breaking news
T20 series
-
‘అలా అయితే డిప్రెషన్లోకి వెళ్లిపోతాడు.. మంచి పనే చేశారు’
హర్షిత్ రాణా.. ఐపీఎల్లో సత్తా చాటి అనతికాలంలోనే టీమిండియాలో అరంగేట్రం చేసిన ఆటగాళ్లలో ఒకడు. హెడ్కోచ్ గౌతం గంభీర్ ప్రియ శిష్యుడిగా పేరొందిన ఈ ఢిల్లీ పేసర్.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలోనూ అడుగుపెట్టాడు.టీమిండియా తరఫున ఇప్పటి వరకు రెండు టెస్టులు, పద్నాలుగు వన్డేలు, పద్నాలుగు టీ20 మ్యాచ్లు ఆడిన 24 ఏళ్ల హర్షిత్ రాణా.. ఆయా ఫార్మాట్లలో వరుసగా నాలుగు, 26, 16 వికెట్లు కూల్చాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన భారత జట్టులోనూ అతడు సభ్యుడు.గాయాలతో సావాసంఅయితే, గత కొంతకాలంగా హర్షిత్ రాణా గాయాల వల్ల ఇబ్బందిపడుతున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ముందు సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఈ రైటార్మ్ పేసర్ గాయపడ్డాడు. మోకాలి నొప్పితో విలవిల్లాడిన అతడు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఐపీఎల్-2026 మొత్తానికి ఈ కోల్కతా నైట్ నైడర్స్ ఆటగాడు దూరమయ్యాడు.ఇలా వచ్చి.. అలా వెళ్లాడుఈ క్రమంలో జూన్లో ఐర్లాండ్ పర్యటన సందర్భంగా భారత టీ20 జట్టులోకి హర్షిత్ రాణా పునరాగమనం చేశాడు. అయితే, ఇంగ్లండ్తో ట్రెంట్ బ్రిడ్జ్ వన్డే సందర్భంగా అతడికి తొడ కండరాల గాయమైంది. దీంతో హర్షిత్ రాణా మరోసారి జట్టుకు దూరమయ్యాడు.ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్లో హర్షిత్ రాణా పునరావాసం పొందుతున్నాడు. అయితే, అఫ్గానిస్తాన్తో స్వదేశంలో సెప్టెంబరు 13న మొదలయ్యే టీ20 సిరీస్కు అతడు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ తొలుత ప్రకటించింది.సిరీస్ మొత్తానికి దూరంఅయితే, ఫిట్నెస్ పరీక్ష సమయంలో హర్షిత్ రాణా మరోసారి గాయపడటంతో అతడు సిరీస్ మొత్తానికి దూరమైనట్లు ప్రకటించింది. అతడి స్థానంలో యశ్ ఠాకూర్ను ఎంపిక చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ జట్టు హెడ్కోచ్ శరణ్దీప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత హర్షిత్ను టీమిండియాలో ఆడించాలని శరణ్దీప్ సింగ్ సూచించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో యాజమాన్యం తొందరపడి అతడిని తీసుకురాకుండా మంచి పని చేసిందని పేర్కొన్నాడు. ఈ మేరకు ఫ్యాన్కోడ్తో మాట్లాడుతూ....డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంది‘‘ఒక్కసారి టీమిండియాలోకి తిరిగి వస్తే అదనంగా శ్రమించాల్సి ఉంటుంది. కాబట్టి గాయం మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హర్షిత్ రాణాను మరికొంత కాలం పక్కనపెట్టడం సానుకూల విషయమే. లేదంటే వరుస గాయాల వల్ల హర్షిత్ డిప్రెషన్లో కూరుకుపోయే అవకాశం ఉంటుంది.ఒత్తిడి పెరిగి అతడి మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం భారత జట్టులో అతడు కీలక సభ్యుడిగా ఉన్నాడు. అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటు అవసరమైనపుడు బ్యాటింగ్ కూడా చేయగలడు. గతేడాది కాలంగా బాగా రాణించాడు. అయితే, గాయాల వల్ల కాస్త వెనుకబడ్డాడు. అతడు త్వరలోనే ఫిట్గా మారి తిరిగి వస్తాడని ఆశిస్తున్నా’’ అని శరణ్దీప్ సింగ్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఏడెకరాల భూమి.. ఫామ్హౌజ్.. ఆస్తి విలువ ఎంతంటే? -
కివీస్ టూర్లో టీమిండియా తురుపుముక్క అతడే!
అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్, ఆసియా గేమ్స్ అనంతరం టీమిండియా అక్టోబర్-నవంబర్లో న్యూజిలాండ్లో పర్యటించనుంది. ఈ టూర్లో టీమిండియా రెండు టెస్టులతో పాటు ఐదు టీ20లు, ఐదు వన్డే మ్యాచ్లు ఆడనుంది. దాదాపు ఆరేళ్ల తర్వాత కివీస్ గడ్డపై సుదీర్ఘ సిరీస్ ఆడేందుకు రానున్న నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నవంబర్ 19 నుంచి మొదలుకానున్న టెస్టు సిరీస్లో టీమిండియా తరఫున కేఎల్ రాహుల్ కీలక బ్యాటర్ కానున్నాడని బౌల్ట్ జోస్యం చెప్పాడు. అతడి బ్యాటింగ్ స్టైల్ కివీస్ పిచ్లకు అనుగుణంగా ఉంటుందని, అందుకే కివీస్ టూర్లో భారత్ తురుపుముక్క అతడే అవుతాడని పేర్కొన్నాడు.బౌల్ట్ మాట్లాడుతూ.. "న్యూజిలాండ్లో టెస్టు క్రికెట్ ఆడేందుకు భారత్ వచ్చిన ప్రతీసారి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. అయితే భారత్ ఎప్పుడూ ఫిబ్రవరి-మార్చి నెలల్లోనే న్యూజిలాండ్ పర్యటనకు వచ్చేది. కానీ ఈసారి భిన్నంగా అక్టోబర్-నవంబర్లో మా దేశంలో పర్యటించనుంది. ఆ సమయంలో దేశంలో వాతావరణం చల్లగా ఉండడంతో బ్యాటర్లకు పరిస్థితులు క్లిష్టంగా మారుతాయి. ఇది బ్యాటర్లకు మరింత సవాల్గా మారనుంది. నవంబర్లో టెస్టు సిరీస్ మొదలుకానుండంతో, అప్పటికే వాతావరణం పూర్తిగా చల్లగా ఉంటుంది. ఇది బౌలర్లకు అనుకూలంగా మారి వికెట్కు సహకరించవచ్చు. అయితే గెలుపోటములు పక్కనబెడితే ఈ సిరీస్ మాత్రం అభిమానులకు ఒక మంచి ఫీస్ట్ను అందించనుంది అని ఖచ్చితంగా చెప్పగలను" అని చెప్పుకొచ్చాడు.ఇక గతంలో బౌల్ట్, టిమ్ సౌథీ చాలా సంవత్సరాలు న్యూజిలాండ్ తరఫున కొత్త బంతితో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ఈసారి కైల్ జేమీసన్, మాట్ హెన్రీ, నాథన్ స్మిత్, విలియం ఓ రూర్కీ రూపంలో కివీస్ బౌలింగ్ లైనప్ బలంగా కనిపిస్తుంది. ఇక న్యూజిలాండ్లో భారత పర్యటన అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. తొలుత ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా అక్టోబర్ 22 నుంచి నవంబర్ 1 మధ్య ఐదు టీ20 మ్యాచ్లు, నవంబర్ 4 నుంచి 15 మధ్య ఐదు వన్డేలు, నవంబర్ 19 నుంచి 23 మధ్య తొలి టెస్టు, నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు రెండో టెస్టు జరగనుంది.Read: ‘నిజంగా ఆ క్యాచ్ పట్టి ఉంటే తల పగిలేది’ -
భారత జట్టు సాధన మొదలు
న్యూఢిల్లీ: సొంతగడ్డపై టి20 సిరీస్కు భారత్ సన్నద్ధమైంది. ఆదివారం నుంచి జరిగే 3 మ్యాచ్ల టి20 సిరీస్లో అఫ్గానిస్తాన్తో భారత్ తలపడుతుంది. జింబాబ్వేపై 3–0తో సిరీస్ గెలిచిన తర్వాత టీమిండియా బరిలోకి దిగుతున్న టి20 సిరీస్ ఇదే. ఈ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో ముగ్గురు ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి తమ ఫిట్నెస్ను నిరూపించుకున్నారు. ఈ ముగ్గురు మ్యాచ్ ఫిట్గా ఉన్నారని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) నిర్ధారించింది. భారత జట్టులోని 10 మంది సభ్యులు గురువారం సుదీర్ఘ సమయం పాటు సాధనలో పాల్గొన్నారు. హెడ్ కోచ్ గంభీర్, స్పిన్ బౌలింగ్ కోచ్ బహుతులే పర్యవేక్షణలో స్పిన్నర్లు సుందర్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత నెట్ బౌలర్ల సహాయంతో సుందర్ బ్యాటింగ్ కూడా చేశాడు. ఇతర నెట్స్లో అక్షర్, బిష్ణోయ్ల బౌలింగ్లో సంజు సామ్సన్, అభిషేక్ శర్మ దూకుడైన షాట్లు ఆడుతూ తమ ప్రాక్టీస్ను కొనసాగించారు. బుమ్రా, నితీశ్ శుక్రవారం జట్టుతో చేరతారు. పేస్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఈ సెషన్కు గైర్హాజరయ్యాడు. భారత్లో అతని వర్కింగ్ వీసా గడువు ముగిసిందని, దక్షిణాఫ్రికాకు వెళ్లి రెన్యువల్ చేయించుకున్న తర్వాత తిరిగి వస్తాడని బోర్డు వర్గాలు వెల్లడించాయి.