ని పిటిషనర్ నకిలీది సమర్పించినప్పటికీ, ఆ పత్రం ప్రేరణతో విద్యాశాఖ గుర్తింపు ఇవ్వలేదు.ఆ ఎన్వోసీ లేకపోయినా ఆయనకు చట్టప్రకారమే గుర్తింపు లభిస్తుంది. కాబట్టి ఇక్కడ పిటిషనర్కు అక్రమ లాభం గానీ, విద్యాశాఖకు నష్టం గానీ జరగలేదు. తప్పుడు పత్రానికి, పొందిన ప్రయోజనానికి మధ్య బలమైన సంబంధం లేనప్పుడు, చీటింగ్ నేరానికి అవసరమైన కీలకమైన అంశం సంతృప్తి చెందనట్లే..’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మోసపూరిత ఉద్దేశం లేనందున ఫోర్జరీకి సంబంధించిన సెక్షన్లు 468, 471 కూడా వర్తించవని చెబుతూ పిటిషనర్పై కేసును ధర్మాసనం కొట్టేసింది. -
భారత్-పాక్ మ్యాచ్ రద్దుకు సుప్రీం కోర్టులో పిల్.. న్యాయస్థానం స్పందన ఇదే..!
ఆసియా కప్ 2025లో భాగంగా ఈ నెల 14న దుబాయ్లో జరుగబోయే భారత్-పాకిస్తాన్ మ్యాచ్పై సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలైంది. ఈ మ్యాచ్ను రద్దు చేయాలని ఉర్వశి జైన్ నేతృత్వంలో నలుగురు న్యాయ విద్యార్థులు ఆర్టికల్ 32 ప్రకారం పిటిషన్ను దాఖలు చేశారు.పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జాతీయ గౌరవానికి విరుద్ధమని వారు పిటిషన్లో పేర్కొన్నారు. మ్యాచ్ నిర్వహణ అమరవీరుల కుటుంబాలకు బాధ కలిగించే చర్యగా అభిప్రాయపడ్డారు.అయితే, ఈ పిటిషన్ను జస్టిస్ జె.కె.మహేశ్వరి, విజయ్ బిష్ణోయి నేతృత్వంలోని బెంచ్ విచారణకు తీసుకోలేదు. "ఇది కేవలం మ్యాచ్ మాత్రమే.. వదిలేయండి" అంటూ న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్పై రాజకీయ, సామాజిక భావోద్వేగాలు ఉన్నప్పటికీ, సుప్రీం కోర్టు ఈ విషయాన్ని క్రీడా పరంగా మాత్రమే పరిగణించింది. క్రికెట్ను జాతీయ ప్రయోజనాల కంటే పైగా చూడలేమన్న అభిప్రాయాలు ఉన్నా, ప్రస్తుత విధానాలు మరియు అంతర్జాతీయ ఒప్పందాలు కారణంగా మ్యాచ్ను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బహుల దేశాలు పాల్గొనే టోర్నీల్లో పాక్తో మ్యాచ్ను రద్దు చేసుకుంటే, అది భారత ఆటగాళ్ల కెరీర్లపై ప్రభావం చూపే ప్రమాదముంది.బహుల దేశాలు పాల్గొనే టోర్నీల్లో టీమిండియా పాక్తో తలపడనున్నా, ద్వైపాక్షిక సిరీస్లు మాత్రం ఆడదు. ఈ విషయాన్ని బీసీసీఐ ఇదివరకే స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే, ఆసియా కప్లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. నిన్న (సెప్టెంబర్ 10) యూఏఈతో జరిగిన మ్యాచ్ను టీమిండియా 27 బంతుల్లోనే ముగించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. కుల్దీప్ యాదవ్ (2.1-0-7-4), శివమ్ దూబే (2-0-4-3), వరుణ్ చక్రవర్తి (2-0-4-1), అక్షర్ పటేల్ (3-0-13-1), బుమ్రా (3-0-19-1) ధాటికి 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (9 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) చెలరేగడంతో 4.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
పాలస్తీనా ఖైదీలకిచ్చే ఆహార నాణ్యత పెంచండి
టెల్అవీవ్: ఇజ్రాయెల్ బలగాలు గాజాలోని పాలస్తీనియన్ల పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్న వేళ ఆ దేశ సుప్రీంకోర్టు స్పందించింది. దేశంలోని జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఖైదీలకు సరిపోను ఆహారం సైతం అందివ్వకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వారికిచ్చే ఆహార పరిమాణాన్ని, ఆహార నాణ్యతను కూడా పెంచాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ విధానాలపై సుప్రీంకోర్టు జోక్యం కేవలం సలహాలకు మాత్రమే పరిమితం. అయినప్పటికీ, ఇజ్రాయెల్–హమాస్ మధ్య జరిగే యుద్ధంపై తొలిసారిగా సుప్రీంకోర్టు స్పందించడం విశేషం. పాలస్తీనా ఖైదీలకు కనీసం ఆహారం కూడా అందివ్వకపోవడాన్ని ఒక విధానంగా అధికారులు అమలు చేస్తున్నారంటూ ఇజ్రాయెల్కు చెందిన మానవ హక్కుల సంస్థలు ఇచి్చన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు పైవిధంగా స్పందించింది. ఖైదీల ప్రాథమిక మనుగడకు రోజులో మూడు భోజనాలు అందించడం ప్రభుత్వ చట్టపరమైన విధి అని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. అధికారులు అమలు చేయాలని ఆదేశించింది. అదేవిధంగా, అసోసియేషన్ ఫర్ సివిల్ రైట్స్ ఇన్ ఇజ్రాయెల్(అక్రి), ఇజ్రాయెలీ రైట్స్ గ్రూప్ గిషాలు గతేడాది వేసిన పిటిషన్పై విచారణకు సైతం తాజాగా అంగీకరించింది. దీనిని అనూహ్య పరిణామంగా పేర్కొంటున్నారు. ఇజ్రాయెల్ జైళ్లలోని ఖైదీలకు అందించే ఆహారంపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆంక్షలు పెడుతోందని, వారిని ఆకలి చావులకు గురిచేస్తోందని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టు...‘మేం సుఖవంతమైన లేదా విలాసవంతమైన జీవనం గురించి మాట్లాడటం లేదు. చట్ట ప్రకారం మనిషి మనుగడకు అవసరమైన ప్రాథమిక పరిస్థితుల కల్పనపైనే మాట్లాడుతున్నాం’అని పేర్కొంది. అత్యంత దుర్మార్గులైన మన శత్రువుల మాదిరిగా మనం వ్యవహరించరాదని వ్యాఖ్యానించింది. 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి గాజాలోని హమాస్ శ్రేణులు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు మొదలయ్యాక.. ఇజ్రాయెల్లోని జైళ్లలో కనీసం 61 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్చిలో 17 ఏళ్ల పాలస్తీనా వాసి చనిపోయాడు. ఆకలి బాధతోనే ఇతడు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇలా ఉండగా, సుప్రీంకోర్టు రూలింగ్పై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇటమర్ బెన్ గ్విర్ తీవ్రంగా స్పందించారు. జడ్జీలు అసలు ఇజ్రాయెలీయులేనా? అని ప్రశ్నించారు. ఒక వైపు గాజాలోని ఇజ్రాయెల్ బందీలకు సాయం చేసే వారే లేకపోగా, హమాస్కు సుప్రీంకోర్టు మద్దతు పలకడం సిగ్గు చేటన్నారు. చట్ట ప్రకారమే జైళ్లలో కనీస పరిస్థితులను కలి్పస్తున్నామని, ఇందులో ఎటు వంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. అయితే, సుప్రీంకోర్టు తీర్పు మేరకు అధికా రులు తక్షణమే చర్యలు తీసుకోవాలని అక్రి డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ జైళ్లు టార్చర్ క్యాంపుల్లాగా మారరాదని పేర్కొంది. ‘ప్ర భుత్వం ప్రజలను ఆకలిబాధకు గురి చేయరాదు. ప్రజలు ప్రజలనే చంపుకుంటారా? వాళ్లు ఎలాంటి నేరానికి పాల్పడ్డారనేది తర్వాతి విషయం’అని స్పష్టం చేసింది. -
రాజకీయ యుద్ధాలకు కోర్టును వాడుకోవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం రేవంత్రెడ్డిపై బీజేపీ తెలంగాణ శాఖ దాఖలు చేసిన పరువునష్టం పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ కె. వినోద్చంద్రన్, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్లతో కూడిన ధర్మాసనం బీజేపీ తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘రాజకీయ యుద్ధాలకు ఈ కోర్టును ఉపయోగించుకోవద్దని పదేపదే చెబుతున్నాం’అంటూ సీజేఐ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో జోక్యం చేసుకోదలచుకోలేదని తేల్చిచెప్పారు.రాజ కీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు తట్టుకొనే శక్తి ఉండాలని పేర్కొంటూ పిటిషన్ను డిస్మిస్ చేశారు. రాజకీయ వ్యాఖ్యలను రాజకీయంగానే ఎదుర్కోవాలని హితవు పలికారు. అయినా రంజిత్ కుమార్ వాదనలు కొనసాగించేందుకు ప్రయతి్నంచడంతో సీజేఐ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘మేం ఇప్పటికే పిటిషన్ను కొట్టేశాం. ఇంకా వాదనలు దేనికి? మళ్లీ ఇలాంటి పిటిషన్తో కోర్టుకు వస్తే రూ. 10 లక్షల జరిమానా విధిస్తాం’అంటూ హెచ్చరించారు. ఇదీ నేపథ్యం.. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గతేడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు తమ పార్టీకి రాజకీయంగా పరువునష్టం కలిగించాయంటూ బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు హైదరాబాద్ ట్రయల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయని నిర్ధారించి ఐపీసీ సెక్షన్ 499, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 కింద విచారణకు ఆదేశించింది.ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రేవంత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ‘రాజకీయ ప్రసంగాలు తరచుగా అతిశయోక్తులతో నిండి ఉంటాయి. వాటిని పరువునష్టంగా పరిగణించడం సరికాదు’అని వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. ట్రయల్ కోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ రేవంత్కు అనుకూలంగా తీర్పు ఇచి్చంది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు అభిõÙక్ మను సింఘ్వీ, దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. -
సుప్రీంకోర్టులో తెలంగాణ BJPకి చుక్కెదురు
-
ట్రంప్కు టెన్షన్.. అదే జరిగితే వసూలు చేసిందంతా కక్కాల్సిందే!
వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై పన్నులు విధిస్తూ ఎంజాయ్ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కొత్త టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తోంది. సుంకాల విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పు వస్తే.. ఇప్పటి వరకు వచ్చిన బిలియన్ డాలర్ల ఆదాయం రీఫండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వెల్లడిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తాజాగా మీట్ ది ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల విషయమై సుప్రీంకోర్టులో తీర్పు రావాల్సి ఉంది. కోర్టు తీర్పును ట్రంప్కు అనుకూలంగా వస్తే మంచిదే. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే మాత్రం.. మేము దాదాపు సగం సుంకాలకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇది అమెరికా ట్రెజరీకి భయంకరంగా మారుతుంది. తిరిగి చెల్లింపులను జారీ చేయడానికి పరిపాలన సిద్ధంగా ఉందా లేదా? అనేది తేలాలి. అదే జరిగితే పలు దేశాల నుంచి ముక్కు పిండి వసూలు చేసిందంతా అమెరికా కక్కాల్సి ఉంటుంది. అయితే, సుప్రీంకోర్టులో ట్రంప్ అనుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక, 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద ట్రంప్కు భారీ సుంకాలను విధించే అధికారం లేదని రెండు ఫెడరల్ కోర్టులు తేల్చిన తర్వాత బెసెంట్ ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇదిలా ఉండగా.. ప్రపంచ దేశాలపై పన్నులు విధించేందుకు బ్రేకులు పడుతుండటంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫెడరల్ చట్టం ప్రకారం అధ్యక్షుడికి దిగుమతులపై సుంకాలు విధించే హక్కు ఉందని పేర్కొంటూ ఈ కేసును అత్యవసరంగా విచారణ జరపాలని కోరింది. ఎమర్జెన్సీ అధికార చట్టం ప్రకారం ట్రంప్ సుంకాలు విధించారని ఇటీవల అప్పీల్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఆ సుంకాలు చట్టవిరుద్ధమని పేర్కొనడంతో ట్రంప్ యంత్రాంగం సుప్రీం తలుపుతట్టింది.నవంబర్ ప్రారంభంలోనే ఈ కేసుపై వాదనలు వినాలని సొలిసిటర్ జనరల్ డి.జాన్ సావర్ న్యాయమూర్తిని కోరారు. ‘అప్పీల్స్ కోర్టు నిర్ణయం అధ్యక్షుడు ఐదు నెలలుగా విదేశాలతో కొనసాగిస్తున్న చర్చలను అనిశ్చితిలోకి నెడుతుంది. ఇప్పటికే పూర్తయిన చర్చలను, జరగబోయే చర్చలను ప్రమాదంలో పడేస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ వాదనను లిబర్టీ జస్టిస్ సెంటర్ వ్యాజ్య డైరెక్టర్, సీనియర్ న్యాయవాది జెఫ్రీ ష్వాబ్ తోసిపుచ్చారు. ‘చట్టవిరుద్ధమైన సుంకాలు చిన్న వ్యాపారాలకు తీవ్ర హాని కలిగిస్తున్నాయి. వాటి మనుగడ ప్రమాదంలో పడుతోంది. ఈ కేసులో మా క్లయింట్లకు సత్వరం పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై వ్యాపార వర్గాలు ఇప్పటికే రెండు న్యాయస్థానాల్లో పైచేయి సాధించాయి. -
ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చు
‘‘ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద ముందస్తు బెయిల్పై నిషేధం ఉంది. అయితే, ఆరోపణలు నిరాధారమైనప్పుడు ముందస్తు బెయిల్ మంజూరుకు ఆ నిషేధం ఏమాత్రం అడ్డంకి కాదు’’. ‘‘ఎఫ్ఐఆర్లో ప్రాథమిక ఆధారాలున్నాయా లేదా అన్నదానిపై కోర్టు ఓ నిర్ధారణకు రావొచ్చు. ఈ సందర్భాల్లో కోర్టులు ఘటనకు సంబంధించిన ఆధారాల్లోకి వెళ్లడం, సంబంధంలేని విషయాలను పరిగణనలోకి తీసుకోవడం చేయరాదు. మినీ ట్రయల్ కూడా చేయడానికి వీల్లేదు.’’ – ‘‘ఎస్సీ, ఎస్టీలు పౌర హక్కులను కోల్పోకుండా ఉండటం.. అవమానాలు, హేళనల నుంచి, వేధింపుల నుంచి వారిని రక్షించడం కూడా చట్టం ముఖ్యోద్దేశం’’. – సుప్రీంకోర్టు ధర్మాసనంసాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్లోని ఆరోపణలు నిరాధారమైనప్పుడు కోర్టు తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి సీఆర్పీసీ సెక్షన్–438 కింద నిందితునికి ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యొచ్చని స్పష్టంచేసింది. ఎఫ్ఐఆర్లోని ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలుంటే ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి ఏమాత్రం వీల్లేదని తేల్చిచెప్పింది. నిజానికి.. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద ముందస్తు బెయిల్పై నిషేధం ఉందని.. అయితే, ఆరోపణలు నిరాధారమైనప్పుడు ముందస్తు బెయిల్ మంజూరుకు ఆ నిషేధం ఏమాత్రం అడ్డంకి కాదని పేర్కొంది. ఆధారాల్లోకి వెళ్లడం.. మినీ ట్రయల్ నిర్వహించొద్దు.. ‘ఎఫ్ఐఆర్లో ప్రాథమిక ఆధారాలున్నాయా లేదా అన్నదానిపై కోర్టు ఓ నిర్ధారణకు రావొచ్చు. ఎఫ్ఐఆర్లోని వివరాలు, ఆరోపణలే నిర్ణయాత్మకమైనవి. ఈ సందర్భాల్లో కోర్టులు ఘటనకు సంబంధించిన ఆధారాల్లోకి వెళ్లడం, సంబంధంలేని విషయాలను పరిగణనలోకి తీసుకోవడం చేయరాదు. అంతేకాక.. కోర్టులు లోతైన విషయ పరిశీలన చేయడం, మినీ ట్రయల్ నిర్వహించడం కూడా చేయడానికి వీల్లేదు’.. అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ బి. రామకృష్ణ గవాయ్, న్యాయమూర్తులు జస్టిస్ కె. వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇటీవల కీలక తీర్పునిచ్చింది. ‘సుప్రీం’ తీర్పు సారాంశం ఏమిటంటే.. అవమానాల నుంచి రక్షణ కోసమే ఎస్సీ, ఎస్టీ చట్టం.. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్–18 నిబంధనలను పరిశీలిస్తే, ఈ చట్టాన్ని తీసుకొచి్చన ఉద్దేశం ప్రస్ఫుటమవుతోంది. ఈ నిబంధనలు కఠినమైనవిగా ఉన్నా, అవి రాజ్యాంగం ప్రతిపాదించిన సామాజిక న్యాయసూత్రాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అలాగే, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతుల ప్రజలు కూడా సమాజంలో ఇతర అన్నీ వర్గాల్లాగే సమాన స్థాయిలో ఉండేలా చేస్తున్నాయి. సెక్షన్–18 నిబంధనలను, తదనుగుణ నిషేధం, పార్లమెంట్ ఎస్సీ, ఎస్టీ చట్టం చేసిన ఉద్దేశాన్ని కలిపి చూడాల్సి ఉంటుంది.షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతుల సామాజిక ఆరి్థక పరిస్థితులను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలను అమలుచేయడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ఎస్సీ, ఎస్టీలు సుదీర్ఘకాలంగా సమాజంలో అణగారిన వర్గాలుగా ఉన్న నేపథ్యంలో వారికి తగిన రక్షణ కల్పించడం కూడా ఈ చట్టం ఉద్దేశం. ఎస్సీ, ఎస్టీలు పౌర హక్కులను కోల్పోకుండా ఉండటం, అవమానాలు, హేళనల నుంచి, వేధింపుల నుంచి వారిని రక్షించడం కూడా చట్టం ముఖ్యోద్దేశం. చట్టపరమైన నిషేధాన్ని హైకోర్టు విస్మరించింది.. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల్లో సీఆర్పీసీ సెక్షన్–438 (ముందస్తు బెయిల్ మంజూరు) వర్తింపుపై మినహాయింపు ఉంది. దీంతో ఈ చట్టం కింద నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడంపై పూర్తి నిషేధం ఉంది. అందువల్ల ఆ వ్యక్తి ముందస్తు బెయిల్ పొందే ప్రయోజనం పూర్తిగా తొలగించబడుతుంది. ఎస్సీ, ఎస్టీ కేసుకు సంబంధించి ఓ వ్యక్తికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దుచేసింది.ఈ కేసులో ఎఫ్ఐఆర్ను చదవగానే ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నేరం జరిగినట్లు అర్థమవుతోంది. అయితే, హైకోర్టు మాత్రం సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించి, అందులో కొన్ని వైరుధ్యాలున్నాయని తేల్చిది. వీటి ఆధారంగా నేరం జరగలేదని నిర్ణయించింది. ఇది తప్పు. ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు ముందస్తు బెయిల్ మంజూరు చేయరాదన్న నిషేధాన్ని సైతం హైకోర్టు విస్మరించింది. అందువల్ల హైకోర్టు తీర్పును రద్దుచేస్తున్నాం. అలాగే నిందితునికి ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దుచేస్తున్నాం. నిందితులకు ముందస్తు బెయిలిచ్చిన బాంబే హైకోర్టు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయలేదంటూ రాజ్కుమార్ జైన్, మరికొంతమంది గ్రామస్తులు చూస్తుండగానే తమను కులం పేరుతో దూషించి, దాడిచేశారంటూ కిరణ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహారాష్ట్ర, ధారాషివ్ జిల్లా, పరండా పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో రాజ్కుమార్ జైన్ తదితరులు కింది కోర్టును ఆశ్రయించగా, కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో.. వారు హైకోర్టును ఆశ్రయించారు. ఎఫ్ఐఆర్లోని అంశాలకు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలకు మధ్య వ్యత్యాసం ఉందంటూ రాజ్కుమార్ జైన్ తదితరులకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బాంబే హైకోర్టు తీర్పును తప్పుపట్టిన సుప్రీంకోర్టు..దీనిపై బాధితుడు కిరణ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం బాంబే హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్లోని ఆరోపణలు నిరాధారమైనప్పుడు కోర్టు తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి సీఆర్పీసీ సెక్షన్–438 కింద నిందితునికి ముందస్తు బెయిల్ మంజూరు చేయవచ్చని ధర్మాసనం తెలిపింది ఎఫ్ఐఆర్లోని ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలుంటే మాత్రం ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి ఏమాత్రం వీల్లేదంది. ఈ కేసులో బాధితుడిని రాజ్కుమార్ జైన్ తదితరులు బహిరంగంగానే కులం పేరుతో దూషించారని, ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తేనే ఈ విషయం అర్ధమైపోతోందని తెలిపింది. అందువల్ల రాజ్కుమార్ జైన్ తదితరులకు ముందస్తు బెయిలిస్తూ బాంబే హైకోర్టు ఇచి్చన తీర్పును రద్దుచేసింది. -
పిన్నెల్లి సోదరులకు ముందస్తు బెయిల్
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటల్లో భాగంగా చోటు చేసుకున్న ఆ పార్టీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుల హత్యకు సంబంధించి రాజకీయ దురుద్దేశాలతో నమోదు చేసిన కేసులో వైఎస్సార్సీపీ నేతలైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.వారిద్దరికీ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని, దర్యాప్తునకు సహకరించాలని పిన్నెల్లి సోదరులను ఆదేశించింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ కక్షతో పిన్నెల్లి సోదరులపై కేసు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య, జవిశెట్టి కోటేశ్వరరావు ఈ ఏడాది మే 24న హత్యకు గురయ్యారు. వివాహానికి వెళ్లి బైకుపై తిరిగి వస్తుండగా బోదిలవీడు సమీపంలో టీడీపీకే చెందిన తోట వెంకట్రామయ్య తదితరులు స్కార్పియో వాహనంతో ఢీ కొట్టి హత్య చేశారు.తోట వెంకట్రామయ్యకు, మృతుడు జవిశెట్టి వెంకటేశ్వర్లుకు మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరులో భాగంగా ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తేల్చారు. అయితే పోలీసులు యధావిధిగా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పిన్నెల్లి సోదరులను నిందితులుగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వారు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఇటీవల దాన్ని కొట్టేస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అంతర్గత పోరులో భాగమే ఈ హత్య అని ఎస్పీనే చెప్పారు.. ఈ నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లపై జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. పిన్నెల్లి సోదరుల తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, షోయబ్ ఆలం, సానేపల్లి రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో నమోదు చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే ఫిర్యాదుదారు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారని, నిజానికి అధికార పార్టీ నేతల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో భాగంగానే ఈ హత్యలు జరిగాయన్నారు. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ మీడియా ముఖంగా చెప్పారని, ఆ తర్వాత రాజకీయ జోక్యంతో పిటిషనర్లను నిందితులుగా చేర్చారని వివరించారు. జవిశెట్టి సోదరుల హత్య కేసులో పిన్నెల్లి సోదరులు మినహా మిగిలిన వారందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్లను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని తెలిపారు. వీరు మినహా నిందితులంతా టీడీపీ వారేగా.. ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఇది హత్య కేసని, ఎలాంటి ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని ధర్మాసనాన్ని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ, హత్య కేసన్న సంగతి తమకు తెలుసని చెప్పింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే... పిటిషనర్లు మినహా మిగిలిన నిందితులందరూ కూడా హత్యకు గురైన వారి పార్టీ (టీడీపీ)కి చెందిన వారేనంటూ వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది ఏదో చెప్పబోతుండగా, ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, కౌంటర్ దాఖలు చేయనివ్వండి.. అన్నీ పరిశీలించి అవసరమైతే ముందస్తు బెయిల్ రద్దు చేస్తాం అని తేల్చి చెప్పింది.ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఇదే సమయంలో పిన్నెల్లి సోదరులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ట్రయల్ ముగియకుండా పిటిషనర్లు జాప్యం చేస్తుంటే, ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తామిచ్చిన ఈ ఉత్తర్వులను ఉపసంహరించాలంటూ ప్రభుత్వం తమను కోరవచ్చని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. -
యుద్ధం ఆగాలంటే భారత్పై టారిఫ్ల మోత తప్పదు!
న్యూయార్క్/వాషింగ్టన్: టారిఫ్ల బూచి చూపి పలు దేశాలను భయపెడుతున్న ట్రంప్ సర్కార్ చివరకు యూఎస్ సుప్రీంకోర్టును సైతం టారిఫ్లు తగ్గిస్తే అమెరికా వాణిజ్యలోటు సంక్షోభంలో కూరుకుపోతుందని భయపెట్టే దుస్సాహసానికి ఒడిగట్టింది. ఉక్రెయిన్లో శాంతిస్థాపనే జరగాలంటే భారత్పై టారిఫ్ల మోత మోగాల్సిందేనని ట్రంప్ ప్రభుత్వం గురువారం అమెరికా సుప్రీంకోర్టులో వితండవాదానికి దిగింది. భారత్సహా ఇతర దేశాలపై అధిక టారిఫ్ల భారం మోపకపోతే ఆర్థికలోటు సుడిగుండంలో అమెరికా చిక్కుకోక తప్పదని ట్రంప్ సర్కార్ అనవసరంగా ఆందోళన వ్యక్తంచేసింది. అప్పీళ్ల కోర్టులో తమకు వ్యతిరేకంగా ఉత్తర్వులు రావడంతో ఇతర దేశాలతో టారిఫ్ల చర్చల్లో ప్రతిష్ఠంబన నెలకొందని, అందుకే కేసును వీలైనంత త్వరగా తేల్చాలని యూఎస్ సుప్రీంకోర్టులో గురువారం డిమాండ్చేసింది. ఈ మేరకే ఏకంగా 251 పేజీల అఫిడవిట్ను కోర్టుకు ట్రంప్ సర్కార్ సమరి్పంచింది. ‘‘ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు దిగడంతో ప్రత్యక్షంగా అమెరికాలో జాతీయ అత్యయిక పరిస్థితి ఏర్పడింది. దీనిని పరిష్కరించేందుకే భారత్పై టారిఫ్ల మోత మోగించాల్సి వచ్చింది. ఇందుకోసం అధ్యక్షుడు తన ‘1977 అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం’ను ప్రయోగించారు. అధిక టారిఫ్లతో భారత్పై ఆర్థికపరంగా ఒత్తిడి తెస్తేనే భారత్ మరో గత్యంతరంలేక చివరకు రష్యా యుద్ధవిరామం చేసేలా ఒప్పించగల్గుతుంది. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు, అమెరికా ఆర్థికవ్యవస్థ పటిష్టతకు భారత్పై 50 శాతం టారిఫ్ అవశ్యం’’అని ట్రంప్ ప్రభుత్వం వాదించింది. ‘‘టారిఫ్ల విధింపును కోర్టులు అడ్డుకుంటే, అన్ని దేశాలపై టారిఫ్లు విధించే అసాధారణ అధికారం అధ్యక్షుడికి లేదని మీరు తేలిస్తే వాణిజ్యలోటు కష్టాల నుంచి అమెరికా బయటపడటం చాలా కష్టమవుతుంది. చివరకు అమెరికా ఆర్థికవినాశనం సంభవిస్తుంది’’అంటూ తమకు వ్యతిరేక తీర్పు రావొద్దనే ధోరణిలో ఏకంగా యూఎస్ సుప్రీంకోర్టునే భయపెట్టేలా ట్రంప్ సర్కార్ దుస్సాహసానికి ఒడిగట్టింది. ఆరు కీలక దేశాలు దారికొచ్చాయి ‘‘టారిఫ్ల కొరడా ఝుళిపించడంతో ప్రపంచంలోనే ఆరు ప్రధాన ఆర్థికవ్యవస్థలు(దేశాలు) మా దారికొచ్చాయి. అమెరికాతో 27 సభ్యదేశాలున్న ఐరోపా సమాఖ్యసైతం టారిఫ్ల ఒప్పందంచేసుకుంది. ఈ ఒప్పందం అమెరికాకు భారీగా మేలు చేకూర్చేదే. దీంతోపాటు 2 ట్రిలియన్ డాలర్ల కొనుగోళ్లు, అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి భారీ పెట్టుబడులు సాధ్యంకానున్నాయి. ఆయా దేశాలపై మేం విధించే టారిఫ్లు అనేవి అమెరికా మరింతగా 1.2 ట్రిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్యలోటు అగాధంలో పడకుండా కాపాడే రక్షారేకులు. టారిఫ్లు విధించే అధికారం అధ్యక్షుడికి ఉండదన్న ‘అప్పీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్ కోర్టు’అభిప్రాయాన్ని పట్టించుకోకండి. ఇతర దేశాలపై అధిక టారిఫ్లు మోపితేనే అమెరికా సంపన్న దేశంగా కొనసాగుతుంది. లేదంటే పేదదేశంగా పతనమవుతుంది. ట్రంప్ అధికారంలోకి రాకమునుపు అమెరికా ఆర్థిక వ్యవస్థ స్తబ్దుగా ఉండిపోయింది. ఇప్పుడు అధిక టారిఫ్లతో బిలియన్ల కొద్దీ డబ్బు వచ్చిపడుతోంది. ఇప్పుడు అమెరికా మళ్లీ బలపడుతోంది. ఆర్థికంగా పటిష్టమవుతూ విశ్వవ్యాప్తంగా గౌరవమర్యాదలను పొందుతోంది’’అని ట్రంప్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ డి. జాన్ సాయెర్ వాదించారు. నవంబర్లోపు కేసులో వాదోపవాదనలను ముగించి తీర్పు చెప్పాలని కోర్టును సాయెర్ కోరారు. -
Supreme Court: తదుపరి విచారణ వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు
-
బాబు సర్కారుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
ఏ1 నుండి ఏ5 వరకు టీడీపీ నేతలే: సుప్రీంకోర్టు
ఢిల్లీ: పిన్నెల్లి సోదరులపై హత్య కేసు నమోదు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఏ1 నుంచి ఏ5 వరకు ఉన్నది టీడీపీ వారే అని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అనంతరం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (ఏ6), ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి (ఏ7) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిన్నెల్లి సోదరుల తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ..‘రాజకీయ కక్షతో పెట్టిన కేసు ఇది. ఈ కేసుతో తమకు సంబంధం లేదని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకముందే ఫిర్యాదుదారు ఇంటర్వ్యూ ఇచ్చారు. అధికార పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు వల్లే జరిగిన హత్య ఇది. చంద్రబాబు ప్రభుత్వం కావాలనే పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు బనాయించింది అని తెలిపారు.అనంతరం, ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘నిందితులంతా హత్యకు గురైన వ్యక్తి పార్టీ వారే కావడం విచిత్రం. ఈ కేసులో ఏ1 నుంచి ఏ5 వరకు టీడీపీవారే ఉన్నారు అని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి విచారణ వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. -
బిల్లులపై గవర్నర్ల పెత్తనమేంటి?
న్యూఢిల్లీ: శాసన నిర్వాహక వర్గం విధులు, ప్రక్రియలో కార్యనిర్వాహక వర్గం జోక్యం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలియజేసింది. బిల్లు రూపంలోని ప్రజల ఆకాంక్ష, అవసరాన్ని గవర్నర్లు లేదా రాష్ట్రపతి ఇష్టాయిష్టాలకు లోబడి ఉంచలేమని పేర్కొంది. శాసనసభలో ఆమోదించిన బిల్లు యోగ్యతను గవర్నర్లు ప్రశ్నించజాలరని తేల్చిచెప్పింది. బిల్లుకు సమ్మతి తెలియజేసే విషయంలో గవర్నర్లు/రాష్ట్రపతికి సుప్రీంకోర్టు 3 నెలల గడువు విధించిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభ్యంతరం తెలిపారు. గవర్నర్లు లేదా రాష్ట్రపతికి గడువు నిర్దేశించే అధికారం కోర్టులకు ఉందా? అని ప్రశ్నించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టుకు సూచించారు. రాష్ట్రపతి రిఫరెన్స్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తన వాదనను బుధవారం ధర్మాసనం దృష్టికి తీసుకొచి్చంది. ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు కార్యనిర్వాహక వర్గం పరిధిలోకి రాదని పేర్కొన్నారు. ప్రజల సంకల్పమే అత్యున్నతం అని ఉద్ఘాటించారు. ధర్మాసనం స్పందిస్తూ... లెజిస్లేటివ్ నిబంధనలకు అనుగుణంగా లేని బిల్లులను కూడా గవర్నర్లు/రాష్ట్రపతి సమ్మతించాలని మీరు భావిస్తున్నారా? బిల్లుల యోగ్యతను కోర్టులు పరీక్షించవచ్చా? అని ప్రశ్నించింది. చట్టాల రాజ్యాంగబద్ధతను కోర్టులను పరీక్షించవచ్చని సిబల్ బదులిచ్చారు. కార్యనిర్వాహక వర్గానికి ఆ అధికారం లేదన్నా రు. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులపై గవర్నర్లు తక్షణమే త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. మూడు నెలలు లేదా ఆరు నెలలు అనడం సరైంది కాదన్నారు. మన దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత బిల్లును గవర్నర్లు లేదా రాష్ట్రపతి నిలిపివేసిన సందర్భాలు ఎక్కువగా లేవని గుర్తుచేశారు. ఒక బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందితే దానికి రాజ్యాంగబద్ధత వచ్చేసినట్లేనని అభిప్రాయపడ్డారు. ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. -
సుప్రీంకోర్టే సర్వోన్నతం!
