swami swarupananda saraswathi
-
టీటీడీ ఈవో నియామకంపై కోర్టుకెళ్తా
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ధ్వజం యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన అనిల్కుమార్ సింఘాల్ నియామకాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లనున్నట్లు విశాఖపట్నంలోని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పేర్కొన్నారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ ఈవోగా ఉత్తరాది వారిని నియమించడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలకు ఇది పరాకాష్ట అని మండిపడ్డారు. టీటీడీ ఈవోగా వ్యవహరించిన సాంబశివరావును బదిలీచేయడం పనికిమాలిన ఆలోచనని, అసలు ఆయన్ను ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. తెలుగు చదవడం రాని వారిని టీటీడీ ఈవోగా ఎలా నియమిస్తారని నిలదీశారు. టీటీడీ ఆగమాలపై అవగాహన లేనందువల్ల కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు అనేక సమస్యలు వస్తాయన్నారు. ఈ అంశంపై తాను తప్పక న్యాయపోరాటం చేస్తానని స్వరూపానందేంద్ర స్వామి స్పష్టం చేశారు. రాజకీయ నిరుద్యోగులకు ధర్మకర్తల మండలిలో సభ్యులుగా నియమిస్తే టీటీడీకి నష్టం వాటిల్లుతుందని తెలిపారు. -
ఏపీ ప్రభుత్వంపై కోర్టుకెళతా: స్వామి స్వరూపానంద
అమరావతి: టీటీడీ ఈఓగా ఉత్తరాది వారిని నియమించడం దురదృష్టకరమని స్వామి స్వరూపానంద సరస్వతి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు ఇది పరాకాష్ఠ అని విమర్శించారు. మాజీ ఈఓ సాంబశివరావు నిజాయితీగలవారని, అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చారు. సాంబశివరావును మార్చడం పనికిమాలిన ఆలోచన అని మండిపడ్డారు. తెలుగువారిని వదిలి బయటివారికి ఈఓ పోస్టు కట్టబెడుతూ టీడీపీ ప్రభుత్వం చేసిన దుస్సాహసం ఎవ్వరూ చేయలేదన్నారు. తెలుగు చదవడం, మాట్లాడటం రానివారిని ఎలా ఈఓగా ప్రభుత్వం నియమిస్తుందని ప్రశ్నించారు. కీలక నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఆగమానికి సంబంధించి సమస్యలు వస్తాయని వివరించారు. ఉత్తర ప్రాంతం ఆగమాలతో సంబంధం లేకుండా భక్తి ఉంటుందని తెలిపారు. టీటీడీ నూతన ఈఓ నియామకంపై కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. ఇక ముందు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇలాంటి చర్యలు తీసుకోకుండా పోరాటం చేస్తానని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు కొత్త ఈవోగా ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నియమితులైన విషయం తెలిసిందే. సంబంధిత మరిన్ని కథనాలకై చదవండి తెలుగువారు లేరనా?!