హర్షిత్ స్థానంలో యశ్ ఠాకూర్... కండరాల గాయంతో భారత జట్టుకు దూరమైన పేసర్ హర్షిత్ రాణా కోలుకోలేదు. సీఓఈలో రీహాబిలిటేషన్లో ఉన్న అతనికి ఇప్పుడు కొత్తగా మరో గాయమైంది. దాంతో అఫ్గనిస్తాన్తో సిరీస్తో పాటు ఆసియా క్రీడలకు కూడా హర్షిత్ దూరమయ్యాడు. అతని స్థానంలో యశ్ ఠాకూర్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇటీవల జింబాబ్వేతో సిరీస్లో అరంగేట్రం చేసిన ఠాకూర్ 2 టి20లు ఆడి 4 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఆదివారం ఢిల్లీలో తొలి టి20 మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. దేశ రాజధానిలో ‘బ్రిక్స్’ సమావేశం కారణంగా స్థానిక పోలీసులు భద్రత కలిగించడం కష్టమవుతుంది కాబట్టి మ్యాచ్ను వాయిదా వేయాలనే చర్చ జరిగినా... పోలీసులతో ఢిల్లీ క్రికెట్ సంఘం చర్చల అనంతరం మ్యాచ్ యధావిధిగా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. -
గంభీర్ ఫేవరెట్ ప్లేయర్ అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ
అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. హెడ్కోచ్ గౌతం గంభీర్ ప్రియ శిష్యుడిగా పేరొందిన యువ పేసర్ హర్షిత్ రాణా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన ఈ ఢిల్లీ బౌలర్.. ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో పునరావాసం పొందుతున్నాడు.మరోసారి గాయంఈ క్రమంలో హర్షిత్ రాణా గాయం నుంచి కోలుకోవడంతో అఫ్గాన్తో సిరీస్కు టీమిండియా సెలక్టర్లు ఎంపిక చేశారు. ఫిట్నెస్ ఆధారంగా టీ20 సిరీస్ ఆడతాడని పేర్కొన్నారు. కానీ హర్షిత్ రాణా మరోసారి గాయపడ్డాడు. మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకునే క్రమంలో సోమవారం బౌలింగ్ చేస్తున్న సందర్భంగా హర్షిత్కు మరోసారి తొడ కండరాలు పట్టేసినట్లు సమాచారం. దీంతో అఫ్గానిస్తాన్తో సిరీస్తో పాటు ఆసియా క్రీడలు-2026 టోర్నీకి కూడా దూరమయ్యాడు.హర్షిత్ స్థానంలో అతడేఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా ధ్రువీకరించింది. హర్షిత్ రాణా స్థానంలో యశ్ ఠాకూర్ను అఫ్గాన్తో టీ20 సిరీస్తో పాటు.. ఆసియా క్రీడల జట్టుకు ఎంపిక చేసినట్లు గురువారం ప్రకటన విడుదల చేసింది.ఇరవై ఏడేళ్ల యశ్ ఠాకూర్ కుడిచేతి వాటం ఫాస్ట్ మీడియం పేసర్. విదర్భకు చెందిన ఈ యువ బౌలర్ ఇటీవలే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వే పర్యటన సందర్భంగా అరంగేట్రం చేసిన యశ్ ఠాకూర్,, ఇప్పటికి రెండు మ్యాచ్లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు.దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 50 మ్యాచ్లు ఆడిన యశ్ ఠాకూర్.. మొత్తంగా 81 వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఐపీఎల్లో ఇప్పటికి 22 మ్యాచ్లు ఆడిన యశ్ ఠాకూర్ 27 వికెట్లు కూల్చాడు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్కు ఆడాడు యశ్. గోల్డెన్ ఛాన్స్ఇక పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇటీవలే భారత టీ20 జట్టు సారథిగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యశ్ ఠాకూర్ అరంగేట్రం చేశాడు. తాజాగా హర్షిత్ రాణా దూరం కావడంతో అఫ్గాన్తో టీ20 సిరీస్తో పాటు.. ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే జట్టుకు ఆడే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు భారత జట్టు (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్.ఆసియా క్రీడలు-2026 టోర్నీకి భారత జట్టు (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్.చదవండి: ‘జింబాబ్వేతో మ్యాచ్ పెట్టండి.. మా కింగ్ ఆడతాడు’ -
ఇప్పుడు టి20 శైలికి మారిపోతా!
చెన్నై: దులీప్ ట్రోఫీలో సౌత్జోన్ కెప్టెన్గా రెండు మ్యాచ్లు ఆడిన ఠాకూర్ తిలక్ వర్మ మూడు ఇన్నింగ్స్లలో వరుసగా 116 నాటౌట్, 51 నాటౌట్, 99 పరుగులు (మొత్తం 266) చేశాడు. టి20 స్పెషలిస్ట్గానే ప్రస్తుతం భారత జట్టులో ఉన్న తిలక్... ఫస్ట్ క్లాస్ ఆట శైలికి తగినట్లుగా తన బ్యాటింగ్ను ప్రదర్శించాడు. దులీప్ ట్రోఫీ సెమీస్, ఫైనల్ మ్యాచ్ కలిపి 461 బంతులు ఎదుర్కొన్న అతను... ఫైనల్ మ్యాచ్లో పరిస్థితికి అనుగుణంగా ఆడుతూ ఒకదశలో వరుసగా 63 బంతులపాటు బౌండరీ కొట్టకుండా నియంత్రణ కూడా ప్రదర్శించాడు. దీనికి ముందు భారత ‘ఎ’ జట్టుకు కూడా తిలక్ కెప్టెన్గా వ్యవహరించాడు. ‘నా వ్యక్తిగత ఫామ్ చాలా బాగుంది. ఈ ప్రదర్శనతో నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ నా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చానని భావిస్తున్నా. ఈ మ్యాచ్లో కాస్త ముందుగానే దూకుడు ప్రదర్శించగలిగేవాడిని. కానీ పరిస్థితులకు, జట్టు అవసరాలకు తగినట్లు ఆడటమే ముఖ్యం. నాతో పాటు అవతలి ఎండ్లో మరో బ్యాటర్ నిలిస్తే సెషన్లవారీగా ఆడుతూ డ్రా కోసం ప్రయత్నించేవాడిని. కానీ వరుసగా వికెట్లు కోల్పోవడం ఈస్ట్కు మేలు చేసుంది. భారత ‘ఎ’ జట్టుకు, ఇప్పుడు సౌత్జోన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం వల్ల ఇతర యువ ఆటగాళ్ల నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం లభించింది. సారథిగా నేను ఎదుగుతున్నాననే భావన కలిగింది. కొన్ని సార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడే కెప్టెన్గా నా బాధ్యత మరింత పెరుగుతుంది’ అని తిలక్ అభిప్రాయపడ్డాడు. ఈ నెల 13 నుంచి అఫ్గానిస్తాన్తో జరిగే టి20 సిరీస్లో భారత జట్టును గెలిపించడంపైనే ప్రస్తుతం దృష్టి పెట్టినట్లు తిలక్ వెల్లడించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి ఒక్కసారిగా టి20లకు మారడం తనకు కష్టమేమీ కాదని, సిరీస్కు సిద్ధంగా ఉన్నానని అతను చెప్పాడు.‘ఇప్పుడు నా బ్యాటింగ్ గేర్లు మార్చి దూకుడు ప్రదర్శిస్తా. నా ఆటపై నాకు చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు అఫ్గానిస్తాన్తో సిరీస్ గెలవడమే లక్ష్యం. ఎరుపు రంగు బంతి మ్యాచ్ నుంచి టి20లకు మారడం అంత సులువు కాదు. అయితే సిరీస్కు ముందు ప్రాక్టీస్ కోసం నాకు రెండు రోజుల సమయం లభిస్తోంది. నా ఆట శైలిని మార్చుకునేందుకు ఇది సరిపోతుంది’ అని తిలక్ వ్యాఖ్యానించాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు 64 టి20 మ్యాచ్లు ఆడిన తిలక్ 145.18 స్ట్రయిక్రేట్తో 1645 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతను మరో 5 వన్డేల్లో కూడా బరిలోకి దిగాడు. -
ఆరేళ్లుగా ఎదురుచూపులు.. 50వేల టికెట్లు హాంఫట్!