న్యూఢిల్లీ: రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి, సుప్రీంకోర్టుల్లో ఎవరు సుప్రీం అన్న అత్యంత కీలకమైన అంశంపై ఆ రెండు వ్యవస్థల నడుమ కొన్ని నెలలుగా నివురుగప్పిన నిప్పులా సాగుతున్న పెను వివాదం ముదురుపాకాన పడింది. ఈ విషయమై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ కేసులోనైనా సరే, సంపూర్ణ న్యాయం చేకూర్చేందుకు అవసరమైన అన్ని రకాల ఆదేశాలూ ఇచ్చి తీరతామని కుండబద్దలు కొట్టింది.‘‘అందుకోసం అవసరమతే ప్రస్తుత చట్టాల్లోని లోపాలను బేఖాతరు చేయాల్సి వచి్చనా ఏ మాత్రమూ వెనకాడబోం. ఎందుకంటే ఆర్టీకల్ 142 కింద సుప్రీంకోర్టుకు స్వయానా రాజ్యాంగమే కట్టబెట్టిన అసాధారణమైన విచక్షణాధికారమది’’ అని కుండబద్దలు కొట్టింది. అంతేగాక, అత్యున్నత న్యాయస్థానానికి దఖలు పడ్డ న్యాయ సమీక్షాధికారం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమని చరిత్రాత్మకమైన మినర్వా మిల్స్ కేసును ఉటంకిస్తూ గుర్తు చేసింది. తద్వారా, సుప్రీంకోర్టు అధికార పరిధికి అంతిమంగా రాష్ట్రపతి కూడా లోబడాల్సిందేనని చెప్పకనే చెప్పింది.అసెంబ్లీలు ఆమోదించే బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్లతో పాటు ఏకంగా రాష్ట్రపతికి కూడా 3 నెలల గడువు విధిస్తూ సీజేఐ ధర్మాసనం ఇటీవల వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించడం తెలిసిందే. దానిపై కీలక రాజ్యాంగపరమైన సందేహాలు లేవనెత్తుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేరుగా సుప్రీంకోర్టుకే లేఖ రాయడం మరింత సంచలనంగా మారింది. దానిపై సీజేఐ ధర్మాసనం ఎదుట మంగళవారం ఆరో రోజు కూడా విచారణ కొనసాగింది. రాజ్యాంగపరమైనవంటూ ఈ విషయమై రాష్ట్రపతి లేవనెత్తిన సందేహాలు వాస్తవానికి రాజకీయపరమైనవవేనని ఈ సందర్భంగా ధర్మాసనం తేల్చేసింది.అయినా సరే, రాష్ట్రపతి లేవనెత్తిన ‘రాజ్యాంగపరమైన’ ప్రశ్నలకు సమాధానం నిరాకరించజాలమని పేర్కొంది. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతికి, గవర్నర్లకు గడువు విధిస్తూ ఆదేశాలిచ్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉందో లేదో తేల్చాలంటూ ఆర్టీకల్ 143(1) కింద దఖలు పడ్డ విచక్షణాధికారాలను వాడుకుంటూ ద్రౌపదీ ముర్ము గత మే నెలలో సీజేఐకి లేఖ రాసింది. వారికి ఆ అధికారాల్లేవ్! గవర్నర్లు బిల్లులకు ఆమోదం తెలపకుండా తొక్కిపెట్టడం ప్రజాభీష్టాన్ని కాదనడమేనని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ చరిత్రలోనే మొదటిసారిగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందన్నారు. ‘‘ఒక వ్యవస్థ మరో వ్యవస్థకు అవరోధంగా మారేందుకు రాజ్యాంగంలోని ఏ సూత్రమూ అనుమతించదు. అసలు విచక్షణ అనే భావనే ఆర్టీకల్ 200కు ఫక్తు విరుద్ధం.గవర్నర్ నిర్వర్తించేది రాజ్యాంగ విధి, అంతే తప్ప స్వేచ్ఛాయుత ఎంపిక కాదు‘ అని వాదించారు. రాష్ట్రపతి, గవర్నర్ల చర్యలు రాజ్యాంగ సమీక్షకు అతీతమని కేంద్రం భావిస్తోందంటూ తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి మండిపడ్డారు. అలా బిల్లులను ఆపేసేందుకు రాష్ట్రపతికి, గవర్నర్లకు ఎలాంటి స్వతంత్ర అధికారాలూ లేవని వాదించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో తలెత్తిన న్యాయ వివాదాలను సింఘ్వీ తన వాదనకు మద్దతుగా ప్రస్తావించారు. దాన్ని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తీవ్రంగా తప్పుబట్టారు.‘‘అలాంటి కేసులనే వాదనలకు ఆధారంగా చూపదలిస్తే మేం (కేంద్రం) కూడా లిఖితపూర్వకంగా సమాధానం సమరి్పంచాల్సి వస్తుంది. స్వతంత్రం వచి్చన నాటినుంచీ కొన్ని రాష్ట్రాల్లో రాజ్యాంగాన్ని అడ్డంగా తుంగలో తొక్కుతూ వచ్చారు. ఆ మురికమయమైన గతాన్ని తవి్వపోయాలనే మీరు భావిస్తుంటే అందుకు సంబంధించిన పూర్తి రికార్డులను మేం కోర్టు ముందుంచుతాం’’ అని సింఘ్వీ, సిబల్లను ఉద్దేశించి స్పష్టం చేశారు. సీజేఐ కల్పించుకుని వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ, కర్నాటక కావచ్చు, మేం కేవలం రాజ్యాంగంలోని నిబంధనలకు నిర్వచిస్తామంతే. అంతకంటే మరేమీ లేదు’’ అంటూ వాదనలను రాజ్యాంగపరమైన అంశాలపైకి మళ్లించారు. విచారణ బుధవారం కూడా కొనసాగనుంది. మినర్వా కేసు.. మైలురాయి! న్యాయసమీక్ష రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమంటూ ధర్మాసనం ఉటంకించిన మినర్వా మిల్స్ కేసును భారత న్యాయచరిత్రలోనే అతి కీలక మైలురాయిగా పేర్కొంటారు. ఏ విషయంపై అయినా నిర్ణయాలు తీసుకునే విషయంలో రాజ్యాంగ మౌలిక నిర్మాణ సిద్ధాంతమే సర్వోన్నతమంటూ సుప్రీంకోర్టు వెలువరించిన చరిత్రాత్మక తీర్పుకు మినర్వా కేసే నిమిత్తంగా నిలిచింది. -
లోకల్ రిజర్వేషన్ కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
-
అలా చదివితేనే.. తెలంగాణలో లోకల్: సుప్రీంకోర్టు సంచలన తీర్పు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ లోకల్ రిజర్వేషన్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తెలంగాణలో వరుసగా 9,10,11,12 తరగతులు చదివితేనే లోకల్ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం తీర్పును ఇచ్చింది. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో, తెలంగాణ లోకల్ రిజర్వేషన్ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది.ఈ సందర్బంగా వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుందన్న తెలంగాణ ప్రభుత్వ జీవో నెంబర్-33ని సుప్రీంకోర్టు సమర్థించింది. స్థానిక రిజర్వేషన్ల అంశంపై ప్రతి రాష్ట్రానికి నిబంధనలను తయారు చేసుకునే అధికారం ఉందని కోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదించింది. వాదనలను ధర్మాసనం ఒప్పుకుంది. ఈ అంశాన్ని సవాల్ చేసిన విద్యార్థుల పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అయితే గత ఏడాది ఇచ్చిన మినహాయింపుతో ప్రయోజనం పొందిన విద్యార్థులను అలాగే కొనసాగించాలని ధర్మాసనం సూచించింది. కాగా, ఎంబీబీఎస్, బీడీఎస్, యూజీ కోర్సులకు లోకల్ కోటా రిజర్వేషన్ తీర్పు వర్తించనుంది. -
త్వరలో తాడిపత్రికి ఎంట్రీ ఇస్తా.. సుప్రీం తీర్పుపై పెద్దారెడ్డి రియాక్షన్
-
తాడిపత్రిలో పెద్దారెడ్డి పర్యటించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
-
దివ్యాంగులపై జోకులా.. కమెడియన్లకు సుప్రీంకోర్టు బిగ్ షాక్
ఢిల్లీ: దివ్యాంగులపై జోకులు వేసే కమెడియన్లపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. స్టాండప్ కామెడీ పేరుతో దివ్యాంగులపై అనుచితమైన జోక్స్ తగదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అవమానించే వ్యాఖ్యలు ఎప్పుడు ఆగుతాయంటూ వ్యాఖ్యానించిన ధర్మాసనం.. అసభ్యకరమైన జోకులు వేసిన కమెడియన్లను మందలించింది. ఇలాంటి షోల్లో పాల్గొని అనుచిత వ్యాఖ్యలు చేసినవారు తమ సామాజిక మాధ్యమాల్లో కూడా క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.సామేయ్ రైనా, విపున్ గోయల్, బల్ రాజ్ పరమజీత్ సింగ్ ఘాయ్, సోనాలి థక్కర్, నిశాంత్ జగదీష్ తన్వర్ వంటి కమెడియన్లు వికలాంగులను అపహాస్యం చేశారంటూ ఎస్ఎంఏ క్యూర్ ఫౌండేషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. హాస్యం జీవితంలో భాగమే, కానీ అది ఇతరుల గౌరవాన్ని దెబ్బతీయకూడదంటూ ధర్మాసనం హెచ్చరించింది.సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించాలంటూ ఆదేశించింది. ఇలాంటి కేసులలో భవిష్యత్తులో జరిమానాలు కూడా విధించవచ్చంటూ సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఇకపై కమెడియన్లు ప్రతి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం.. ఈ ఇన్ఫ్లుయెన్సర్లపై విధించాల్సిన జరిమానాపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ వివాదం అనంతరం సమయ్ రైనా తన షో "ఇండియాస్ గాట్ లాటెంట్"ను నిలిపేసిన సంగతి తెలిసిందే. -
అమిత్ షా వ్యాఖ్యలు కరెక్ట్ కాదు.. రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం సీరియస్
ఢిల్లీ: ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయిన మాజీ జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం ఖండించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు సహా 18 మంది రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం బహిరంగంగా ఓ ప్రకటన విడుదల చేసింది.ఈ సందర్బంగా 18 మంది రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు దురదృష్టకరం. సుప్రీంకోర్టు తీర్పును పక్షపాతంతో తప్పుగా అర్థం మాట్లాడటం సరైంది కాదు. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇటువంటి ప్రకటనలు చేయడం న్యాయ స్వాతంత్ర్యంపై ప్రభావం చూపుతాయి. కోర్టు తీర్పు స్పష్టంగా లేదా పరోక్షంగా నక్సలిజానికి మద్దతు ఇవ్వలేదని చెప్పింది. ముఖ్యంగా ఉపరాష్ట్రపతి వంటి రాజ్యాంగ పదవుల కోసం జరిగే ప్రచారాల సమయంలో, సైద్ధాంతిక చర్చలలో, రాజకీయ నాయకులు అవమానాలు చేయకుండా గౌరవాన్ని కాపాడుకోవాలి అని కోరారు. ఈ మేరకు ఉమ్మడి ప్రకటనపై వారంతా సంతకాలు చేశారు.BIG MONDAY MORNING DEVELOPMENT :Seven former Supreme Court judges, three former High Court chief justices and eight former High Court judges issue a public statement criticising Home Minister Amit Shah for misinterpreting Supreme Court's 2011 Salwa Judum judgement and…— Nagendar Sharma (@sharmanagendar) August 25, 2025న్యాయమూర్తుల బృందంలో ఉన్నది వీరే.. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు.. కురియన్ జోసెఫ్, మదన్ బీ లోకూర్, జె.చలమేశ్వర్, ఏకే పట్నాయక్, అభయ్ ఓకా, గోపాల గౌడ, విక్రమ్జిత్ సేన్ ఉన్నారు. మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు.. గోవింద్ మాథుర్, ఎస్. మురళీధర్, సంజీబ్ బెనర్జీ ఉండగా.. సంజయ్ హెగ్డే, ప్రొఫెసర్ మోహన్ గోపాల్ వంటి ఇతర సీనియర్ న్యాయవాదులు కూడా ఉన్నారు.అమిత్ షా విమర్శలకు స్పందన.. ఇక, అంతకుముందు.. సాయుధ సల్వాజుడుం వ్యవస్థను సుప్రీంకోర్టు వ్యతిరేకించడం వల్లే నక్సలిజం ఇంకా ఉనికిలో ఉందని, దీనికి పరోక్షంగా సుదర్శన్రెడ్డి కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్షా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా వ్యాఖ్యలను విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్రెడ్డి విభేదించారు. అనంతరం, ఆయన స్పందిస్తూ.. సిద్ధాంతాలకు అతీతంగా ప్రజలందరి ప్రాణాలు, ఆస్తులు కాపాడే హోం మంత్రి అమిత్ షాతో నేరుగా వాగ్వాదం పెట్టుకోదల్చుకోలేదు. 2011 డిసెంబర్లో సల్వాజుడుంను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగా ఆ తీర్పు కాపీని నేనే రాశాను. కానీ ఆ అభిప్రాయం నాది కాదు. అది సుప్రీంకోర్టు అభిప్రాయం. తీర్పు పూర్తిపాఠం అమిత్ షా చదవి ఉండకపోవచ్చు. అందుకే ఆయన నన్ను విమర్శిస్తున్నారు. 40 పేజీల ఆ తీర్పు మొత్తాన్నీ చదివితే సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఆయనకు ఖచ్చితంగా అవగతమవుతుంది. ఇంతకు మించి నేనేమీ చెప్పదల్చుకోలేదు. ఇంతటితో ఈ అంశంపై చర్చ ముగిస్తే బాగుంటుంది’’అని వ్యాఖ్యానించారు.నక్సలిజాన్ని అంతంచేయాలనే ఏకైక లక్ష్యంతో ఆనాటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గిరిజన యువతకు తుపాకులిచ్చి సల్వా జుడుం(కోయ కమెండోలు) పేరితో సాయుధ వ్యవస్థను అమలుచేయగా, ఇది చట్టవిరుద్ధమని ఈ సాయుధ పౌర మిలటరీ వ్యవస్థను వెంటనే నిర్విర్యంచేయాలని సుప్రీంకోర్టు ఆనాడు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉన్నారు. దీంతో నక్సలిజం పట్ల సుదర్శన్ రెడ్డికి సానుభూతి ఉందని, అందుకే అలా తీర్పిచ్చారని అమిత్ షా శుక్రవారం ఆరోపించడం తెలిసిందే. -
ఇథనాల్ కలిపిన పెట్రోలుపై సుప్రీంకోర్టులో పిల్!
ఇరవై శాతం ఇథనాల్ కలిపిన పెట్రోలు అమ్మకాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇథనాల్ లేని పెట్రోలును ఎంచుకునే సౌకర్యం వినియోగదారులకు కల్పించాలని కోరుతూ అక్షయ్ మల్హోత్ర అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ సౌకర్యం కల్పించకపోవడం 2019 నాటి వినియోదారుల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించడమేనని, ప్రజల ప్రాథమిక హక్కులకూ భంగం కలిగించేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఇథనాల్ కలిపిన పెట్రోలును విక్రయించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిన్న మొన్నటివరకూ పెట్రోలులో కలిపే ఇథనాల్ మోతాదు పది శాతం మాత్రమే ఉండగా.. ఆగస్టు ఒకటవ తేదీ నుంచి దీన్ని ఇరవై శాతానికి పెంచారు. అయితే చౌక ఇథనాల్ను కలుపుతున్నా అంతమేరకు పెట్రోలు ధరలు తగ్గకపోవడంపై, ఈ-20 పెట్రోలు కారణంగా తమ వాహనాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, మైలేజీ తగ్గుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2023 ఏప్రిల్ కంటే ముందు తయారైన వాహనాలు, కాలుష్య నివారణ మార్గదర్శకాలు బీఎస్-6లు రెండింటికీ ఈ ఈ-20 పెట్రోలు అనుకూలంగా లేదన్నది ఆరోపణ. ఈ-20 ఇథనాల్ ఇంజిన్ భాగాలను దెబ్బతీస్తుందని, సామర్థ్యాన్ని తగ్గించడమే కాకుండా తుప్పు పట్టేందుకు అవకాశాలు ఎక్కువ చేస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇథనాల్ మిశ్రమ ఇంధనం వల్ల కలిగే నష్టాలను భర్తీ చేసేందుకు బీమా కంపెనీలు ససేమిరా అంటూండటం గమనార్హం.వినియోగదారుల అవగాహనపెట్రోల్ కంటే తక్కువ ధరకు ఇథనాల్ లభిస్తోందని కానీ ప్రభుత్వం మాత్రం అందుకు తగ్గట్టుగా పెట్రోలు ధరలు తగ్గించలేదని పిటిషనర్ ఆరోపించారు. పెట్రోలు బంకుల్లో లభిస్తున్నది ఇథనాల్ కలిపినదా? కాదా? అన్నది కూడా స్పష్టంగా తెలియడం లేదని తగిన లేబలింగ్, ప్రకటనలు లేకపోవడం వల్ల వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారని తన పిటిషన్లో పేర్కొన్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఇథనాల్ లేని పెట్రోలును కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిందీ పిటిషన్. ఇథనాల్ లేదా ఇతర పదార్థాలను కలిపి అందిస్తూంటే ఆ విషయాలను స్పష్టం చేస్తున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో అన్ని పెట్రోల్ స్టేషన్లలో ఇథనాల్ లేని పెట్రోల్ను కూడా అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టును కోరింది. దీంతోపాటే మిశ్రమం ఎంత? ఏ ఏ పదార్థాలను కలిపింది కూడా పెట్రోలు బంకుల్లో స్పష్టంగా ప్రకటించాలని... ఆయా వాహనాలు మిశ్రమ ఇంధనానికి అనువైనవా? కావా? అన్న సమాచారాన్ని వినియోగదారులకు అందించాలని సూచించింది. ఈ-20 పెట్రోలు వాడకం ప్రభావం వాహనాలపై ఎలా ఉంటుందన్న విషయాన్ని దేశవ్యాప్తంగా అధ్యయనం చేయాలని అభ్యర్థించింది.ఇదీ చదవండి: పాలసీ ఏజెంట్లు చెప్పని విషయాలు -
జడ్జీలపై వ్యక్తిగత ఆరోపణలు ప్రమాదకరం
సాక్షి, హైదరాబాద్: న్యాయమూర్తులపై విమ ర్శలు చేయడం, దూషించడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారిందని హైకోర్టు న్యాయ మూర్తి జస్టిన్ మౌషుమీ భట్టాచార్య ఆవేదన వ్యక్తంచేశారు. అసంతృప్తికి గురైన న్యాయ వాదులు, క్లయింట్లు జడ్జీలపై ఆరోపణలు చేయడమే కాకుండా కేసు విచారణ నుంచి తప్పుకోవాలని బెదిరించే స్థాయికి దిగజారుతు న్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ చర్యలు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తాయని, అనిశ్చితికి దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ కేసులో ముగ్గురి క్షమాపణలను అనుమతిస్తూ న్యాయ మూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డిపై గతంలో నమోదైన అట్రాసిటీ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ మౌషుమి భట్టాచార్య వివక్షతో వ్యవహరించారని పిటిషనర్ పెద్దిరాజు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా.. దానిని అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 11న కొట్టివేసింది. పిటిషనర్తోపాటు ఆయన తరఫు న్యాయవాదులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. జస్టిస్ మౌషుమి భట్టాచార్యకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. దీంతో జస్టిస్ మౌషుమి భటాచార్య ధర్మాసనం ముందు శుక్రవారం పెద్దిరాజు, రితీశ్పాటిల్, నితిన్ మేష్రమ్ భేషరతుగా క్షమాపణ చెప్పారు. అప్పీల్లో వాడిన భాషకు చింతిస్తున్నామని తెలిపారు. ఆ అఫిడవిట్ను న్యాయమూర్తి అనుమతించారు.న్యాయమూర్తులకు వేదిక లేదుతనపట్ల సుప్రీంకోర్టు వ్యవహరించిన తీరుకు న్యాయమూర్తి మౌషుమి భట్టాచార్య కృతజ్ఞత తెలిపారు. జడ్జీలపై దాడులు చేసేవారు ఇష్టారాజ్యంగా మీడియాలో ఒక క్లిక్తో ప్రచారం చేస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై తన వాదన వినిపించేందుకు సంబంధిత న్యాయమూర్తికి వేదికే లేదని ఆవేదన వ్యక్తంచేశారు. చట్టాన్ని కాపాడటంలో జడ్జీలది కీలక పాత్ర అని, వారిపై దాడులు కోర్టుల గౌరవానికి భంగం కలిగిస్తాయని అన్నారు. న్యాయమూర్తి పదవి అంటే చైర్మన్ అధికారం కాదని.. మనస్సాక్షి, నిబద్ధత, కరుణతో న్యాయం అందించే బాధ్యత అని స్పష్టంచేశారు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా కోర్టులు న్యాయం అందించడంలో పతాకధారులుగా నిలుస్తుండటం అభినందనీయమని ప్రశంసించారు. -
బిహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై సుప్రీంకోర్టు విచారణ
-
వీధికుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
జడ్జీలకు కన్ను కొట్టండి.. మహిళా లాయర్లకు వింత సలహా
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ ఇటీవల తన సలహా కోరిన మహిళా లాయర్కు వింతైన సమాధానం ఇచ్చారు. కోర్టులో జడ్జీలకు కన్ను కొట్టాలని చెప్పారు. అనుకూలమైన ఉత్తర్వులు రావాలంటే అలాంటి పని చేయక తప్పదని అన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పంచుకున్నారు.తాను సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పని చేసిన సమయంలో ఎంతోమంది మహిళా న్యాయవాదులు తనకు కన్ను కొట్టారని గుర్తుచేసుకున్నారు. న్యాయమూర్తి నుంచి వారికి అనుకూలమైన తీర్పులు, ఉత్తర్వులు రావడానికే ఆరాటపడ్డారని వెల్లడించారు. ఈ విషయం తెలియజేస్తూ తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.అయితే, సోషల్ మీడియా తన పోస్టుపై విమర్శలు రావడంతో దాన్ని తొలగించారు. కోర్టులో ప్రభావవంతంగా వాదనలు ఎలా చేయాలన్న దానిపై మహిళా లాయర్ కోరిన సలహాను ఆ తర్వాత పోస్టు చేశారు. జడ్జిలకు కన్ను కొట్టూ అంటూ ఆయన ఇచ్చిన సమాధానం ఇందులో కనిపిస్తోంది. జస్టిస్ మార్కండేయ కట్జూ 2006 నుంచి 2011 దాకా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. అంతకుమందు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ చైర్పర్సన్గా సేవలందించారు. -
రాజ్యాంగవ్యవస్థలు పనిచేయకుంటే ఆ పని కోర్టులే చేస్తాయి
న్యూఢిల్లీ: రాష్ట్రాల బిల్లులకు ఆమోదం తెలపడంపై గవర్నర్లకు, తనకు గడువు నిర్దేశిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టు అభిప్రాయం కోరిన అంశంపై గురువారం సైతం రాజ్యాంగ ధర్మాసనం విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వానుద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ సేథ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై వాదనలను ఆలకిస్తూ ఈ వ్యాఖ్యలుచేసింది. ‘‘రాజ్యాంగబద్ద సంస్థలు తమ విధులను నిర్వర్తించకుండా నిర్లక్ష్యవహించినా, రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా గవర్నర్ నిష్క్రియాపరత్వం చూపినా సరే తాము చేతులు కట్టుకుని కూర్చోవాలా?’’ అని కేంద్ర తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సూటిగా ప్రశ్నించింది. దీనిపై మెహతా బదులిచ్చారు. ‘‘అసెంబ్లీలు ఆమోదించి పంపిన బిల్లులపై ఎటూ తేల్చకుండా గవర్నర్ వాటిని అలాగే తనవద్దే అట్టిపెట్టుకుంటే అలాంటి సందర్భాల్లో రాష్ట్రాలే రాజకీయ పరిష్కారాలను వెతకాలి. అంతేగానీ న్యాయస్థానాల నుంచి పరిష్కారాలను ఆశించకూడదు. సమస్య పరిష్కారానికి సంప్రతింపుల మార్గంలో వెళ్లాలి. చర్చలకే తొలి ప్రాధాన్యత దక్కాలి’’ అని అన్నారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్ జోక్యంచేసుకున్నారు. ‘‘ మీరన్నట్లు చర్చలకు సిద్ధపడకుండా ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం మా వద్దకొస్తే మేమేం చేయాలి?’’ అని ప్రశ్నించారు. దీనికి బదులుగా మెహతా.. ‘‘ ఇలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కోర్టులను ఆశ్రయిస్తారని నేను అనుకోవట్లేను. సీఎం తొలుత ఆ గవర్నర్తో భేటీ కావాలి. అప్పుడా గవర్నర్ ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని కలిసి వారి సలహాలు, సూచనలతో పరిష్కారాలు వెతుకుతారు. కొన్ని సార్లు టెలిఫోన్ సంభాషణలు కూడా సమస్యలను సద్దుమణిగేలా చేశాయి’’ అని అన్నారు. ‘‘ సమస్యల పరిష్కారానికి కొన్ని దశాబ్దాలుగా ఇదే విధానాన్ని అవలంభిస్తున్నారు. ఇది కూడా సాధ్యంకాకపోతే తొలుత ప్రతినిధి బృందం రంగంలోకి దిగి గవర్నర్, రాష్ట్రపతితో చర్చలు జరుపుతుంది. కొన్ని సార్లు మధ్యవర్తిత్వం కూడా పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ మధ్య సఖ్యత కోసం రాజనీతిజ్ఞత అనేది బాగా అక్కరకొస్తుంది’’ అని మెహతా వాదించారు. దీనిపై సీజేఐ గవాయ్ స్పందించారు. ‘‘ ఈ ప్రక్రియలో ఏదైనా తప్పు జరిగితే ప్రత్యామ్నాయంఉండాలి కదా. రాజ్యాంగానికి పరిరక్షకులుగా కోర్టులున్నాయి. అందుకే ఇలాంటి ప్రత్యామ్నాయాన్ని సైతం రాజ్యాంగానికి ఆపాదించేలా ఉండాలి’’ అని ఆయన అన్నారు. దీనిపై మెహతా మాట్లాడారు. ‘‘ ఏదైనా అంశాన్ని మనకు అనుగుణంగా ఆపాదించుకోవడం వేరు. రాజ్యాంగానికి సరిపోయేలా చూడడం వేరు. రాజ్యాంగబద్ధ సంస్థలతో ఏదైనా అంశాన్ని పరిష్కరించుకోవాలన్న సందర్భాల్లో కొంత వెసులుబాట్లు కల్పించాలి’’ అని అన్నారు. -
ప్రజా ప్రభుత్వాల మనుగడ గవర్నర్ల దయపైనా?
న్యూఢిల్లీ: ‘‘దేశ పాలన వ్యవస్థలో అతి కీలకమైన గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ సామరస్యం ఉందా? అతి పెద్ద అధికార కేంద్రాలైన ఈ రెండు వ్యవస్థల నడుమ పలు కీలక అంశాలపై రాజ్యాంగంలో పేర్కొన్న మేరకు ప్రజా ప్రయోజనాలే పరమావధిగా సజావుగా సంప్రదింపుల ప్రక్రియ అసలు జరుగుతోందా?’’అని సర్వోన్నత న్యాయస్థానం కీలక సందేహాలు లేవనెత్తింది. రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలను నెరవేర్చడంలో దేశం ఏ మేరకు సఫలమైందో అర్థం కాని పరిస్థితి నెలకొందంటూ ఆవేదన వెలిబుచ్చింది.‘‘అసెంబ్లీలు ఆమోదించే బిల్లులను గవర్నర్ నిరవధికంగా పెండింగ్లో ఉంచితే పరిస్థితేమిటి? మెజారిటీ ప్రజల తీర్పు ఆధారంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వ మనుగడ గవర్నర్ల చపలత్వంపై ఆధారపడ్డట్టేగా! ఇది ఏ మేరకు సబబు? రాష్ట్రంలో పాలన తదితరాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండదా?’’అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించింది. అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపే బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపే అధికారం గవర్నర్లకు లేదని పునరుద్ఘాటించింది. ‘‘ఆర్టికల్ 200 ప్రకారం ఈ విషయంలో గవర్నర్ ముందు నాలుగు మార్గాలున్నాయి. బిల్లుకు ఆమోదం, పెండింగ్, రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, అసెంబ్లీ పరిశీలనకే తిప్పి పంపడం. అసెంబ్లీ గనక బిల్లును మళ్లీ ఆమోదించి పంపితే దాన్ని రెండోసారి రాష్ట్రపతి పరిశీలనకు పంపే అధికారం గవర్నర్కు లేదు’’అని స్పష్టం చేసింది.రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోద ముద్ర వేసే విషయంలో గవర్నర్లతో పాటు ఏకంగా రాష్ట్రపతికి కూడా గడువు నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల సంచలనాత్మక తీర్పు వెలువరించడం తెలిసిందే. ఈ విషయంలో సుప్రీంకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని పలువురు న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు. అనంతరం ఈ విషయమై సర్వోన్నత న్యాయస్థానానికి ఉన్న అధికార పరిధిపై పలు రాజ్యాంగపరమైన సందేహాలు లేవనెత్తుతూ ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్రపతి ఏకంగా ప్రశ్నావళి పంపడం మరింత కలకలం రేపింది. సీజేఐకి రాష్ట్రపతి ప్రశ్నావళి పంపడం తాలూకు రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం సుదీర్ఘంగా విచారణ జరిపింది.గవర్నర్ల నియామకం, అధికారాలకు సంబంధించి రాజ్యాంగ పరిషత్లో జరిగిన చర్చలను ఉటంకిస్తూ కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు విన్పించారు. కొందరు ఆరోపిస్తున్నట్టుగా గవర్నర్ పదవి రాజకీయ ఆశ్రయానికి ఉద్దేశించినది కానే కాదని మెహతా స్పష్టం చేశారు. రాజ్యాంగం నిర్దేశించిన మేరకు గవర్నర్కు పలు కీలక అధికారాలు, బాధ్యతలు దఖలు పడ్డాయని గుర్తు చేశారు. ‘‘రాష్ట్రపతికి, గవర్నర్లకు ఇలా గడువు నిర్దేశించడమంటే అత్యున్నత వ్యవస్థల్లో ఒక వ్యవస్థ రాజ్యాంగం తనకు దఖలు పరచని అధికారాలను నెత్తిన వేసుకోవడమే తప్ప మరోటి కాదు. అంతిమంగా ఇది రాజ్యాంగపరమైన అవ్యవస్థకే దారి తీస్తుంది’’అని హెచ్చరించారు.గవర్నర్లు తమ విచక్షణాధికారాన్ని అత్యంత పరిమితంగా మాత్రమే ఉపయోగిస్తారని చెప్పుకొచ్చారు. దీనిపై ధర్మాసనం సూటిగా స్పందించింది. ‘‘చట్టం అమలు తాలూకు తీరుతెన్నులపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తామే తప్ప తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ కేసులో రాష్ట్రపతికి, గవర్నర్లకు గడువు విధిస్తూ సుప్రీం ధర్మాసనం వెలువరించిన నిర్ణయంపై కాదు. ఈ విషయంలో సలహాపూర్వక న్యాయపరిధికే పరిమితం అవుతాం తప్ప అపీల్ కోర్టులా వ్యవహరించబోం’’అని స్పష్టం చేసింది. సీజేఐ ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ ఉన్నారు. -
DCM పవన్ స్థాయిని తగ్గించి మరీ నారా లోకేష్ కు ఎలివేషన్
-
ప్రేమించడం నేరమా?: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ప్రేమించడం నేరం ఎలా అవుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ముస్లిం బాలికల కనీస పెళ్లి వయసుకు సంబంధించిన వ్యవహారంలో బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్(ఎన్సీపీసీఆర్) దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం మంగళవారం తోసిపుచ్చింది. పంజాబ్లో 21 ఏళ్ల ముస్లిం యువకుడు, 16 ఏళ్ల ముస్లిం బాలిక ప్రేమ వివాహం చేసుకున్నారు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఆ వివాహం చెల్లుతుందని పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు ఉత్తర్వు జారీ చేసింది. రజస్వల అయిన తర్వాత లేదా 15 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ముస్లిం బాలిక పెళ్లి చేసుకోవచ్చని వెల్లడించింది. దీన్ని సవాల్ చేస్తూ ఎన్సీపీసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఉత్తర్వును వ్యతిరేకిస్తూ జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) సైతం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.బి.నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. బాలిక, యువకుడి మధ్య అంగీకారంతోనే పెళ్లి జరిగిందని గుర్తుచేసింది. సమాజంలోని వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపింది. బాలబాలికలు ఒకచోట కలిసి చదువుకుంటున్నప్పుడు వారి మధ్య ఆకర్షణ ఏర్పడడం సహజమేనని పేర్కొంది. వారి మధ్య ప్రేమను నేరంగా పరిగణించడం సరైంది కాదని తేల్చిచెప్పింది. ఎన్సీడబ్ల్యూ పిటిషన్ను ధర్మాసనం తిరస్కరించింది. -
డాగ్ లవర్స్.. ఈ వీడియో చూడండి: ఆర్జీవీ
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కుక్కడ బెడద ఎక్కువైపోయింది. వీధి కుక్కల దాడిలో పలువురు యువకులు, చిన్న పిల్లలు తీవ్రంగా గాయపడుతున్నారు. దీంతో సుమోటోగా కేసు తీసుకున్న సుప్రీం కోర్టు.. 8 వారాల్లోగా నగరంలోని వీధి కుక్కలన్నింటిని షెల్టర్లకు తరలించాలని ఆగస్ట్ 11న ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు దీన్ని అడ్డుకోవాలని జంతు ప్రేమికులు ప్రయత్నిస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పుని పలువురు జంతు ప్రేమికులు తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా వేదికగా తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇందులో సదా, జాన్వీ కపూర్, సోనాక్షి సిన్హా లాంటి సినీ తారలు కూడా ఉన్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma ) వీరందరికి కౌంటర్ ఇస్తూ ఓ ట్వీట్ చేశాడు.వీధి కుక్కల దాడిలో చనిపోయిన ఓ చిన్నారికి సంబంధించిన వీడియోని ఎక్స్లో షేర్ చేస్తూ.. ‘సుప్రీంకోర్టు తీర్పుపై ఏడుస్తున్న డాగ్ లవర్స్ ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇక్కడ ఒక నగరం మధ్యలో పట్టపగలు నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి’ అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది. పలువురు నెటిజన్స్ ఆర్జీవీ పోస్ట్కి మద్దతు తెలుపుతున్నారు. గతంలో ఇలాంటివి చాలా జరుగాయంటూ ఆయా వీడియోలను షేర్ చేస్తున్నారు. To all the DOG LOVERS who are crying hoarse on the SUPREME court’s judgement on STRAY DOGS , please check this video , where a 4 year old boy was killed by street dogs in broad day light in the middle of a city pic.twitter.com/DWtVnBchvQ— Ram Gopal Varma (@RGVzoomin) August 16, 2025 -
హైకోర్టు కంటే సుప్రీం ఎక్కువ కాదు: సీజేఐ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాదిరిగానే హైకోర్టులు కూడా రాజ్యాంగ న్యాయస్థానాలేనని, ఇందులో ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ అనే తేడా లేదని ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. అదేవిధంగా, ఫలానా వ్యక్తినే న్యాయమూర్తిగా సిఫారసు చేయాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టులకు ఆదేశాలు ఇవ్వ జాలదని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ ప్రసంగించారు. సుప్రీంకోర్టులో పనిచేసే న్యాయవాదులను హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించే అంశాన్ని పరిశీలించాలంటూ అంతకుముందు బార్ అధ్యక్షుడు వికాస్ సింగ్ చేసిన వినతిపై ఆయనీ మేరకు స్పందించారు. ‘జడ్జీల నియామకంపై సిఫారసులు చేయాల్సింది ముందుగా హైకోర్టులే. హైకోర్టులు అందజేసిన పేర్లలో కొన్నిటిని మాత్రం మేం సిఫారసు చేస్తాం. తిరిగి మాకు అందిన జాబితాలోని వారు మాత్రమే జడ్జీలుగా నియమితులవుతారు’అని ఆయన తెలిపారు. -
కన్నడ హీరో దర్శన్కు బిగ్ షాక్.. పోలీసుల అదుపులో నటుడు!
కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్యకేసులో హీరో దర్శన్కు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్శన్ బెయిల్ సుప్రీం రద్దు చేయడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దర్శన్తో పాటు పవిత్ర గౌడను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. ఇలాంటి వారికి బెయిల్ ఇవ్వడం వక్రబుద్ధితో సమానమని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా... బెంగళూరులో జరిగిన రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, అతనితో పాటు ప్రియురాలు, నటి పవిత్ర గౌడ నిందితులుగా ఉన్నారు. జూన్ 11, 2024న పోలీసులు అరెస్టు చేశారు. పవిత్ర గౌడ అభిమానిగా చెప్పుకునే రేణుకస్వామి నటికి అసభ్యకరమైన సందేశాలు పంపాడని.. అతన్ని చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని ఆరోపణలొచ్చాయి. ఈ కేసులో దర్శన్తో పాటు పవిత్ర గౌడను కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. గతేడాది జూన్ 8న బెంగళూరులోని ఒక మురుగు కాలువలో రేణుకస్వామి మృతదేహం లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఐదు నెలలు జైలులో ఉన్న తర్వాత డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు దర్శన్కు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా సుప్రీం బెయిల్ రద్దు చేయడంతో మరోసారి దర్శన్ను జైలుకు పంపనున్నారు.అసలు ఏం జరిగిందంటే?పోలీసుల అభియోగాల ప్రకారం.. చాలెంజింగ్ స్టార్ దర్శన్కు వీరాభిమాని అయిన రేణుకాస్వామి నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. 2024 జూన్లో దర్శన్, అతని సహచరులు రేణుకాస్వామిని అపహరించి, బెంగళూరులోని షెడ్లో మూడు రోజుల పాటు హింసించారు. అనంతరం అతని శవాన్ని డ్రెయిన్లో పడేశారు. ఈ కేసులో దర్శన, పవిత్రగౌడ, మరో 15 మంది అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో వాళ్లకు అందిన వీఐపీ ట్రీట్మెంట్పైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో దర్శన్ను మరో జైలుకు మార్చారు. ఆపై వాళ్లు బెయిల్ మీద బయటకు వచ్చారు. #WATCH | UPDATE | Actor Darshan also arrested in connection with Renukaswamy murder case: S Girish, DCP Bengaluru South https://t.co/kR9PhVbM5n pic.twitter.com/uBPtC4eME3— ANI (@ANI) August 14, 2025#WATCH | Bengaluru, Karnataka | The Police arrest actor Pavitra Gowda after the Supreme Court cancelled the bail granted to her by the High Court in the Renukaswamy murder case. Visuals from outside of Pavithra Gowda's residence. pic.twitter.com/jqf56st025— ANI (@ANI) August 14, 2025 -
KSR: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి సంపూర్ణ బెయిల్..
-
నటుడు దర్శన్ కు బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
-
వీధికుక్కల తరలింపు తీర్పుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ: వీధికుక్కలను షెల్టర్లకు తరలించాలని ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు పునఃసమీక్షించనుంది. గురువారం ఈ అంశంపై విచారణ చేపట్టనుంది.దేశరాజధానిలో వీధికుక్కల స్వైరవిహారంతో విసిగిపోయిన సుప్రీంకోర్టు సోమవారం జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్ మహదేవన్ల ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. రేబిస్ వ్యాధి, కుక్క కాటు,ప్రజల భద్రత అంశాలను పరిగణనలోకి తీసుకుని ఢిల్లీ వీధుల్లో ఒక్క కుక్క కూడా కనిపించకూడదని, షెల్టర్లకు తరలించాలని స్పష్టం చేసింది. ఆదేశాలను అడ్డుకునే ఏ సంస్థ అయినా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.అదే సమయంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధుల్లో ఆహారం పెట్టే ప్రేమికులు, తమ ఇంట్లోనే పెట్టొచ్చుగా? అని కోర్టు ప్రశ్నించింది. రేబిస్తో ప్రాణాలు కోల్పోయిన వారిని తిరిగి తీసుకురాగలరా? అంటూ జంతు హక్కుల కార్యకర్తలపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధికుక్కలను దత్తత తీసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వొద్దని స్పష్టం చేసింది.అయితే, ఈ తీర్పుపై వివాదం చెలరేగింది. జంతు ప్రేమికులు ఈ తీర్పును సవాలు చేశారు. సుప్రీంకోర్టులో పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశారు. వీధికుక్కల షెల్టర్లకు తరలింపుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందించారు. ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునసమీక్షిస్తామని తెలిపారు.ఈ క్రమంలో బుధవారం ప్రధాన న్యాయమూర్తి గవాయ్ ఆదేశాల మేరకు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వీ అంజరియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును రేపు విచారించనుంది.#BREAKING Delhi Stray dog case referred to SC 3-judge bench.A 3-judge bench of the #SupremeCourt to hear the case tomorrow.This is different from the 2-judge bench.A bench of Justices Vikram Nath, Sandeep Mehta and NV Anjaria will hear the matter tomorrow. pic.twitter.com/o0RSdoXyXp— Kashmir Dot Com (KDC) (@kashmirdotcom) August 13, 2025 -
సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ నియమించిన ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్కు చెంపపెట్టు అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు(కేటీఆర్) అన్నారు.‘‘గతంలో బీజేపీ.. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ పంపిన ఇద్దరు ఎమ్మెల్సీ ప్రతిపాదనలకు అడ్డుపడితే, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రక్రియ పెండింగ్లో ఉండగానే మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. బీఆర్ఎస్ గతంలో నామినేట్ చేసిన బడుగు, బలహీనవర్గాలకు చెందిన దాసోజు శ్రవణ్, సత్యనారాయణల అభ్యర్థిత్వాలకు అడ్డుతగిలిన కాంగ్రెస్, బీజేపీల నిజస్వరూపం మరోసారి బట్టబయలైంది’’ అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ దుయ్యబట్టారు. ‘‘రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేని ఈ రెండు ఢిల్లీ పార్టీల అప్రజాస్వామిక విధానాలు ఎంతమాత్రం సాగనివ్వమని చాటిచెప్పిన గౌరవ న్యాయవ్యవస్థకు బీఆర్ఎస్ పక్షాన శిరస్సు వంచి సలాం చేస్తున్నాం’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ నియమించిన ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నిక చెల్లదని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్ కు చెంపపెట్టు. గతంలో బీజేపీ.. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ పంపిన ఇద్దరు ఎమ్మెల్సీ ప్రతిపాదనలకు…— KTR (@KTRBRS) August 13, 2025 -
కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ నియామకం రద్దు
ఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ గవర్నర్ కోటాలో కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకంపై తాత్కాలికంగా స్టేవిధించింది. గతంలో కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం బీఆర్ఎస్ నేతల పిటిషన్పై సుప్రీం ఇవాళ కీలక తీర్పును వెల్లడించింది. కోదండరామ్, అమీర్ అలి ఖాన్ల నియామకాల స్టేవిధించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.తీర్పు ఇలా వస్తుందని అనుకోలేదు: ఆమీర్ అలీ ఖాన్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియాకం రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పుపై ఆమీర్ అలీ ఖాన్ మీడియాతో మాట్లాడారు. ‘సుప్రీం కోర్టు ఈ విధమైన తీర్పు ఇస్తుందని అనుకోలేదు. కోర్టు ఆర్డర్ చదివిన తర్వాత అన్ని మాట్లాడుతాను. కొద్ది సేపటి క్రితమే సుప్రీం కోర్టులో జరిగిన విషయాల గురించి తెలుసుకున్నారు. నేను మొన్నటి వరకు జర్నలిస్టును. నాకు ఎలాంటి రాజకీయం బ్యాక్ గ్రౌండ్ లేదు. నాటి ప్రభుత్వ పెద్దలు ఇంకా ఏం మాట్లాడలేదు.ఇదే అంశంపై న్యాయ పోరాటం చేస్తాం’ అని అన్నారు. -
సాక్షి TV ప్రసారాల నిలిపివేతపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
-
కంచ గచ్చిబౌలి కేసు: తెలంగాణ ప్రభుత్వానికి ‘సుప్రీం’ ఆదేశాలు
న్యూఢ్లిల్లీ: తెలంగాణ ప్రభుత్వం పర్యావరణాన్ని, అభివృద్ధిని సమతుల్యం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కంచ గచ్చిబౌలి కేసు విచారణలో సుప్రీంకోర్టు సూచించింది. కంచ గచ్చిబౌలి భూముల్లో రేవంత్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యలపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యావరణాన్ని, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రతిపాదనలు తీసుకురావాలన్నారు. ఈ సమస్యకు సంతోషకరమైన ముగింపు పలకాలన్నారు. అలాగే అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని జస్టిస్ బీఆర్ గవాయి పేర్కొన్నారు.పర్యావరణాన్ని కాపాడితే అన్ని ఫిర్యాదులు ఉపసంహరిస్తామని, అప్పుడు తాము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతామని జస్టిస్ అన్నారు. పర్యావరణాన్ని, అభివృద్ధిని సమతుల్యం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సుప్రీం సూచనల దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రతిపాదనలు తీసుకొచ్చేందుకు ఆరు వారాల సమయం కావాలని సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ కోరారు.హైదరాబాద్ లోని కంచ గచ్చిబౌలి ప్రాంతంలో ఐటీ పార్క్ అభివృద్ధి కోసం చెట్లను నరికివేయడం, వన్యప్రాణులను మరో ప్రాంతానికి తరలించడం లాంటి చర్యలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఇప్పటికే రెండుసార్లు జరిగిన వాదనల్లో చెట్లను నరికిన వంద ఎకరాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టాలని సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారులకు జైలుశిక్ష తప్పదని హెచ్చరించింది. పునరుద్ధరణ పనులకు సంబంధించి ప్రణాళికను కోర్టుకు సమర్పించాలని కోరింది. -
ఒకే మాటపై నలుగురు గాంధీలు.. ఏ విషయంలోనంటే..
న్యూఢిల్లీ: నలుగురు గాంధీలు.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వరుణ్ గాంధీ, మేనకా గాంధీ.. వీరంతా ఒక విషయంలో ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలా నలుగురూ ఒకే మాటకు కట్టుబడి ఉండటమనేది అరుదుగా జరిగింది. ఇంతకీ ఆ నలుగురు గాంధీలు ఏ విషయంలో ఏకతాటిపైకి వచ్చారు?రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్లో వీధి కుక్కలను తొలగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, వరుణ్ గాంధీ, మేనకా గాంధీలు వ్యతిరేకించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ తరహా సుప్రీం ఆదేశాన్ని దశాబ్దాల మానవీయ విధానం నుండి వెనక్కి తగ్గడమని అభివర్ణించారు. రాహుల్ తన ‘ఎక్స్’ పోస్టులో సుప్రీం కోర్టు నిర్ణయం మనలోని కరుణను తొలగిస్తుందని పేర్కొన్నారు. షెల్టర్లు, స్టెరిలైజేషన్, టీకాలు వేయడం మొదలైన చర్యలు వీధి శునకాలను సురక్షితంగా ఉంచగలవన్నారు. ఇదే అంశంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ, ఢిల్లీ నగరంలోని అన్ని వీధి కుక్కలను వారాల వ్యవధిలో ఆశ్రయాలకు తరలించడ మనేది అమానవీయ ప్రవర్తనకు దారితీస్తుంది. వాటిని ఉంచేందుకు తగినన్ని ఆశ్రయాలు కూడా లేవన్నారు. First time in my life, I’m not just sharing his post, I’m fully supporting him on this issue. ❤️.@RahulGandhi Ji, thank you for standing up for these innocent dogs. ❤️🙏 pic.twitter.com/0VedWX6uNQ— Gyan Jara Hatke (@GyanJaraHatke) August 12, 2025బీజేపీ మాజీ ఎంపి వరుణ్ గాంధీ ఇదే అంశంపై మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాన్ని క్రూరత్వాన్ని సంస్థాగతీకరించడంతో పోల్చారు. తమను తాము రక్షించుకోలేని వాటిని(కుక్కలను) శిక్షించడానికి చట్టపరంగా చేసి సూచన అని అన్నారు. వీధి ఆవులు, కుక్కలను తరలిస్తే, ప్రభుత్వం నుంచి సానుభూతి నుండి వైదొలిగినట్లేనని, అలాంటప్పుడు తీవ్ర నైతిక సంక్షోభాలు ఎదురవుతాయని వరుణ్ గాంధీ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. మాజీ కేంద్ర మంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ ఈ ఉత్తర్వులను ఆచరణీయం కాదన్నారు. ఇది పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. -
సుప్రీంకోర్టులోనూ వీధికుక్కల సంచారం
న్యూఢిల్లీ: దేశరాజధానిలో వీధికుక్కల స్వైరవిహారంతో విసిగిపోయిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని షెల్టర్లకు తరలించాలని ఆదేశాలిచ్చిన మరుసటిరోజే మరోసారి వాటి ప్రస్తావన తెచ్చింది. సుప్రీంకోర్టు ప్రాంగణంలోనూ వీధికుక్కల బెడద ఎక్కువగా ఉందని అసహనం వ్యక్తంచేసింది. మిగిలిపోయిన ఆహారాన్ని మూతలున్న చెత్తబుట్టలో పడేయకుండా కోర్టుకాంప్లెక్స్లో ఎక్కడపడితే అక్కడ పడేయడంతో ఈ సమస్య తీవ్రతరమైందని ఆగ్రహం వ్యక్తంచేసింది.ఢిల్లీ–జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్) పరిధిలోని వీధి శునకాలను కచ్చితంగా షెల్టర్లకు తరలించాలంటూ మంగళవారం జారీచేసిన ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు భవన పరిస్థితినీ ధర్మాసనం ప్రస్తావించింది.‘‘ సుప్రీంకోర్టుకు వచ్చి ప్రతి ఒక్కరూ తాము వెంట తీసుకొచ్చిన, కొనుగోలుచేసిన ఆహారం మిగిలిపోతే దానిని కచ్చితంగా మూసిఉన్న డస్ట్బిన్లోనే పడేయండి. ఇష్టమొచ్చిన చోట పడేస్తే దానిని తినేందుకు వీధికుక్కలు సుప్రీంకోర్టు ప్రాంగణమంతా సంచరిస్తున్నాయి. కారిడార్లు మొదలు లిఫ్ట్ల దాకా ప్రతిచోటా వీధి శునకాలు కనిపిస్తున్నాయి. కుక్క కాట్ల నుంచి తప్పించుకోవాలంటే వాటికి ఆహారం దొరక్కుండా మూతలున్న చెత్తబుట్టలో పడేయండి.బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పడేయకండి. ఆహారం లభించకపోవడంతో అవి ఇక సుప్రీంకోర్టు ప్రాంగణాలకు రావడం మానేస్తాయి. కుక్క కాటు ముప్పు తప్పుతుంది. కోర్టుకు వచ్చి ప్రతి ఒక్కరి సహకారంతో న్యాయస్థానం పరిసరాలు వీధికుక్కల కాట్ల నుంచి సురక్షితంగా ఉంటాయి’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. -
ఆధార్ ఓటర్ ఐడీ పౌరసత్వ రుజువులు కావు!
న్యూఢిల్లీ: పౌరసత్వ రుజువులకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా పదిహేనేళ్లకు పైగా అన్ని రకాల అవసరాలకూ ఏకైక గుర్తింపు కార్డుగా చెలామణిలో ఉన్న ఆధార్, ఓటు హక్కుకు గుర్తింపు అయిన ఓటర్ కార్డు రెండూ పౌరసత్వానికి రుజువులు కాబోవని కుండబద్దలు కొట్టింది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వైఖరి, వాదన సరైనవేనని స్పష్టం చేసింది. ‘‘పౌరసత్వానికి ఆధార్ పూర్తిస్థాయి రుజువు కాబోదు. దాన్ని ఇతరత్రా మార్గాల ద్వారా నిర్ధారణ చేసుకోవడం తప్పనిసరి’’ అని న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఐఆర్) పేరిట భారీగా ఓట్లను తొలగిస్తున్నారంటూ దాఖలైన కేసుల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. అదే సందర్భంలో బిహార్లో ఎన్నికల జాబితా ధ్రువీకరణకు ఈసీకి ఉన్న అధికారాలపై కీలక ప్రశ్నలు కూడా లేవనెత్తింది. దీన్ని ముందుగా తేల్చాల్సి ఉంటుందని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ‘‘ఈసీకి ఓటర్ల జాబితా ధ్రువీకరణ అధికారమే గనక లేనిపక్షంలో ఈ వ్యవహారం ఇక్కడితో ముగిసిపోయినట్టే అన్నారు.ఎస్ఐఆర్ ముసుగులో బిహార్లో ఈసీ తలపెట్టిన కసరత్తు కారణంగా భారీ సంఖ్యలో ఓటర్లు జాబితా నుంచి గల్లంతవుతున్నారని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ముఖ్యంగా ఈసీ తాజాగా కోరుతున్న డాక్యుమెంట్లు సమర్పించని వారంతా ఓటు హక్కు కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వెలిబుచ్చారు. ‘‘అప్పుడెప్పుడో 2003 నాటి ఓటర్ల జాబితాలో ఉన్నవారు కూడా తాజాగా ఈసీ కోరిన అన్ని పత్రాలూ సమర్పించడాన్ని తప్ప నిసరి చేశారు.అలా చేయ ని వాళ్ల పేర్లను నాటికీ, నేటికీ వారి చిరునామాలతో సహా ఎలాంటి మార్పు లూ లేకపోయినా సరే ఓటర్ల జాబితా నుంచి తీసేస్తున్నారు. బిహార్లో 7.24 కోట్ల మంది తాజాగా కోరిన పత్రాలు సమర్పించినట్టు ఈసీ జాబితా వెల్లడిస్తోంది. అయినా సరే, ఏకంగా 65 లక్షల మందిని సరైన విచారణ కూడా లేకుండానే మృతులు, వలసదారులుగా ముద్ర వేసి జాబితా నుంచి తొలగించేశారు!’’ అంటూ సిబల్ వాదించారు. పైగా ఈ విషయంలో శాస్త్రీయమైన సర్వే ఏదీ చేపట్టలేదని అఫిడవిట్ సాక్షిగా ఈసీయే అంగీకరించిందని ధర్మాసనానికి విన్నవించారు. వాస్తవాలా, ఊహలా: ధర్మాసనం బిహార్లో తాజాగా 65 లక్షల ఓట్లు తొలగించారనేందుకు ప్రాతిపదిక ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనర్ల సందేహాలు, ఆందోళనలు వాస్తవికమా, లేక కేవలం ఊహాజనితాలా అని తెలుసుకోగోరింది. బిహార్లో 2025 జాబితాలో 7.9 కోట్ల ఓటర్లున్నట్టు సిబల్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘వారిలో 4,9 కోట్ల మంది 2003 నాటి ఓటరు జాబితాలోనూ ఉన్నారు. అందులో 22 లక్షల మందిని మృతులుగా నమోదు చేశారు’’ అన్నారు. మృతి, చిరునామా మార్పు కారణంగా ఓటర్ల జాబితా నుంచి మినహాయించిన వారి పేర్లను కోర్టుకు గానీ, వెబ్సైట్లో గానీ ఈసీ అందుబాటులో ఉంచలేదని మరో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు.‘‘అడిగితే, దీనికి సంబంధించి బూత్ స్థాయి ఏజెంట్లకు ఏదో సమాచారం ఇచ్చామంటూ ఈసీ పొంతన లేని సమాధానం చెబుతోంది. అసలు ఇలాంటి సమాచారాన్ని ఎవరికైనా ఇవ్వాల్సిన అవసరమే తమకు లేదని బుకాయిస్తోంది’’ అంటూ ఆక్షేపించారు. ఆధార్, రేషన్ కార్డులను గుర్తింపు కార్డుగా జోడిస్తూ సమర్పించే పత్రాలను ఇతరత్రా మార్గాల ద్వారా ధ్రువీకరించుకోవడం ఈసీ బాధ్యత అని ధర్మాసనం పేర్కొంది. ఓటర్ల జాబితా నుంచి తొలగించడం వంటి కీలక నిర్ణయానికి వచ్చేముందు మిస్సింగ్ డాక్యుమెంట్లకు సంబంధించి బాధ్యులకు ముందుగా సమాచారమిచ్చారా లేదా అని ఈసీని ప్రశ్నించింది. -
హైకోర్టు జడ్జీలు ఎవరికంటే తక్కువకారు
సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కంటే తక్కువకాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయమూర్తులపై నిరాధారంగా, అసభ్యకరంగా ఆరోపణలు చేసే ధోరణి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ మౌషుమి భట్టాచార్యపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కక్షిదారు పెద్దిరాజు, ఆయన తరఫు న్యాయవాదులు బేషరతు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది.ఒక వారంలోపు క్షమాపణ పిటిషన్ సమర్పించాలని, ఆ తర్వాత హైకోర్టు న్యాయమూర్తి ఆ క్షమాపణను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. సోమవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ అతుల్ ఎస్.చందుర్కర్తో కూడిన ధర్మాసనం ఈమేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘ఇటీవలి కాలంలో కారణం లేకుండా హైకోర్టు, ట్రయల్ కోర్టు జడ్జీలను విమర్శించే అలవాటు పెరిగింది. హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు జడ్జీలతో సమాన రక్షణ పొందుతారు.రాష్ట్రంలో రాజకీయ నాయకుడిపై కేసు ఉంటే ఆ రాష్ట్రంలో న్యాయం దొరకదని భావించి పిటిషనర్ ఆ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరే సంస్కృతి పెరిగింది’అని ధర్మాసనం పేర్కొంది. కాగా సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పులను మార్చగలిగినా, హైకోర్టు న్యాయమూర్తులపై పరిపాలనా నియంత్రణ లేదని చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తులపై చేసిన ఆరోపణలు అవమానకరంగా ఉన్నాయని, వీటిని సహించలేమని హెచ్చరించింది. ‘లాయర్లను శిక్షించడం కోర్టులకు ఆనందం కాదు. కానీ కోర్టుల వ్యవహారంలో జోక్యం చేసుకునేలా వ్యవహరిస్తే ఏమాత్రం సహించం’అని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. కేసును మళ్లీ తెరవండి ప్రస్తుత కేసు సీఎం రేవంత్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద నమోదైన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేయడంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తిపై పక్షపాతం, తప్పుడు ప్రవర్తన ఆరోపణలు చేస్తూ ఎన్.పెద్దిరాజు సుప్రీంకోర్టులో ట్రాన్స్ఫర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను జూలై 29న సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే న్యాయమూర్తిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు పిటిషనర్, ఆయన తరఫు న్యాయవాదులకు కంటెప్ట్ నోటీసులు జారీ చేసింది. కాగా సుప్రీంకోర్టు 1954లో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సీజేఐ ధర్మాసనం ప్రస్తావించింది.ఇలాంటి అవమానకర, అసభ్యకర ఆరోపణలకు పిటిషనర్ మాత్రమే కాకుండా, పిటిషన్పై సంతకం చేసిన న్యాయవాదులు కూడా సమాన బాధ్యత వహించాలన్నది ఆ తీర్పు సారాంశమని ధర్మాసనం గుర్తు చేసింది. హైకోర్టు న్యాయమూర్తికి క్షమాపణ చెప్పడం సరైనదని భావిస్తూ, కేసు మళ్లీ తెరిచి న్యాయమూర్తి ముందుంచాలని హైకోర్టు రిజి్రస్టార్ జనరల్ను ఆదేశించింది. ఒక వారం లోపు క్షమాపణ సమర్పించాలని, ఆ తర్వాత మరో వారం లోపు న్యాయమూర్తి ఆ క్షమాపణపై నిర్ణయం తీసుకోవాలని సీజేఐ చెప్పారు. కాగా పిటిషనర్ పెద్దిరాజు తరపున సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే బేషరతు క్షమాపణ పిటిషన్ సమర్పించారు. -
ఢిల్లీ వీధి కుక్కల వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్
-
కబుతర్ జా జా జా!
హైదరాబాద్ చాలా పెద్ద నగరం. కానీ..అబిడ్స్, కింగ్ కోఠీ, అమీర్పేట్ సర్కిల్తోపాటు కొన్ని చోట్ల ఒక దృశ్యం మాత్రం కామన్!ఏమిటయ్యా అదీ అంటే.. టూవీలర్స్, కార్లలో వచ్చి మరీ కొందరు పావురాలకు గింజలు వేస్తూంటారు!నిన్న మొన్నటివరకూ ఇలాంటి దృశ్యాలు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కనిపించేవి కానీ.. ఇకపై కాదు!ఎందుకంటారా? చదివేయండి..పావురాలకు కాసిన్ని గింజలు వేయడం హైదరాబాద్, ముంబైల్లో మాత్రమే కాదులెండి.. దేశంలోని చాలా నగరాల్లో సర్వసాధారణంగా జరిగే విషయమే. జీవకారుణ్యానికి ఇదో పెద్ద నిదర్శనంగా చాలామంది పోజులు కొడుతూంటారు. ఆ పావురాలతో కలిసి రీల్స్ చేస్తూ కనిపిస్తారు. అయితే పది రోజుల క్రితం ముంబై హైకోర్టు ఈ తంతుకు ఫుల్స్టాప్ పెట్టమని స్పష్టం చేస్తూ ఆదేశాలిచ్చింది. ఎవరైనా మాట వినకపోతే.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టమని కూడా చెప్పింది. పిచ్చుకపై బ్రాహ్మాస్త్రం అన్నట్టు పావురాలకు తిండిపెడితే క్రిమినల్ కేసులు ఎందుకు అనుకుంటున్నారా? అయితే మీరు ఈ పావురాలతో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవాల్సిందే. పావురాల వ్యర్థాల దగ్గరే ఉన్నందుకు ఈ మధ్యే గుజరాత్లోని 42 ఏళ్ల మహిళ ఊపిరితిత్తి మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో పదకొండేళ్ల బాలుడు పావురాల ఈకలను తట్టుకోలేక న్యుమోనిటిస్కు గురయ్యాడు. ముంబైలోనూ 2020లో ఇద్దరు మహిళలకు ఈ పావురాల కారణంగా ఊపిరితిత్తులు మార్చాల్సి వచ్చింది. అంత సమస్య ఉందన్నమాట ఈ పావురాలతో. ఏదో ముద్దుగా ఉంటాయి. కువకువలాడుతూంటే ముచ్చటేస్తుందని అనుకుంటాం కానీ... వాటితోపాటు వచ్చే ఆరోగ్య సమస్యలను మాత్రం విస్మరిస్తూంటాం. కావాల్సినంత తిండి ఫ్రీగా దొరుకుతూంటే అవి కూడా ఎప్పటికప్పుడు తమ సంతతిని పెంచుకుంటూ పోతున్నాయి. మరిన్ని చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. భవనాల పిట్టగోడలపై, చిన్న చిన్న కంతల్లోకి చేరే పావురాలు అక్కడ వ్యర్థాలను వదులుతూంటాయి. ఎండకు ఎండిన ఈ వ్యర్థాల్లోంచి పుట్టుకొచ్చే ఫంగస్ గాల్లోకి చేరుతుంది. ఆ గాలిని పీల్చిన వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుందన్నమాట. మీరు తరచూ జలుబులాంటి సమస్యలు ఎదుర్కొంటూంటే... లేదా ఊపిరితిత్తుల సమస్య ఉన్నా, తరచూ ఫుడ్పాయిజనింగ్కు, జీర్ణకోశ వ్యాధుల బారిన పడుతున్నా... మీ చుట్టుపక్కల పావురాలు ఎక్కువగా ఉన్నయేమో ఒక్కసారి చూసుకోండి మరి! ఇందుకే ముంబై హైకోర్టు పావురాలకు తిండిపెట్టే వారిపై క్రిమినల్ కేసులు పెట్టమని ఆదేశించింది. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందండోయ్..ముంబై హైకోర్టు ఆదేశాలకు అక్కడి జైన సమాజం తీవ్రంగా వ్యతిరేకించింది. నోరులేని మూగ జీవాలకు ఆహారం వేయడం తమ మత ధర్మం అంటూ వారు వీధుల్లోకి వచ్చారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తాము పావురాలకు గింజలు వేసి తీరతామని ఎంత జరిమానా వేసిన భరిస్తామని కూడా తేల్చి చెప్పారు. ఈ విషయం అక్కడితో ఆగలేదు. ముంబై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు చేరింది. ఈ కేసును సోమవారం విచారించిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయిల బెంచ్... హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ పిటిషన్ను కొట్టి వేసింది. హైకోర్టు తీర్పులో ఏదైనా సవరణలు కావాలనుకంటే అక్కడికే వెళ్లాలని స్పష్టం చేసింది. చూడాలి ఏమవుతుందో.::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
-
దర్శన్, పవిత్ర బెయిలు బంతి.. సుప్రీంకోర్టులో
యశవంతపుర: రేణుకాస్వామి హత్య కేసులో నిందితులు నటీనటులు దర్శన్, పవిత్రాగౌడ బెయిల్ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారించిన కోర్టు తీర్పును రిజర్వు చేసింది. బెయిలు రద్దు చేయరాదని ఇరువురి తరఫు వకీళ్లు లిఖితపూర్వకంగా వాదనలను సమర్పించారు. హైకోర్టు ఇచ్చిన బెయిలును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడం తెలిసిందే. ఇరువైపులా న్యాయవాదుల బలమైన కారణాలను పేర్కొన్నారు. అసలు రేణుకాస్వామిని అపహరించినట్లు, హత్య చేసినట్లు దర్శన్పై ఎలాంటి ఆధారాలు లేవని ఆయన లాయర్లు పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వ వాదనలు ఇలా ప్రభుత్వ న్యాయవాదుల వాదనల్లో.. మృతుడు రేణుకాస్వామి దర్శన్ అభిమాని. దర్శన్ పవిత్రాగౌడతో సహజీవనం చేస్తున్నాడని కోపగించి అవహేళన సందేశం పంపాడని రేణుకాస్వామిని అపహరించి బెంగళూరులో పట్టణగెరె వద్ద ఒక షెడ్డులో హత్య చేశారు. నిందితులందరూ హత్య చేసిన స్థలంలో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అక్కడి మట్టి నమూనాలు అందరి పాదరక్షలలోను ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది అంటూ పలు కారణాలను పేర్కొన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. -
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించిది. భారత సైన్యం గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 వేల కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని మీరు (రాహుల్)ఎలా చెబుతున్నారని కోర్టు ప్రశ్నించింది. భారత్ జోడోయాత్రలో రాహుల్ గాంధీ ఆర్మీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఉదయ్ శంకర్ అనే వ్యక్తి పరువు నష్టం దావా కింద క్రిమినల్ కేసు వేశారు. అయితే ఈ ఫిర్యాదులో విచారణ పై స్టే విధించాలంటూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏసీ మాసిహ్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు రాహుల్ వ్యాఖ్యలను అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందనే విషయం మీకెలా తెలుసని ప్రశ్నించింది. ప్రతిపక్షనేత హోదా కలిగిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని హెచ్చరించింది. నిజమైన భారతీయులు ఇలాంటి వ్యాఖ్యలు చేయరని మండిపడింది.కాగా గతంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా..2,000 కిలోమీటర్లకు పైగా భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. 2020 జూన్లో లబ్దఖ్లోని గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణ అనంతరం, మోదీ ప్రభు త్వం చైనాకు లొంగిపోయిందని, 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని డ్రాగన్ దేశం చట్టవిరుద్ధంగా ఆక్రమించిందని ఆరోపించారు. అయితే రాహుల్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, వాదనలు వినిపించారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. ఏదైనా సమస్య లేదా విషయంపై మాట్లాడాలంటే పార్లమెంటులోనే మాట్లాడాలని.. సోషల్ మీడియాలో కాదని మండిపడింది. ఈ కేసులో విచారణను నిలిపివేసినప్పటికీ.. రాహుల్కు మాత్రం నోటీసులు జారీచేసింది. -
కేఏ పాల్ పిటిషన్.. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు ‘సుప్రీం’ నోటీసులు
ఢిల్లీ: బెట్టింగ్ యాప్లను నిషేధించాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. బెట్టింగ్ యాప్ల నిషేధంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 18కి వాయిదా వేసింది. అయితే, గత విచారణలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినా కౌంటర్ దాఖలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.కేంద్రం వైఖరి తెలుసుకునేందుకు మరొక అవకాశం ఇస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. బెట్టింగ్ యాప్ల నిషేధంపై కేంద్రం సమర్థిస్తుందా?. వ్యతిరేకిస్తుందా? ఎలాంటి యంత్రాంగాన్నీ ఏర్పాటు చేస్తుందో చూద్దామంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణలో మధ్యంతర ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.సినిమా హీరోలు, సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లను ఎండార్స్ చేయకుండా నిషేధం విధించేలా మద్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కేఏ పాల్ కోరారు. బెట్టింగ్ యాప్లు కారణంగా కోట్లాదిమంది యువకులు నష్టపోతున్నారని సుప్రీంకోర్టు దృష్టికి కేఏ పాల్ తీసుకువచ్చారు. -
BRS ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్
-
సుప్రీంకోర్టు తీర్పుపై కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని నిరూపించిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు అంటూ ఆయన ట్వీట్ చేశారు.గత ఎన్నికల సందర్భంగా పాంచ్ న్యాయం పేరుతో పార్టీ మారితే ఆటోమేటిక్గా అనర్హత వర్తించాలని చెప్పిన రాహుల్ గాంధీ.. సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తారని ఆశిస్తున్నాను. రాహుల్ గాంధీ చెప్పే మాటలకు, నీతులకు కట్టుబడి ఉండాలి. దమ్ముంటే, నిజాయితీ ఉంటే అనర్హత వేటు విషయంలో పంచ న్యాయ పేరుతో చెప్పిన నీతులను ఆచరణలో చూపించాలంటూ రాహుల్ గాంధీకి కేటీఆర్ సవాల్ విసిరారు.రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని మరింత కాలం అవహేళన చేయలేరు. పార్టీ మారిన పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారణ అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో ప్రతిరోజు పాల్గొంటున్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన వెంటనే అనర్హత విధిస్తూ నిర్ణయం తీసుకోవాలి. బీఆర్ఎస్ తరపున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయ బృందానికి ధన్యవాదాలు.BRS welcomes the decision of the Honorable Supreme Court and we thank the Honorable CJI for ensuring that the democratic structure of this country isn't eroded by malicious methodsI hope @rahulgandhi who in his Panch Nyay advocated for stronger anti-defection laws and automatic…— KTR (@KTRBRS) July 31, 2025పార్టీ తరఫున ఎన్నికైన 10 ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగి పార్టీ మారినా.. కష్టకాలంలో పార్టీ వెంట నిలిచిన లక్షల మంది కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పిన కేటీఆర్.. రానున్న మూడు నెలల కాలంలో 10 నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమవుతుందన్నారు. ఈ దిశగా పని చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చిన కేటీఆర్.. అంతిమంగా సత్యం ధర్మం గెలిచిందని కేటీఆర్ అన్నారు. -
'నేరమే'.. అయినా! సుప్రీంకోర్టు సైతం..