టీమిండియా జట్టు అక్టోబర్ చివర్లో న్యూజిలాండ్లో పర్యటించనుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య రెండు నెలల పాటు టీమిండియా ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్లు ఆడనుంది. ఆరేళ్ల తర్వాత భారత్ న్యూజిలాండ్లో పర్యటించనుండడంతో ఇప్పటినుంచే టికెట్ల హడావిడి మొదలైంది. గత రెండు వారాల్లోనే 50వేల టికెట్లు అమ్ముడైనట్లు న్యూజిలాండ్ క్రికెట్ పేరేంటింగ్ బాడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.మొదట క్రికెట్ నేషన్ సభ్యులు, స్కై కస్టమర్లు, ఏఎన్జెడ్ కస్టమర్ల కోసం రెండు వారాల ప్రీ సేల్ విండో ఇచ్చారు. ఆగస్టు 24న క్రికెట్ నేషన్ ప్రీ సేల్ మొదలైన 48 గంటల్లోనే 26 వేల టికెట్లు అమ్ముడయ్యాయని న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. తర్వాత అభిమానుల కోసం కూడా టికెట్లను ఓపెన్ చేశారు. ముందుగానే సభ్యత్వం తీసుకున్న వారికి 15 శాతం డిస్కౌంట్ కూడా ఇచ్చారు. భారత్ సిరీస్ కోసం టికెట్లపై డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసిన బోర్డు, ఆగస్టులోనే అభిమానులను ప్రీ రిజిస్టర్ చేసుకోవాలని కోరింది. పబ్లిక్ టికెట్ సేల్స్ మొదలైన తర్వాత కూడా బుకింగ్స్ వేగంగా సాగుతున్నాయి.క్రైస్ట్చర్చ్లోని హాగ్లీ ఓవల్లో అక్టోబర్ 24న జరిగే రెండో టీ20కు ఇప్పటికే 75 శాతం టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ మైదానంలో భారత్ రెండు టీ20లు ఆడనుంది. అక్టోబర్ 22, 24 తేదీల్లో ఆ మ్యాచ్లు జరగనున్నాయి. హాగ్లీ ఓవల్లో మ్యాచ్లకు ఎప్పుడూ కూడా భారీ స్థాయిలో ప్రేక్షకులు వస్తారని న్యూజిలాండ్ క్రికెట్ మార్కెటింగ్ హెడ్ టిమ్ ఎల్లిస్ చెప్పారు. కానీ ఒక మ్యాచ్కు ఇంత ముందుగానే మూడు వంతులకుపైగా టికెట్లు అమ్ముడవడం చాలా స్పెషల్ అని అన్నారు. సుమారు 9 వేల మంది సామర్థ్యం ఉన్న ఈ మైదానంలో నవంబర్ చివర్లో రెండో టెస్ట్ కూడా జరగనుంది.Photo Credit: Twitterరోహిత్, కోహ్లి క్రేజ్..కివీస్ గడ్డపై టీమిండియాకు ఇంత క్రేజ్ రావడానికి కారణం మాత్రం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ సౌతాఫ్రికాలో జరగనున్న నేపథ్యంలో, తమ అభిమాన క్రికెటర్లను చివరిసారి చూసుకోవాలని అభిమానులు టికెట్ల కోసం ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. 🚨 50,000+ tickets already sold for New Zealand’s home summer of cricket 🇳🇿🏏The India series is driving the madness Christchurch’s 2nd T20I is already 75% sold, while Eden Park has opened its 6th tier for the first time since India’s 2019 tour.The demand for India in NZ is… pic.twitter.com/1i1xu2VHCp— Mid Wicket (@Thinkerr_11) September 9, 2026 Read: ఈస్ట్జోన్దే టైటిల్!.. చరిత్ర సృష్టించనున్న వైభవ్! -
ఆఫ్గన్తో టీ20 సిరీస్.. టీమిండియాకు బ్యాడ్న్యూస్!
స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే టీమిండియా జట్టును ప్రకటించింది. 16 మందితో కూడిన జట్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రానా, వాషింగ్టన్ సుందర్లను కూడా పరిగణలోకి తీసుకున్నారు. అయితే వారు ఫిట్నెస్ క్లియరెన్స్ ఇస్తేనే మ్యాచ్లు ఆడే అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే.సుందర్ ఒక్కడే.. హర్షిత్ డౌట్!ఆఫ్గన్తో టీ20 సిరీస్కు మరో మూడు రోజులు సమయం ఉన్న నేపథ్యంలో ఈ నలుగురి ఆటగాళ్లకు సంబంధించి ఫిట్నెస్పై కీలక అప్డేట్ వచ్చింది. వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్ క్లియరెన్స్ తీసుకొని టీ20 సిరీస్కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. హర్షిత్ రానా ఫిట్గా ఉన్నట్లు సమాచారమున్నప్పటికీ అతడికి ఇంకా ఫిట్నెస్ క్లియరెన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. మరోవైపు బుమ్రా, నితీశ్రెడ్డిలు మాత్రం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) మెడికల్ టీం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందాల్సి ఉంది."సుందర్ ఇప్పటికే బీసీసీఐ మెడికల్ టీం నుంచి క్లియరెన్స్ పొందాడు. సెప్టెంబర్ 4న నిర్వహించిన సిములేషన్ ఎక్సర్సైజ్లో సుందర్ క్లియరెన్స్ పొందాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 7న బుమ్రా, నితీశ్రెడ్డి, హర్షిత్ రానాలు మ్యాచ్ సిములేషన్కు పంపించాము. అయితే సిములేషన్లో ఈ ముగ్గురికి సంబంధించిన రిజల్ట్లో తేడాలు ఉన్నట్లు గుర్తించాం. అందుకే ఇవాళ మరోసారి ఈ ముగ్గురిని సిములేషన్ ఎక్సర్సైజ్కు పంపాలని నిర్ణయించాం. ఆ తర్వాత ఈ ముగ్గురి ఫిట్నెస్ క్లియరెన్స్కు సంబంధించిన రిపోర్ట్ వివరాలను వెల్లడిస్తాం" అని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతినిధుల బృందం తెలిపింది.బుమ్రా దూరం.. నితీశ్ కూడా!ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు బుమ్రా అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. హర్షిత్ రానా మాత్రం ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించడంతో ఆఫ్గన్తో టీ20 సిరీస్కు రెడీ అవుతున్నాడు. ఇక ఆల్రౌండర్ నితీశ్ కుమార్రెడ్డి మాత్రం ఆఫ్గన్తో టీ20 సిరీస్ ఆడడని, అతడిని నేరుగా ఆసియా గేమ్స్లో ఆడేందుకు పంపించనున్నట్లు సీవోఈ మరో ప్రకటనలో తెలిపింది.ఇంగ్లండ్తో మూడో వన్డే సందర్భంగా మోకాలి గాయానికి గురైన బుమ్రా లంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. ఇంగ్లండ్ సిరీస్కు ముందే హర్షిత్ రానా కూడా కండరాల గాయంతో రీహాబిలిటేషన్ సెంటర్కు వచ్చేశాడు. నితీశ్రెడ్డి కూడా కండరాల గాయంతోనే ఇంగ్లండ్తో పాటు లంక సిరీస్కు దూరమయ్యాడు. ఈ ముగ్గురితో పాటు పాండ్యా, వరుణ్ చక్రవర్తి కూడా గాయాల నుంచి కోలుకుంటున్నారు.🚨 UPDATE ON BUMRAH, NITISH & HARSHIT 🚨- Harshit Rana is fully fit and should be play in T20I series against Afghanistan.- Jasprit Bumrah is unlikely for T20i series against Afghanistan.- Nitish Kumar Reddy is doubtful for T20i series against Afghanistan & he is most… pic.twitter.com/pisBr2amZL— M A N U. (@Manu_1845) September 9, 2026చదవండి: IPL 2027: రూ.20 కోట్లు ఇస్తే హెడ్కోచ్గా వస్తా? -
భారత్ వర్సెస్ అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్.. మ్యాచ్లను ఎక్కడ చూడాలంటే?