న్యాయ విచారణలో తీర్పులెప్పుడూ బలహీనుల పక్షమే ఉండాలి... నేరానికి బలైనా, నేరం చేసినా! ఆ బలహీనుల వర్గంలో పిల్లలు, మహిళలు ముందుంటారు! అందుకే... హనీమూన్ మర్డర్ మొదలు ఆడవాళ్లు చేసినట్టుగా నమోదవుతున్న ఆ తరహా నేరాల విషయంలో వాటి వెనుకున్న సామాజిక ఒత్తిళ్ల మీద చర్చ జరగాలి.. ఆ వాతావరణాన్నివిశ్లేషించాలని సోషల్ ఇంజినీర్స్, సైకాలజిస్ట్లు అంటున్నారు. వాటిని సుప్రీంకోర్ట్ కూడా పరిగణనలోకి తీసుకుంది. తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్న అమ్మాయిలు దాన్నుంచితప్పించుకోవడానికి చేసిన నేరాలను ప్రస్తావిస్తూ ఇటీవలే ఓ అభిప్రాయాన్ని వెల్లడించింది.సమాజంలోని లింగవివక్ష, సామాజిక నిబంధనలు చాలావరకు స్త్రీని పరాయిగా చూస్తూ.. స్వేచ్ఛాస్వాతంత్య్రాలను దూరం చేస్తూ ఆమెను నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తున్నాయి. ఈ అణచివేత, నిస్సహాయతే నేరాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి సామాజిక నేపథ్యంతో నేరం చేసిన స్త్రీల విషయంలో కఠినమైన శిక్షలకన్నా సంస్కరణ దృక్పథాన్ని అనుసరించాలని ఉద్ఘాటించింది సుప్రీం కోర్ట్.ఈ నిర్ణయానికి ప్రధాన నేపథ్యం.. కర్ణాటకకు చెందిన శుభ అనే కాలేజ్ స్టూడెంట్.. తన స్నేహితుడు అరుణ్ వర్మతోపాటు వెంకటేశ్, దినేశ్ అనే ఇంకో ఇద్దరు వ్యక్తులతో కలిసి తన కాబోయే భర్తను హత్య చేసింది. నిజానికి శుభకు ఆ పెళ్లి ఇష్టంలేదు. అయినా తల్లిదండ్రులు బలవంతపెట్టడంతో ఆ విషయాన్నే తన స్నేహితుడు అరుణ్కి చెప్పి, పెద్దలు నిశ్చయించిన ఆ వరుడి హత్యకు కుట్ర పన్నింది. ఈ కేస్ పూర్వపరాలను పరిశీలించిన సుప్రీంకోర్ట్.. ‘లింగవివక్ష, ఏళ్ల నుంచి పాతుకుపోయిన జెండర్ రోల్స్ వంటివన్నీ మహిళల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు సంకెళ్లుగా మారుతూ వారిని అణచివేస్తున్నాయి. అది వాళ్లలో ధిక్కార ప్రవర్తనకు కారణమవుతోంది. ఫలితంగా నేరాలకు పాల్పడుతున్నారు. ఆధునిక మహిళలు చాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ హక్కును ఆస్వాదించాలనుకుంటున్నారు. ఉదాహరణకు.. చదువుకున్న అమ్మాయి ‘ఆశలు’ అనే రెక్కలు తొడుక్కోవాలనుకుంటుంది. ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటుంది. ఈ క్రమంలో బలవంతపు పెళ్లి తన జీవిత లక్ష్యానికి విడాకులు ఇప్పిస్తుంది. పై చదువులకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటుంది. ఇది కచ్చితంగా ప్రతి చర్యకు దారితీస్తుంది. అయితే ఈ రియాక్షన్స్ మహిళ మహిళకు మారుతుంటాయి.. వాళ్ల నేపథ్యం, స్నేహాలను బట్టి. ఉదాహరణకు మధ్యతరగతికి చెందిన అమ్మాయి.. పేదింటి లేదా ధనిక కుటుంబపు అమ్మాయిల కంటే భిన్నంగా రియాక్ట్ కావచ్చు. తీసుకునే నిర్ణయాన్ని అది ప్రభావితం చేయొచ్చు’ అని విశ్లేషించింది. నేరస్తులు అందరిపట్లా...స్త్రీలకు సంబంధించి.. నేరానికి ఉసిగొల్పిన సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నేరస్థుల సంస్కరణ దిశగా తీర్పులు ఉండాలన్న సుప్రీంకోర్ట్ అభిప్రాయం హర్షించదగ్గది. అయితే దాదాపుగా నేరాలన్నిటికీ సామాజిక పరిస్థితులే కారణాలుగా ఉంటాయి. నేరస్థుల అందరిపట్లా ఇలాంటి అప్రోచే ఉండాలి. శిక్ష తర్వాత సమాజంలోకి వచ్చిన వాళ్లను సానుకూల దృక్పథంతో చూడాలి. సహానుభూతి ఉండాలి. – ప్రొఫెసర్ బీనా చింతలపురిసంస్కరించడమే పరిష్కారంమన దేశంలో చాలామంది మహిళలు పిల్లల కోసమో, విడాకులకు సొసైటీలో యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్లో, అవమానాలు, అపవాదులకు జడిసో, ఆర్థిక స్వాతంత్య్రం లేకనో వైవాహిక జీవితంలోని హింసను మౌనంగా భరిస్తూన్నారు. భరించలేని కొందరు మాత్రం విపరీత చర్యలకు ఒడిగడుతున్నారు. ఇది కలవరపరచే అంశమే! వారి ఆ చర్యలకు సామాజిక నిర్లక్ష్యం, అన్యాయం, వాళ్లను అర్థం చేసుకోకపోవడమే కారణాలుగా తోస్తున్నాయి. వెఫల్యం చెందిన వ్యవస్థలను సంస్కరించడమే దీనికి పరిష్కారం. కుటుంబం ముఖ్యంగా మగవాళ్లు అమ్మాయిల పట్ల సహానుభూతితో వ్యవహరించాలి. కెరీర్, పెళ్లి, పిల్లలు లాంటి విషయాల్లో వాళ్ల నిర్ణయాలను గౌరవించి ఆమోదించాలి. మద్దతుగా నిలవాలి.– రాజ్ రాచకొండ, సినీ దర్శకుడుకారణాలను పరిగణించాలి... సామాజిక, కుటుంబ ఒత్తిళ్లు మహిళలు/అమ్మాయిల స్వేచ్ఛను అడ్డుకోవడమేకాక వాళ్లను నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తున్నాయి. ఇవి కొన్నిసార్లు నేరాలకు దారితీయొచ్చు. కాబట్టి వారిలో పరివర్తన తీసుకురావడం ఎంత అవసరమో.. ఆ సామాజిక పరిణామాలను పరిగణనలోకి తీసుకుని వారికి క్షమాభిక్ష పెట్టడమూ అంతే అవసరమంటూ సుప్రీంకోర్టు చేసిన సిఫార్సు ఆహ్వానించదగినది. అలాగని సుప్రీంకోర్టు నేరాన్ని సమర్థించట్లేదు. నేరస్థులను చంపితే నేరం చావదని, నేరస్థుల పరివర్తన మీద దృష్టిపెట్టి.. నేర స్వభావానికి కారణమైన సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చెబుతోంది. ఉద్దేశపూర్వకంగా చేసిన నేరానికీ, నిస్సహాయ స్థితిలో ఒక అమ్మాయి చేసిన నేరానికి చాలా తేడా ఉంటుంది. రెండింటిలో శిక్ష ఒకే మాదిరిగా ఉన్నప్పటికీ, వారిలో తేవాల్సిన పరివర్తన ధోరణి, అలాగే క్షమాభిక్ష పెట్టేప్పుడు పరిగణించాల్సిన అంశాలు వేరేగా ఉండాలి.– మామిడి సుధేష్ణ, హైకోర్ట్ అడ్వకేట్సంస్కరించడమే పరిష్కారంమన దేశంలో చాలామంది మహిళలు పిల్లల కోసమో, విడాకులకు సొసైటీలో యాక్సెప్టెన్స్ లేక΄ోవడం వల్లో, అవమానాలు, అపవాదులకు జడిసో, ఆర్థిక స్వాతంత్య్రం లేకనో వైవాహిక జీవితంలోని హింసను మౌనంగా భరిస్తూన్నారు. భరించలేని కొందరు మాత్రం విపరీత చర్యలకు ఒడిగడుతున్నారు. ఇది కలవరపరచే అంశమే! వారి ఆ చర్యలకు సామాజిక నిర్లక్ష్యం, అన్యాయం, వాళ్లను అర్థం చేసుకోకపోవడమే కారణాలుగా తోస్తున్నాయి. వెఫల్యం చెందిన వ్యవస్థలను సంస్కరించడమే దీనికి పరిష్కారం. కుటుంబం ముఖ్యంగా మగవాళ్లు అమ్మాయిల పట్ల సహానుభూతితో వ్యవహరించాలి. కెరీర్, పెళ్లి, పిల్లలు లాంటి విషయాల్లో వాళ్ల నిర్ణయాలను గౌరవించి ఆమోదించాలి. మద్దతుగా నిలవాలి.– రాజ్ రాచకొండ, సినీ దర్శకుడు (చదవండి: కండలు తిరిగిన వైద్యురాలు..! ఏకంగా 600కి పైగా..) -
ఎమ్మెల్యేల ఫిరాయింపుపై సుప్రీం తుది తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్ర్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడు నెలల్లోగా ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అనే పరిస్థితిని అంగీకరించమని ధర్మాసనం స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ బి ఆర్. గవాయి ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ.. తెలంగాణ హైకోర్టు తీర్పును కొట్టివేసింది.పదో షెడ్యూల్ కింద స్పీకర్కురాజ్యాంగ రక్షణ లేదు. ఎమ్మెల్యేలు ఈ ప్రక్రియను సాగదీసే ప్రయత్నం చేయొద్దు. పార్టీ ఫిరాయింపులకు ఫుల్ స్టాప్ పెట్టే అంశంపై పార్లమెంట్ ఆలోచించాలి. మేము జోక్యం చేసుకునేంత వరకు స్పీకర్ నోటీసులు ఇవ్వకపోవడం సమంజసం కాదు. పదో షెడ్యూల్ ఉద్దేశాలు నెరవేరుతున్నాయా ? లేదా అని ఆలోచించాలి. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేసే ఎత్తుగడలు మంచివి కాదు’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకునేలా గడువు విధించాలని బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికే పూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్లు పార్టీ ఫిరాయించారు. -
ఎమ్మెల్యేల ఫిరాయింపుపై నేడు సుప్రీం తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సుప్రీం కోర్టు గురువారం తుది తీర్పు వెలువరించనుంది. ఈ ఫిరాయింపుల కేసుపై చివరిసారిగా ఏప్రిల్ 3న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టైన్ జార్జి మసీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇప్పుడు జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈకేసుపై సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ సుప్రీం కోర్టులో జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.అదేరోజు ఎమ్మెల్యేలు పరిగి శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి.ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాం«దీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింత ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ రిట్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత వాదనలు జరుగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ను ప్రతివాదిగా చేర్చారు. ఆ పిటిషన్లంటినీ కలిపి విచారించిన ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పును ఎనిమిది వారాలకు రిజర్వ్ చేసింది. ధర్మాసనంలో సీజేపాటు జస్టిస్ వినోద్ చంద్రన్ ఉన్నారు. -
TG: ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. ‘సుప్రీం’ తుది తీర్పు రేపే
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో రేపు(గురువారం) సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేల అనర్హతపై రేపు(జులై 31) తుది తీర్పును వెలువరించనుంది. ఇరు పక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు.. తీర్పును రిజర్వు చేసింది. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం రేపు తేలనుంది. ‘సుప్రీం’ తీర్పుపై ఆ ఎమ్మెల్యేలతో పాటు, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రేపు ఉదయమే తీర్పు వచ్చే అవకాశముంది. -
సీఎం రేవంత్కు సుప్రీంకోర్టులో ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: గోపన్పల్లి భూ వివాదం కేసులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా ఎన్.పెద్దిరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్ను మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసుమి భట్టాచార్యపై అసంబద్ధ ఆరోపణలు చేసినందుకు పిటిషనర్ పెద్దిరాజు, అతని తరఫు న్యాయవాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.వారిపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో ఆగస్టు 11న తదుపరి విచారణ సందర్భంగా వ్యక్తిగతంగా హాజరై సమాధానం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ‘న్యాయమూర్తులను ఇబ్బందికర స్థితిలోకి నెట్టేలా ఎవరైనా ఆరోపణలు చేయడం మేము సహించం. ఇలాంటి వ్యవహారాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చర్యలతో న్యాయవ్యవస్థ పరువు పోతుంది. అలాంటి వ్యాఖ్యలపై కఠినంగా వ్యవహరించాలి.ఇక్కడ మేము న్యాయవాదులను కూడా రక్షించాలనే ఉద్దేశంతో ఉన్నాం’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రేవంత్ రెడ్డికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇతర న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ పెద్దిరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆరోపణలు చేస్తూ పెద్దిరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్షమాపణలతో తప్పించుకోలేరు విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాది రితేష్ పాటిల్ ట్రాన్స్ఫర్ పిటిషన్ను వెనక్కు తీసుకుంటామని సుప్రీంకోర్టును కోరారు. అయితే ధర్మాసనం నిరాకరించింది. ‘ఇది కేవలం లిటిగెంట్ తప్పు మాత్రమే కాదు, అలాంటి వ్యాఖ్యలపై సంతకం చేసిన న్యాయవాది కూడా కోర్టు ధిక్కారానికి బాధ్యత వహించాలి. ‘మీరంతా మొదట న్యాయమూర్తిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు సమరి్పంచండి. అవి నిజాయితీగా ఉన్నాయో లేదో చూస్తాం. అంతేతప్ప, మీరు పిటిషన్ వెనక్కు తీసుకుంటామంటే క్షమించలేం’అని ధర్మాసనం స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. అసలు ఏం జరిగిందంటే.. గోపన్పల్లిలో సర్వే నంబర్ 127లోని సొసైటీకి సంబంధించిన భూమిని ఆక్రమించడంతోపాటు నిర్మాణాలను జేసీబీతో కూల్చేశారంటూ గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో 2016లో కేసు నమోదైంది. పెద్దిరాజు ఫిర్యాదు మేరకు.. ఏ–1గా కొండల్ రెడ్డి (రేవంత్ రెడ్డి సోదరుడు), ఏ–2గా ఈ.లక్ష్మయ్య, ఏ–3గా రేవంత్ రెడ్డిని చేర్చారు. ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును కొట్టేయాలని రేవంత్ 2020లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై హైకోర్టులో వాదనలు విన్న జడ్జి జస్టిస్ మౌషుమీ భట్టాచార్య ధర్మాసనం.. రేవంత్ రెడ్డి ఘటనా స్థలంలో లేరనే విషయాన్ని ఫిర్యాదుదారు సైతం అంగీకరించారని పేర్కొంది. తాను లేను కాబట్టి తనపై కేసు కొట్టేయాలని అడుగుతున్నారని, మిగతా వారిపై కేసుకొట్టేయాలని అడగటం లేదని వ్యాఖ్యానించింది. రేవంత్రెడ్డి ఆదేశాలమేరకే దూషించాడనే ఆరోపణలకు ఆధారాలు లేవని తెలిపింది. ఈ క్రమంలో జూలై 18న రేవంత్పై నమోదైన కేసును కొట్టేసింది. -
కమిటీ ముందు ఎందుకు హాజరయ్యారు?
న్యూఢిల్లీ: సగం కాలిన కరెన్సీ నోట్ల కట్టలు అధికారిక నివాసప్రాంగణంలో బయటపడిన ఉదంతంలో అభిశంసనను ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. న్యాయం కోసం ఇప్పుడు కోర్టు గడప తొక్కిన మీరు అప్పుడెందుకు కోర్టును ఆశ్రయించలేదని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సూటి ప్రశ్నవేసింది. కరెన్సీ నోట్లు బయల్పడిన ఉదంతానికి సంబంధించి హైకోర్టు న్యాయ మూర్తులతో కూడిన దర్యాప్తు కమిటీ ఇచ్చిన తుది నివేదికను చెల్లనిదిగా ప్రకటించాలంటూ యశ్వంత్ వర్మ పెట్టుకున్న పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ వర్మకు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ‘‘ మీరు తప్పు చేయలేదని భావిస్తే ఆ దర్యాప్తు కమిటీని ముందుగానే సవాల్చేయాల్సింది. మీరు అసలు ఆ కమిటీ ఎదుట విచారణకు ఎందుకు హాజరయ్యారు?. సగం కాలిన కరెన్సీలను చూపిస్తున్న వీడియోను తొలగించాలని కోరేందుకే కోర్టుకొచ్చారా?. దర్యాప్తు కమిటీ విచారణ మొత్తం పూర్తయ్యేదాకా మీరెందుకు వేచి చూశారు?. ఒకవేళ కమిటీ నివేదిక మీకు అనుకూలంగా రావొచ్చని ముందుగానే భావించారా?’’ అని జస్టిస్ వర్మను ధర్మాసనం పలు ప్రశ్నలు అడిగింది. ఈ సందర్భంగా జస్టిస్ వర్మ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ‘‘ ఆరోజు దొరికిన కట్టలకొద్దీ నగదు ఎవరిదో తెల్సుకునేందుకే వర్మ ఆ కమిటీ ఎదుట విచారణకు హాజర య్యారు. విచారణకు హాజరైనంత మాత్రాన తప్పు ఒప్పుకుని విచారణకు వచ్చారని ముందస్తు అంచనాకు కోర్టు రాకూడదు’’ అని సిబల్ వాదించారు. పిటిషన్ ఇలాగేనా వేసేది?ఈ విచారణ జరుగుతున్నంతసేపు ధర్మాసనం ఎక్కడా వర్మ పేరు ప్రత్యకంగా ప్రస్తావించకుండా ఎక్స్ఎక్స్ఎక్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుగానే పేర్కొంది. ఇలా పిటిషన్ వేయడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘‘ పిటిషన్ ఇలాగేనా వేసేది?. ఒకరకంగా సుప్రీంకోర్టు మీదనే కేసు వేసినట్లుగా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఆ దర్యాప్తు కమిటీ ఏర్పడిందికదా?’’ అని ధర్మాసనం సిబల్కు గుర్తుచేసింది. దీనిపై సిబల్ వివరణ ఇచ్చారు. 124వ అధికరణంలోని ‘‘ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సుప్రీంకోర్టు’ ప్రకారం జడ్జి పేరును బహిరంగ కేసు విచారణలో ప్రస్తావించకూడదు కదా. అయినా ఆ నివేదికను అభిశంసనకు ప్రాతిపదికగా తీసుకోకూడదు’’ అని సిబల్ వాదించారు. దీనిపై కోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘‘ ఈ కేసులో ఏదైనా నోటీసులు జారీచేయాలంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరికి పంపాలి?. ఈ జడ్జిని నియమించిన రాష్ట్రపతికా? లేదంటే ఈ మేరకు సలహాలు ఇచ్చిన ప్రధాని సారథ్యంలోని మంత్రిమండలికా? అందుకే ఒకే ఒక్క పేజీలో బుల్లెట్ పాయింట్లతో కేసులో అవతలి పార్టీ ఎవరో స్పష్టంగా పేర్కొని తీసుకుని రండి’’ అని సిబల్ను కోర్టు ఆదేశించింది. కేసు రేపటికి వాయిదావేసింది. -
విశాఖలో లులుకు భూ కేటాయింపులపై రిటైర్డ్ ఐఏఎస్ శర్మ అభ్యంతరం
-
తెలుగు రాష్ట్రాలకు సుప్రీం షాక్
-
మిమ్మల్ని పోలీసులు కారణం లేకుండా అరెస్ట్ చేస్తే.. అప్పుడు మీరు ఏం చేయాలంటే
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ విచారణ పేరుతో తమను వేధిస్తున్నారంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తరచూ పోలీస్ స్టేషన్కు పిలిచి వేధిస్తున్నారని ప్రభాకర్రావు పిటిషన్ దాఖలు చేయగా.. మరో వైపు ప్రభాకర్రావుకు ఇచ్చిన రిలీఫ్ను కొట్టివేయాలంటూ పోలీసులు కోరారు. ప్రభాకర్రావు పిటిషన్.. ఆగస్టు 4వ తేదీన విచారణకు రానుంది.కాగా, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ను సిట్ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నిందితులు, బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2023 నవంబర్ 15 నుంచి 30 మధ్యే ప్రభాకర్రావు నేతృత్వంలోని ఎస్ఐబీ 4,013 ఫోన్లపై నిఘా ఉంచినట్లు సిట్ గుర్తించిన సంగతి తెలిసిందే.వీటిలో 618 రాజకీయ నాయకులకు సంబంధించినవిగా తేల్చింది. మరోపక్క కేసులో మరో నిందితుడు ప్రణీత్రావు ఫోన్ నుంచి సిట్ అధికారులు కొన్ని ఆడియోలు సేకరించారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ప్రభాకర్రావుతో పాటు ఆయన టీమ్ మొత్తం తమ ఫోన్లలో ఉన్న డేటాను డిలీట్ చేయడంతో పాటు ఫోన్లను ధ్వంసం చేసింది. అయితే ప్రణీత్కు సంబంధించిన ఓ ఫోన్లో మాత్రం డేటా డిలీట్ కాకపోవడంతో అది సిట్ చేతికి చిక్కింది. -
రాష్ట్రపతికి గడువుపై మీరేమంటారు?
న్యూఢిల్లీ: అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో రాష్ట్రపతికి కాల పరిమితి విధించడంపై సుప్రీంకోర్టు మంగళవారం కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29వ తేదీలోగా సమాధానాలను అందజేయాలంటూ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది.ఈ అంశంపై ఆగస్ట్లో విచారణ చేపడతామని వెల్లడించింది. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో రాష్ట్రపతి న్యాయస్థానాలు కాల పరిమితి విధించవచ్చా అంటూ మేలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలతో లేఖ రాయడం తెల్సిందే. పరిశీలన కోసం గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి అవి అందిన నాటి నుంచి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఏప్రిల్లో జారీ చేసిన ఉత్తర్వులు సంచలనం రేపడం తెల్సిందే. -
సిగ్గుపడాల్సిన విషయం
న్యూఢిల్లీ: ఒడిశాలో 15 ఏళ్ల బాలిక దహనం దురదృష్టకరం, సిగ్గుపడాల్సిన విషయమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు సాధికారత, సురక్షితమైన వాతావరణాన్ని అందించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ‘గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల బాలికలు, గృహిణులు, పిల్లల పరిస్థితి అత్యంత దుర్బలంగా ఉంది. వారిని శక్తివంతం చేయాలి. అందుకు మా ఈ ఆదేశాలు ఉపయోగపడాలి’అని ఆదేశించింది. వారి భద్రతకోసం కొన్ని స్వల్పకాలిక, దీర్ఘకాలిక కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరం ఉందని, తద్వారా తాలూకా స్థాయిలో నివసించే మహిళలకు అవగాహన, సాధికారత కలి్పంచవచ్చని ధర్మాసనం పేర్కొంది. తాలూకా స్థాయిలో మహిళలకు శిక్షణ ఇచ్చి పారా లీగల్ వలంటీర్లుగా నియమించవచ్చని, మహిళలకు వారి హక్కుల గురించి అవగాహన కలి్పంచడానికి అంగన్వాడీ కార్యకర్తల సహాయం కూడా తీసుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది. మహిళలు, పిల్లలు, ట్రాన్స్పర్సన్లకు సురక్షితమైన వాతావరణం కోసం పాన్–ఇండియా మార్గదర్శకాలను రూపొందించడానికి ఆదేశాలు కోరుతూ గత సంవత్సరం డిసెంబర్ 16న దాఖలైన ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగి్చలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఇది ప్రభుత్వాల వ్యతిరేక వ్యాజ్యం కాదని, మహిళల భద్రతకోసం కేంద్రం, అన్ని పారీ్టల నుంచి సూచనలు అవసరమని ధర్మాసనం పేర్కొంది. కేంద్రం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి మాట్లాడుతూ, లైంగిక నేరస్థులను గుర్తించడానికి, సకాలంలో చర్యలు తీసుకోవడానికి బహిరంగ ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు, ఫేస్ స్కాన్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. బాధలో ఉన్న మహిళలకు సహాయపడేలా ప్రతి జిల్లాలో వన్–స్టాప్ సెంటర్లు పనిచేస్తున్నాయని ఆమె అన్నారు. అయితే, వన్–స్టాప్ సెంటర్ తాలూకా స్థాయికి వెళ్లాల్సిన అవసరం ఉందని ధర్మాసనం సూచించింది. -
రాజకీయ యుద్ధాల్లో.. మిమ్మల్ని ఎందుకు వాడుతున్నారు?
మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ భూకేటాయింపుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను దురుద్దేశపూర్వకంగా రంగంలోకి దించారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం, ప్రత్యర్థి పార్టీలపై కక్ష సాధింపు కోసం ఈడీని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఈ విషయంలో మేం నోరువిప్పితే బాగోదు. రాజకీయ యుద్ధాల్లో ఈడీని ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఇలాంటి విపరీత పోకడ వైరస్ను దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయకండి. ఈడీని ఉసిగొల్పే వికృత క్రీడను దేశ మంతటా అమలు చేయకండి. ఎన్నికల వేదికలపై మాత్రమే రాజకీయ యుద్ధాలు చేసుకోండి. ఇదే ధోరణి కొనసాగిస్తే మేం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. – సుప్రీంకోర్టుసాక్షి బెంగళూరు: కర్ణాటకలో మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూకేటాయింపుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని దురుద్దేశపూర్వకంగా రంగంలోకి దించారని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రత్యర్థి పార్టీలపై కక్ష సాధింపు కోసం ఈడీని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజుకు సుప్రీంకోర్టు సూటి ప్రశ్నవేసింది. ముడా భూకేటాయింపుల కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి వ్యతిరేకంగా ఈడీ గతంలో జారీచేసిన సమన్లు కొట్టేస్తూ కర్ణాటక హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం సమర్థించింది.హైకోర్టు తీర్పును సవాల్చేస్తూ ఈడీ దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. ఈ సందర్భంగానే సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘‘ఈ విషయంలో మేం నోరువిప్పితే బాగోదు. అచ్చం ఇలాగే మహారాష్ట్రలో జరిగిన ఉదంతం మొత్తం మాకు తెలుసు. రాజకీయ యుద్ధాల్లో ఈడీని ఎందుకు ఉపయోగిస్తున్నారు?. ఇలాంటి విపరీత పోకడ వైరస్ను దేశవ్యాప్తంగా వ్యాప్తిచేయకండి.ఈడీని ఉసిగొల్పే వికృత క్రీడను దేశమంతటా అమలుచేయకండి. ఎన్నికల వేదికలపై మాత్రమే రాజకీయ యుద్ధాలు చేసుకోండి. ఈ యుద్ధాల్లోకి ఈడీని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? మీరు ఇదే ధోరణి కొనసాగిస్తే మేం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కేసుల విషయంలో ఈడీ అధికారులు అన్ని పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారు’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.స్వాగతించిన కాంగ్రెస్.. విమర్శించిన బీజేపీఈడీ వైఖరిని ఎండగడుతూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ఈడీ–బీజేపీ సమష్టిగా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సుప్రీంకోర్టు బట్టబయలుచేసిందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ రణ్దీప్ సూర్జేవాలా అన్నారు. కోర్టు తీర్పు కేంద్రప్రభుత్వానికి చెంపదెబ్బలా తగిలిందని సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.ఈడీని రాజకీయ లబ్ధి కోసం దుర్వినియోగం చేస్తున్న ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షాలకు ఈ తీర్పు మేలుకొలుపు అని ఆయన అన్నారు. ముడా కేసులో తమ పోరాటం ఆగదని బీజేపీ స్పష్టంచేసింది. ‘‘ భూమికి బదులు ప్లాట్ల కేటాయింపుల్లో అక్రమాలు జరగకపోతే వాటిని సీఎం కుటుంబం ఎందుకు మళ్లీ వెనక్కి ఇచ్చేసింది?. వాటిని వాళ్ల వద్దే ఉంచుకోవచ్చుగదా. ఈ అంశంలో మా పోరాటం కొనసాగుతుంది’’అని కర్ణాటక అసెంబ్లీలో విపక్షనేత, బీజేపీ నాయకుడు ఆర్.అశోక్ సోమవారం బెంగళూరులో అన్నారు.ఏమిటీ ముడా కేసు?సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ బోర్డ్గా 1904లో ఏర్పాటై తదనంతరకాలంలో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా)గా అవతరించిన సంస్థ ఇప్పుడు భూకేటాయింపుల వివాదంలో కేంద్రబిందువుగా నిలిచింది. కెసెరె గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. ఈ గ్రామంలో దేవనార్ 3ఫేజ్ లేఅవుట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. నష్టపరిహారంగా 2021లో మైసూర్లోని విజయనగర మూడో, నాలుగో ఫేజ్ లేఅవుట్లలో 38,284 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 ప్లాట్లను కేటాయించింది.అయితే పార్వతి నుంచి తీసుకున్న భూముల కంటే కేటాయించిన ప్లాట్ల విలువ రూ.45 కోట్లు ఎక్కువ అని ఆర్టీఐ కార్యకర్త అబ్రహాం లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేటాయింపుల అంశం వార్తల్లోకెక్కింది. కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లిఖార్జున స్వామి 2010 అక్టోబర్లో బహుమతిగా ఇచ్చాడు. ప్రభుత్వం సేకరించాక 2014 జూన్లో నష్టపరిహారం కోసం పార్వతి దరఖాస్తు చేసుకున్నారు. ప్లాట్ల కేటాయింపుపై సిద్ధూ గతంలోనే స్పష్టతనిచ్చారు. ‘‘2014లో నేను సీఎంగా ఉన్నపుడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కష్టమని అధికారులు చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడు 2021లో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఈ ప్లాట్లను కేటాయించారు’’ అని సిద్దూ అన్నారు.అయితే గతంలో ముడా 50: 50 పేరిట ఒక పథకాన్ని అమలుచేసింది. నిరుపయోగ భూమి తీసుకుంటే వేరే చోట ‘అభివృద్ధి చేసిన’ స్థలాన్ని కేటాయిస్తారు. ప్రతీ కేటాయింపు ముడా బోర్డు దృష్టికి తేవాలి. అయితే కొందరు ముడా అధికారులతో చేతులు కలిపి, బోర్డు దృష్టికి రాకుండా, పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను రాయించుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లోపాలున్న పథకాన్ని 2023 అక్టోబర్లో రద్దుచేశారు. అయితే తన భూమికి ఎక్కువ విలువ ఉంటుందని రూ.62 కోట్ల నష్టపరిహారం కావాలని సిద్ధరామయ్య ఈఏడాది జూలై నాలుగున డిమాండ్ చేయడం విశేషం. అయితే అసలు ఈ భూమి పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామిది కాదని, అక్రమంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి 2004లో తన పేరిట రాయించుకున్నాడని ఆరోపణలున్నాయి. -
హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు అసంతృప్తి.. దర్శన్కు లీగల్ షాక్
సాక్షి,న్యూఢిల్లీ: అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్ తూగుదీపకు కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై గురువారం (జులై 17) సుప్రీంకోర్టు ఆగ్రహ వ్యక్తం చేసింది. రేణుకా స్వామి హత్యకేసులో కర్ణాటక హైకోర్టు దర్శన్కు గతేడాది బెయిల్ మంజూరు చేసింది. అయితే, దర్శన్కు బెయిల్ ఇచ్చే సమయంలో హైకోర్టు తగిన ఆధారాలు, కేసు తీవ్రత, బాధితుడి (రేణుకాస్వామి) హక్కులను సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని భావించింది.గతేడాది ఏప్రిల్ నెలలో తన స్నేహితురాలు పవిత్ర గౌడకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు పంపించాడన్న ఆరోపణల్లో రేణుకాస్వామిని దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్రగౌడలు దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో దర్శన్, పవిత్రగౌడ సహా 15మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టిన కోర్టు నిందితులకు జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో దర్శన్, పవిత్రగౌడతో పాటు పలువురు నిందితులు కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. అనంతరం, గతేడాది డిసెంబర్లో వీరికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.దర్శన్కు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై సుప్రీం కోర్టు జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టించింది. ఈ సందర్భంగా..దర్శన్కు కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇచ్చిన తీరును తప్పుబట్టింది.రేణుకాస్వామి హత్య కేసు విచారణ సందర్భంగా, దర్శన్ తరపున వాదనలు వినిపిస్తున్న ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్తో సుప్రీం కోర్టు ధర్మాసనం ఇలా అన్నది.‘రేణుకాస్వామి కేసులో దర్శన్కు బెయిల్ ఇచ్చిన కర్ణాటక హైకోర్టు తీర్పు.. న్యాయబద్ధంగా తీసుకోలేదనే అభిప్రాయం కలుగుతోంది. తగిన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా, విచక్షణను సరిగ్గా అమలు చేయలేకపోయింది అనిపిస్తోంది. మిస్టర్ సిబల్..మీ అభిప్రాయం ఏమిటి?’అని అడిగింది.అందుకు కపిల్ సిబల్ అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టు నిర్ణయాన్ని పక్కన పెట్టి సాక్షుల ఇచ్చిన స్టేట్మెంట్లపై దృష్టి పెట్టాలని కోరారు. కపిల్ సిబల్ విజ్ఞప్తిపై సుప్రీం ధర్మాసనం.. విచారణ తదుపరి మంగళవారానికి వాయిదా వేస్తున్నాం. హైకోర్టు తీర్పులో మేము ఎందుకు జోక్యం చేసుకోకూడదో వచ్చే విచారణలో మీరు వాదించండి. మీ వాదనల్ని మేం వినాలని అనుకుంటున్నామని తెలిపింది. Supreme Court hears Karnataka’s plea against bail granted to Kannada actor Darshan Thoogudeepa (Sri Darshan C). They are accused in the murder of a fan, Renukaswamy, allegedly triggered by derogatory messages the victim sent to actress Pavithra Gowda - Darshan’s alleged… pic.twitter.com/7Dw8eIL9vf— Bar and Bench (@barandbench) July 17, 2025 -
మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్
-
బాబుకు సుప్రీం బిగ్ షాక్.. వంశీని టచ్ చేయొద్దు
-
సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట
ఢిల్లీ: సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట లభించింది. మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వ పిటిషన్ను హైకోర్టుకు సుప్రీం కోర్టు తిప్పి పంపించింది. అరెస్టు నుంచి రక్షణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్పై గురువారం.. సుప్రీంకోర్టు విచారణ జరిపింది.హైకోర్టు తమ వాదన వినకుండానే ముందస్తు బెయిల్ ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదించారు. దాంతో కేసును ఏపీ హైకోర్టు మరోసారి విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అరెస్టు నుంచి రక్షణను సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. -
వాటికి సొంతింట్లో తిండి పెట్టొచ్చుగా?
న్యూఢిల్లీ: వీధిశునకాలను ఎక్కడపడితే అక్కడ పెంచిపోషిస్తున్న కారణంగా కుక్కలున్న రోడ్లపై చిన్నారులు, వృద్దులు, మహిళలు ఒంటరిగా వెళ్లలేని పరిస్థితి దాపురించిందని సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తంచేసింది. వీధి శునకాల కోసం ప్రత్యేకంగా ఆహారకేంద్రాలు తెరవాలంటూ పిటిషన్ దాఖలుచేసిన ఒక వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయన తరఫున హాజరైన న్యాయవాదిపై పలు ప్రశ్నలు సంధించింది. ‘‘వీధిశునకాల బాగోగులు పట్టించుకునే ఇలాంటి దయార్థ్ర హృదయుల కోసం కాలనీలోని ప్రతి రోడ్డును, ప్రతి సందును భోజనాల కోసం కేటాయించాలా?. ఆయన ఉండే కాలనీలోని వీధి శునకాలన్నింటికీ ఆయన సొంతింట్లోనే ఆహారం పెట్టొచ్చుగా?. ఎవ్వరూ ఆయనకు అడ్డుచెప్పరు’’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జంతువుల జనన నియంత్రణ నిబంధనలు, 2023లో 20వ రూల్ ప్రకారమే తమ ఏరియాలోని వీధిశునకాలకు క్లయింట్ ఆహారం పెడుతుంటే ఆయా కాలనీవాసులు, అపార్ట్మెంట్ యజమానులు అడ్డుచెబుతున్నారని, వేధిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. జనం పెద్దగా తిరగని ప్రాంతాల్లో ఫీడింగ్ పాయింట్లు ఏర్పాటుచేసేలా పురపాలికలను ఆదేశించాలని న్యాయవాది కోరారు. దీనిపై సుప్రీంకోర్టు మండిపడింది.‘‘మేమొక మంచి సలహా ఇస్తాం. పిటిషనర్ ఇంట్లోనే ఒక షెల్టర్ను తెరవండి. అక్కడే ప్రతి ఒక్క వీధిశునకానికి ఆహార ఏర్పాట్లు చేసుకోండి’’అని కోర్టు సూచించింది. గ్రేటర్ నోయిడాలో ఇలాంటి పాయింట్లు ఉన్నా నోయిడా సిటీలో లేవని న్యాయవాది వాదించడంతో కోర్టు మళ్లీ స్పందించింది. ‘‘మీరొక సైకిల్ తొక్కుతూ ఉదయం పూట అలా వెళ్లిరండి. వీధి శునకాలున్న రోడ్డులో ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది’’అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘నేను రోజూ ఉదయం వాకింగ్కు వెళ్తా. ఎన్నో కుక్కలను చూస్తా’’అని అనడంతో కోర్టు కల్పించుకుని ‘‘ఉదయపు నడకకు వెళ్లే వాళ్లకు వీధిశునకాల బెడద ఎక్కువ. అందులోనూ సైకిల్, ద్విచక్రవాహనాలు నడిపే వాళ్లకు కుక్కల బెడద మరింత ఎక్కువ. అవి వెంట బడి కిందపడి గాయపడేలాచేస్తాయి. వాటి కారణంగా కిందపడి ప్రాణాలమీదకు తెచ్చుకున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు’’అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇదే అంశంలో పెండింగ్లో ఉన్న ఇతర కేసులతో కలిపి ఈ పిటిషన్ను తర్వాత విచారిస్తామని కోర్టు తెలిపింది. -
ట్రంప్ సర్కార్కు భారీ ఊరట.. ఆ 1,400 మంది తొలగింపునకు లైన్ క్లియర్
తీవ్ర ఉత్కంఠ నడుమ.. అమెరికా సుప్రీం కోర్టులో ట్రంప్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఆ దేశ విద్యాశాఖను రద్దు చేసే ప్రక్రియను కొనసాగించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో ఆ శాఖకు సంబంధించిన 1,400 మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ముమ్మురం చేయనున్నారు.ఎన్నికల ప్రచారం నుంచే విద్యాశాఖను మూసివేయాలని ట్రంప్ భావిస్తూ వస్తున్నారు. మార్చి 11వ తేదీన విద్యాశాఖలో సగానికి పైగా ఉద్యోగుల భారం తగ్గించుకోనున్నట్లు కార్యదర్శి లిండా మెక్ మహోన్ ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా.. 21వ తేదీన విద్యాశాఖ(Department of Education) మూసివేత ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. నాలుగు దశాబ్దాలుగా భారీగా ఖర్చు చేస్తున్నా అమెరికాలో విద్యా ప్రమాణాలు మెరుగుపడటం లేదని, ఇంకా యూరప్ దేశాలు.. చైనా కంటే వెనుకబడే ఉన్నామని, కాబట్టే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారాయన. అయితే.. విద్యార్థులకు ఫీజుల రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలు మాత్రం కొనసాగిస్తామని అన్నారాయన.మార్చి-మే మధ్యలో.. మొత్తం 1,400 మంది ఉద్యోగులను విధుల్లోంచి తొలగించారు. ఇది మొత్తం ఉద్యోగుల్లో సగానికి సగం. మిగతా సగాన్ని పెయిడ్ లీవ్లో ఉంచి.. ఇతర విభాగాల్లోకి సర్దుబాట చేయడం ముమ్మరం చేశారు. ఈలోపు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై డెమెక్రట్స్తో పాటు మసాచుసెట్స్ పబ్లిక స్కూల్ సిస్టమ్స్ & యూనియన్స్ పిటిషన్లు వేశాయి.అయితే మే 22వ తేదీన బోస్టన్ ఫెడరల్ కోర్టు ఉద్యోగుల తొలగింపును నిలిపివేయాలని ఆదేశించింది. తొలగించిన వాళ్లను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సిందేనని జడ్జి యోంగ్ జోన్ ఆదేశించారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ యూఎస్ సర్క్యూట్ కోర్టు(బోస్టన్)ను ట్రంప్ ప్రభుత్వం ఆశ్రయించగా.. అక్కడ చుక్కెదురైంది. ఈ క్రమంలో..సుప్రీం కోర్టు జులై 14న కింది కోర్టు ఇచ్చిన నిలుపుదల ఆదేశాలను పక్కనపెడుతూ.. విద్యాశాఖను రద్దు చేసే ప్రక్రియ కొనసాగించవచ్చని 6-3 తేడాతో ఎమర్జెన్సీ బెంచ్ తీర్పు వెల్లడించింది. ఈ క్రమంలో ఎలాంటి వివరణను తీర్పు సందర్భంగా న్యాయమూర్తులు చదివి వినిపించకపోవడం గమనార్హం. కోర్టు నిర్ణయాన్ని అమెరికకా విద్యాశాఖ కార్యదర్శి లిండా మెక్ మహో స్వాగతించారు. అయితే ఈ తీర్పు రాజ్యాంగానికి ముప్పు కలిగించొచ్చని, విద్యా రంగానికి హాని కలిగించే అవకాశం ఉందని తీర్పును వ్యతిరేకించిన ముగ్గురు న్యాయమూర్తులు అభిప్రాయపడుతున్నారు.లిండా.. ఫస్ట్ అండ్ లాస్ట్ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక.. మార్చి 3వ తేదీన డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ సీఈవో లిండా మెక్ మహోన్(Linda McMahon) విద్యాశాఖ కార్యదర్శిగా నియమించారు. మార్చి 3వ తేదీన ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే.. విద్యాశాఖ రద్దు ఫైల్పై సంతకం చేసే సమయంలో అమెరికాకు లిండా మెక్ మహోన్నే చివరి విద్యాశాఖ కార్యదర్శి కావొచ్చని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.ఎందుకీ నిర్ణయమంటే..అమెరికాలో 1979 నుంచి విద్యాశాఖ విభాగాన్ని ఫెడరల్ గవర్నమెంట్ చూసుకుంటోంది. విద్యాశాఖ నిర్వహణలో పరిమితమైన పాత్రే పోషిస్తున్నప్పటికీ.. ఫండింగ్ విషయంలో మాత్రం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకు విద్యాశాఖ రద్దు నిర్ణయానికి ట్రంప్ కట్టుబడి ఉన్నారు. ఎన్నికల సమయంలో తన ప్రచారంలోనూ ట్రంప్ ఈ నిర్ణయం తప్పకుండా అమలు చేస్తానని ప్రకటించడం తెలిసిందే. అయితే.. తాజా ట్రంప్ ఆదేశాలతో ఇక నుంచి స్టేట్స్(రాష్ట్రాలు) ఆ బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. అయితే.. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇటు డెమోక్రట్లు, అటు విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఇది ట్రంప్ తీసుకున్న మరో వినాశకార నిర్ణయమని డెమోక్రట్ సెనేటర్ చుక్ షూమర్ అభిప్రాయపడుతున్నారు. -
సుప్రీంలో నిమిషా కేసు.. అద్భుతం జరుగుతుందా?
-
సృజనాత్మకతతోనే ఉన్నత శిఖరాలకు..
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద వృత్తిలో నైపుణ్యంతోపాటు సృజనాత్మకత అవసరమని, అవి పాటించినవారే ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు. వర్ణ వివక్ష, సామాజిక వివక్షపై పోరాడిన న్యాయవాదుల వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని యువ న్యాయవాదులకు పిలుపునిచ్చారు. న్యాయవాద వృత్తిలో అడ్డంకులుంటాయని, వాటిని అధిగమించి ముందుకు సాగాలని సూచించారు.న్యాయవ్యవస్థలో విశ్వాసం, నిబద్ధత, ప్రజా సేవకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. హైదరాబాద్ షామీర్పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో 22వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ బీఆర్ గవాయ్, గౌరవ అతిథిగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, నల్సార్ చాన్స్లర్, రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీజేఐ పలుసూచనలు, సలహాలు ఇచ్చారు.విదేశీ విద్యపై మోజు వద్దు..‘నల్సార్ అంటే విద్యా నైపుణ్యం మాత్రమే కాదు.. చట్ట విలువల పట్ల దాని లోతైన నిబద్ధత. దేశంలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు ఇతర సంస్థల కంటే మెరుగ్గా ప్రమాణాలు పాటిస్తున్నాయి. కొత్త ప్రపంచం, సాంకేతిక పరిణామాలకు ప్రతిస్పందనగా వృత్తి అభివృద్ధి చెందుతున్నా.. ఇంకా బలమైన పునాదులు అవసరం. సహచరుల ఒత్తిడి కారణంగా విదేశీ విద్యపై మోజు పెంచుకోవద్దు. అంతర్జాతీయ అర్హతతోనే ఎదుగుదల సాధ్యమన్నది అవాస్తవం.దేశంలో నాణ్యమైన విద్యకు కొదవలేదు. కొందరు ఆర్థిక భారమైనా విదేశాలకు వెళ్లాలని భావించడం సరికాదు. అది ఆ కుటుంబాలను అప్పుల్లో మునిగేలా చేస్తుంది. ఎల్ఎల్బీతోనే ఆగిపోకుండా ఎల్ఎల్ఎం సహా ఉన్నత చదువులపై దృష్టి సారించాలి. కోర్టు, కక్షిదారుల ముందు న్యాయవాదులు తమను తాము నిరూపించుకునేందుకు నిరంతరం కష్టపడాలి. న్యాయస్థానం ఇచ్చే తీర్పులపై అవగాహన పెంపొందించుకోవాలి. అప్పుడే సమర్థవంతమైన న్యాయవాదిగా నిలబడగలుగుతారు’ అని సూచించారు.విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తున్న సుప్రీంకోర్టు సీజే గవాయ్, జస్టిస్ పీఎస్.నరసింహ, హైకోర్టు సీజే జస్టిస్ సుజయ్పాల్, సీఎం రేవంత్రెడ్డి నిబద్ధతతో ముందుకు సాగాలి..విద్యా నైపుణ్యం, రాజ్యాంగ విలువలు, సమ్మిళిత వృద్ధికి నల్సార్ కట్టుబడి ఉందని వర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం కింద ప్రత్యేక కోర్టుల ఆధునీకరణపై కేంద్రంతో కలిసి పని చేశామని చెప్పారు. డిగ్రీలు అందుకుని వెళ్తున్న విద్యార్థులు నిబద్ధతతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా డిగ్రీలు పూర్తి చేసుకున్న పీహెచ్డీ, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, ఎంఏ (పన్ను చట్టాలు), ఎంఏ (క్రిమినల్ జస్టిస్ మేనేజ్మెంట్), బీఏ ఎల్ఎల్బీ(హానర్స్), బీబీఏ (హానర్స్), బీబీఏ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ విద్యార్థులకు పట్టాలను అందజేశారు.ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జస్టిస్ బీఆర్ గవాయ్, రేవంత్రెడ్డి పసిడి పతకాలు ప్రదానం చేశారు. అత్యధికంగా ఇషికా గార్గ్ 8, ఖండేకర్ సుకృత్ శైలేంద్ర 7, అర్చిత సతీశ్ 6 పతకాలు సాధించారు. రెండు వీసీ మెడల్స్తో కలిపి మొత్తం 58 బంగారు పతాకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శామ్కోషి, జస్టిస్ వినోద్కుమార్, జస్టిస్ విజయ్సేన్రెడ్డి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ.నరసింహారెడ్డి, అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్రెడ్డి, వర్సిటీ రిజి్రస్టార్ కె. విద్యుల్లతారెడ్డి, కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత శాఖ కార్యదర్శి అమిత్ యాదవ్ (ఐఏఎస్) తదితరులు పాల్గొన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా సీజేఐతో సీఎం రేవంత్రెడ్డి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.ఏఐతో సత్వర న్యాయం సాధ్యమే..‘ఏటా న్యాయవాద విద్యలోకి వచ్చే వారు పెరుగుతున్నారు. అయితే, వృత్తిలో నైపుణ్యం పెంచుకున్నవారే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. దేశానికి ఉత్తమ న్యాయవాదుల అవసరం ఎంతో ఉంది. మనదేశం ఎదుర్కొంటున్న చట్టపరమైన సవాళ్లకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. న్యాయవ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించాల్సిన సమయం ఆసన్నమైంది. సరై న పద్ధతిలో ఉపయోగిస్తే సత్వర న్యాయం అందించేందుకు దోహదం చేస్తుంది. స్నేహితులు, కుటుంబం, పుస్తకాలు, అభిరుచులు, ఆరోగ్యం, ఊహ.. ఈ ఐదు అంశాలు ఎప్పు డూ చెక్కుచెదరకుండా చూసుకోవాలి’అని ఉద్బోధించారు. -
నిమిష ప్రియ కేసుపై నమోదైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీం అంగీకారం
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. ప్రభాకర్ రావుకు ఝలక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సిట్ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు డీసీపీ విజయ్కుమార్, ఏసీపీ వెంకటగిరి ఢిల్లీకి వెళ్లారు.అయితే, గతంలో ప్రభాకర్ రావును అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మినహాయింపులు రద్దు చేయాలని సుప్రీంకోర్టును సిట్ అధికారులు కోరనున్నారు. ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభాకర్ రావును కస్టడీకి తీసుకోవాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ను సిట్ అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు డేటా కీలకంగా మారనుంది. వీటి నుంచి డేటాను సేకరించి పనిలో అధికారులు ఉన్నారు. ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి సిట్ అధికారులు పంపించారు. ఈ క్రమంలో 2023 అక్టోబర్ నుండి మార్చి15 వరకు కాల్ డేటాను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ప్రభాకర్ రావు.. పలువురు బీఆర్ఎస్ నేతలతో, పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్టు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది.ఇక, ఇప్పటికే నిందితులు, బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. రేపు మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు రానున్నారు. 2023 నవంబర్ 15 నుండి 30 వరకు అందిన సర్వీసు ప్రొవైడర్ డేటాలో 618 ఫోన్ నెంబర్లను సిట్ గుర్తించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ధ్వంసమైన హార్డ్ డిస్కులలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డేటా ఉన్నట్టు సమాచారం. దీంతో, సిట్ అధికారులు.. హార్డ్ డిస్కులపైన ఆశలు పెట్టుకున్నారు. డేటా రిట్రైవ్, హార్డ్ డిస్కులోని రహస్యాలపై సిట్ ఆరా తీస్తోంది. -
‘ఎన్నికల జాబితా’పై సుప్రీంకు మొయిత్రా
కోల్కతా: బిహార్లోని యువ ఓటర్లకు ఓటు లేకుండా చేసేందుకే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)కు పూనుకుందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. బిహార్ తర్వాత ఈసీ తదుపరి లక్ష్యం 2026లో ఎన్నికలు జరిగే బెంగాల్ అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చర్యకు నిరసనగా ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లోని నిబంధనలు ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950కి విరుద్ధంగా ఉన్నాయి మహువా పేర్కొన్నారు. వివిధ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నందున ఈసీ ఎస్ఐఆర్ను నిలిపివేయాలని సూచించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించినట్లు వివరించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆదేశాలను ఈసీ జారీ చేయకుండా చూడాలని కోరానన్నారు. 1987 జూలై 1–2004 డిసెంబర్ 2వ తేదీల మధ్య జని్మంచిన వారు ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ కారణంగా ఓటేసే హక్కుకు లక్షలాది మంది దూరమవుతారని ఆరోపించారు. బిహార్లో ఎస్ఐఆర్ను అమలు చేయాలంటూ ఈసీ జూన్ 24వ తేదీన ఆదేశాలు జారీ చేయడం తెల్సిందే. అనర్హులను జాబితా నుంచి తొలగించడం, అర్హులైన పౌరుల పేర్లు జాబితాలో ఉండేలా చూడటమే ఈ ఆదేశాల లక్ష్యమని ఈసీ అంటోంది. ఈసీ ఆదేశాలపై ఏడీఆర్, పీయూసీఎల్ వంటి పౌర సంఘాలు, కార్యకర్తలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే, బిహార్లో ఎస్ఐఆర్ అమలుకు సంబంధించి తాము జారీ చేసిన ఆదేశాల్లో ఎలాంటి మార్పూ లేదని ఈసీ ఆదివారం స్పష్టం చేసింది. -
కేంద్రానికి సుప్రీం కోర్టు లేఖ.. చంద్రచూడ్ బంగ్లాను ఖాళీ చేయించాలంటూ..
ఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అధికారిక నివాసం విషయమై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లేఖ రాసింది. ఆయన అధికారిక నివాసాన్ని వీలైనంత త్వరగా ఖాళీ చేయించాలని కోరుతూ లేఖలో పేర్కొంది. జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణ అనంతరం నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉండటాన్ని సర్వోన్నత న్యాయస్థానం లేఖలో ప్రస్తావించింది. దీంతో, సదరు లేఖపై చంద్రచూడ్ స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్లో సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసం ఉంటున్నారు. కాగా, ఈ బంగ్లాను అత్యవసరంగా ఖాళీ చేయించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లేఖ రాసింది. ఈ క్రమంలో.. బంగ్లాను జస్టిస్ డీవై చంద్రచూడ్ నుంచి ఆలస్యం చేయకుండా స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాం. ఆయన పదవీ విరమణ అనంతరం బంగ్లాను ఖాళీ చేయాల్సిన గడువు ముగిసిపోయి కూడా ఆరు నెలలు అవుతోంది అని సుప్రీంకోర్టు.. హౌసింగ్ అర్బన్ అఫైర్స్ (MoHUA) శాఖ కార్యదర్శికి రాసిన లేఖ రాసింది.ఇక, సుప్రీంకోర్టు రాసిన లేఖపై జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ..‘కొన్ని వ్యక్తిగత అవసరాల కారణంగా ఆలస్యమైందన్నారు. త్వరలోనే బంగ్లాను ఖాళీ చేసి అధికారులకు అప్పగిస్తానన్నారు. కొన్ని పరిస్థితులు, తన కుమార్తెలకు ఉన్న ప్రత్యేక అవసరాల దృష్ట్యా అధికారిక బంగ్లా ఖాళీ చేయడానికి ఆలస్యమైందన్నారు. అలాగే, తుగ్లక్ రోడ్లోని బంగ్లా నంబర్ 14ను ప్రభుత్వం తనకు ప్రత్యామ్నాయ వసతిగా ఇప్పటికే కేటాయించినప్పటికీ.. పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగా అందులోకి మారలేదని వెల్లడించారు.భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ రెండేళ్ల పాటు సేవలందించిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్ 10న చంద్రచూడ్ పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ చేసిన నాటి నుంచి జస్టిస్ చంద్రచూడ్ ఢిల్లీలోని ప్రధాన న్యాయమూర్తి అధికారిక భవనంలోనే నివాసం ఉంటున్నారు. దీంతో, అనంతరం సీజేఐగా విధులు నిర్వహించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ఇద్దరూ కూడా అధికారిక నివాసంలోకి మారలేదు. ఈ కారణంగానే సుప్రీంకోర్టు లేఖ రాసినట్టు తెలుస్తోంది. -
తెలంగాణ హైకోర్టుకు కొత్త జడ్జీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు రానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం వారి నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. న్యాయవాదులు గౌస్ మీరా మొహినుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్కుమార్లను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో 26 మంది న్యాయమూర్తులున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేసిన జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్తోపాటు జస్టిస్ అభిషేక్రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ సుమలతలను తెలంగాణకు బదిలీ చేస్తూ గత నెల సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ సుజోయ్పాల్ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. కొత్తగా ఎంపికైన వారు నలుగురు, బదిలీపై ఇక్కడికి వచ్చేవారు నలుగురు, ఇక్కడి నుంచి వెళ్లే వారు ఒకరు.. వీరందరి సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపితే న్యాయమూర్తుల సంఖ్య 33 (సీజేతో కలిపి)కు పెరగనుంది. ఇంకా 9 ఖాళీలుంటాయి. చాలాకాలం తర్వాత న్యాయవాదుల కోటా నుంచి న్యాయమూర్తులుగా పదోన్నతులు క ల్పించడంపట్ల అడ్వొకేట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జడ్జీల నేపథ్యాలు ఇవి.. ⇒ సుద్దాల చలపతిరావు 1971 జూన్ 25న జనగాంలో జన్మించారు. తండ్రి జగన్మోహన్రావు. 1998 మార్చి 26న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. వై.రామారావు వద్ద 1998 నుంచి 2004 వరకు జూనియర్గా పనిచేశారు. 2004 నుంచి స్వతంత్ర ప్రాక్టీస్ ప్రారంభించారు. రంగారెడ్డి, సిటి సివిల్ కోర్టులతోపాటు హైకోర్టులో సివిల్, క్రిమినల్ సహా అన్ని విభాగాల కేసుల్లో వాదనలు వినిపించారు. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సెల్గా 2022లో నియమితులయ్యారు. ప్రస్తుతం అవే విధులు నిర్వహిస్తున్నారు. ⇒ వాకిటి రామకృష్ణారెడ్డి 1970 సెప్టెంబర్ 14న జన్మించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు స్వగ్రామం. వారిది వ్యవసాయ కుటుంబం. తండ్రి సర్పంచ్గా, జెడ్పీటీసీగా సేవలందించారు. తల్లి గృహిణి. అన్న, చెల్లి ఉన్నారు. 1998లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఎ.అనంతసేన్రెడ్డి వద్ద జూనియర్గా పనిచేశారు. 2005 నుంచి స్వతంత్ర ప్రాక్టీస్ ప్రారంభించారు. రంగారెడ్డి, సికింద్రాబాద్, సిటీ సివిల్ కోర్టుతోపాటు తెలంగాణ, ఏపీ హైకోర్టుల్లో వాదనలు వినిపించారు. రాజ్యాంగ, సివిల్, క్రిమినల్, రెవెన్యూ, ట్యాక్స్, ఫ్యామిలీ, కంపెనీ కేసుల్లో సమర్థులు. ఇప్పటివరకు 1,000 పిటిషన్లకుపైగా దాఖలు చేశారు. 2016–17లో తొలి తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈడీ స్టాండింగ్ కౌన్సెల్గా విధులు నిర్వహిస్తున్నారు. ⇒ గౌస్ మీరా మొహినుద్దీన్ 1969 జూలై 15న జన్మించారు. ఆయన హైదరాబాద్ బాలానగర్కు చెందిన వారు. తండ్రి మహమ్మద్ ఇస్మాయిల్ హెచ్ఎంటీ మేనేజర్గా పనిచేశారు. వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని నెల్లూరు వీఆర్ న్యాయ కళాశాల నుంచి న్యాయ విద్య పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీలో ఎల్ఎల్ఎం చదివారు. 1993 మార్చి 17న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఉమ్మడి బార్ కౌన్సిల్, తెలంగాణ బార్ కౌన్సిల్కు స్టాండింగ్ కౌన్సిల్గా విధులు నిర్వర్తించారు. సివిల్, రాజ్యాంగంతోపాటు పలు విభాగాల్లో సమర్థ వాదనలు వినిపించారు. ⇒ గాడి ప్రవీణ్కుమార్ 1971 ఆగస్టు 28న జన్మించారు. ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా భీమ్గల్. తండ్రి జగన్మోహన్రావు. కాకతీయ వర్సిటీ నుంచి ఎల్ఎల్బీ.. ఓయూలో ఎంఏ, ఎల్ఎల్ఎం చదివారు. 1998 నవంబర్ 12న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. హైకోర్టు, అడ్మిని్రస్టేటివ్, ట్రిబ్యునల్స్, లేబర్ కోర్టులో పలు కేసులు వాదించారు. రాజ్యాంగ, సర్విస్ మ్యాటర్స్, లేబర్ లా, క్రిమినల్ లా.. పలు విభాగాల్లో నిష్ణాతులు. ప్రస్తుతం హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్ జనరల్గా విధులు నిర్వహిస్తున్నారు. -
సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట
-
సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట.. కూటమి సర్కార్కు షాక్
సాక్షి, ఢిల్లీ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మైనింగ్ కేసులో వంశీ బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు ఆసక్తి చూపలేదు. అనంతరం, తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది.అయితే, మైనింగ్ కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. దీనిపై ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్బంగా వంశీ బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీం కోర్టు ఆసక్తి చూపించలేదు. మైనింగ్ వాల్యూయేషన్పై నివేదిక ఇచ్చిన తర్వాత చూస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. చంద్రబాబు ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. తమ వాదన వినకుండా బెయిల్ ఇచ్చారని కోర్టుకు తెలిపారు. అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పుకొచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఇక, అన్ని కేసుల్లో బెయిల్ వచ్చి ఈరోజు విడుదలవుతున్న నేపథ్యంలో వంశీని విడుదల కాకుండా చేసేందుకు టీడీపీ కుట్ర చేస్తోంది. అందులో భాగంగానే బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో కూటమి కేసులు పెట్టింది. -
సుప్రీంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. అత్యున్నత న్యాయస్థానంలో ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జూన్ 24న సర్క్యులర్ జారీ చేశారు. జూన్ 23 నుంచే రిజర్వేషన్ విధానం అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు మోడల్ రిజర్వేషన్ రోస్టర్, రిజిస్టర్ను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. దీని ప్రకారం.. సుప్రీంకోర్టులో పదోన్నతుల్లో ఎస్సీ ఉద్యోగులకు 15 శాతం, ఎస్టీ ఉద్యోగులకు 7.5 శాతం కోటా కల్పిస్తారు.రిజిస్ట్రార్లు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ లైబ్రేరియన్లు, జూనియర్ కోర్టు అసిస్టెంట్లు, చాంబర్ అటెండెంట్లు ఈ రిజర్వేషన్లకు అర్హులు. న్యాయమూర్తులకు ఇవి వర్తించవు. రిజర్వేషన్ విధానంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ స్పందించారు. ప్రభుత్వ సంస్థలు, వివిధ హైకోర్టుల్లో రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని గుర్తుచేశారు. సుప్రీంకోర్టునూ అమల్లోకి తీసుకురావడం సరైన నిర్ణయమని అభిప్రాయడ్డారు. సుప్రీంకోర్టులో రెండో దళిత ప్రధాన న్యాయమూర్తిగా ఆయన రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే. దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం పెంచడానికి ఈ రిజర్వేషన్లు దోహదపడతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. -
వలస ఖైదీలను మూడో దేశానికి పంపొచ్చు.. అమెరికా సుప్రీంకోర్టు
వాషింగ్టన్: వలసదారులను వారి స్వదేశాలకు కాక ఇతర దేశాలకు తిరిగి పంపించే ప్రక్రియకు అమెరికా సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. వలసదారులను మూడో దేశానికి పంపడం వల్ల వారు ఎదుర్కొనే ప్రమాదాలను అధికారులకు చెప్పడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును తోసిపుచ్చింది. ఇది అక్రమాలకు వారు అనుభవించే ప్రతిఫలమని కోర్టు వ్యాఖ్యానించింది.వలసదారుల బహిష్కరణలపై కఠిన వైఖరి అవలంబిస్తున్న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఊరటను ఇచ్చింది. ఈ కేసులో మయన్మార్, దక్షిణ సూడాన్, క్యూబా, మెక్సికో, లావోస్, వియత్నాం దేశాలకు చెందిన ఎనిమిది మంది వలసదారులు ఉన్నారు. వీరిని మే నెలలో దక్షిణ సూడాన్కు వెళ్తు విమానంలో పంపించారు.అయితే వలసదారులను మూడో దేశాలకు తరలిస్తే అక్కడ వారు హింసకు లేదా హత్యకు గురయ్యే అవకాశం ఉందన్న అప్పీళ్లను సుప్రీం కొట్టిపారేసింది. కోర్టు తీర్ప భయంకరమైనదని నేషనల్ ఇమ్మిగ్రేషన్ లిటిగేషన్ అలయన్స్ తెలిపింది. ఈ నిర్ణయం తమ క్లయింట్లను హింసకు, మరణానికి గురిచేసిందన్నారు. ఈ తీర్పు అమెరికా ప్రజల భద్రత, రక్షణకు విజయమని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పేర్కొంది. ఎనిమిది మంది వలసదారులు అమెరికాలో హత్య, దహనం, సాయుధ దోపిడీతో సహా క్రూరమైన నేరాలకు పాల్పడ్డారని తెలిపింది. కానీ, ఖైదీలలో చాలా మందిపై ఎటువంటి నేరారోపణలు లేవని వలసదారుల న్యాయవా దులు సుప్రీంకోర్టుకు వినిపించారు. -
రూ.500 లంచం తీసుకున్నందుకు పదేళ్ల తర్వాత జైలు
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): రూ.500 లంచం తీసుకున్న పాపానికి రిటైర్డ్ అయిన 10 సంవత్సరాలకు ఒక విలేజ్ అకౌంటెంట్కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన బెళగావిలో చోటుచేసుకుంది. నాగేశ్ శివంగేకర్ 30 సంవత్సరాల క్రితం విధుల్లో ఉన్న సమయంలో బెళగావి తాలూకా కడోలి గ్రామానికి చెందిన లక్ష్మణ్ ఓ పని కోసం నాగేశ్ను ఆశ్రయించగా రూ.500 లంచం డిమాండ్ చేశాడు. దీంతో లక్ష్మణ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. పథకం ప్రకారం లోకాయుక్త పోలీసులు దాడి చేసి నాగేశ్ను అరెస్టు చేశారు. 2006లో నాగేశ్కు కోర్టు రూ.వెయ్యి జరిమానా, ఏడాది జైలు శిక్ష విధించింది. తర్వాత ధార్వాడ హైకోర్టును ఆశ్రయించగా శిక్షను రద్దు చేసింది. అయితే అప్పటికే నాగేశ్ రిటైర్ య్యారు. అయితే లోకాయుక్త సుప్రీకోర్టుకు అప్పీలుకు వెళ్లింది. నాగేశ్కు పది సంవత్సరాల జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది. ఆయన్ను బెళగావి హిండలగా జైలుకు తరలించారు. కాగా ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతి చెంది 5ఏళ్లు కావడం గమనార్హం. -
థగ్ లైఫ్ బ్యాన్.. కర్ణాటక ప్రభుత్వంపై సుప్రీం సీరియస్!
కోలీవుడ్ అగ్రనటుడు కమల్ హాసన్ నటించిన చిత్రం థగ్ లైఫ్. జూన్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. మణిరత్న- కమల్ కాంబోలో వచ్చిన ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ అంతగా మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంలో విఫలమైంది.అయితే బెంగళూరులో కమల్ చేసిన వ్యాఖ్యలతో థగ్ లైఫ్ను కర్ణాటక రిలీజ్ చేయలేదు. కన్నడ భాషను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వివాదానికి దారితీశాయి. దీంతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ థగ్ లైఫ్ సినిమాపై నిషేధం విధించింది. ఈ వివాదంపై కమల్ హాసన్ టీమ్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కర్ణాటక ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. థగ్ లైఫ్ను కర్ణాటకలో అడ్డుకోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది మీ కర్తవ్యమని కర్ణాటక ప్రభుత్వానికి గుర్తు చేసింది.సుప్రీం తీర్పుతో థగ్ లైఫ్ సినిమా స్క్రీనింగ్కు ఎట్టకేలకు రక్షణ కల్పిస్తామని కర్ణాటక ప్రభుత్వం నుంచి హామీ లభించింది. ఈమేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ చిత్రంపై అనధికారిక బ్యాన్కు సంబంధించి దాఖలైన పిల్ విచారణను ముగించింది. తమిళం నుంచే కన్నడ పుట్టిందన్న కమల్ వ్యాఖ్యలతో ఈ వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. -
థగ్లైఫ్ కర్ణాటకలో విడుదల కావాల్సిందే
న్యూఢిల్లీ: కన్నడ భాషపై ప్రముఖ నటుడు కమల్హాసన్ చేసిన వ్యాఖ్యలతో వివాదాస్పదంగా మారిన థగ్లైఫ్ సినిమా విడుదలపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. సినిమాను కర్ణాటక రాష్ట్రంలో విడుదలచేయాల్సిందేనంటూ థగ్లైఫ్ చిత్రబృందానికి అనుకూలంగా ఉత్తర్వులిచి్చంది. రాష్ట్రంలో సినిమా విడుదల వేళ భాషా సంబంధ నిరసన సంఘాలు ఎలాంటి అవాంతరాలు సృష్టించకుండా, ఉద్రిక్తతలు తలెత్తకుండా అంతా సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత కర్ణాటక ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టంచేసింది. సినిమా చూడొద్దని ప్రేక్షకులపై ఎవరూ తుపాకీ తలకు గురిపెట్టకూడదని జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘సినిమా విడుదలను, సినిమాను అడ్డుకునేందుకు అల్లరిమూకలు, నిరసనసంఘాలు వీధుల్లో వీరంగం ఆడతామంటే ఒప్పుకోం. శాంతిభద్రతలకు సంబంధించి చట్టాన్ని తూ.చ. తప్పకుండా ఖచి్చతంగా అమలుచేయాల్సిందే. ఆందోళనకారుల ఆగడాలను మేం అస్సలు సహించం. ఏదైనా అంశంపై ఒకరు అభ్యంతరకర వ్యాఖ్యలుచేస్తే ఇంకొరు దానిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రతి విమర్శలు చేయొచ్చు. అంతేగానీ సినిమా విడుదలను అడ్డుకోకూడదు’’అని జస్టిస్ భూయాన్ వ్యాఖ్యానించారు. సినిమా విడుదల విషయంలో మీ వైఖరి ఏంటో జూన్ 18వ తేదీకల్లా చెప్పాలని కర్ణాటక ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. -
హక్కుల పరిరక్షణలో సుప్రీం కీలకపాత్ర
సిటీ కోర్టులు: ప్రాథమిక హక్కుల పరిరక్షణలో సుప్రీంకోర్టు కీలక పాత్ర పోషిస్తోందని, పౌరుల హక్కులకు భంగం కలిగినప్పుడు కాపాడేందుకు ఆదేశాలు జారీ చేస్తోందని జస్టిస్ రాధారాణి పేర్కొన్నారు. కుల, మత, లింగ, ఇతర వివక్ష లేకుండా సమానత్వపు హక్కును అందించడంలో అత్యున్నత న్యాయస్థానం పాత్ర ప్రశంసనీయమన్నారు. సుప్రీంకోర్టు ప్రారంభమై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మార్వాడి శిక్షా సమితి (ఎంఎస్ఎస్) న్యాయ కళాశాల ఆధ్వర్యంలో బేగంపేట్లో శనివారం జాతీయ సదస్సు నిర్వహించారు.తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాధారాణి, జస్టిస్ టి.మాధవిదేవి, జస్టిస్ సూరేపల్లి నందా, జస్టిస్ నర్సింగ్ రావు నందికొండ, పట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డి హాజరయ్యారు. జస్టిస్ టి.మాధవిదేవి మాట్లాడుతూ... దేశంలో లింగ సమానత్వం కోసం సుప్రీంకోర్టు అనేక తీర్పులిచ్చిందన్నారు. పెరిగిపోతున్న లింగ భేదాన్ని తగ్గించేందుకు గర్భనిర్ధారణ పరీక్షలపై నిషేధం విధించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. జస్టిస్ సూరేపల్లి నందా మాట్లాడుతూ.. 75 ఏళ్లలో సుప్రీంకోర్టు ఇచి్చన అనేక సంచలనాత్మక తీర్పులను, వాటి పరిణామాలను చదివి వినిపించారు. -
కొమ్మినేనిపై హోంమంత్రి అనిత వ్యాఖ్యలు హేయం: పొన్నవోలు
సాక్షి, తాడేపల్లి: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావునుద్దేశించి హోంమంత్రి అనిత వ్యాఖ్యలు హేయం అని వైస్సార్సీపీ జనరల్ సెక్రటరీ, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి మండిపడ్డారు. కొమ్మినేనిపై హోంమంత్రి వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు నివేదిస్తామని సుధాకర్రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. డిబేట్లో పార్టిసిపెంట్ మాటలను కొమ్మినేనికి ఎలా ఆపాదిస్తారని సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వాన్ని కడిగేసింది. కొమ్మినేని విషయంలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగింది కాబట్టే సుప్రీంకోర్టు గట్టి ఆదేశాలు ఇచ్చింది’’ అని పొన్నవోలు పేర్కొన్నారు.తన విచక్షణాధికారాన్ని వినియోగించి ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు కొమ్మినేని విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. అయినా సరే కొమ్మినేనిపై ఉద్దేశ పూర్వకంగా విషం కక్కుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఈ ప్రభుత్వం కుట్రను బద్దలు చేశాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను తట్టుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. తాము చేసిన ఆరోపణలనే ఈ రాష్ట్రం, దేశమే కాదు, కోర్టులు కూడా నమ్మాలన్న భావనలో ఉన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను శిరసావహించాలన్న విజ్ఞత హోంమంత్రి చూపడంలేదు. ఒక హోంమంత్రికి సుప్రీంకోర్టు ఆదేశాల విలువ తెలియకపోవడం దురదృష్టకరం. హోంమంత్రి అనిత మాటలు సుప్రీంకోర్టును తప్పుబట్టేలా ఉన్నాయి’’ అని పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఈ కేసు ఇంకా ముగిసిపోలేదు, విచారణలో ఉందనే విషయం ఆమెకు తెలియదా?. సుప్రీంకోర్టు విచారణలో ఉన్న అంశంపై ఒక హోంమంత్రి ఇష్టానుసారంగా మాట్లాడటం చట్ట విరుద్ధం. కొమ్మినేని అరెస్టు వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆమె మాటల్లోనే వ్యక్తం అవుతోంది. డిబేట్లు చేయొద్దని సుప్రీంకోర్టు ఎలాంటి దేశాలు ఇవ్వలేదు. జర్నలిస్టుగా ఆయన వాక్ స్వాతంత్రాన్ని కాపాడాల్సిన బాధ్యతనూ సుప్రీంకోర్టు గుర్తుచేసింది...కావాలంటే ఆ తీర్పు కాపీని మంత్రికి పంపిస్తాను. తాను అనని మాటలను కొమ్మినేనికి ఆపాదించి, ఆ ముసుగులో సాక్షి కార్యాలయాలపై దాడులు చేశారు. ఈ దాడులకు పోలీసులు పహరా కాశారు. దాడుల్లో పాల్గొన్న వారంతా టీడీపీ నాయకులు, కార్యకర్తలే. వీడియో, ఫొటోల రూపంలో అన్ని ఆధారాలున్నాయి. తుదపరి విచారణలో మొత్తం ఈ వ్యవహారాన్ని కోర్టు ముందుపెడతాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. లేకుంటే అరాచకం ప్రబలుతుంది’’ అని పొన్నవోలు సుధాకర్రెడ్డి పేర్కొన్నారు. -
YS Jagan: బాబుకు సుప్రీం కోర్టు బాగా బుద్ధి చెప్పింది
-
నవ్వితేనే అరెస్టు చేస్తారా?... సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్రావు అరెస్టు విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
-
థగ్ లైఫ్ బ్యాన్.. కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు!