భారత్, అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఈ నెల 13 నుంచి జరుగనున్న మూడు మ్యాచ్ల టి20 సిరీస్ను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సెపె్టంబర్ 13, 15, 17న వరుసగా మూడు టి20 మ్యాచ్లు జరుగనున్నాయి.ఈ సిరీస్ భారత్లో జరుగుతున్నప్పటికీ అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు దీనికి ఆతిథ్యమివ్వనుంది. ‘భారత్–అఫ్గానిస్తాన్ టి20 సిరీస్... సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేయనుంది. ‘ఫెస్టివల్ ఆఫ్ స్పోర్ట్స్’లో ఇది రసవత్తర సిరీస్గా నిలుస్తుంది’ అని సోనీ పిక్చర్స్ అధికారి రాజేశ్ కౌల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా పలువురు అఫ్గానిస్తాన్ ప్లేయర్లు స్టార్లుగా ఎదగగా... ఇప్పుడు టీమిండియాపై వారు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది కీలకం. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ సామ్సన్, తిలక్ వర్మ వంటి పలువురు స్టార్ ఆటగాళ్లు ఉండగా... పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా ఫిట్నెస్ సాధిస్తేనే జట్టులో ఉండనున్నారు. మరోవైపు ఇబ్రహీం జద్రాన్ నాయకత్వంలోని అఫ్గానిస్తాన్ జట్టులో రషీద్ ఖాన్, రహా్మనుల్లా గుర్బాజ్, సాదిఖుల్లా అటల్, అజ్మతుల్లా, గుల్బదీన్ నైబ్, నబీ వంటి ప్రతిభావంతులు ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్తో సిరీస్ ఆడేందుకు ఆతృతగా ఉన్నట్లు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈఓ నసీబ్ ఖాన్ అన్నాడు. ప్రపంచ క్రికెట్లో అత్యంత బలమైన జట్లలో ఒకటైన టీమిండియాతో సిరీస్ ద్వారా తమ ప్రతిభ చాటుకునే అవకాశం అఫ్గాన్ ప్లేయర్లకు లభిస్తుందని ఆయన వెల్లడించారు.చదవండి: గంటల వ్యవధిలో మరో పాక్ ప్లేయర్పై ఐసీసీ చర్యలు -
IND vs AFG: టీమిండియాకు శుభవార్త
అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అఫ్గాన్తో జరిగే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు అతడు అందుబాటులోకి వచ్చాడని జాతీయ మీడియా వెల్లడించింది.కాగా అఫ్గాన్ క్రికెట్ బోర్డు భారత్లో టీమిండియాకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియాతో సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో అఫ్గాన్ జట్టు మూడు టీ20 మ్యాచ్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక.శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోఇక ఈ సిరీస్కు సంబంధించి ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఈ జట్టులోకి ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ పేసర్ హర్షిత్ రాణా, ఆల్రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ గాయాల నుంచి కోలుకుని తిరిగి వచ్చారు.మ్యాచ్ ఫిట్నెస్ సాధించిన వాషీ!అయితే, ఫిట్నెస్ ఆధారంగానే ఈ నలుగురు అఫ్గాన్తో సిరీస్లో ఆడతారా? లేదా? అనేది తేలుతుందని బోర్డు పేర్కొంది. ఇండియా టుడే కథనం ప్రకారం.. వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. కానీ, బుమ్రా, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి మ్యాచ్ ఫిట్నెస్ సాధించారా? లేదా? అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.కాగా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు యాజమాన్యం పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గౌతం గంభీర్ మార్గదర్శనంలో టీ20 ఫార్మాట్లో అతడు కీలక ప్లేయర్గా మారాడు. అంతేకాదు మూడు ఫార్మాట్లలోనూ అతడికి ప్రాధాన్యం దక్కుతోంది. పెరిగిన ప్రాధాన్యందిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో ఆఫ్ స్పిన్ సేవల కోసం యాజమాన్యం వాషీని వాడుకుంటోంది. వన్డేల్లోనూ సీనియర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా కంటే ఈ చెన్నై చిన్నోడికే ప్రాధాన్యం ఇస్తోంది.అయితే, ఇటీవల యూకే పర్యటనలో వాషీ గాయపడ్డాడు. తొడకండరాల గాయంతో ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందిన వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకుని.. అఫ్గాన్తో టీ20 సిరీస్ సందర్భంగా పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే.. గాయం వల్ల 26 ఏళ్ల వాషీ శ్రీలంక పర్యటనకు దూరం కాగా.. అతడి స్థానంలో దేశవాళీ క్రికెట్ వీరుడు, 33 ఏళ్ల సారాంశ్ జైన్ టెస్టు సిరీస్కు ఎంపికై అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది.అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు టీమిండియాశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివం దూబే, నితీశ్ కుమార్ రెడ్డి (ఫిట్నెస్ ఆధారంగా), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ (ఫిట్నెస్ ఆధారంగా), వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, జస్ప్రీత్ బుమ్రా (ఫిట్నెస్ ఆధారంగా), అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా (ఫిట్నెస్ ఆధారంగా).చదవండి: IND vs AUS: భారత జట్టులో మార్పులు -
ఓడించాలని కంకణం.. తొలి టీ20కి ఆఫ్గన్ తుది జట్టు ఇదే!
టీమిండియాతో టీ20 సిరీస్ను అఫ్గానిస్తాన్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. పసికూనలం కాదని ఇప్పటికే నిరూపించుకున్న అఫ్గానిస్తాన్ టీమిండియాతో సిరీస్కు బలమైన జట్టుతో బరిలోకి దిగాలని చూస్తోంది. ఈ మేరకు తమ వద్ద ఉన్న బలమైన బ్యాటింగ్, బౌలింగ్ అస్త్రాలను టీమిండియాపై ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. మూడు మ్యాచ్ల సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు బలమైన జట్టును ఎంపిక చేసింది. ఆదివారం (సెప్టెంబర్ 13న) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆ జట్టు తుది కూర్పు ఎలా ఉంటుందనేది ఒకసారి పరిశీలిద్దాం.ఓపెనర్లుగా ఆ ఇద్దరే..తొలి టీ20లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ రహ్మనుల్లా గుర్బాజ్, కెప్టెన్ ఇబ్రహీం జద్రన్లు ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. తమ జట్టుకు పటిష్టమైన ఆరంభాన్ని అందించే బాధ్యతను ఈ ఇద్దరు అనుభవజ్ఞులు తీసుకోనున్నారు. మరోవైపు రహ్మనుల్లా గుర్బాజ్కు ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉండడంతో అతని నుంచి భారీ ఇన్నింగ్స్లు వచ్చే అవకాశం లేకపోలేదు. కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ కూడా మంచి ఫామ్లో ఉండడం ఆ జట్టుకు సానుకూలాంశం. ఇక వన్డౌన్లో దర్విష్ రసూలీ బ్యాటింగ్ చేసే అవకాశముంది. కొంతకాలంగా టీ20ల్లో ఆఫ్గన్కు కీలక బ్యాటర్గా మారిన రసూలీ 28 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. ఇందులో నాలుగు హాఫ్సెంచరీలు ఉన్నాయి.మిడిలార్డర్ ఇలా..సాదిఖుల్లా అటల్ను బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో పంపవచ్చు. అటల్ 29 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో నాలుగు అర్ధ సెంచరీలు సాధించాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన గుల్బదిన్ నైబ్ ఐదో స్థానంలో బ్యాటింగ్కు రావొచ్చు. 2024 టీ20 సిరీస్లో నైబ్ తన బ్యాట్తో భారత జట్టును ఇబ్బంది పెట్టాడు. ఈసారి కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. అజ్మతుల్లా ఉమర్జయ్ ఆరో స్థానంలో, సీనియర్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ ఏడో స్థానంలో రానున్నారు. ఈ ఇద్దరు అనుభవజ్ఞులు తమ ఫినిషింగ్ టచ్తో భారత బౌలర్లను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇక జట్టు ఐకాన్ ప్లేయర్ రషీద్ ఖాన్తో పాటు నూర్ అహ్మద్ కూడా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నవాళ్లే.బౌలింగ్ దళం..అఫ్గానిస్తాన్కు స్పిన్ బౌలింగ్ ప్రధాన ఆయుధం. ముజీబ్ ఉర్ రహ్మాన్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ త్రయం భారత్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టవచ్చు. తొలి టీ20కి ఈ ముగ్గురు అందుబాటులో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక జట్టులో ఏకైక స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్గా ఫజల్ ఫరూఖీ ఉండవచ్చు. అతడికి తోడుగా అజ్మతుల్లా, గుల్బదిన్ నైబ్లు కూడా బౌలింగ్తో ముప్పతిప్పలు పెట్టొచ్చు. ఆల్రౌండర్ మహ్మద్ నబీ తన ఆఫ్ స్పిన్తో ఇబ్బందిపెట్టగల సత్తా ఉన్నవాడే. మొత్తం మీద అఫ్గానిస్తాన్ జట్టు పేపర్పై మాత్రం బలంగా కనిపిస్తోంది. ఇటీవలే కాలంలో ఓటములను అంత త్వరగా ఒప్పుకోని అఫ్గానిస్తాన్ జట్టు సొంతగడ్డపై దుర్భేద్యంగా కనిపిస్తున్న టీమిండియాను ఏ మేరకు నిలువరించగలదనేది చూడాలి.తొలి టీ20కి అఫ్ఘనిస్తాన్ తుది జట్టు అంచనా:రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రన్ (కెప్టెన్), దర్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఉమర్జయ్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రహ్మాన్, రషీద్ ఖాన్, ఫజల్ ఫరూకీ, నూర్ అహ్మద్.Read: రెస్ట్ తీసుకోమన్నా వినలేదు; నొప్పిని భరిస్తూనే డబుల్ సెంచరీ -
అసలు అతడిని ఎలా ఎంపిక చేశారు? ఇదేం పద్ధతి?
అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు టీమిండియా సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్లు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే జట్టును ప్రకటించింది.ఫిట్నెస్ ఆధారంగా..జింబాబ్వే పర్యటనలో ఆడిన ఎనిమిది మంది ఆటగాళ్లను తప్పించి.. ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా అఫ్గాన్తో సిరీస్ ఆడిస్తామని తెలిపింది. ఇక గాయాల నుంచి జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి కోలుకున్నప్పటికీ.. ఫిట్నెస్ ఆధారంగానే వారు అఫ్గాన్తో సిరీస్ ఆడతారని బీసీసీఐ స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం తీరుపై మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. ముఖ్యంగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ విషయంలో మేనేజ్మెంట్ ఎందుకు ఇంత ఉదారంగా ఉంటుందో తనకు అర్థం కావడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రతీ రెండు, మూడు సిరీస్లకు ఓసారి గాయపడే ఆటగాడి కోసం ఇతరులను బలి చేయడం ఏమిటని ప్రశ్నించాడు.రెండువారాల్లో ఏం మారింది?ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘టెస్టుల్లో వాషింగ్టన్ సుందర్ బాగా ఆడతాడు. కానీ ఇటీవల గాయం వల్ల శ్రీలంకతో సిరీస్కు దూరమయ్యాడు. మరి రెండువారాల్లోనే అతడు ఎలా ఫిట్గా మారాడు?ఇప్పటికీ అతడు మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకోలేదు. అలాంటపుడు జట్టుకు ఎంపిక చేసి ఏం ఉపయోగం? టీమిండియాకు ఎంపిక చేసే ముందు కనీసం కొన్ని మ్యాచ్లలో ఆడి.. ఫిట్నెస్ సాధించాడా? లేదా? అన్నది చూడాలి.డాక్టర్ సర్టిఫికెట్తో ఆడేస్తారా?కానీ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ ఉంటే చాలు ఆడిస్తామంటే ఎలా? వాషింగ్టన్ సుందర్ ప్రతీ రెండు, మూడు సిరీస్లకు ఓసారి గాయపడుతున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్లలో అతడి బౌలింగ్ బాగాలేదు.నిజానికి టీ20 ఫార్మాట్తోనే అతడు టీమిండియాలోకి వచ్చాడు. ఆ తర్వాత తన ప్రదర్శనలతో టెస్టు క్రికెట్లోనూ అడుగుపెట్టాడు. కానీ ఇప్పుడు వైట్బాల్ క్రికెట్లో అతడు ఏమాత్రం సత్తా చాటడం లేదు’’ అని మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్య విధానాలను విమర్శించాడు. అదే సమయంలో నితీశ్ కుమార్ రెడ్డి గురించి చిక్కా స్పందించాడు.ఇదేం పద్ధతి?ఒకవేళ నితీశ్ గనుక మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకుంటే.. శివం దూబేకు బదులు నితీశ్నే తుదిజట్టులో ఆడించాలని సూచించాడు. ఏదేమైనా మ్యాచ్ ఆడి ఫిట్నెస్ నిరూపించుకోవాలని.. అంతే తప్ప డాక్టర్ సర్టిఫికెట్తో ఓ ఆటగాడు సులువుగా టీమిండియాలోకి రాకూడదని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పునరుద్ఘాటించాడు. చిన్నపుడు స్కూల్ ఎగ్గొట్టిన తర్వాత డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చి.. చాలా మంది శిక్ష నుంచి తప్పించుకునే వాళ్లని.. టీమిండియాకు అలాంటి దుస్థితి రాకూడదని ఘాటు విమర్శలు చేశాడు.చదవండి: గంజాయి వాసన వస్తోందని మ్యాచ్ ఆపిన సబలెంకా! -
‘ఎందుకు తప్పించారో సెలక్టర్లకే తెలియాలి’
అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందించాడు. రింకూ సింగ్ విషయంలో యాజమాన్యం వైఖరి ఏమిటో అర్థం కావడం లేదన్నాడు. ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన రింకూను ఏ కారణం లేకుండానే తప్పించారని విమర్శించాడు.ఢిల్లీ వేదికగా అఫ్గాన్ టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ల నిర్వహణకు సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ ఇటీవలే జట్టును ప్రకటించింది.వారి రీ ఎంట్రీ.. వీరికి ఉద్వాసనశ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఈ జట్టులోకి సంజూ శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్ తిరిగి రాగా.. జింబాబ్వే పర్యటనలో ఆడిన రింకూ సింగ్, హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ప్రభ్సిమ్రన్ సింగ్, అశోక్ శర్మ, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్లను సెలక్టర్లు తప్పించారు. ఇక చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు మరోసారి మొండిచేయి ఎదురైంది.ఎందుకు తప్పించారో సెలక్టర్లకే తెలియాలిఈ నేపథ్యంలో వసీం జాఫర్ స్పందిస్తూ.. రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్ విషయంలో తనకు ఎంతో బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘రింకూ ఐపీఎల్లో బాగా ఆడాడు. ఉత్తరప్రదేశ్ ప్రీమియర్ లీగ్లోనూ సత్తా చాటాడు. అక్కడి నుంచి నేరుగా రెడ్బాల్ క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు.దులిప్ ట్రోఫీలో భాగమయ్యాడు. కానీ దురదృష్టవశాత్తూ టీమిండియాలో మాత్రం మళ్లీ చోటు కోల్పోయాడు. అతడిని సెలక్టర్లు ఏ కారణం లేకుండానే ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదు. బహుశా జట్టులోకి తిరిగి వచ్చిన వారి కోసం రింకూపై వేటు వేసి ఉంటారు.జట్టులో స్థానం కోల్పోయేంతగా అతడు ఎలాంటి తప్పూ చేయలేదు. తనకు అవకాశం ఇచ్చిన ప్రతీసారీ రింకూ సద్వినియోగం చేసుకున్నాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో జట్టును విజయాల దిశగా నడిపించాడు. అతడి ప్రదర్శన బాగానే ఉన్నా జట్టు నుంచి తప్పించారు.కుల్దీప్ విషయంలోనూ అదే తీరుఇక కుల్దీప్ యాదవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతిసారీ అతడి విషయంలో బాధపడటం తప్ప మనమేమీ చేయలేము. అతడి పట్ల సెలక్టర్లు ఎందుకో సుముఖంగా లేరు’’ అని వసీం జాఫర్ యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా ఐపీఎల్-2026లో కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ రింకూ సింగ్.. 295 పరుగులు చేశాడు. యూపీ టీ20 లీగ్లో ఆరు ఇన్నింగ్స్ ఆడి 169 పరుగులు సాధించాడు. దులిప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ తరఫున 80 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధ శతకం కూడా ఉంది. ఇదిలా ఉంటే.. కుల్దీప్ యాదవ్ టీమిండియా తరఫున ఇప్పటికి 54 మ్యాచ్లు ఆడి 95 వికెట్లు కూల్చాడు. టీ20 ప్రపంచకప్-2026 సందర్భంగా పొట్టి ఫార్మాట్లో తన చివరి మ్యాచ్ ఆడాడు.చదవండి: బీసీసీఐ బిగ్ ప్లాన్! -
లంక జట్టు ప్రకటన; రెండేళ్ల తర్వాత జట్టులోకి మాజీ కెప్టెన్!
ఇంగ్లండ్ గడ్డపై ఈ నెల 15 నుంచి శ్రీలంక జట్టు వైట్బాల్ సిరీస్ (వన్డే, టీ20లు) ఆడనుంది. ఈ నేపథ్యంలో బుధవారం శ్రీలంక క్రికెట్ బోర్డు వన్డే, టీ20 సిరీస్లకు 16 మందితో కూడిన వేర్వేరు జట్లను ప్రకటించింది. గాయాల నుంచి కోలుకున్న లంక విధ్వంసకర బ్యాటర్లు కుశాల్ మెండిస్, పాతుమ్ నిస్సాంకలు తిరిగి జట్టుతో చేరారు. వన్డే, టీ20 జట్లకు కుశాల్ మెండిస్ కెప్టెన్గా ఎంపికవ్వగా, చరిత్ అసలంక అతడికి డిప్యుటీగా వ్యవహరించనున్నాడు. ఇటీవలే గాయాలతో టీమిండియాతో టెస్టు సిరీస్కు దూరమైన పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ తిరిగి రావడం లంక జట్టును బలంగా మార్చేసింది. 2027 వన్డే వరల్డ్కప్ నేపథ్యంలో..జట్టు ఎంపికలో మరో విశేషమేమిటంటే.. రెండేళ్ల తర్వాత మాజీ కెప్టెన్ దాసున్ షనక వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. 2024 జనవరిలో చివరి వన్డే ఆడిన షనక మళ్లీ ఇన్నాళ్లకు జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. పనిలో పనిగా వన్డేలతో పాటు టీ20 జట్టుకు కూడా షనకను ఎంపిక చేయడం విశేషం. ప్రస్తుతం 35 ఏళ్లున్న షనక 2027 వన్డే వరల్డ్కప్లో లంక జట్టులో కీలక ఫినిషర్ కానున్న నేపథ్యంలో అతడి ఎంపిక ప్రాధాన్యత సంతరించుకుంది.ఇంగ్లండ్ టూర్కు వైస్ కెప్టెన్గా ఎంపికైన చరిత్ అసలంక టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. అయితే ఆ తర్వాత జరిగిన లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్ 2026)లో చరిత్ అసలంక 153 స్ట్రైక్రేట్తో 385 పరుగులు సాధించి తిరిగి ఫామ్ అందుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ గడ్డపై తమ పర్యటనను ఆత్మవిశ్వాసంతో ఆరంభించనుంది.ఆ ఇద్దరి స్థానాలు పదిలం..లంక ప్రీమియర్ లీగ్లో అదరగొట్టిన కమిల్ మిషారా (411 రన్స్), లాహిరు ఉదారా (434 రన్స్) రెండు జట్లలోనూ తమ స్థానాలను నిలబెట్టకున్నారు. కమిందు మెండిస్ కూడా రెండు జట్లలోనూ చోటు దక్కించుకోగా, మరో సీనియర్ వనిందు హసరంగతో పాటు దునిత్ వెల్లలాగేలు కూడా వన్డే, టీ20 జట్లకు ఎంపికయ్యారు. లంక స్టార్ బౌలర్ మహీశ్ తీక్షణ రాకతో స్పిన్ విభాగం బలపడింది. ఇక పేస్ విభాగంలో ఇషాన్ మలింగ, దుష్మంత చమీరలు కీలకం కానున్నారు. సెప్టెంబర్ 5న లంక జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరి వెళ్లనుంది.ఇంగ్లండ్, శ్రీలంక టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్:👉తొలి టీ20 మ్యాచ్: సెప్టెంబర్ 15న, సౌతాంప్టన్ 👉రెండో టీ20 మ్యాచ్: సెప్టెంబర్ 17న, కార్డిఫ్👉మూడో టీ20 మ్యాచ్: సెప్టెంబర్ 19న, మాంచెస్టర్👉తొలి వన్డే మ్యాచ్: సెప్టెంబర్ 22న, చెస్టర్ లీ స్ట్రీట్👉రెండో వన్డే మ్యాచ్: సెప్టెంబర్ 24న, లీడ్స్👉మూడో వన్డే మ్యాచ్: సెప్టెంబర్ 27న, ఓవల్శ్రీలంక వన్డే జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కమిందు మెండిస్, చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), జనిత్ లియానాగే, పవన్ రత్నాయకే, దాసున్ షనక, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, మహీశ్ తీక్షణ, సచిందు కొలంబాగే, దుష్మంత చమీర, ఇషాన్ మలింగ, అసితా ఫెర్నాండో, దిల్షాన్ మధుషంక.శ్రీలంక టీ20 జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, లహిరు ఉదార, కమిందు మెండిస్, చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), జనిత్ లియానగే, దాసున్ షనక, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగా, మహీశ్ తీక్షణ, తరిందు రత్ననాయకె, దుష్మంత చమీర, ఇసాన్ మలింగ, నువాన్ తుషారా, బినూర ఫెర్నాండో.చదవండి: ర్యాంకింగ్స్లో దుమ్ములేపిన పడిక్కల్, అతడికి కెరీర్ బెస్ట్! -
వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్..! అస్సలు ఊహించి ఉండడు?
టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్ తిరిగి జాతీయ టీ20 జట్టులోకి వచ్చాడు. జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న శాంసన్ను.. అఫ్గానిస్తాన్తో జరగనున్న టీ20 సిరీస్కు ఎంపిక చేశారు. దీంతో అఫ్గాన్ సిరీస్లో భారత ఓపెనింగ్ జోడీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. జింబాబ్వే టూర్లో శాంసన్ లేకపోవడంతో భారత ఇన్నింగ్స్ను అభిషేక్ శర్మ-వైభవ్ సూర్యవంశీ ప్రారంభించారు. అంతకుముందు ఇంగ్లండ్ పర్యటనలో సంజూ విఫలం కావడంతో సూర్యవంశీకి ఓపెనర్గా అవకాశమిచ్చారు. కానీ సంజూ స్ధానంలో జట్టులోకి వచ్చిన వైభవ్ కూడా తీవ్ర నిరాశపరిచాడు.దీంతో ఇంగ్లండ్తో ఆఖరి టీ20కు వైభవ్ను తప్పించి శాంసన్ను మళ్లీ తుది జట్టులోకి తీసుకొచ్చారు. ఆ మ్యాచ్లో శాంసన్ 27 పరుగులు సాధించి జట్టుకు మెరుపు ఆరంభం ఇచ్చాడు. అయినప్పటికి ఆ తర్వాత జింబాబ్వే టీ20 సిరీస్కు అతడిని పక్కన పెట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది. టీ20 ప్రపంచకప్ హీరోని జట్టు నుంచి తప్పిస్తారా? అని సెలక్టర్లపై చాలా మంది మాజీలు మండిపడ్డారు. అయితే అతడిని జట్టు నుంచి తప్పించలేదని, కేవలం విశ్రాంతి మాత్రమే ఇచ్చారని బీసీసీఐ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. ఇప్పుడు మళ్లీ సంజూ టీ20 జట్టులోకి వచ్చాడు.ఈ క్రమంలో సంజూ రాకతో వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్ తగిలే అవకాశముంది. ఎప్పటిలాగే భారత ఇన్నింగ్స్ను సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే 15 ఏళ్ల సూర్యవంశీ బెంచ్కు పరిమితం కావాల్సిందే. ఒకవేళ శాంసన్ విఫలమైతేనే వైభవ్కు తుది జట్టులో చోటు దక్కనున్నట్లు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్జోన్ జట్టుకు సూర్యవంశీ ప్రాతినిధ్యం వహించాడు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. ఆ వెంటనే అఫ్గానిస్తాన్తో సిరీస్ ప్రారంభం కానుండటంతో, తొలి మ్యాచ్ ఎంపికకు అతడు అందుబాటులో ఉండటం అనుమానంగానే మారింది.చదవండి: అతడు జట్టులో ఎందుకు? ముగ్గురిలో.. ఇద్దరు ఫిట్గా లేరు.. గ్రేట్! -
IND vs AFG: అతడు ఎందుకు?.. ముగ్గురిలో ఇద్దరు లేనట్లే!
టీమిండియా యాజమాన్యం తీరుపై విమర్శలు వస్తున్నాయి. హెడ్ కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తమకు నచ్చిన క్రికెటర్లను ఆడించేందుకు అర్హులైన వారికి బలి చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగే టీ20 సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం తమ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అఫ్గాన్ ఢిల్లీ వేదికగా టీమిండియాకు ఈ సిరీస్లో ఆతిథ్యం ఇస్తుండగా.. ఇందుకోసం పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.అదే జట్టుసెప్టెంబరులో జపాన్లో జరిగే ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన జట్టులో ఎలాంటి మార్పూ లేకుండానే ఈ సిరీస్ కోసం సెలక్టర్లు జట్టును ఎంచుకున్నారు. కాగా మోకాలి గాయంతో చాలా కాలంగా ఆటకు దూరమైన టీమిండియా ప్రధాన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇంగ్లండ్తో మూడో వన్డే సమయంలో గాయపడిన బుమ్రా ఆ తర్వాత శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్లో కూడా ఆడలేదు.ఆ నలుగురు...ఇదిలా ఉంటే.. బుమ్రాతో పాటు గాయాల నుంచి కోలుకుంటున్న మరో ముగ్గురు ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలకు కూడా అఫ్గాన్తో ఆడే జట్టులో చోటు దక్కింది. అయితే ఈ నలుగురి ఎంపిక కూడా ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుందని, పూర్తిగా ఫిట్గా మారితేనే సిరీస్కు అందుబాటులో ఉంటారని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు.అతడు ఎందుకు?.. ముగ్గురిలో ఇద్దరు ఫిట్గా లేరు‘‘ముగ్గురు ఫాస్ట్ బౌలర్ల (బుమ్రా, హర్షిత్, అర్ష్దీప్)ను ఎంపిక చేశారు. కానీ అందులో ఇద్దరు (బుమ్రా, హర్షిత్) ఫిట్నెస్ సాధిస్తేనే ఆడతారట. వాళ్లు ఒక మ్యాచ్ ఆడి మళ్లీ గాయపడితే పరిస్థితి ఏంటి? హర్షిత్ ఇంగ్లండ్ పర్యటనలో అలాగే గాయపడ్డాడు కదా!..గంభీర్ ప్రియ శిష్యుడు కాబట్టే అతడిని మరోసారి ఎంపిక చేశారా?.. హర్షిత్కు బదులు ఫామ్లో ఉన్న మహ్మద్ షమీని పిలిపించవచ్చు కదా!.. లేదంటే భువనేశ్వర్ కుమార్ను ఎంపిక చేయాల్సింది.ఇక వాషింగ్టన్ సుందర్.. అతడు ఎప్పుడూ గొప్పగా ఆడిందేమీ లేదు. పూర్తి ఫిట్నెస్ సాధించలేదు అంటున్నారు. అలాంటపుడు జట్టులో ఎందుకు? వాషీకి బదులు కృనాల్ పాండ్యాను జట్టుకు ఎంపిక చేస్తే మెరుగ్గా ఉండేది. కానీ గంభీర్కు అది ఇష్టం లేదేమో!..పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో పరాభవం తర్వాత కూడా ఇంకా తమకు నచ్చిన ఆటగాళ్లకు మాత్రమే అవకాశాలు ఇస్తామంటే.. టీమిండియా మున్ముందు మరిన్ని పరాభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అర్హులైన ఆటగాళ్లను ఎంపిక చేయండి. జట్టుకు అదే మంచిది’’ అని సోషల్ మీడియా వేదికగా టీమిండియా యాజమాన్యానికి నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంకా కోలుకోకపోవడంతో అతడిని ఈ సిరీస్కు ఎంపిక చేయలేదు. మరోవైపు.. ఫిట్గా మారిన వరుణ్ చక్రవర్తి తిరిగి జట్టులోకి వచ్చాడు. వాళ్లను పక్కన పెట్టేశారుజింబాబ్వేతో సిరీస్లో ఆడని సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్ మళ్లీ జట్టులోకి రాగా...ఈ పర్యటనలో టీమిండియాలో భాగంగా ఉన్న రింకూ సింగ్, ప్రభ్సిమ్రన్ సింగ్, హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అశోక్ శర్మ, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్లను పక్కన పెట్టారు. ఈ నెల 13, 15, 17 తేదీల్లో న్యూఢిల్లీలో భారత్, అఫ్గానిస్తాన్ మధ్య మూడు టీ20లు జరుగుతాయి. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక.చదవండి: ‘నువ్వెంతగా కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’ -
ఆఫ్గన్తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
స్వదేశంలో అఫ్గానిస్తాన్ జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు బీసీసీఐ మంగళవారం టీమిండియా జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా ఉండనున్నాడు. ఇక స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వనుండగా, జింబాబ్వేతో టీ20 సిరీస్కు విశ్రాంతినిచ్చిన సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.ఇక బుమ్రాను ఎంపిక చేసినప్పటికీ, అతడు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డితో పాటు వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలు ఎంపికైనప్పటికీ, వీరు కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక అఫ్గానిస్తాన్తో టీమిండియా సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 13న, రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 17న జరగనున్నాయి. ఈ మూడు టీ20లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది.ఆఫ్గన్తో టీ20 సిరీస్ కోసం సెలెక్టర్లు ప్రధాన బౌలర్లను చోటివ్వగా.. గాయం నుంచి కోలుకున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్క్వాడ్లోకి వచ్చాడు. రవి బిష్ణోయ్ రెండో స్పిన్నర్గా స్థానం సాధించాడు. బుమ్రా, హర్షిత్, వరుణ్ రాకతో ఇంగ్లండ్ గడ్డపై ఆడిన ప్రసిధ్ కృష్ణ, సూర్యాన్ష్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్ జట్టులో చోటు కోల్పోయారు. అయితే జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ బుమ్రా, నితీశ్, సుందర్, రాణాలు ఈ సిరీస్లో ఆడతారా? లేదా?అనేది ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుందని సెలెక్టర్లు పేర్కొన్నారు.ఇక ఆఫ్గన్తో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన జట్టునే ఆసియా గేమ్స్కు పంపనున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు మార్పులు మినహా దాదాపు ఇదే జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. ఇక ఆసియా క్రీడలు జపాన్లోని ఐచీ-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి.భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్*, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా*, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా*India’s squad for Afghanistan T20I series announced. #TeamIndia will play three T20Is against Afghanistan at New Delhi, beginning September 13.#AFGvIND pic.twitter.com/UqTUeZyHz8— BCCI (@BCCI) September 1, 2026Read: పాక్ క్రికెట్లో సంక్షోభం; మనస్తాపానికి గురై పదవికి రాజీనామా! -