కమల్ హాసన్ నటించిన చిత్రం థగ్ లైఫ్. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. తొలి మూడు రోజుల్లో భారీగానే వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీ ఇప్పటివరకు పెద్దగానే వసూళ్లు రాబట్టలేకపోయింది. అయితే ఈ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకపోవడం కూడా కలెక్షన్స్పై ప్రభావం చూపింది.అయితే థగ్లైఫ్ సినిమా నిషేధంపై సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కన్నడపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో థగ్ లైఫ్ను కర్ణాటకలో నిషేధిస్తున్నట్లు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. ఆ తర్వాత హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసింది. కమల్ క్షమాపణలు చెబితే విడుదలకు అనుమతి ఇస్తామని చెప్పిన ఆయన వెనక్కి తగ్గలేదు. దీంతో థగ్ లైఫ్ కర్ణాటకలో రిలీజ్ చేయలేదు.అయితే సెన్సార్ పూర్తయిన చిత్రాన్ని అనధికారికంగా నిషేధించారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తాజాగా థగ్ లైఫ్పై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 17కి వాయిదా వేసింది. చాలా ఏళ్ల తర్వాత కమల్- మణిరత్నం కాంబోలో వచ్చిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో శింబు, త్రిష కీలక పాత్రలు పోషించారు. -
Sake Sailajanath: మీకు సాక్షి అంటే వణుకు అందుకే..
-
డిబేట్ నిర్వహించే వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు?
-
చంద్రబాబుకు సుప్రీంకోర్టు గట్టిగా బుద్ధిచెప్పింది: YS జగన్
-
ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుంది.. అడ్వకేట్ పొన్నవోలు రియాక్షన్
-
కొమ్మినేని అరెస్ట్ టు బెయిల్! ఎప్పుడేం జరిగిందంటే..
సాక్షి, అమరావతి: సుప్రీం కోర్టు తీర్పుతో విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలకు, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. కొమ్మినేనిని తక్షణమే రిలీజ్ చేయాలంటూ.. ఆయన అరెస్ట్ అక్రమమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చేసింది. సాక్షి, కొమ్మినేనికి కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు ఏ సంబంధం లేకపోయినా.. వాటిని ఆపాదిస్తూ ఎల్లో బ్యాచ్ ఎంతగా రెచ్చిపోయిందో తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పుడు, ఏం జరిగిందో పరిశీలిస్తే..9వ తేదీ సోమవారం..గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కొమ్మినేనిని ఈ నెల 9వ తేదీన(సోమవారం) అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి ఆ రోజు ఉదయమే చేరుకుని ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఏ అభియోగాలపై తనను అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించిన కొమ్మినేనికి సరైన సమాధానం ఇవ్వలేదు. 👉70 ఏళ్ల వయసులో.. సీనియర్ సిటిజన్, పైగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన్ను.. ఇంటి లోపల గదిలోకి వెళ్లి మందులను తెచ్చుకునేందుకు కూడా అనుమతించలేదు. బలవంతంగా వాహనం ఎక్కించి గుంటూరుకు తరలించారు. కొమ్మినేనిని సోమవారం ఉదయం 11 గంటలకు అరెస్టు చేసినట్టు ప్రకటించారు.కొమ్మినేనిపై బీఎన్ఎస్ 79, 196(1), 353(2), 299, 356(2), 61(1), 67 ఐటీ యాక్ట్, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సాక్షి మీడియాపై కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా అక్రమ కేసు నమోదు చేసిందని వైఎస్సార్సీపీ మండిపడింది. అదే సమయంలో సాక్షి మీడియా సంస్థలపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగాయి.పోలీసులపై మంగళగిరి కోర్టు ఆగ్రహంఈ నెల 10న (మంగళవారం) కొమ్మినేనిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద ఏ విధంగా కేసు నమోదు చేస్తారు? అంటూ గుంటూరు జిల్లా మంగళగిరి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఆ సెక్షన్ను ఎందుకు పెట్టారని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ డిబేట్లో అసలు ఎస్సీ, ఎస్టీల గురించి చర్చే జరగనప్పుడు ఆ చట్టం కింద కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఆ సెక్షన్లు కొట్టి వేస్తున్నట్లు చెబుతూ.. మెమోలు జారీ చేస్తామని పోలీసులను హెచ్చరించారు. ఆపై కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ని గుంటూరు జైలుకు తరలించారు.ఇవాళ.. పోలీసులకు సుప్రీం కోర్టు మందలింపు కొమ్మినేని అరెస్టు అక్రమమని దాఖలైన పిటిషన్పై శుక్రవారం(13 జూన్) సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ‘‘గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు టీవీ యాంకర్ కొమ్మినేని ఎలా బాధ్యులవుతారు?. నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా?.. అలాగైతే కేసు విచారణ సమయంలో చాలాసార్లు మేమూ నవ్వుతాం అని వ్యాఖ్యానించింది . వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం. -
సత్యమేవ జయతే.. KSR అరెస్టు అక్రమమని తేల్చేసిన సుప్రీంకోర్టు
-
కొమ్మినేని కేసులో జరిగింది ఇదే..: పొన్నవోలు
సాక్షి, ఢిల్లీ: ఒక్క సాకుతో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును జైలుపాలు చేశారని.. ఎప్పటికైనా ధర్మం, న్యాయం గెలుస్తుందని.. ఈ కేసులో సరిగ్గా ఇదే జరిగిందని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొమ్మినేని అరెస్ట్ అక్రమమని.. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు.‘‘మూడేళ్ల లోపు శిక్ష కలిగిన సెక్షన్లకు ఎలా అరెస్టు చేస్తారు?. గెస్ట్ చేసే వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారు?. నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం అక్రమం. పాలక పక్షం మెప్పుకోసం పోలీసులు ప్రయత్నాలు మానుకోవాలి. సాక్షి మీడియా గొంతు నులమాలని చూస్తున్నారు. సాక్షి ఆఫీసులపైన దాడులకు దిగుతున్నారు. పోలీసులు కనీసం కేసులు పెట్టడం లేదు. ఈ అంశాలన్నీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చాం’’ అని పొన్నవోలు తెలిపారు. -
కొమ్మినేని కేసులో సరిగ్గా ఇదే జరిగింది : పొన్నవోలు
-
నవ్వితే అరెస్ట్ చేస్తారా? కొమ్మినేనిని విడుదల చేయాలని సుప్రీం ఆదేశం
-
కొమ్మినేనికి బిగ్ రిలీఫ్.. వెంటనే విడుదల చేయండి.. సుప్రీం ఆదేశం
-
న్యాయ వ్యవస్థ స్వతంత్రత కాపాడేందుకే కొలీజియం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు ఇది ముఖ్యమైన భద్రతా వ్యవస్థగా కొనసాగుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. కొలీజియం వ్యవస్థపై విమర్శలు వస్తున్నాయని అంగీకరించారు. ఈ వ్యవస్థ పరిపూర్ణం కాదని చెప్పారు. కానీ, కార్యనిర్వాహక వర్గం జోక్యం నుంచి న్యాయమూర్తులను రక్షించడంలో కొలీజియం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న జస్టిస్ సూర్యకాంత్ తాజాగా సియాటెల్ యూనివర్సిటీలోని ‘రౌండ్ గ్లాస్ ఇండియా సెంటర్’లో జరిగిన కార్యక్రమంతోపాటు మరో రెండు చోట్ల కీలక ప్రసంగాలు చేశారు. సుప్రీంకోర్టు ఇటీవల చేపట్టిన పలు చర్యలను ప్రస్తావించారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకతను మెరుగుపర్చేందుకే వీటిని అమల్లోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజల్లో విశ్వాసం పెంచుకోవడానికి న్యాయవ్యవస్థ పదే పదే తమ పారదర్శకతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కొలీజియంపై వస్తున్న విమర్శలను నిరాకరించలేమని, ఈ వ్యవస్థను మరింత మెరుగుపర్చాలన్న సంకల్పంతో న్యాయ వ్యవస్థ ముందడుగు వేస్తోందని ఉద్ఘాటించారు. న్యాయం అంటే సిద్ధాంతం, బాధ్యత న్యాయమూర్తులు అంటే అపరిమిత అధికారం కలిగినవారు కాదని... వారు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమేనని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలను నిలబెట్టే విధంగా వ్యవహరించాలని న్యాయమూర్తులకు సూచించారు. కోర్టులు అధికారాన్ని ప్రదర్శించే వ్యవస్థలుగా కాకుండా, ప్రజాస్వామ్య ప్రయాణంలో భాగస్వాములై ఉండాలని పేర్కొన్నారు. న్యాయం అనేది తాత్కాలికంగా పంపిణీ చేయాల్సిన ఉత్పత్తి కాదని.. అది ఒక సిద్ధాంతం, ఒక బాధ్యత అని తేలి్చచెప్పారు. స్వేచ్ఛ, సమానత్వం, స్వయంపాలన అనేవి అనుకోకుండా వచ్చినవి కాదని, ఇవన్నీ సుదీర్ఘమైన పోరాటాల ఫలితంగా సమాజానికి లభించాయని జస్టిస్ సూర్యకాంత్ గుర్తుచేశారు. సుప్రీంకోర్టులో సీనియారిటీ ఆధారంగా, ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ తరువాత జస్టిస్ సూర్యకాంత్ 2025 నవంబర్లో భారత సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. -
ఆ గురుద్వారా అలాగే ఉండనివ్వండి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని షాదారా ప్రాంతంలో ఉన్న గురుద్వారా స్థలం తమదేనని, దాన్ని తమకు అప్పగించాలని కోరుతూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అక్కడ చాలా ఏళ్లుగా గురుద్వారా ఉంది కాబట్టి దాన్ని అలాగే ఉండనివ్వండి అని తేల్చిచెప్పింది. ఒకవేళ ఆ స్థలం మీదేనని మీరు భావిస్తే ఆ అభిప్రాయం మానుకోండి అని సూచించింది. షాదారా గురుద్వారా స్థలం ‘మసీదు తకియా బబ్బర్ షా’కు చెందుతుందని పేర్కొంటూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు 2010 సెపె్టంబర్లో ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీశ్చంద్ర శర్మతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఆ స్థలంలో గురుద్వారా చాలా ఏళ్లుగా ఉందని మీరే చెబుతున్నారు కాబట్టి దాన్ని అలాగే కొనసాగనివ్వాలని పిటిషనర్కు స్పష్టంచేసింది. పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తెలియజేసింది. ఆ స్థలంలో 1947 నుంచి గురుద్వారా ఉన్నట్లు ఢిల్లీ హైకోర్టులో విచారణ సందర్భంగా ఓ సాక్షి చెప్పిన విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. -
కూటమి ప్రభుత్వం వేధింపులపై YSRCP కార్యకర్త ప్రవీణ్ సెల్ఫీ వీడియో
-
బుగ్గ మఠం భూములు.. ఏపీ సర్కార్కు సుప్రీం నోటీసులు
సాక్షి, ఢిల్లీ: ఏపీలోని బుగ్గ మఠం భూముల విషయమై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆదేశించింది.బుగ్గ మఠం భూములపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్పై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అనంతరం, వారం రోజుల్లోగా పెద్దిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జవాబు చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్పై వారం రోజుల్లోగా పిటిషనర్ రిజైన్డర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సమయం ఇచ్చింది. అప్పటివరకు భూములపై యధాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. భారత్కు వస్తున్నా అంటూ ప్రభాకర్ రావు లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసులో కీలక నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు అమెరికా నుంచి భారత్కు తిరిగి వస్తున్నారు. ఈ మేరకు జూన్ ఐదో తేదీన విచారణకు హాజరు అవుతానని దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చారు.వివరాల ప్రకారం.. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు ఎట్టకేలకు అమెరికా నుంచి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో విచారణకు హాజరవుతానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్ లెటర్ రాసిచ్చారు. వన్ టైమ్ ఎంట్రీ పాస్పోర్టు తనకు అందిన వెంటనే భారత్ వస్తానని చెప్పుకొచ్చారు. దీంతో, పాస్పోర్టు అందిన మూడు రోజుల్లో ఆయన భారత్కు రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు దేశాన్ని వీడిన విషయం తెలిసిందే. గత 14 నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలోనే తల దాచుకున్నారు. ప్రభాకర్ భారత్కు వస్తున్న పనేపథ్యంలో ఆయనను విచారించేందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది. ప్రభాకర్ ఉరావును విచారిస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక, అంతకుముందు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు పిటిషన్పై సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరిగింది. మూడు రోజుల్లో స్వదేశానికి రావాలని.. విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. ఈమేరకు అండర్ టేకింగ్ ఇవ్వాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు కఠిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ముందస్తు బెయిల్ అంశంపై తదుపరి విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది -
యూట్యూబర్పై సుప్రీం ధిక్కార చర్యలు
న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానంలోని జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పంజాబ్ యూట్యూబర్ అజయ్ శుక్లాపై సుప్రీంకోర్టు మండిపడింది. సుప్రీం జడ్జీలపై అతడు చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా, ప్రతిష్టకు భంగం కలిగించేలా, ధిక్కార పూరితంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. సుమోటోగా అతడిపై ధిక్కార చర్యలు చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ల ధర్మాసనం శుక్రవారం..తక్షణమే శుక్లా వ్యాఖ్యలున్న వీడియోను తొలగించాలని, మరోసారి అదే వీడియోను కానీ, అలాంటి వీడియోను కానీ ప్రసారం చేయరాదంటూ అతడి వరప్రద్ మీడియా చానల్ను ఆదేశించింది. శుక్లా వ్యాఖ్యలు తీవ్రమైనవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రం, పత్రికా స్వేచ్ఛకు కొన్ని పరిమితులున్నాయని ధర్మాసనం తెలిపింది. ఈ స్వేచ్ఛను అడ్డుపెట్టుకుని సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. శుక్లాపై ధిక్కారం కేసు నమోదు చేయాలని ఆదేశించింది. రిటైర్డు జస్టిస్ బేలా ఎం త్రివేదిపై వ్యాఖ్యలతో కూడిన వీడియోను శుక్లా తన యూట్యూబ్ చానల్లో ఇటీవల అప్లోడ్ చేశాడు. -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు మంచు విష్ణు
-
మనసు విప్పి మాట్లాడుకోండి
న్యూఢిల్లీ: మనసు విప్పి చర్చించుకుంటే పరిష్కారం కాని సమస్యంటూ ఉండదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘‘మీకు మూడేళ్ల కొడుకున్నాడు. వైవాహిక సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడంలో భేషజాలెందుకు? గతమొక చేదుమాత్ర అనుకుని మర్చిపొండి. భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఓ కప్పు చాయ్ తాగుతూ మాట్లాడుకుంటే ఏదైనా సాధ్యమే. ఈ రాత్రి కలిసి భోంచేయండి. విభేదాలను సామరస్యంగా మాట్లాడుకుని పరిష్కరించుకోండి’’ అని విడాకుల కోసం తమను ఆశ్రయించిన ఓ జంటకు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సతీశ్చంద్ర శర్మ ధర్మాసనం సూచించింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
సుప్రీం జడ్జీలుగా ముగ్గురు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురిని సీజేఐ సారథ్యంలోని కొలీజియం సిఫార్సు చేసింది. కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.అంజరియా, గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విజయ్ బిష్ణోయ్, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్ పేర్లను కేంద్రానికి పంపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సోమవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మొత్తం సంఖ్య 34. సీజేఐ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ హృషికేశ్ రాయ్ రిటైర్మెంట్తో ఏర్పడ్డ మూడు ఖాళీలను పూరించేందుకు కొలీజియం తాజా సిఫార్సులు చేసింది. హైకోర్టు సీజేలుగా ఐదుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఐదుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేస్తూ కొలీజియం మరో నిర్ణయం తీసుకుంది. జస్టిస్ సంజీవ్ సచ్దేవను మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా, జస్టిస్ విభు బక్రూను కర్నాటక హైకోర్టు సీజేగా, జస్టిస్ అశుతోష్ కుమార్ను గువాహటి హైకోర్టు సీజేగా, జస్టిస్ విపుల్ మనుబాయి పంచోలీని పట్నా హైకోర్టు సీజేగా, జస్టిస్ తార్లోక్సింగ్ చౌహాన్ను జార్ఖండ్ హైకోర్టు సీజేగా నియమించాల్సిందిగా కేంద్రానికి సిఫార్సు చేసింది. -
కొలీజియంలోకి జస్టిస్ నాగరత్న
న్యూఢిల్లీ: మరో రెండేళ్ల తర్వాత సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి రికార్డ్ సృష్టించబోతున్న జస్టిస్ బీవీ నాగరత్న నేడు సుప్రీంకోర్టు కొలీజియంలో లాంఛనంగా సభ్యురాలు కాబోతున్నారు. ఇంతకాలం కొలీజియంలో సభ్యునిగా ఉన్న సుప్రీంకోర్టు మరో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా శుక్రవారం పదవీవిమరణ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఐదో సీనియర్ మోస్ట్ జడ్జి అయిన జస్టిస్ నాగరత్న మే 25వ తేదీ నుంచి అధికారికంగా సుప్రీంకోర్టు కొలీజియంలో కొనసాగనున్నారు. 2027 అక్టోబర్ 29వ తేదీదాకా ఆమె ఈ కొలీజియంలో కొనసాగుతారు. ఈలోపు అంటే 2027 సెపె్టంబర్ 23వ తేదీన అత్యంత సీనియర్ మోస్ట్ జడ్జి అర్హతతో ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. ఈమె 1989లో ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన మాజీ సీజేఐ జస్టిస్ ఇ. సీతారామయ్య వెంకటరామయ్య కుమార్తె. జస్టిస్ నాగరత్న చేరికతో కొలీజియం సభ్యుల సంఖ్య ఐదుకు పెరగనుంది. ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి ఇందులో సభ్యులుగా ఉన్నారు. సోమవారం సీజేఐ కొలీజియంను సమావేశపరిచి సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఖాళీలపై వివరాలు వెల్లడించనున్నట్లు సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. జస్టిస్ అభయ్ ఎస్.ఓకా రిటైర్ అయ్యాక సుప్రీంకోర్టులో మూడు జడ్జీ పోస్టులు ఖాళీ అయ్యాయి. 1993లో కొత్తగా మనుగడలోకి వచ్చిన సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ ద్వారానే సుప్రీంకోర్టు, 25 హైకోర్టులకు జడ్జీల ఎంపిక, బదిలీ, పదోన్నతి ప్రక్రియలు కొనసాగుతున్నాయి. -
మూడో కాన్పుకూ ప్రసూతి ప్రయోజనాలు
న్యూఢిల్లీ: మూడో కాన్పు అయినంత మాత్రాన ప్రసూతి ప్రయోజనాలు వర్తించకుండా పోవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడుకు చెందిన కె.ఉమాదేవి అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలి పిటిషన్పై శుక్రవారం ఈ మేరకు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. తమిళనాడులో ప్రసూతి ప్రయోజనాలు రెండు కాన్పులకే వర్తిస్తాయి. ఈ కారణంగా మూడో కాన్పుకు ప్రసూతి సెలవులు నిరాకరించడాన్ని ఉమాదేవికి హైకోర్టులో సవాలు చేయగా ఏకసభ్య ధర్మాసనం ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ‘‘తొలి వివాహం ద్వారా ఇద్దరు సంతానం కలిగేనాటికి ఆమె ఉద్యోగంలోనే చేరలేదు. పైగా ఆ పిల్లలు ఇప్పుడు మాజీ భర్త సంరక్షణలోనే ఉన్నారు’’ అని గుర్తు చేసింది. ఆ తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేయడంతో ఉమాదేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. డివిజన్ బెంచ్ తీరును జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం తప్పుబట్టింది. మహిళల పునరుత్పత్తి హక్కుల్లో, ప్రసూతి ప్రయోజనాల్లో ప్రసూతి సెలవులు అత్యంత కీలకమైనవని స్పష్టం చేసింది. పైగా ప్రభుత్వోద్యోగిగా ప్రసూతి ప్రయోజనాలను ఆమె తొలిసారి కోరుతోందని హైకోర్టు సింగిల్ జడ్జి వ్యాఖ్యలను ఉటంకిస్తూ గుర్తు చేసింది. ఉమాదేవికి ప్రసూతి సెలవులు, ఇతర ప్రయోజనాలు కలి్పంచాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. -
‘కోటా’ మరణాలపై సుప్రీంకోర్టు సీరియస్
ఢిల్లీ: రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్, ఐఐటీ కోచింగ్ సెంటర్లకు అడ్డాగా ఉన్న రాజస్థాన్లోని కోటాలో ఈ ఏడాది 14 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. విద్యార్థుల ఆత్మహత్యలపై నమోదైన పిటిషన్లపై జేబీ పార్దివాలా, ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఏం చేస్తోంది?.. కోటాలో ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకున్నారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలను తేలికగా తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆత్మహత్యలపై సిట్ ఏర్పాటు చేశామని రాజస్థాన్ సర్కార్ తెలిపింది. తదుపరి విచారణ జులై 14కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కాగా, రాజస్థాన్లో కోచింగ్ సెంటర్ హబ్గా పేరు పొందిన కోటాలో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది.నిరుపేద కుటుంబాల నుంచి పిల్లలు చదువుల ఒత్తిడి తట్టుకోలేకపోవడమో, తల్లిదండ్రులు చేసిన అప్పు వేధిస్తూ ఉండడంతో ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయన్న అంచనాలున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల ఆత్మహత్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఇది చాలా ఆందోళకరమైన విషయం అంటూ రాజస్థాన్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలు కోటాలో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయంటూ నిలదీసింది. -
ఈడీపై సుప్రీం ఆగ్రహం
-
వక్ఫ్ పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్
ఢిల్లీ: వక్ఫ్ చట్ట సవరణపై స్టే విధించాలన్న అంశంపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం (మే22) ఈ పిటిషన్లపై బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ వాదనలు ఆసక్తికరంగా సాగాయి. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం వక్ఫ్ బిల్లు సవరణ చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలన్న విజ్ఞప్తిపై ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. #BreakingNews | Supreme Court reserves its order for interim relief on a batch of pleas challenging the Constitutional validity of the Waqf (Amendment) Act, 2025.#WaqfAct #WaqfBoard #Waqf #SupremeCourt pic.twitter.com/icvCz361gx— DD News (@DDNewslive) May 22, 2025 -
తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే
-
హద్దు దాటారు.. తమిళనాడులో ఈడీ సోదాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఢిల్లీ: తమిళనాడులో లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ హద్దులు దాడి వ్యవహరించిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి వ్యాఖ్యలు చేశారు. దేశంలోని సమాఖ్య వ్యవస్థను ఈడీ ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు.ఇటీవల తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్లో ఈడీ సోదాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. సిబల్ వాదనలు వినిపిస్తూ.. 2014-21 వరకు రాష్ట్ర ప్రభుత్వమే అవినీతి ఆరోపణలపై 41 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. కానీ, ఈడీ 2025లో టాస్మాక్ హెడ్ క్వార్టర్లలో సోదాలు చేసి ఉద్యోగుల ఫోన్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుందన్నారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం స్పందిస్తూ.. వ్యక్తులపైన కేసు రిజిస్టర్ చేయవచ్చు కానీ.. మొత్తం కార్పొరేషన్ను దీనికి సంబంధం ఏమిటి? అని ప్రశ్నించింది. ఈడీ హద్దులు దాడి వ్యవహరించింది. దేశంలోని సమాఖ్య వ్యవస్థను ఈడీ ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం, తమిళనాడు లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.CJI: We have granted stay; Sibal: they are investigating-why are ED coming here?ASG Raju: We have done nothing wrong CJI: If they have registered FIR, why ED should come? Raju: 1000 crore fraudCJI: Where is the predicate offence? ED passing all limits— Live Law (@LiveLawIndia) May 22, 2025ఇదిలా ఉండగా.. తమిళనాడులో లిక్కర్ స్కాం కేసులో 1,000 కోట్లకు పైగా ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు తమిళనాడులో రాజకీయ గందరగోళాన్ని సృష్టించింది. తమిళనాడులో మద్యం విక్రయాలపై పూర్తి గుత్తాధిపత్యం కలిగిన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ TASMAC, రాష్ట్ర ఆదాయంలో గణనీయమైన భాగం (సంవత్సరానికి దాదాపు రూ. 45,000 కోట్లు) సమకూరుస్తుంది. ఇది రాష్ట్రంలో 4,700కు పైగా రిటైల్ షాపుల ద్వారా మద్యం పంపిణీ చేస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకారం.. TASMAC కార్యకలాపాలలో బహుళ అవకతవకలు జరిగాయి. ఇందులో టెండర్ మానిప్యులేషన్, అక్రమ నగదు లావాదేవీలు, రూ. 1,000 కోట్లకు పైగా మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపించింది. కాగా ఇటీవల ఈ కేసులో భాగంగా టాస్మార్క్ అధికారుల ఇళ్లు, ఆఫీస్లలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో ఈడీ అధికారుల తీరుకు వ్యతిరేకంగా TASMAC అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
సెలవుల్లో పని చేయడానికి లాయర్లు ఇష్టపడడం లేదు
న్యూఢిల్లీ: సెలవు రోజుల్లో పని చేయడానికి న్యాయవాదులు ఇష్టపడడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. మరోవైపు పెండింగ్ కేసులు పరిష్కరించడం లేదంటూ న్యాయ వ్యవస్థపై విమర్శలు వస్తున్నాయని పేర్కొంది. తమ పిటిషన్పై విచారణను వేసవి సెలవుల తర్వాత ప్రారంభించాలని కోరిన ఓ న్యాయవాది పట్ల ధర్మాసనం బుధవారం అసంతృప్తి వ్యక్తంచేసింది. సుప్రీంకోర్టులో మొదటి ఐదుగురు న్యాయమూర్తులు వేసవి సెలవుల్లోనూ విధులు నిర్వర్తిస్తారని తెలియజేసింది. అయినప్పటికీ బ్యాక్లాగ్ కేసుల విషయంలో తమపై నిందలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. వాస్తవానికి వేసవి సెలవుల్లో పని చేయడం లాయర్లకు ఎంతమాత్రం ఇష్టం లేదని ఆక్షేపించింది. సుప్రీంకోర్టుకు ఈ నెల 26 నుంచి జూలై 13 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు న్యాయస్థానం నోటిఫికేషన్ జారీ చేసింది. సెలవుల సమయంలోనూ ధర్మాసనాలు పాక్షికంగా పని చేయాలని సూచించింది. రెండు నుంచి ఐదు వెకేషన్ బెంచ్లు పని చేయాలని నిర్దేశించింది. సీజేఐ సహా ఐదుగురు న్యాయమూర్తులు విధులకు హాజరవుతారు. గతంలో వేసవి సెలవుల్లో కేవలం రెండు వెకేషన్ బెంచ్లు పనిచేసేవి. సీనియర్ న్యాయమూర్తులు విధులు నిర్వర్తించాలన్న నిబంధన ఉండేది కాదు. కానీ, ఈ నిబంధనల్లో సుప్రీంకోర్టు తాజాగా మార్పులు చేసింది. ఈ నెల 26 నుంచి ఐదు ధర్మాసనాలకు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ బి.బి.నాగరత్న నేతృత్వం వహిస్తారు. అలాగే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అన్ని పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా తెరిచి ఉంటుంది. -
నాగం జనార్ధన్రెడ్డి పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ నాగం జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ బివి.నాగరత్నం, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ జరిపింది.నాగం జనార్ధన్రెడ్డి తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపిస్తూ.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పెద్ద ఫ్రాడ్ జరిగిందన్నారు. ప్రభుత్వ ఖజానాకు రూ.2426 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ప్రభుత్వం ఆమోదించిన ప్రకారం 65 శాతం పంపులు, మోటార్ల కోసం బీహెచ్ఈఎల్కు చెల్లింపులు చేయాలి. 35 శాతం సివిల్ వర్క్స్కు మేఘాకు చెల్లింపులు చేయాలి.. కానీ, అంతర్గత ఒప్పందం ప్రకారం బీహెచ్ఈఎల్కు 65 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు. మేఘాకు 80 శాతం చెల్లింపులు జరిగాయి. 65:35 నుంచి 20:80 కు ఎలా మారింది. ఇందులో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ వాదనలు వినిపించారు. న్యాయవాది ముకుల్ రోహతగి తన వాదనలు వినిపిస్తూ.. ‘‘తెలంగాణ హైకోర్టులో దీనికి సంబందించిన ఐదు పిటిషన్లు కొట్టివేశారు.. ఇందులో ఎలాంటి ఫ్రాడ్ లేదని స్పష్టం చేసింది. సివిసి కూడా ఇందులో ఏమి లేదని తేల్చింది. ఎస్టిమేషన్ పెంచడాన్ని తప్పు పడుతున్నారు. బీహెచ్ఈఎల్ కూడా ఇందులో ఫిర్యాదు చేయలేదు. ఏదో ఒక డాక్యుమెంట్ తెచ్చి కేసులు వేస్తున్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ బాగా పని చేస్తోంది’’ అని ముకుల్ రోహతగి తెలిపారు. -
ఇస్లాంలో తప్పనిసరి భాగం కాదు
న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ) చట్టం–2025ను కేంద్ర ప్రభుత్వం గట్టిగా సమర్థించుకుంది. వక్ఫ్ అనేది ఇస్లామిక్ భావనే అయినప్పటికీ ఇస్లాంలో అది తప్పనిసరి భాగం కాదని తేల్చిచెప్పింది. వక్ఫ్ అంటే ఇస్లాంలో ఒక సేవా కార్యక్రమం అని స్పష్టంచేసింది. వక్ఫ్(సవరణ) చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ ధర్మానం ఎదుట వాదనలు వినిపించారు. సేవా కార్యక్రమాలను ప్రతి మతం గుర్తించి, ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఏ మతంలోనైనా ఇలాంటి సేవా కార్యక్రమాలను తప్పనిసరి భాగంగా చూడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ‘వక్ఫ్ బై యూజర్’ సూత్రం ఆధారంగా ప్రభుత్వ ఆస్తులు, భూములపై ఎవరూ హక్కులు కోరలేరని అన్నారు. వక్ఫ్ బై యూజర్ నిబంధనను అడ్డం పెట్టుకొని వక్ఫ్ ఆస్తులను రాష్ట్రాలు బలవంతంగా లాక్కోలేవని చెప్పారు. దీనిపై ఆందోళన అవసరం లేదని వివరించారు. వక్ఫ్ బై యూజర్ అనేది ప్రాథమిక హక్కు కాదని, ఇది శాసన వ్యవస్థ తీసుకొచ్చిన నిబంధన అని గుర్తుచేశారు. దాన్ని తొలగించే అధికారం కూడా శాసన వ్యవస్థకు ఉందన్నారు. ప్రభుత్వ భూములపై ఎవరికీ హక్కు ఉండదని అన్నారు. ప్రభుత్వ భూములను ప్రభుత్వం కచ్చితంగా రక్షించాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చినట్లు గుర్తుచేశారు. ప్రభుత్వ భూములతోపాటు వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 14 కోట్ల మంది పౌరుల తరఫున వక్ఫ్ ఆస్తులకు ప్రభుత్వం సంరక్షకురాలిగా వ్యవహరిస్తోందని ఉద్ఘాటించారు. వక్ఫ్(సవరణ) చట్టం ప్రకారం సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్(సీడబ్ల్యూసీ)తోపాటు స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమిస్తారంటూ ఆందోళన చెందడం అర్థరహితమని తుషార్ మెహతా వ్యాఖ్యానించారు. సీడబ్ల్యూసీలో మొత్తం 22 మంది సభ్యులను నియమించే అవకాశం ఉందని, అందులో ముస్లిమేతరులు గరిష్టంగా నలుగురు మాత్రమే ఉంటారని వెల్లడించారు. ఇక స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో 11 మంది సభ్యులకు అవకాశం ఉండగా, అందులో ముస్లిమేతరులు ముగ్గురు మాత్రమేనని వివరించారు. ఎక్ఫ్–అఫీషియో సభ్యులు ముస్లిమేతరులు అయితే సభ్యులుగా ఇద్దరు ముస్లిమేతరులకే స్థానం దక్కుతుందని పేర్కొన్నారు. వక్ఫ్(సవరణ) చట్టంతో ముస్లిమేతరులు కూడా ప్రభావితం అవుతు న్నారు కాబట్టి వారిని సభ్యులు నియమించే నిబంధన తీసుకొచ్చినట్లు తెలియజేశారు. ఈ చట్టంపై వాదనలు గురువారం కూడా కొనసాగనున్నాయి. -
పూజా ఖేడ్కర్ హంతకురాలో, తీవ్రవాదో కాదు: సుప్రీంకోర్టు
ఢిల్లీ: మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్కు బెయిల్ మంజూరైంది. నకిలీ సర్టిఫికెట్ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. పూజ హంతకురాలో, తీవ్రవాదో కాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు తీవ్రత, వాస్తవాలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఉండాల్సిందంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.ఇప్పుడు పూజ అన్నీ కోల్పోయింది.. ఎక్కడా ఆమెకు ఉద్యోగం దొరికే అవకాశం కూడా లేదన్న ధర్మాసనం.. ఈ కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని సూచించింది. కాగా, నకిలీ సర్టిఫికెట్లతో ఐఏఎస్కు ఎంపికైన పూజ ఖేడ్కర్ను శిక్షణ నుంచి యూపీఎస్సీ తొలగించిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ రూల్స్ 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికార ఉత్తర్వుల్లో పేర్కొంది.పుణెలో ఐఏఎస్ ప్రొబేషనరీ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఖేద్కర్పై ఆరోపణలు ఉన్నాయి. ట్రైనింగ్ సమయంలో అధికారిక ఐఏఎస్ నెంబర్ ప్లేట్ కలిగిన కారు, కార్యాలయం వినియోగించడంతో గత ఏడాది ఆమెపై పుణె కలెక్టర్ మహారాష్ట్ర సీఎస్కు లేఖ రాశారు. దీంతో ఆమెపై బదిలీ వేటు పడింది. సివిల్ సర్వీసెస్కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు సైతం తేలింది.అంతేగాక నిబంధనలకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ... ఆమెను ముస్సోరిలోని లాల్బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. -
మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును ఆక్షేపించిన సుప్రీంకోర్టు
-
సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులపై విచారణకు ముందస్తు అనుమతి ఎందుకు?
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణల్లో న్యాయ విచారణల నుంచి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు ఉన్న రక్షణకు సంబంధించి ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిపై అభియోగాలు వచ్చినప్పుడు విచారించేందుకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. అందుకు సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. సోమవారం ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టల కేసును ప్రస్తావించారు. ‘‘అది బయటపడి రెండు నెలలవుతోంది. అయినా జస్టిస్ వర్మపై ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. పైగా దానిపై విచారణ జరిపిన ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ సాక్షుల నుంచి కేసుకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. అలా ఎలా చేస్తారు? ఇది చాలా తీవ్రమైన అంశం’’ అంటూ మండిపడ్డారు. జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదులో ఇంత ఆలస్యం ఎందుకని ధన్ఖడ్ ప్రశ్నించారు. ‘‘ఆయన నివాసంలో బయటపడ్డ డబ్బెంత, దాని మూలా లేమిటి, అది ఎవరికి చెందినది, ఈ ఉదంతం న్యాయవ్యవస్థనే కలుషితం చేసిందా వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ప్రజలంతా ఊపిరి బిగబట్టి మరీ ఎదురు చూస్తున్నారు. దీని వెనక దాగున్న పెద్ద తిమింగలాలెవరో కనిపెట్టి బయట పెట్టాల్సిన అవసరముంది. దేశ పౌరులందరికీ సమానంగా వర్తించే నేరన్యాయ వ్యవస్థను ఇంత కీలకమైన కేసుకు ఎందుకు వర్తింపజేయలేదు?’’ అంటూ ప్రశ్నలు గుప్పించారు. రెండు నెలలు దాటుతున్నా ఈ ప్రశ్నల్లో వేటికీ ఇప్పటిదాకా బదులు లేదన్నారు. ‘‘జస్టిస్ వర్మ కేసులో సత్వర విచారణ జరగాల్సిన అవసరముంది. 1991లో సుప్రీంకోర్టు ఇచ్చిన కె.వీరాస్వామి తీర్పును పునఃపరిశీలించాల్సిన సమయం కూడా వచ్చింది’’ అని ధన్ఖడ్ అన్నారు. జస్టిస్ వర్మ ఇంట్లో భారీగా నోట్లకట్టలు బయటపడటం నిజమేనని కమిటీ తేల్చడం, సీజేఐ ఆ నివేదికను రాష్ట్రపతికి పంపడం, ఆయన్ను పదవి నుంచి తొలగించాలని సిఫార్సు చేయడం తెలిసిందే.పారదర్శక నియంత్రణ వ్యవస్థ కావాలిదురుద్దేశపూర్వక ఆరోపణలు తదితరాల నుంచి ఉన్నతస్థాయి న్యాయమూర్తులకు తప్పకుండా రక్షణ కల్పించాల్సిందేనని ధన్ఖడ్ అభిప్రా యపడ్డారు. అయితే ఈ విషయంలో సమగ్రమైన అంతర్గత నియంత్రణ వ్యవస్థ కూడా అత్యంత అవసరమని స్పష్టం చేశారు. అది పూర్తి పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, వేగవంతంగా ఉండాలని సూచించారు. ‘‘జస్టిస్ వర్మ ఉదంతంపై ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఒక హైకోర్టు న్యాయమూర్తితో సీజేఐ ఒక కమిటీ వేశారు. నిజానిజాలను నిగ్గుదేల్చేందుకు వారెంతగా శ్రమించి ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి. కానీ వారి కమిటీకి ఎలాంటి రాజ్యాంగబద్దతా, చట్టబద్దతా లేవు. వారిచ్చే నివేదికను సుప్రీంకోర్టు సొంతంగా ఏర్పాటు చేసుకుని పాలనపమైన ఏర్పాటును అనుసరించి ఎవరికైనా పంపవచ్చు. ఇక ఆ నివేదిక ప్రయోజనమేమిటి?’’ అని ఆయన ప్రశ్నించారు. ఏమిటా తీర్పు?సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు అవినీతి నిరోధక చట్టాల వర్తింపు విషయమై కె.వీరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1991లో అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ‘‘న్యాయమూర్తులు కూడా ప్రజా సేవకులే. కానీ ఆ చట్టం ప్రకారం వారిని విచారించేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరి’’ అని పేర్కొంది. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాలంటే ఇది తప్పనిసరి తెలిపింది. -
సహ నిందితుల వాంగ్మూలం ఆధారమా?
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై అక్రమ కేసులో కె.ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసే సమయంలో సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. భారతీయ సాక్ష్యాల చట్టం 1872 సెక్షన్ 30 కింద తుది విచారణ (ట్రయల్) సందర్భంగా ఏ వాంగ్మూలాలను అయితే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందో, వాటిని ముందస్తు బెయిల్, బెయిల్ మంజూరు సమయంలో కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని హైకోర్టు చెప్పడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.హైకోర్టు అభిప్రాయంతో తాము ఎంతమాత్రం ఏకీభవించలేమని స్పష్టం చేసింది. సహ నిందితుల వాంగ్మూలాలను ముందస్తు బెయిల్, బెయిల్ మంజూరు సమయంలో పరిగణనలోకి తీసుకోవడానికే వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సీఆర్పీసీ సెక్షన్ 161 కింద వాంగ్మూలం ఇచ్చింది సాక్షా? లేక నిందితుడా? లేక నిందితుడిగా మారే వ్యక్తా? అన్న విషయాన్ని బెయిల్, ముందస్తు బెయిల్ మంజూరు సమయంలో కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొన్ని సందర్భాల్లో 161 వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి నిందితుడు కాకపోవచ్చు.. ఆ తరువాత నిందితుడు కావొచ్చని పేర్కొంది. నేర విచారణ ప్రక్రియలో ఓ నిందితుడి వాంగ్మూలాన్ని సహ నిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించరాదన్నది ప్రాథమిక సూత్రమని తెలిపింది. రాజకీయ దురుద్దేశాలున్నట్లు పిటిషనర్లు ప్రాథమిక ఆధారాలు చూపారు.. ప్రభుత్వం న్యాయపరమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.. మద్యం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కృష్ణమోహన్రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, వికాట్ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ జంషేడ్ బొర్జూర్ పారీ్థవాలా, జస్టిస్ మహాదేవన్ల ధర్మాసనం వాటిని కొట్టేసింది.దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున దాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదంటూ పిటిషన్లు కొట్టేసింది. ఇదే సమయంలో మద్యం కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలున్నట్లు పిటిషనర్లు ప్రాథమిక ఆధారాలను చూపారని, ఇందుకు ప్రభుత్వం న్యాయపరమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పునకు సంబంధించిన కాపీ తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఈ తీర్పులో ధర్మాసనం నిందితుల వాంగ్మూలాల గురించి పూర్తిస్థాయిలో చర్చించింది. కస్టడీలో పోలీసులకిచ్చిన వాంగ్మూలానికి ఆమోద యోగ్యత లేదు... ‘భారతీయ సాక్ష్యాల చట్టం సెక్షన్ 24 ప్రకారం సహ నిందితుడిపై మరో నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు.. ఆ వాంగ్మూలాన్ని ఆ వ్యక్తికి వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యంగా రుజువు చేయాల్సి ఉంటుంది. ఈ వాంగ్మూలం భయపెట్టి, బెదిరించి, ప్రలోభపెట్టి తీసుకున్నదై ఉండకూడదు. పోలీసు అధికారికి ఇచ్చిన వాంగ్మూలాన్ని నిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించడానికి వీల్లేదు. పోలీసు అధికారికి ఇచ్చిన వాంగ్మూలం భారతీయ సాక్ష్యాల చట్టం సెక్షన్ 25 ప్రకారం పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదు. ఈ అంశాలన్నింటినీ కూడా కేసు ట్రయల్ సందర్భంగా పరిశీలించాల్సి ఉంటుంది. నిందితులందరినీ ఉమ్మడిగా విచారించినప్పుడు (జాయింట్ ట్రయల్) మాత్రమే సహ నిందితుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వారిని ఒకే కేసులో, ఒకే కోర్టులో కలిపి విచారిస్తున్న సమయంలోనే వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యమవుతుంది.సెక్షన్ 30 కింద అభియోగాలు నమోదు కానప్పుడు, నిందితులను విచారణకు హాజరుపరచనప్పుడు భారతీయ సాక్ష్యాల చట్టం వర్తించదు. ఈ నేపథ్యంలో నిందితుల వాంగ్మూలాన్ని కోర్టులు పరిగణనలోకి తీసుకోజాలవు. ఒకవేళ సహ నిందితుల వాంగ్మూలాన్ని బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవచ్చని అనుకున్నా కేవలం నేరాంగీకార వాంగ్మూలమే కాకుండా సహ నిందితుడిపై ఉన్న ఇతర స్వతంత్ర సాక్ష్యాలను కూడా కోర్టు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. సెక్షన్ 25 ప్రకారం కస్టడీలో పోలీసులకిచ్చిన వాంగ్మూలాలకు ఆమోద యోగ్యత లేనందున ఆ వాంగ్మూలాలను సహ నిందితులకు వ్యతిరేకంగా ఉపయోగించరాదు. సెక్షన్ 26 ప్రకారం మేజి్రస్టేట్ సమక్షంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని మాత్రమే సహ నిందితులకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. పోలీసు అధికారికి నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదు‘నిందితుడి వాంగ్మూలం సహ నిందితుడిని ఇరికించేలా ఉంటే ఆ వాంగ్మూలాన్ని సీఆర్పీసీ సెక్షన్ 161 ప్రకారం పరిగణనలోకి తీసుకోవచ్చా అనే విషయంలో ఎలాంటి అయోమయానికి, గందరగోళానికి తావులేకుండా స్పష్టతనివ్వదలిచాం. ఎఫ్ఐఆర్లో పేరున్న వ్యక్తిని, నేరం చేసిన వ్యక్తిని పోలీసులు విచారించి సీఆర్పీసీ సెక్షన్ 161 కింద అతడి వాంగ్మూలాన్ని నమోదు చేయవచ్చు. అయితే అలా నమోదు చేసిన వాంగ్మూలానికి ఎంతమాత్రం ఆమోదయోగ్యత లేదు. ఇదే విషయాన్ని సాహిబ్ సింగ్తో పాటు పలు కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.2022లో ఇంద్రేష్ కుమార్ కేసులో సీఆర్పీసీ సెక్షన్ 161 కింద ఇచ్చిన వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకోరాదని, అయితే బెయిల్ మంజూరు సందర్భంగా పరిగణనలోకి తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు, చెప్పింది. ఈ కేసులో పూర్వాపరాల ఆధారంగా ఆ తీర్పునివ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పు కేవలం సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలకే వర్తిస్తుంది గానీ నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలకు కాదు. ఆ తీర్పులో ఎక్కడా కూడా నిందితులు పోలీసులకిచ్చిన వాంగ్మూలాలను బెయిల్ మంజూరు సందర్భంగా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పలేదు. సెక్షన్ 161 కింద ఓ సాక్షి ఇచ్చిన వాంగ్మూలానికి, ఓ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలానికి చాలా తేడా ఉంది.పోలీసు అధికారికి నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని విస్మరించవచ్చు. నిందితుడి వాంగ్మూలాన్ని సహ నిందితుడికి వ్యతిరేకంగా వాడకూడదన్న న్యాయ సూత్రానికి ఓ మినహాయింపు ఉంది. నిందితుడి వాంగ్మూలం నేరాన్ని రుజువు చేసేదే కాక, అది విశ్వసించేదిగా, ఆధార సహితంగా ఉన్నప్పుడు ఆ వాంగ్మూలాన్ని సహ నిందితుడికి వ్యతిరేకంగా వాడొచ్చు. అయితే నిందితుడి వాంగ్మూలమొక్కటే సరిపోదు. సహ నిందితుడి పాత్రను రుజువు చేసేందుకు ఇతర సాక్ష్యాలు కూడా కావాల్సి ఉంటుంది. ఆ సాక్ష్యాలు నిందితుడి వాంగ్మూలానికి మద్దతునిచ్చేవిగా ఉండాలి. అందువల్ల సహ నిందితుడికి వ్యతిరేకంగా ముఖ్యంగా పోలీసు అధికారి ముందు ఇచ్చిన వాంగ్మూలాలను న్యాయస్థానాలు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. నిందితుడి వాంగ్మూలం సహ నిందితుడిని ఇరికించేలా ఉంటే ఆ వాంగ్మూలాన్ని సీఆర్పీసీ సెక్షన్ 161 ప్రకారం పరిగణనలోకి తీసుకోవచ్చా? అనే విషయంలో ఎలాంటి అయోమయానికి, గందరగోళానికి తావులేకుండా స్పష్టతనివ్వదలిచాం. ఎఫ్ఐఆర్లో పేరున్న వ్యక్తిని, నేరం చేసిన వ్యక్తిని పోలీసులు విచారించి సీఆర్పీసీ సెక్షన్ 161 కింద అతడి వాంగ్మూలాన్ని నమోదు చేయవచ్చు. అయితే అలా నమోదు చేసిన వాంగ్మూలానికి ఎంతమాత్రం ఆమోదయోగ్యత లేదు. - సుప్రీంకోర్టుకేవలం సహ నిందితుని కన్ఫెషన్ స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తి బెయిల్పై నిర్ణయం తీసుకోరాదని తన జడ్జిమెంట్లో పలు పేరాల్లో అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అందులోని కొన్ని ...34. ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం, ఒక వ్యక్తి తనకు వ్యతిరేకంగా అలాగే మరొకరిని కూడా దోషిగా సూచిస్తూ చేసిన అంగీకారాన్ని (కన్ఫెషన్), వారు ఇద్దరూ ఒకే సమయంలో ఒకే కేసులో సంయుక్తంగా విచారణకు లోనవుతున్నప్పుడు, ఆ కోర్టు ఆ అంగీకారాన్ని పరిశీలనలోకి తీసుకోవచ్చు. అయితే, ఈ అంగీకారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని మరొకరిని శిక్షించకూడదు. దానిని మిగతా ఆధారాలతో కలిపి పరిశీలించాలి.39. ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 30పై హైకోర్టు తనదైన అర్థాన్ని కలిగి ఉంది. సెక్షన్ 30 కింద అంగీకరించదగినదిగా (కన్ఫెషన్) ఉన్న విషయం, ముందస్తు బెయిల్ లేదా సాధారణ బెయిల్ పిటిషన్ పరిశీలన సమయంలో కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే, హైకోర్టు వ్యక్తపరిచిన అభిప్రాయంతో మేము ఏకీభవించడం లేదు. మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్న అభిప్రాయం ఏమిటంటే– అటువంటి ఒప్పుకోలు ఏదైనా ఉన్నా, అది ముందస్తు బెయిల్ లేదా సాధారణ బెయిల్ ఇచ్చే దశలో పరిగణనలోకి తీసుకోరాదు. దీనికి ప్రధాన కారణాలు ఇవే:(1) ఒక సహ–ఆరోపితుడిపై ఒప్పుకోలు (కన్ఫెషన్) ఆధారంగా నిర్ణయం తీసుకోవాలంటే, ఆ ఒప్పుకోలు చేసిన వ్యక్తిపై ముందు నేరం నిరూపితమవ్వాలి. అది సెక్షన్ 24 వీగిపోకూడదు. లేదా సెక్షన్ 25 ప్రకారం చట్టవిరుద్ధంగా ఉండకూడదు. ఇది పూర్తిగా కోర్టు విచారణ సమయంలోనే తేలుతుంది. కేసు నిరూపణ కోసం విశ్వసనీయ, బలమైన సాక్ష్యాలు కోర్టులో ఉంచాల్సి ఉంటుంది, తద్వారా నేరం స్పష్టంగా నిరూపితం కావాలి. ‘దీపక్ భాయ్ జగదీష్ చంద్ర పటేల్ (వర్సెస్) స్టేట్ ఆఫ్ గుజరాత్ అండ్ అదర్స్ (2019) 16 ఎస్సీసీ 547’లో అత్యున్నత న్యాయస్థానం ఇదే విషయాన్ని చెప్పింది. పోలీసు అధికారుల ముందు ఇచ్చిన ఒప్పుకోలు, కోర్టులో సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకోరాదు. సెక్షన్ 30 ప్రకారం పరిగణనలోకి తీసుకునే స్టేట్మెంట్ సరైనదై ఉండాలి, చట్టబద్ధమైనదై ఉండాలి. ఇది ఈ సెక్షన్ మూల లక్ష్యం.49. (10) ముందస్తు (యాంటిసిపేటరీ) లేదా సాధారణ (రెగ్యులర్) బెయిల్ విచారణకు సంబంధించి కోర్టు సీఆర్పీసీ 161 ప్రకారం పోలీసుల ముందు ఒక వ్యక్తి ఇచ్చిన ప్రకటనను పరిశీలించే ముందు, ఆ వ్యక్తి వాస్తవంగా సాక్షినా, నిందితుడా, లేక భవిష్యత్తులో నిందితుడిగా మారే అవకాశం ఉన్నవాడా అనే విషయాన్ని మొదట తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి. ఎందుకంటే 161‑సెక్షన్ ప్రకటన‑ సమయంలో ఆ వ్యక్తి నిందితుడి జాబితాలో లేకపోయినా, దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో తర్వాత అతను నిందితుడిగా చేర్చబడే పరిస్థితులు ఏర్పడవచ్చు.ఈ నేపథ్యంలో, మొదట సాక్షిగా ఉన్న వ్యక్తి తర్వాత నిందితుడిగా మారవచ్చన్న భావాన్ని కోర్టులు ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. ఎఫ్ఐఆర్లో పేరు లేదని మాత్రమే కారణం చెప్పుకుని ఆ వ్యక్తి ప్రకటనపై ఆధారపడితే, అతన్ని నిందితుడిగా చేర్చే దశ వచ్చే వరకు ఆ ప్రకటనను నమ్ముకునే అసంబద్ధ పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే, రికార్డుల ప్రకారం ఆ వ్యక్తిని నిందితుడిగా చేర్చే అవకాశముందని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తే, దర్యాప్తు ఏ విధంగానూ ప్రభావితం కాకుండా కోర్టులు ఏ విధమైన అభిప్రాయాన్ని ప్రకటించకుండా జాగ్రత్తగా ఉండాలని మేము హెచ్చరిస్తున్నాము. -
సుప్రీం కోర్టులో వొడాఫోన్ పిటిషన్ డిస్మిస్
న్యూఢిల్లీ: ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) బాకీల నుంచి మినహాయింపు కోరుతూ వొడాఫోన్, ఎయిర్టెల్, టాటా టెలీసరీ్వసెస్ దాఖలు చేసిన పిటీషన్లను సుప్రీం కోర్టు తోసిపుచ్చుంది. ఒక బహుళ జాతి కంపెనీ ఇలాంటి పిటీషన్ వేయడం తమను షాక్కి గురి చేసిందని వ్యాఖ్యానించింది. ఒకవేళ ప్రభుత్వం తనంతట తాను ఏదైనా సహాయం చేయదల్చుకుంటే న్యాయస్థానం జోక్యం చేసుకోబోదని తెలిపింది. వివరాల్లోకి వెళ్తే.. టెలికం సంస్థలు లైసెన్సింగ్, స్పెక్ట్రం వినియోగ ఫీజుల కింద నిర్దిష్ట మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం టెలికం సేవలతో పాటు టెల్కోలకు వచ్చే ఇతరత్రా వనరుల నుంచి కూడా వచ్చే ఆదాయాన్ని వాటి మొత్తం ఆదాయంగా (ఏజీఆర్) నిర్వచిస్తూ, దాని ప్రాతిపదికగా చెల్లింపులు జరపాలంటూ ప్రభుత్వం, న్యాయస్థానం గతంలో సూచించడం వివాదానికి దారి తీసింది. ఏజీఆర్పరమైన బకాయిలను తప్పుగా లెక్కించడం వల్ల తమపై ఆర్థిక భారం గణనీయంగా పెరిగిపోతుందని, దీన్ని మినహాయించాలని లేదా పునఃసమీక్షించాలని న్యాయస్థానాన్ని టెల్కోలు ఆశ్రయించాయి. రూ. 30,000 కోట్ల బాకీల నుంచి మినహాయింపునివ్వాలంటూ వొడాఫోన్ కోరింది. గత ఉత్తర్వుల కారణంగా ప్రభుత్వం సహాయం చేయలేకపోతోందన్న పిటీషనర్ వాదనలను సుప్రీం కోర్టు తోసిపుచి్చంది. జూలై వరకు వాయిదా వేయాలని లేదా ఉపసంహరించుకునేందుకు అనుమతించాలన్న అభ్యర్ధనలను పక్కన పెట్టింది. ప్రభుత్వమే స్వయంగా సహాయం చేయదలిస్తే న్యాయస్థానం అడ్డుకోబోదని స్పష్టం చేసింది. -
కీలెరిగి వాతపెట్టిన ‘సుప్రీం’
యుద్ధంలో ఆయుధాలు మాత్రమే నిర్ణయాత్మక శక్తి కాదు... కోట్లాది పౌరులు ఒక్కటై వినిపించే స్వరం కూడా. కానీ పాకిస్తాన్తో తీవ్ర ఘర్షణలు తలెత్తిన వేళ ఆ సమష్టి స్వరానికి అవరోధం కల్పించేలా, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడి మన నేతల్లో కొందరు దేశాన్ని దిగ్భ్రమ పరిచారు. బహుశా అందుకే కావొచ్చు, కల్నల్ సోఫియా ఖురేషిపై నోరు పారేసుకున్న మధ్యప్రదేశ్ మంత్రి కన్వర్ విజయ్ షా క్షమాపణను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది. ఈ విషయంలో ఆయనపై దాఖలైన ఎఫ్ఐఆర్పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి ఈ నెల 28కల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.ఐపీఎస్ అధికారులతో ఏర్పాటయ్యే ఈ బృందంలో ఒక మహిళా అధికారి ఉండాలనీ, దానికి ఐజీ ర్యాంకుకు తక్కువకాని అధికారి సారథ్యం వహించాలనీ ఉత్తర్వులిచ్చింది. ఈ తరహా విద్వేష ప్రసంగాలు బీజేపీ నేతల నుంచి మాత్రమే కాదు, కొందరు విపక్ష నేతల నుంచీ వినిపించాయి. చిత్రమేమంటే ఎక్కడా, ఎవరిపైనా పోలీసులు కేసులు పెట్ట లేదు, చర్యలకు సిద్ధపడలేదు. కానీ సాధారణ పౌరులు చిన్నపాటి భిన్నస్వరం వినిపించినా విరు చుకుపడ్డారు. ఇందుకు అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీఖాన్ ఉదంతమే నిదర్శనం. కల్నల్ సోఫియాను కీర్తిస్తున్న బీజేపీ శ్రేణులు విద్వేష ప్రచారానికి బలవుతున్నవారిని ఎందుకు పట్టించుకో రని ఆయన ప్రశ్నించారు. సైన్యాన్నిగానీ, ఆ మహిళా అధికారుల్నిగానీ కించపరచలేదని, బాహాటంగా కనిపిస్తున్న ద్వంద్వ నీతిని ఎత్తిచూపటమే తన ఉద్దేశమని చెప్పినా ఆయన్ను అరెస్టు చేశారు.విజయ్ షాపై మధ్యప్రదేశ్ పోలీసులు సొంతంగా కేసు నమోదు చేయలేదు. అక్కడి హైకోర్టు సుమోటోగా తీసుకుని తక్షణం ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. ఆ తర్వాతైనా పోలీసులు సక్రమంగా చర్యలు తీసుకున్నది లేదు. ఎఫ్ఐఆర్ వాలకం గమనించిన హైకోర్టు చీవాట్లు పెట్టాకే వారికి జ్ఞానోదయమైంది. విజయ్ షా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. రాష్ట్రంలోని ఎస్టీ నియోజకవర్గం హర్సూద్ నుంచి ఇప్పటికి 8 దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. మంత్రిగా పని చేస్తున్నారు.సంక్షోభ సమయాల్లో సంయమనం పాటించటం చాలా అవసరం. బాధ్యతాయుత స్థానాల్లో వున్నవారు ఆ సంగతి మరిచిపోతున్నారు. విజయ్ షా వ్యాఖ్యల సంగతే తీసుకుంటే ఆయన అన్నది కేవలం కల్నల్ సోఫియా ఖురేషిని మాత్రమే కాదు... ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావన చేసి ఆయనపై సంశయాలు రేకెత్తించే విధంగా మాట్లాడారు. యుద్ధానికి సంబంధించిన వివరాలను వెల్లడించటానికి నియమించిన ఇద్దరు మహిళా ప్రతినిధుల్లో ఒకరైన కల్నల్ సోఫియాను ‘ఉగ్ర వాదుల సోదరి’గా అభివర్ణించారు. ఉగ్రవాదులను ఆ వర్గం చేతే దెబ్బకొట్టించటానికి ప్రధాని ఆమెను తెలివిగా ఎంపిక చేశారన్నట్టు మాట్లాడారు.కల్నల్ సోఫియా నిర్వహించిన మీడియా సమావేశాలను గమనిస్తేనే ఆమె ఎంత సమర్థంగా, చతురతతో ఆ బాధ్యతను నెరవేర్చారో తెలు స్తుంది. గర్వించదగిన నేపథ్యం ఆమెది. దేశంలోని ప్రతి మహిళా స్ఫూర్తిదాయకంగా తీసుకోదగిన చరిత్ర ఆమెది. సైనిక కుటుంబం నుంచి వచ్చి, సైన్యంలో చేరి అందులోని వ్యక్తినే వివాహమాడి ప్రతి స్థాయిలోనూ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ కల్నల్ హోదా వరకూ ఎదిగారు. అటువంటామెను కేవలం ముస్లిం మహిళగా చూశారంటేనే... విజయ్ షా ఎంత ఉన్మాదపూరితంగా ఆలోచి స్తున్నారో అర్థమవుతోంది. అందుకే ఆయన ప్రసంగం తీరు చూసి దేశం యావత్తూ సిగ్గుపడుతోందని సుప్రీంకోర్టు అనక తప్పలేదు.ఉగ్రస్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ దేశమంతా ఒక్కటై ఈ కష్టకాలాన్ని అధిగమించటానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. దాని అర్థం, పర మార్థం విజయ్ షాకు కాస్తయినా అర్థం కాలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు, అటు తర్వాత క్షమా పణ చెబుతూ చేసిన ప్రకటన గమనిస్తే తెలుస్తుంది. నోరుజారి తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నానంటే బహుశా కోర్టు చీవాట్లతో సరిపెట్టేదేమో! కానీ అందరి నేతల మాదిరే ‘ఎవరి మనోభావాలైనా దెబ్బతినివుంటే...’ అంటూ రాగం తీయడంతో వివాదంలో మరింత కూరుకుపోయారు.మంత్రి చెప్పిన క్షమాపణలో చిత్తశుద్ధి లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చేస్తున్నది క్షమించరాని తప్పని ఎటూ తెలియలేదు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు పార్టీ అధిష్ఠానం సైతం మందలించినా పునరాలోచన కలగలేదు, పరివర్తన రాలేదు. ఇలాంటివారిని నాలుగ్గోడల మధ్య మందలించటం కాదు... పదవి నుంచి సాగనంపివుంటే అలాంటివారికి అదొక హెచ్చరికగా ఉండేది. దేశ ప్రజలు కొనియాడేవారు. కానీ బీజేపీ ఆ పని చేయలేకపోయింది.సమాజ్వాదీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ సైతం ఈ మాదిరి వ్యాఖ్యలే చేశారు. వైమానిక దళ అధికారులైన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతిల కులాల ప్రస్తావన చేశారు. బీజేపీకి కల్నల్ సోఫియా మతం తెలిసిందిగానీ ఈ అధికారులిద్దరూ పీడిత కులాలవారని తెలియదని, లేకుంటే వారిపైనా తప్పుడు వ్యాఖ్యనాలు చేసేవారని అన్నారు. ఈ బాపతు నాయకు లంతా మనుషుల్ని ఎంతసేపూ కులమతాల చట్రాల్లో చూస్తూ వారి సేవలనూ, అంకిత భావాన్నీ, సంకల్ప దీక్షనూ మరుగుపరుస్తారు. దేశభక్తి పేరుతో ఉన్మాదాన్నీ, విద్వేషాన్నీ పెంచి పోషిస్తారు. సుప్రీంకోర్టు స్పందించిన తీరు నేతలందరికీ గుణపాఠం కావాలి. సంక్షోభ కాలాల్లో మాత్రమే కాదు... సాధారణ సమయాల్లోనూ జాగ్రత్తగా మాట్లాడాలని తెలుసుకోవాలి. -
శరణార్థులపై.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఢిల్లీ: శ్రీలంక శరణార్థుల అంశానికి సంబంధించి దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శ్రీలంక శరణార్థులు పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ధర్మశాల కాదని స్పష్టం చేసింది. శ్రీలంక శరణార్థుల పిటిషన్పై సోమవారం(మే 19 వ తేదీ) విచారించిన ధర్మాసనం... విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ధర్మశాల కాదని స్సష్టం చేసింది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు భారత్ ఆతిథ్యం ఇవ్వాలా? భారత్లో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. అన్ని ప్రాంతాల నుండి వచ్చే విదేశీ పౌరులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ధర్మశాల కాదు. వెంటనే దేశంలోని శరణార్థులు దేశం విడిచి వెళ్లాలని జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. శ్రీలంకలో ప్రత్యేక తమిళ ఈలమ్ కోసం పోరాడిన నిషేధిత తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈ సానుభూతి పరుడైన శ్రీలంక జాతీయుడైన పిటిషనర్ మరో ఇద్దరు నిందితులతో కలిసి దేశంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో 2015లో ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో పిటిషనర్ను దోషిగా పరిగణలోకి తీసుకున్న న్యాయ స్థానం 2018లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)కింద పది సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష కొనసాగుతున్న సమయంలో 2022లోమద్రాస్ హైకోర్టు అతని శిక్షను ఏడు సంవత్సరాలకు తగ్గించడమే కాకుండా, శిక్ష పూర్తయ్యాక వెంటనే భారత్ నుండి వెళ్లాలని, ఇక్కడ ఉండకూడదనే సూచించింది. మద్రాస్ ఇచ్చిన నాటి తీర్పుతో పిటిషనర్ మరికొద్ది రోజుల్లో దేశం విడిచి వెళ్లాల్సి ఉంది.India is not a "dharamshala" that can entertain refugees from all over the world, the Supreme Court orally observed, while refusing to interfere with the detention of a Sri Lankan Tamil national.Read more: https://t.co/LhaVOoiHtu#SupremeCourt pic.twitter.com/6fZD2EoiRq— Live Law (@LiveLawIndia) May 19, 2025 మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కానీ తాను, భారత్ను విడిచి శ్రీలంకకు వెళ్లలేనని, తనని ఇక్కడే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మద్రాస్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై సుప్రీంకోర్టు జస్టిస్ దీపాంకర్ దత్తా, కృష్ణన్ వినోద్ చంద్రన్ (K. Vinod Chandran) నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం(మే19) విచారణ చేపట్టింది. భారత్ ధర్మశాల కాదువిచారణ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ధర్మశాల కాదు. శరణార్థులకు ఇక్కడ ఆతిథ్యం ఇవ్వలేం. వెంటనే శరణార్థులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. మద్రాస్కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ‘మీకు ఇక్కడ స్థిరపడేందుకు ఎలాంటి హక్కు ఉంది?’అనంతరం, పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో తన వాదనలు వినిపించారు. పిటిషనర్ శ్రీలంక జాతీయుడు. శ్రీలంక నుంచి భారత్కు వీసాతో వచ్చాడు. తన దేశంలో ప్రాణ భయముందని అన్నారు. పిటిషనర్ మూడేళ్లపాటు జైలు కస్డడీలో ఉన్నారని, ఆ సమయంలో అతని దేశం నుంచి పంపించేందుకు ఎలాంటి చర్య తీసుకోలేదని ప్రస్తావించారు. పిటిషనర్ తరుఫు న్యాయవాది వాదనలపై సుప్రీం జస్టిస్ దీపాంకర్ దత్తా..‘మీకు ఇక్కడ స్థిరపడేందుకు ఎలాంటి హక్కు ఉంది?’ అని ప్రశ్నించారు.భారత్ కాకుండా వేరే దేశంలో స్థిరపడండిఅందుకు.. పిటిషనర్ న్యాయవాది స్పందిస్తూ.. ‘అతను శరణార్థి. అతని భార్య, పిల్లలు ఇక్కడే స్థిరపడ్డారని ప్రకటించారు. పిటిషనర్ శ్రీలంకకు వెళితే తనకు ప్రాణ హాని ఉందన్న పిటిషనర్ అభ్యర్థనపై జస్టిస్ దీపాంకర్ దత్తా మాట్లాడుతూ.. పిటిషనర్కు తన దేశంలో ప్రాణ భయం ఉందని అన్నారు కదా.. భారత్యేతర దేశంలో స్థిరపడండి’ అని వ్యాఖ్యానించారు. సారీ.. దేశం విడిచి వెళ్లాల్సిందేఅదే సమయంలో పిటిషనర్ 2009లో శ్రీలంక యుద్ధంలో ఎల్టిటి సభ్యుడిగా పాల్గొన్నట్లు చెప్పారు. అందువల్ల తాను శ్రీలంకకు వెళితే మళ్లీ అరెస్ట్ అవ్వడంతో పాటు, తన ప్రాణానికి అపాయం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. తన భార్య ఆరోగ్యపరమైన కారణాలతో బాధపడుతుండగా, తన కుమారుడు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. చివరిగా ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. జైలు శిక్ష పూర్తయిన తర్వాత దేశం విడిచి వెళ్లాలన్న మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్ధించింది. శ్రీలంకకు వెళ్లే అవసరం లేకుండా భారత్లో స్థిరపడేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషనర్ అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించింది. -
బకాయిలు చెల్లించలేం బాబోయ్..
సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిల నుంచి ఉపశమనం కోరుతూ ప్రముఖ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) సమర్పించిన రూ.44,000 కోట్ల చెల్లింపులకు విరుద్ధంగా అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. ఈ ఆర్థిక భారం కంపెనీని పోటీలో నిలపకుండా నియంత్రిస్తుందని, తదుపరి తరం టెక్నాలజీల్లో పెట్టుబడి పెట్టే సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని కంపెనీ వాదిస్తోంది. ఇటీవల మరో టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా నుంచి ఇదే తరహా పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.ఏజీఆర్ బకాయిలుసర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) అనేది ప్రభుత్వం, టెలికాం ఆపరేటర్ల మధ్య రుసుము భాగస్వామ్య యంత్రాంగ విధానం. ఫిక్స్డ్ లైసెన్స్ ఫీజు మోడల్ స్థానంలో 1999లో అవలంబించిన రెవెన్యూ షేరింగ్ మోడల్లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టారు. ఈ మోడల్ కింద టెలికాం కంపెనీలు తమ ఏజీఆర్లో కొంత శాతాన్ని వార్షిక లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.లెక్కింపు ఇలా..టెలికాం, నాన్ టెలికాం వనరుల నుంచి కంపెనీ ఆర్జించిన అన్ని ఆదాయాలను ఏజీఆర్లో చేరుస్తారు. ఇందులో ప్రధాన టెలికాం సేవల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ ఆదాయం, డివిడెండ్, ఆస్తుల అమ్మకంపై లాభం, అద్దె రశీదులు వంటి ప్రధానేతర వనరులు ఉంటాయి. టెలికాం కంపెనీల స్థూల ఆదాయాల ఆధారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) లైసెన్స్ ఒప్పందాల్లో నిర్వచించిన విధంగా ఏజీఆర్ను లెక్కిస్తుంది. స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలకు 3-5 శాతం, లైసెన్సింగ్ ఫీజుకు 8 శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నారు.వివాదం ఏమిటంటే..ఏజీఆర్లో కీలక టెలికాం సేవల నుంచి వచ్చే ఆదాయం మాత్రమే ఉండాలని టెలికాం ఆపరేటర్లు వాదిస్తున్నాయి. టెలికాం శాఖ మాత్రం అన్ని ఆదాయాలు అందులో పరిగణిస్తారని పేర్కొంటుంది. సుప్రీంకోర్టు 2019లో డాట్ నిర్వచనాన్ని సమర్థించింది. ఇది టెలికాం ఆపరేటర్లపాలిట శాపంగా మారింది. దాంతో ఇప్పటివరకు బకాయిపడిన, ప్రభుత్వంతో పంచుకోని ఆదాయాన్ని వెంటనే చెల్లించేలా తీర్పు వెలువడింది. దాంతో ప్రభుత్వంతో మంతనాలు సాగించేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ చెల్లింపులకు విరుద్ధంగా సుప్రీంకోర్టులో టెలికాం కంపెనీలు పిటిషన్ దాఖలు చేస్తున్నాయి.ఇదీ చదవండి: భారత్లో ఐఫోన్ తయారీకి ఆసక్తి చూపడం లేదు: ట్రంప్కంపెనీ వాదన ఇలా..సుప్రీంకోర్టు విధించిన కఠినమైన 10 సంవత్సరాల రీపేమెంట్ టైమ్లైన్ కంపెనీపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుందని, నెట్వర్క్ విస్తరణ, స్పెక్ట్రమ్ పెట్టుబడులు, 6జీ టెక్నాలజీల అభివృద్ధి కోసం వనరులను కేటాయించడం కష్టమవుతుందని ఎయిర్టెల్ తెలుపుతోంది. తిరిగి చెల్లించే నిబంధనలను సుప్రీంకోర్టు, డాట్ పునఃపరిశీలించకపోతే కంపెనీల ఆర్థిక స్థిరత్వం, టెలికాం పరిశ్రమ దెబ్బతింటుందని కంపెనీ వాదిస్తుంది. మరోవైపు వొడాఫోన్ ఐడియా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా వడ్డీ, జరిమానాల రూపంలో రూ.45,000 కోట్లు మాఫీ చేయాలని కోరింది. -
రాజకీయ ప్రేరేపిత కేసే..
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ధరలను పెంచలేదు.. మద్యం ఉత్పత్తులపై పన్నులనే పెంచారు. గత టీడీపీ ప్రభుత్వంలో కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం విక్రయాలను గణనీయంగా తగ్గించింది. కానీ, పన్నులను పెంచడంతో ఎక్సైజ్ శాఖకు ఆదాయం పెరిగింది. దాంతోనే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగింది. మరి ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరిగితే ఇక ప్రభుత్వ ఖజానాకు నష్టం ఎక్కడ వాటిల్లింది..? కుంభకోణం ఎక్కడ జరిగింది..? అంటే ప్రభుత్వ ఖజానాకు రూ.3,200 కోట్ల నష్టం వాటిల్లిందని సిట్ చెబుతున్నది అంతా అవాస్తవమే కదా? సాక్షి, అమరావతి: ‘సిట్ నమోదు చేసింది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే అక్రమ కేసు పెట్టింది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అవినీతిపై నమోదైన కేసులను కప్పిపుచ్చేందుకే ఈ కేసును నమోదు చేసింది’ అని మాజీ అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ ఏసీబీ న్యాయస్థానానికి వివరించారు. 2019–24 మధ్య మద్యం విధానంతో ప్రభుత్వ ఖజానాకు రూ.3,200 కోట్లు నష్టం వాటిల్లిందన్న సిట్ అభియోగానికి ఎలాంటి ప్రాతిపదిక లేదని స్పష్టం చేశారు.అందుకు సంబంధించి న్యాయస్థానానికి కనీసం ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారని గుర్తు చేశారు. దీన్నిబట్టి స్కామ్ అనేది ఒక కట్టుకథ అని స్పష్టం చేశారు. సీఐడీ కేసును ఆ దర్యాప్తు సంస్థ పరిధిలోని ఇతర పోలీసు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఈ కేసులో సిట్ అక్రమంగా అరెస్టు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్రెడ్డి, పి.కృష్ణమోహన్రెడ్డిల తరపున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో శనివారం వాదనలు వినిపించారు. వారిద్దరిని సిట్ అధికారులు అక్రమంగా అరెస్టు చేశారని నిబంధనలను ఉటంకిస్తూ వివరించారు. అంశాల వారీగా శ్రీరామ్ వినిపించిన వాదనలు ఇలా ఉన్నాయి... చంద్రబాబు ప్రభుత్వం 5 డిస్టిలరీల నుంచే 69% మద్యం కొనుగోళ్లు చేసింది చంద్రబాబు అవినీతి కేసులను కప్పిపుచ్చేందుకే సిట్ ఈ అక్రమ కేసు నమోదు చేసింది. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు. దీనివెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని.. వాటిని ఎంతమాత్రం కొట్టిపారేయలేమని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారిస్తూ ఆ విషయాన్ని స్పష్టం చేసింది. రాజకీయ పక్షపాతం, దురుద్దేశాలకు న్యాయపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది కూడా. 2014–19 మధ్యన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై పలు కేసులు న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయి.ఆ ఐదేళ్లలో ప్రభుత్వ మద్యం విధానం ద్వారా పాల్పడిన అవినీతిని ఇప్పటికే సీఐడీ నిర్ధారించి చంద్రబాబుతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్పై ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 5 డిస్టిలరీల నుంచే ఏకంగా 69 శాతం మద్యం కొనుగోళ్లు చేసినట్లు అప్పటి సిట్ తన రిమాండ్ రిపోర్టులోనే పేర్కొంది. మంత్రి మండలికి తెలియకుండా మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేశారు. ఆ కేసులో ఆయన ముందస్తు బెయిల్పై ఉన్నారు. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సిట్ ద్వారా ఈ అక్రమ కేసు నమోదు చేయించారు. అంతెందుకు ఇప్పుడు అడ్డగోలుగా వేధిస్తున్న సిట్ రాజ్ కేసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో కూడా 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం కేవలం నాలుగు డిస్టిలరీల నుంచే 54 శాతం మద్యం కొనుగోళ్లు చేసిందని పేర్కొనడం నిజం కాదా? వైఎస్సార్సీపీ హయాంలో ఖజానా ఆదాయం పెరిగింది 2019–24లో రూ.3,200 కోట్ల కుంభకోణం జరిగిందని ఏ ప్రాతిపదికన నిర్ధారించామన్నది సిట్ చెప్పడమే లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. 2014–19 మధ్య కంటే 2019–24 మధ్య రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరిగింది. 2018–19లో ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.16 వేల కోట్లు ఉంటే 2023–24లో రూ.24 వేల కోట్లకు చేరుకుంది. ఇక కుంభకోణంపై సిట్ వద్ద ఒక్క ఆధారం కూడా లేదు. కనీసం న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలోనూ ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని బెవరేజెస్ కార్పొరేషన్ రికార్డుల్లో కూడా అటువంటి సమాచారం ఏమీ లేదు. ఉంటే సిట్ చూపించి ఉండేది కదా. కేవలం సిట్ అధికారులు తాము బెదిరించి తీసుకున్న కొందరు డిస్టిలరీల ప్రతినిధుల వాంగ్మూలాలను మాత్రమే చూపిస్తున్నారు. ఆ డిస్టిలరీలన్నీ 2014–19లో అప్పటి ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందినవే. అవే డిస్టిలరీలను తర్వాతి ప్రభుత్వం 2019–24లోనూ కొనసాగించింది. సీఐడీ కేసును పోలీసులు ఎలా దర్యాప్తు చేస్తారు? అసలు ఈ కేసు రాజకీయ ప్రేరేపితం. కేసు నమోదు నుంచి సీఐడీకి అప్పగించడం, సిట్ ఏర్పాటు అంతా చట్టానికి విరుద్ధంగా సాగుతోంది. ఈ కేసును సీఐడీ డీజీ పర్యవేక్షిస్తారు అని సిట్ను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోలో ప్రభుత్వం పేర్కొంది. సిట్ను ప్రత్యేక పోలీస్ స్టేషన్గా గుర్తించింది. కానీ, సిట్లో ఉన్న సభ్యుల్లో అత్యున్నత అధికారి విజయవాడ పోలీస్ కమిషనర్. మిగిలిన సభ్యులు ఆయన కంటే జూనియర్లు. మరి వీరందరూ సీఐడీ పరిధిలోకి వస్తారా? తాము సీఐడీ పరిధిలోకి వస్తామని వారిని న్యాయస్థానంలో అఫిడవిట్ సమర్పించమనండి. వారు అలా అఫిడవిట్ సమరి్పస్తే తదనుగుణంగా మేం తదుపరి చర్యలు చేపడతాం. సీఐడీ పరిధిలోకి రాని పోలీస్ అధికారులు ఈ కేసును ఎలా దర్యాప్తు చేస్తారు? అంటే ఈ కేసు దర్యాప్తే పూర్తి నిబంధనలను విరుద్ధంగా సాగుతోంది. సిట్ కేసు ఈ న్యాయస్థానం పరిధిలోకి రాదు సిట్ నమోదు చేసిన ఈ కేసు విజయవాడ ఏసీబీ న్యాయస్థానం పరిధిలోకి రాదు. ఏసీబీ నమోదు చేసే అవినీతి నిరోధక కేసులను విచారించేందుకు ప్రత్యేక చట్టం ద్వారా ఈ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. సీఐడీ నమోదు చేసే అవినీతి నిరోధక కేసులు కూడా ఈ న్యాయస్థానం పరిధిలోకి వస్తాయని చట్టం చేశారు. కానీ, సిట్ను ప్రత్యేక పోలీస్ స్టేషన్గా గుర్తిస్తూ ఈ ప్రభుత్వం జీవో ఇచి్చంది. సిట్ నమోదు చేసే కేసులు అసలు ఈ న్యాయస్థానం పరిధిలోకి రానే రావు. ప్రతి ఒక్కరికి 17ఏ కింద ముందస్తు అనుమతి తీసుకోలేదు ఈ కేసులో నిందితులు ప్రతి ఒక్కరిపై దర్యాప్తునకు 17ఏ కింద ముందే అనుమతి తీసుకోవాలి. మొత్తంగా అందరిపై ఒకేసారి 17ఏ కింద అనుమతి తీసుకున్నామని.. కేరళ హైకోర్టు తీర్పును ఉటంకిస్తూ సిట్ చెబుతున్నది సరికాదు. ప్రతి ఒక్కరిపై విడివిడిగా 17ఏ కింద అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు విస్పష్టంగా ప్రకటించింది. (ఈ అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించిందని సిట్ న్యాయవాదులు చేసిన వాదనను న్యాయవాది శ్రీరామ్ తోసిపుచ్చారు). 2023లో అప్పటి మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు సంబంధించి 17ఏ వర్తిస్తుందా వర్తించదా అనే అంశంపై సుప్రీంకోర్టు చెప్పినదాన్ని ప్రస్తుతం సిట్ న్యాయవాదులు వక్రీకరిస్తున్నారు.స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం 2018 కంటే ముందే జరిగింది కాబట్టి 17ఏ వర్తించదు. 2018కు ముందు జరిగిన కేసులకు 17ఏ వర్తిస్తుందా వర్తించదా అనే విషయాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక ధర్మాసనానికి నివేదించారు. అంతేగానీ, 2018 ఆ తర్వాత నమోదయ్యే కేసుల్లో నిందితులు ప్రతి ఒక్కరిపై విడివిడిగా 17ఏ కింద దర్యాప్తునకు అనుమతి తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఆ ప్రకారం సీఎంవోలో కార్యదర్శిగా చేసిన కె.ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ పి.కృష్ణమోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులు. వారిపై కేసులకు విడివిడిగా 17ఏ కింద అనుమతి తీసుకోవాల్సిందే. ఈ నిబంధనను సిట్ ఉల్లంఘించింది కాబట్టి ఇది అక్రమ అరెస్టే అవుతుంది. హడావుడిగా అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పింది ముందస్తు బెయిల్ ఇవ్వనంత మాత్రాన నిందితులను హడావుడిగా అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. అరెస్టుకు ఉన్న అధికారాన్ని పోలీసులు దుర్వినియోగం చేయొద్దని ఇటీవలే స్పష్టం చేసింది. కచి్చతమైన ఆధారాలు ఉంటేనే అరెస్టు చేయాలని చెప్పింది. కానీ, ఈ అక్రమ కేసులో ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డికి వ్యతిరేకంగా సిట్ స్పష్టమైన ఆధారాలేమీ చూపలేకపోయింది. కనీసం న్యాయస్థానానికి కూడా సమర్పించనే లేదు. ఇక ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి దేశం విడిచివెళ్లే అవకాశం ఉంది కాబట్టి అరెస్టు చేస్తున్నామని సిట్ చెప్పడం పూర్తిగా అవాస్తవం. నిందితులుగా చేర్చకముందే వారికి వ్యతిరేకంగా సిట్ లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. సిట్ అక్రమంగా అరెస్టు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలను శుక్రవారం రాత్రి అరెస్టు చేసే క్రమంలో సిట్ అధికారులు నిబంధనలను ఉల్లంఘించారు. అరెస్టుకు ప్రాతిపదిక, కారణాలను నిందితులకు తెలపాలి. కానీ, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వారి కారు డ్రైవర్కు చెప్పామని రిమాండ్ నివేదికలోనే సిట్ అధికారులు పేర్కొన్నారు. నిందితులకు తెలపాలన్న నిబంధనను సిట్ అధికారులు కావాలనే ఉల్లంఘించారు. కాపీ పేస్ట్ కుట్ర.. అదే సిట్ రిమాండ్ నివేదిక రెడ్బుక్ కుట్రనే సిట్ తన దర్యాప్తు నివేదిక పేరిట మరోసారి కనికట్టు చేసింది. ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని కోరుతూ న్యాయస్థానంలో దాఖలు చేసిన రిమాండ్ నివేదికే ఆ విషయాన్ని వెల్లడించింది. పూర్తిగా అవాస్తవాలు, అభూత కల్పనలతోనే రిమాండ్ నివేదిక రూపొందించిందని స్పష్టమైంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్రెడ్డి, ఇతర నిందితుల రిమాండ్ నివేదికల్లో పేర్కొన్న కట్టుకథనే కాపీ పేస్ట్ చేసింది. ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డికి వ్యతిరేకంగా కనీసం ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. ఈ కేసు దర్యాప్తు పేరిట డిస్టిలరీల ప్రతినిధులు, ఇతర సాక్షులను తాము బెదిరించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలనే అరెస్టుకు ప్రాతిపదికగా చూపించడం సిట్ కుట్రను బట్టబయలు చేసింది. 20 వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం సిట్ అరెస్టు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ కె.ధనుంజయ్రెడ్డి, పి.కృష్ణమోహన్రెడ్డికి న్యాయస్థానం ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. వారిద్దరిని సిట్ అధికారులు శనివారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయస్థానం రిమాండ్ విధించింది. వారికి ప్రత్యేక వసతులు కలి్పంచాలని తన ఆదేశాల్లో పేర్కొంది. అనంతరం ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిని సిట్ అధికారులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. శ్రీధర్రెడ్డికి ముగిసిన కస్టడీ విజయవాడ లీగల్: మద్యం కుంభకోణం ఆరోపణలపై అరెస్టయి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా వున్న శ్రీధర్రెడ్డి మూడు రోజుల కస్టడీ శనివారంతో ముగిసింది. పోలీసులు ఆయనకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి, ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం జిల్లా జైలుకు తరలించారు. -
రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు.. ఏపీలో మద్యం కేసు వెనుక పక్షపాతం, దురుద్దేశాలను కొట్టిపారేయలేం... కూటమి ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
-
ఆయనపై కేసులున్నాయని మీరెలా చెబుతున్నారు?
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసులు ఉన్నాయని మీరెలా చెబుతారు.. అంటూ సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. క్వార్ట్జ్ ఖనిజం తవ్వకాల కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కాకాణి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారించింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారని, గిరిజనులను బెదిరించారని మైనింగ్ అధికారి బాలాజీనాయక్ ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాణి గోవర్దన్ రెడ్డిని ఏ–4గా చేర్చారు. దీంతో ముందస్తు రక్షణ కల్పించాలని కోరుతూ.. ఆయన మే 13న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఆ పిటిషన్ శుక్రవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. కాకాణి గోవర్ధన్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ దవే వాదనలు వినిపించారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పెట్టిన కేసేనని, అందులో ఏ మాత్రం వాస్తవం లేదని కోర్టుకు తెలిపారు. అందుకు ధర్మాసనం.. ‘హైకోర్టు డివిజన్ బెంచ్ వద్దే తేల్చుకోవచ్చు కదా.. దీనికోసం ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు.. అని అడిగింది.హైకోర్టు డివిజన్ బెంచ్ కేసును జూన్ 16కు వాయిదా వేసిందని, అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించామని దవే బదులిచ్చారు. కాగా.. తనపై గతంలో ఇలాంటి కేసులేవీ నమోదు కాలేదని గోవర్దన్ రెడ్డి కోర్టును తప్పుదారి పట్టించేలా పిటిషన్లో పేర్కొన్నారని ఏపీ ప్రభుత్వం తరఫున ప్రేరణ సింగ్ ధర్మాసనానికి తెలిపారు. ‘ఆయన మీద కేసులు ఉన్నాయని మీరు ఎలా చెబుతున్నారు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. అయినా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, వాస్తవాలపై స్పష్టత రావాల్సి ఉన్నందున అరెస్టు నుంచి కాకాణికి మినహాయింపు ఇవ్వలేమని ధర్మాసనం తెలిపింది. -
రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు
ఈ కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు..పక్షపాతం ఉందని పిటిషనర్లు కొంతమేర ప్రాథమికంగా రుజువు చేయగలిగారు. రాజకీయ దురుద్దేశాలు.. పక్షపాతానికి న్యాయపరమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తగిన సమయంలో తేలుస్తాం.థర్డ్ డిగ్రీ ఉపయోగించినా.. బెదిరించినా.. ఒత్తిడి చేసినా.. ప్రలోభపెట్టినా వీటిని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాం. నిందితులు, సహ నిందితుల నుంచి వాంగ్మూలాలను సేకరించే సమయంలో దర్యాప్తు సంస్థ కొన్ని సందేహాస్పద పద్ధతులను అనుసరిస్తోంది. పిటిషనర్లు, ఇతర సహ నిందితుల విషయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించడం, బెదిరించడం, ఒత్తిడి తేవడం, ప్రలోభపెట్టడం చెయ్యడానికి వీల్లేదు. సాక్షి, అమరావతి: ఏపీ మద్యం వ్యవహారంలో కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, వాటిని ఎంతమాత్రం కొట్టిపారేయలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజకీయ పక్షపాతం, దురుద్దేశాలకు న్యాయపరంగా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయితే, రాజకీయ దురుద్దేశాల కారణంతో.. నిందితులను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయకుండా దర్యాప్తు అధికారిని నిరోధించలేమని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జంషేడ్ బుర్జోర్ పార్థివాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.\మద్యం వ్యవహారంలో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చెబుతూ, వారి పిటిషన్లను కొట్టివేసింది. పిటిషనర్లపై థర్డ్ డిగ్రీ ఉపయోగించడానికి వీల్లేదని ఏపీ సీఐడీ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, ఫలానా విధంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయరాదంది. దర్యాప్తును నిష్పాక్షికంగా, పారదర్శకంగా కొనసాగించాలని ఆదేశించింది. పిటిషనర్లు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే, కేసు పూర్వాపరాల ఆధారంగా విచారించి తగిన నిర్ణయం వెలువరించాలని కింది కోర్టు, హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయంలో న్యాయవాదులు ఉండాలనుకుంటే, ఆ అభ్యర్థనతో హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది. సీఐడీ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నారు మద్యం కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం జస్టిస్ పార్థివాలా ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. మద్యం కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, ప్రభుత్వం మారగానే కేసు నమోదైందని వారు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సీఐడీ దర్యాప్తునకు పిటిషనర్లు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 13 గంటల చొప్పున వీరిని దర్యాప్తు అధికారి ప్రశి్నంచారన్నారు. ఎలాంటి అక్రమాల్లేవనీ సీసీఐ తేల్చింది... కొత్త మద్యం కంపెనీలకు అవకాశం కల్పించడం వెనుక అక్రమాలు జరిగాయని సీఐడీ ఆరోపిస్తోందని.. కానీ, ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తేల్చిందని అభిషేక్ మను సింఘ్వీ, వికాస్ సింగ్ పేర్కొన్నారు. సీఐడీ రిమాండ్ రిపోర్టులో ఇప్పుడు చేస్తున్న ప్రతి ఆరోపణ.. గతంలో సీసీఐకి చేసిన ఫిర్యాదులో ఉన్నవేనని గుర్తు చేశారు. నాటి ఫిర్యాదును సీసీఐ క్షుణ్నంగా పరిశీలించి క్లీన్చిట్ ఇచ్చిందని వివరించారు.ఈ మేరకు సీసీఐ ఉత్తర్వులను వారు ధర్మాసనం ముందు ఉంచారు. అక్రమాలే లేవని తేలిన వ్యవహారంలో సీఐడీ కేసు నమోదు చేసిందని, రాజకీయ కక్ష సాధింపులకు ఈ కేసు ఓ ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. ఈ కేసులో సాక్షులను సీఐడీ పలు రకాలుగా భయపెడుతోందన్నారు. కావాల్సిన విధంగా వాంగ్మూలం ఇవ్వకుంటే నిందితులుగా చేర్చేందుకు కూడా వెనుకాడడం లేదని తెలిపారు. వాంగ్మూలాలు తప్ప సాక్ష్యాలు ఏమీ చూపడం లేదని నివేదించారు. పిటిషనర్లకు మద్యం వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని, వారు కేవలం ప్రభుత్వ అధికారులుగా సమావేశాల్లో మాత్రమే పాల్గొన్నారని చెప్పారు. ఇదే నేరం అంటూ కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. పారదర్శక విధానాన్ని పూర్తిగా మార్చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ, ఇదో భారీ కుంభకోణమన్నారు. గతంలో మద్యం కొనుగోళ్లు చాలా పారదర్శకంగా జరిగేవని, గత ప్రభుత్వ హయాంలో దానిని పూర్తిగా మార్చేశారన్నారు. కీలక స్థానాల్లో కావాల్సిన వ్యక్తులను నియమించుకున్నారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ... రాజకీయ దురుద్దేశాలను, ప్రాథమిక ఆధారాలను ఎలా సమతుల్యం చేస్తారని ప్రశ్నించింది. దీంతో ఇది విచారణకు స్వీకరించదగ్గ నేరమే కాదని వికాస్ సింగ్ సమాధానం ఇచ్చారు.ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. అలాగైతే ఎఫ్ఐఆర్ కొట్టివేతకు పిటిషన్ దాఖలు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది. ఆ పని కచి్చతంగా చేస్తామని వికాస్ తెలిపారు. సింఘ్వీ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్లు ప్రభుత్వాధికారులుగా పదవీ విరమణ చేశారని, వారు ఎక్కడికీ పారిపోయే అవకాశం లేదని అన్నారు. ఆ అవసరం కూడా వారికి లేదన్నారు. కావాలంటే పాస్పోర్ట్ జప్తునకు ఆదేశాలు ఇవ్వొచ్చునన్నారు. అలాంటప్పుడు దేశం విడిచివెళ్లిపోతారన్న ఆందోళన అనవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ, ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఈసీఆర్ నమోదు చేసిందన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం, పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమంటూ పిటిషన్లు కొట్టేసింది. బెయిల్ పిటిషన్ దాఖలుకు గోవిందప్పకు అనుమతి వికాట్ సంస్థ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ నేపథ్యంలో తాము దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే సుప్రీంకోర్టుకు వివరించారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్కు అనుమతి కోరగా.. ధర్మాసనం అనుమతిచ్చింది. బాలాజీ గోవిందప్ప రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే కేసు పూర్వాపరాల ఆధారంగా నిర్ణయం వెలువరించాలని కింది కోర్టు, హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సమయంలో దవే స్పందిస్తూ, ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉండగానే గోవిందప్పను అరెస్ట్ చేశారన్నారు. ఇది ఏమాత్రం సహేతుకం కాదని, ఇలా అరెస్ట్ చేయడం తగదంటూ ఇదే కోర్టు గతంలో స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పరిశీలించాలంటూ సంబంధిత తీర్పు కాపీని ధర్మాసనం ముందు ఉంచారు. ఇప్పుడు ఈ అంశాలన్నీ అవసరం లేదని, తాము బాలాజీ గోవిందప్పకు ముందస్తు బెయిల్ ఇవ్వలేదని ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టు హెచ్చరికలు ఇవీ... రాష్ట్ర ప్రభుత్వానికి... ఏపీ మద్యం వ్యవహారంలో కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి. వాటిని ఎంతమాత్రం కొట్టిపారేయలేం. రాజకీయ పక్షపాతం, దురుద్దేశాలు ఉంటే, వాటికి న్యాయపరంగా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.సీఐడీ అధికారులకు..పిటిషనర్లపై థర్డ్ డిగ్రీ ఉపయోగించడానికి వీల్లేదు. ఫలానా విధంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయరాదు. దర్యాప్తును నిష్పాక్షికంగా, పారదర్శకంగా కొనసాగించాలి.రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై... పిటిషనర్లు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే, కింది కోర్టులు కేసు పూర్వాపరాల ఆధారంగా విచారించి తగిన నిర్ణయం వెలువరించాలి. విచారణ సమయంలో న్యాయవాదులు ఉండాలనుకుంటే, ఆ అభ్యర్థనతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించాలి. -
జరిమానా విధిస్తాం జాగ్రత్త
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీ ఇష్టం వచ్చినట్లు ఒకే విషయంపై పదే పదే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుంది జాగ్రత్త..’అని గ్రూప్–1 అభ్యర్థులను సుప్రీంకోర్టు హెచ్చరించింది. ‘ఈ విషయమై గతంలోనూ కొందరు కోర్టును ఆశ్రయించారు. పరీక్షలు అయ్యాక దీనిపై వాదనలు అవసరమా అని అప్పుడే మేం ప్రశ్నించాం. ఆ పిటిషన్ను డిస్మిస్ చేశాం. ఇప్పుడు మళ్లీ మీరెందుకు వచ్చారు? మేం డిస్మిస్ చేసిన విషయం మీకు తెలియదా?’అంటూ నిలదీసింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. అభ్యర్థులు పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు, ఆ పిటిషన్ విత్డ్రాకు ధర్మాసనం అనుమతి ఇచి్చంది.గ్రూప్–1,2,3 నోటిఫికేషన్లకు సంబంధించిన జీవో 29, జీవో 33ను, పీహెచ్సీ రిజర్వేషన్లు వర్టీకల్గా అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ కుమ్మరి ప్రవీణ, మరో 12 మంది 370 పేజీలతో కూడిన రిట్ పిటిషన్ను ఏప్రిల్ 30న సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ జోమాల్య బగి్చలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎస్.నిరంజన్ రెడ్డి, పిటిషనర్ల తరపున రానా ముఖర్జీ వాదనలు వినిపించారు.గ్రూప్–1 నోటిఫికేషన్ వ్యవహారంలో జీవో 29 రద్దు అంశంపై సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణ జరిపి, కొట్టివేసిందని నిరంజన్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం అభ్యర్థులపై సీరియస్ అయ్యింది. ‘పిటిషన్లో కొత్తగా ఏం ఉంది? ఒకే అంశంపై ఇంతమంది ఇన్నిసార్లు ఎందుకు? ఇలా చేస్తే జరిమానా విధిస్తాం..’అని హెచ్చరించింది. దీంతో పిటిషన్ను విత్డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని రానా ముఖర్జీ అభ్యర్థించగా ధర్మాసనం అంగీకరించింది. -
Liquor Case: రాజకీయ కక్ష అని తేలితే...? సుప్రీం సీరియస్
-
‘కంచ’ను రిజర్వు ఫారెస్టుగా ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను వన్యప్రాణుల రక్షణ చట్టం–1972 నిబంధనల మేరకు రిజర్వు ఫారెస్టుగా ప్రకటించేలా కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) సిఫార్సు చేసింది. భూమి నిర్వహణను కూడా అటవీ శాఖకు అప్పగించాలని అభిప్రాయపడింది. కంచ గచ్చిబౌలి భూ వివాదంపై సుప్రీంకోర్టు సిద్ధాంత దాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్ర సాధికార కమిటీ గురువారం సుప్రీంకోర్టుకు మరో నివేదికను అందజేసింది. ‘400 ఎకరాలపై ఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనాన్ని పరిశీలించగా.. 56 శాతం అటవీ ప్రాంతమేనని తేలింది.ఇందులో కూడా 7.08 శాతం దట్టమైన అడవి (70 లేదా అంతకంటే ఎక్కువ శాతం చెట్లు), 31.89 శాతం మధ్యస్థ అడవి (70శాతం కంటే తక్కువ 40 శాతం కంటే ఎక్కువ చెట్లు), 17.17 శాతం బహిరంగ అడవి (10–40 శాతం చెట్లు) ఉన్నాయి. ఇదంతా చెట్ల నరికివేతకు ముందు. ఈ గణాంకాలు తెలంగాణ సర్కార్ చెప్పిన దానికంటే చాలా ఎక్కువ. 1.44 శాతం దట్టమైన అడవి, 7.99 శాతం మధ్యస్థ అడవి, 9.5 శాతం బహిరంగ అడవి.. అని సర్కార్ పేర్కొంది. చెట్ల నరికివేత తర్వాత.. ఈ గణాంకాలు 0.002 శాతం దట్టమైన, 0.61శాతం మధ్యస్థ, 7.92 శాతం బహిరంగ అడవిగా ఉన్నాయని పేర్కొంది.ఆకుపచ్చ జీవవైవిధ్యానికి ప్రాముఖ్యత‘2,300 ఎకరాల భూమిలో గొప్ప జీవవైవిధ్యం దాగిఉంది. ఇది పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుంది. ఈ భూమిని కన్జర్వేషన్ రిజర్వ్గా లేదా డీమ్డ్ ఫారెస్ట్గా ప్రకటించి, అత్యున్నత స్థాయి రక్షణ కల్పించడంపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక పార్కు కోసం పాక్షికంగా తొలగించిన చెట్లను నాటి పునరుద్ధరణ పనులు చేపట్టాలి. ఎలాగూ వర్షాకాలం వస్తోంది కనుక స్థానికంగా ఎదిగే చెట్లు, పొద జాతులను దట్టంగా నాటాలి. నేలతోపాటు తేమ పరిరక్షణ కార్యకలాపాలను చేపట్టాలి. రాష్ట్రంలోని అటవీ భూముల పరిశీలన కోసం క్షేత్రస్థాయి అటవీ అధికారులు, పర్యావరణ శాస్త్రవేత్తలు, ఐటీ, రిమోట్ సెన్సింగ్ నిపుణులు, సర్వే ఏజెన్సీలతో కమిటీని పునర్నియమించాలి.అటవీ ప్రధాన సంరక్షణాధికారి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్, భూ యాజమాన్య విభాగాల సీనియర్ అధికారులు, న్యాయ నిపుణులు, పర్యావరణ శాస్త్రవేత్తలతో కూడిన ఉన్నతస్థాయి సమన్వయ కమిటీని వేసి ప్రభుత్వ, సంస్థాగత భూములను గుర్తించాలి. తడి భూములు (సంరక్షణ–నిర్వహణ) నియమాలు–2017 ప్రకారం.. ఈ ప్రాంతంలోని అన్ని నీటి వనరులను తడి భూములుగా రక్షించేందుకు, హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి ప్రవహించే అన్ని మురుగునీటి అవుట్లెట్ల మూసివేతకు వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లేదా మరో ప్రముఖ సంస్థ ద్వారా కంచ భూముల సమగ్ర పర్యావరణ అంచనా వేయించాలి’ అని నివేదికలో సీఈసీ సిఫార్సు చేసింది.