IND vs AFG: మళ్లీ గాయపడ్డాడు.. వాళ్లిద్దరికి లైన్ క్లియర్!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో అతడు అఫ్గానిస్తాన్తో జరిగే సిరీస్కు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కాగా ఐపీఎల్-2026 తర్వాత ఇప్పటి వరకు హార్దిక్ పాండ్యా టీమిండియా తరఫున ఆడనేలేదు.వెన్ను నొప్పిఈ ఏడాది టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా మార్చిలో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ సందర్భంగా హార్దిక్ ఆఖరిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఇక ఆ తర్వాత ఐపీఎల్ సమయంలో వెన్ను నొప్పితో బాధపడ్డ ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్.. ముంబై ఇండియన్స్ తరఫున లీగ్ దశలో పద్నాలుగింట పది మాత్రమే ఆడాడు.తొడ కండరాల గాయంఆ తర్వాత తొడ కండరాల గాయం కారణంగా అఫ్గానిస్తాన్తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్లో హార్దిక్ పాండ్యా పాల్గొనలేకపోయాడు. మూడు వారాల పాటు విశ్రాంతి అవసరం కావడంతో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందాడు.మళ్లీ ఇలా..అక్కడ క్రమక్రమంగా కోలుకున్న హార్దిక్ పాండ్యా.. జాతీయ జట్టులో పునరాగమనం చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయితే, అంతలోనే మళ్లీ మోకాలికి గాయమైంది. దీంతో అఫ్గానిస్తాన్తో సెప్టెంబరులో జరిగే టీ20 సిరీస్కు కూడా అతడు అందుబాటులో ఉండడనే వార్తలు తెరమీదకు వచ్చాయి.టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ‘‘హార్దిక్ పూర్తిగా కోలుకున్నట్లే. అతడు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే, బౌలింగ్ చేసే సమయంలో అతడు మోకాలి నొప్పితో ఇబ్బందిపడ్డాడు. ఆ తర్వాత కాసేపటికే కోలుకున్నప్పటికీ.. మ్యాచ్ ఫిట్నెస్ మాత్రం సాధించలేకపోయాడని తెలిసింది.బ్యాటింగ్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బృందం మాత్రం హార్దిక్ పూర్తిగా కోలుకున్నాడని భావిస్తేనే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. ఏదేమైనా అఫ్గాన్తో సిరీస్కు హార్దిక్ అందుబాటులో ఉండటం కష్టమే’’ అని తెలుస్తోంది.హార్దిక్ కెరీర్ ఖతమే?హార్దిక్ పాండ్యాకు గాయాలు కొత్త కాదు. గతంలోనూ అతడు తీవ్రగాయాల పాలైనా తిరిగి కోలుకుని మెగా టోర్నీల్లో సత్తా చాటాడు. అరుదైన పేస్ నైపుణ్యాలున్న ఆల్రౌండర్ కావడం వల్ల హార్దిక్ స్థానానికి గతంలో పెద్దగా సవాలు ఎదురుకాలేదు.అయితే, నితీశ్ కుమార్ రెడ్డి రాకతో పరిస్థితి కాస్త మారింది. హార్దిక్కు అతడే సరైన వారసుడు అని మాజీ క్రికెటర్లు కొనియాడుతున్నారు. యాజమాన్యం కూడా హార్దిక్ స్థానాన్ని భర్తీ చేసేలా నితీశ్ను తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉంది.ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ఇలాగే తరచూ గాయపడితే నితీశ్ రెడ్డికి మార్గం పూర్తిగా సుగమమవుతుంది. ఇప్పటికే టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకునే దిశగా పయనిస్తున్న నితీశ్ రెడ్డి.. వైట్బాల్ జట్టులోనూ కీలకంగా మారగలడు.కానీ, నితీశ్ కూడా తరచూ గాయపడుతుండటం గమనార్హం. అయితే, ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లోనే ఉన్న అతడు అఫ్గాన్తో సిరీస్కు మాత్రం అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా 2025 జనవరిలో నితీశ్ చివరగా టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు. ఇదిలా ఉంటే.. వాషింగ్టన్ సుందర్ కూడా కోలుకుని అఫ్గాన్తో సిరీస్ (సెప్టెంబరు 13-17) ఆడేందుకు సిద్ధమైనట్లు సమాచారం.చదవండి: ‘నువ్వెంతగా కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’ -
IND vs AFG: టీమిండియాలోకి ఊహించని ప్లేయర్!
శ్రీలంక పర్యటనను ముగించుకున్న భారత క్రికెట్ జట్టు తదుపరి.. స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగే టీ20 సిరీస్కు సిద్ధమవుతోంది. అయితే, ఈ సిరీస్లో అఫ్గాన్ భారత్లో టీమిండియాకు ఆతిథ్యం ఇస్తుండటం విశేషం. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఇందుకు వేదిక.కాగా అఫ్గాన్లోని పరిస్థితుల దృష్ట్యా అక్కడ అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో యూఏఈ లేదంటే భారత్లో అఫ్గాన్ బోర్డు తమ మ్యాచ్లు నిర్వహించుకుంటోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో టీమిండియా- అఫ్గాన్ టీ20 మ్యాచ్లకు షెడ్యూల్ ఖరారైంది.తెరమీదకు ఊహించని పేరుఈ క్రమంలో భారత జట్టు ఎంపిక గురించి చర్చ జరుగుతుండగా.. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్ ఒకరు అనూహ్యంగా కృనాల్ పాండ్యా పేరును తెరమీదకు తెచ్చారు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ స్థానాన్ని సెలక్టర్లు కృనాల్తో భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. కాగా టీమిండియా ఇటీవల యూకే పర్యటనలో భాగంగా ఘోర పరాభవాలు చవిచూసిన సంగతి తెలిసిందే.తొలిసారి టీ20 కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో తొలుత పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో క్లీన్స్వీప్ అయిన టీమిండియా.. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో 4-0తో వైట్వాష్ అయింది. అనంతరం జింబాబ్వే పర్యటనలో ఆతిథ్య జట్టును 3-0తో క్లీన్స్వీప్ చేసి పరువు నిలబెట్టుకుంది.అయితే, యూకే టూర్లో అక్షర్ పటేల్ ప్రదర్శన పట్ల సెలక్టర్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అతడి స్థానంలో కొత్త లెఫ్టార్మ్ స్పిన్నర్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సెలక్టర్ల చూపు కృనాల్ పాండ్యాపై పడినట్లు సదరు రిపోర్టర్ పేర్కొన్నారు.భువనేశ్వర్ కుమార్తో కృనాల్ పాండ్యా (PC: RCB/BCCI)ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ?2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కృనాల్ పాండ్యా 2021లో టీమిండియా తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు. మొత్తంగా తన ఇంటర్నేషనల్ కెరీర్లో ఇప్పటి వరకు ఐదు వన్డేలు, 19 టీ20 మ్యాచ్లు ఆడిన కృనాల్ పాండ్యా.. 130, 124 పరుగులు చేశాడు. అదే విధంగా.. వన్డేల్లో రెండు, టీ20లలో 15 వికెట్లు పడగొట్టాడు.ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర35 ఏళ్ల కృనాల్ పాండ్యా ఐపీఎల్ 2025,2026 సీజన్లలో అద్భత ప్రదర్శన కనబరిచాడు. గతేడాది 109 పరుగులు చేయడంతో పాటు పదిహేడు వికెట్లు తీశాడు. ఇక ఈ ఏడాది తొమ్మిది ఇన్నింగ్స్ ఆడి 226 పరుగులు సాధించిన కృనాల్.. 15 ఇన్నింగ్స్లో కలిపి 14 వికెట్లు కూల్చాడు.తద్వారా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండు టైటిళ్లు గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగే టీ20 సిరీస్లో కృనాల్ పాండ్యాకు అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఓ మోస్తరుగా రాణించాడు. పదకొండు ఇన్నింగ్స్లో కలిపి 173 పరుగులు చేసిన అక్షర్.. 13 ఇన్నింగ్స్లో 11 వికెట్లు తీశాడు. అయితే, యూకే పర్యటనలో ఆరు ఇన్నింగ్స్లో కేవలం నాలుగు వికెట్లు తీసి.. 48 పరుగులు మాత్రమే చేయగలిగాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ వీరవిహారం -
డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం.. జింబాబ్వేపై సౌతాఫ్రికా ఘన విజయం
పసికూన నమీబియా ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న సౌతాఫ్రికా టీ20 ట్రై సిరీస్లో బోణీ కొట్టింది. శనివారం విండ్హోక్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. జింబాబ్వే విధించిన 145 పరుగుల టార్గెట్ను సఫారీలు 13.4 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. డెవాల్డ్ బ్రెవిస్ (32 బంతుల్లో 75 నాటౌట్, 7 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించి ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఓపెనర్లు ప్రిటోరియస్ (22), జోర్డాన్ హెర్మన్ (20) పర్వాలేదనిపించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవన్స్, బ్లెసింగ్ ముజరబానీ, నైమురి తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకముందు జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (34) టాప్ స్కోరర్ కాగా, మరుమనీ (13 బంతుల్లో 30, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) ఆఖర్లో మెరవడంతో జింబాబ్వే గౌరవప్రదమైన స్కోరును సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో డాన్ జాసెన్ 3 వికెట్లు తీయగా, సుబ్రయెన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో సౌతాఫ్రికా సిరీస్లో బోణీ కొట్టగా, తర్వాతి మ్యాచ్ సోమవారం జింబాబ్వే, నమీబియా మధ్య జరగనుంది.🇿🇦𝐒𝐎𝐔𝐓𝐇 𝐀𝐅𝐑𝐈𝐂𝐀 𝐁𝐄𝐀𝐓 𝐙𝐈𝐌𝐁𝐀𝐁𝐖𝐄 𝐁𝐘 𝟕 𝐖𝐈𝐂𝐊𝐄𝐓𝐒🔥South Africa chased down 145 with ease, winning by 7 wickets.🔹️Dewald Brevis — 75 (32)*🔹️A match-winning knock to finish the chase in style.#SAvZIM #DewaldBrevis pic.twitter.com/LRxxAbmpS0— Sports Nexus (@SportsNexusNews) August 29, 2026Read: ఆసియా క్రీడలకు ముందే బిగ్షాక్.. పతకం పోయినట్లే! -
బుమ్రా, పాండ్యా విషయంలో కీలక అప్డేట్!
శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగించుకున్న టీమిండియా స్వదేశానికి చేరుకుంది. సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య అఫ్గానిస్తాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్తో పాటు సెప్టెంబర్ 19న మొదలుకానున్న ఆసియా గేమ్స్లో టీమిండియా పురుషుల జట్టు మ్యాచ్లు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్నాయి. అయితే ఈ రెండు టోర్నీలకు భారత జట్టులో కీలకమైన స్పీడస్టర్ బుమ్రా, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆడే విషయమై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ ఇద్దరు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లోనే రీహాబిలిటేషన్లో గడుపుతున్నారు. బుమ్రా ఎడమ మోకాలి గాయంతో బాధపడుతుండగా, పాండ్యా వెన్నునొప్పి నుంచి కోలుకున్నప్పటికీ, కాలి పిక్క కండరాల గాయం తిరగబెట్టడంతో సీవోఈలోనే ఉండిపోయాడు.తాజా నివేదికల ప్రకారం ఈ ఇద్దరి గాయాలపై కానీ, ఎప్పుడు కోలుకుంటారనే దానిపై కానీ ఎలాంటి అప్డేట్స్ రాలేదు. మరోవైపు అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు వీరిద్దరు ఆడకపోవచ్చు. ఇక ఆసియా గేమ్స్కు కూడా టీమిండియా-బి జట్టును పంపే యోచనలో ఉన్నట్లు బీసీసీఐ ఇప్పటికే పేర్కొంది. మరి అప్పటివరకు బుమ్రా, పాండ్యా కోలుకుంటే ఆసియా గేమ్స్లో ఆడుతారా అంటే అది కూడా అనుమానమే. బి- జట్టును సిద్ధం చేస్తే మాత్రం బుమ్రా, పాండ్యాలు మరికొంత కాలం రీహాబిలిటేషన్ కేంద్రంలోనే గడపాల్సి ఉంటుంది. మరోవైపు గాయం నుంచి కోలుకున్న ప్రిన్స్ యాదవ్ ఆఫ్గన్తో టీ20 సిరీస్కు అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం అందింది. ఇది భారత పేస్ బౌలింగ్ దళానికి గుడ్న్యూస్ అని చెప్పొచ్చు.Read: చెస్ ఆడాలని చాలెంజ్.. ‘సారీ బ్రో రిటైరయ్యా’ -
పసికూన.. ‘ప్రపంచ రికార్డు’!
సొంతగడ్డపై నమీబియా క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో సౌతాఫ్రికాను రెండుసార్లు ఓడించిన ఏకైక అసోసియేట్ జట్టుగా నిలిచింది. కాగా నమీబియా.. సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లతో ముక్కోణపు టీ20 సిరీస్ ఆడుతోంది.ఇందులో భాగంగా విండ్హోక్ నమీబియా- సౌతాఫ్రికా మధ్య మ్యాచ్తో శుక్రవారం ఈ సిరీస్కు తెరలేచింది. నమీబియా క్రికెట్ గ్రౌండ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన నమీబియా.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 163 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.ఓపెనర్ల ధనాధన్టాపార్డర్లో ఓపెనర్లు లూరేన్ స్టీన్కాంప్ (29 బంతుల్లో 41), జాన్ ఫ్రిలింక్ (38 బంతుల్లో 60) ఆకట్టుకోగా.. కెప్టెన్, వన్డౌన్ బ్యాటర్ గెర్హాడ్ ఎరాస్మస్ 19 పరుగులు చేయగలిగాడు. మిగిలిన వారిలో అలెగ్జాండర్ విలోషెంక్ (13*), రూబెల్ ట్రంపెల్మాన్ (12) మాత్రమే పది పరుగుల మార్కు దాటగా.. మిగతా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.సౌతాఫ్రికా బౌలర్లలో ప్రెనేలన్ సుబ్రేయాన్ మూడు వికెట్లతో మెరవగా.. కెప్టెన్ బిజోర్న్ ఫార్చూన్, అరంగేట్ర ఆటగాడు డువాన్ యాన్సెన్ తలా రెండు.. నకొబాని మొకోనా, డెవాల్డ్ బ్రెవిస్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి.. 145 పరుగులకే పరిమితమైంది. డెవాల్డ్ బ్రెవిస్ ఒంటరి పోరాటం (50 బంతుల్లో 75) వృథాగా పోయింది.తొలి జట్టుగా చరిత్ర..టీ20 ప్రపంచకప్-2022 సందర్భంగా నెదర్లాండ్స్ జట్టు సౌతాఫ్రికాను ఓడించింది. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో సౌతాఫ్రికాపై గెలిచిన తొలి అసోసియేట్ జట్టుగా నెదర్లాండ్స్ నిలిచింది. అయితే, 2025లో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో నమీబియా సౌతాఫ్రికాను తొలిసారి ఓడించి నెదర్లాండ్స్ తర్వాతి స్థానంలో నిలిచింది. తాజాగా మరోసారి ప్రొటిస్ జట్టుపై గెలిచి (16 పరుగుల తేడాతో).. రెండుసార్లు ఈ ఘనత సాధించిన తొలి అసోసియేట్ జట్టుగా ప్రపంచ రికార్డు సాధించింది.ఫైనల్ చేరతాం.. గెలుస్తాంటీ20 ట్రై సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాపై తొలి మ్యాచ్లో గెలుపొందడంపై నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ హర్షం వ్యక్తం చేశాడు. రెండోసారి తాము ఈ పని చేశామని.. ఇదేమీ గాలివాటం విజయం కాదన్నాడు. యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారని.. ప్రతి ఒక్కరు తమ బాధ్యతను చక్కగా నెరవేరుస్తున్నారని ప్రశంసించాడు. ఈ సౌతాఫ్రికా- నమీబియా సిరీస్లో ఫైనల్ చేరి.. టైటిల్ గెలవడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. చదవండి: సూర్యకుమార్ యాదవ్ ఆవేదన -
IND vs AFG: ఊహించని షాకిచ్చిన అఫ్గానిస్తాన్!
అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) సంచలన ప్రకటన జారీ చేసింది. భారత్లో టీమిండియాతో జరిగే టీ20 సిరీస్కు సంబంధించిన ప్రసార హక్కులను పాకిస్తాన్కు చెందిన సంస్థకు అప్పగించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సిరీస్ నిర్వహణపై ముందుకు సాగుతుందా? లేదంటే నిర్ణయం వెనక్కి తీసుకుంటుందా? అన్న చర్చ మొదలైంది.కాగా తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గానిస్తాన్లో సొంతంగా ద్వైపాక్షిక సిరీస్లు నిర్వహించే అవకాశం లేదు. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదంటే భారత్లో ఇప్పటికే పలు మ్యాచ్లకు అఫ్గాన్ బోర్డు ఆతిథ్యం ఇచ్చింది. ఈ క్రమంలోనే సెప్టెంబరులో భారత్ వేదికగా టీమిండియాకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది.ఇందులో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టీమిండియాతో సెప్టెంబరు 13-17 మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, ఈ సిరీస్కు సంబంధించిన మీడియా హక్కులను పాక్కు చెందిన టీజీ (ట్రాన్స్ గ్రూప్)నకు అప్పగించినట్లు అఫ్గాన్ బోర్డు తాజాగా ప్రకటన విడుదల చేసింది.‘‘ఏసీబీ గ్లోబల్ మీడియా హక్కుల సిండికేషన్ భాగస్వామిగా టీజీ ఉంటుంది. టీపీటీ360 మీడియా ప్రొడక్షన్ పార్ట్నర్గా వ్యవహరిస్తుంది. ఇండియాలో ఫ్యాన్ కోడ్ ఈ సిరీస్ను అధికారికంగా ప్రసారం చేస్తుంది’’ అని అఫ్గాన్ బోర్డు తెలిపింది.కాగా ట్రాన్స్ గ్రూపునకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో సత్సంబంధాలు ఉన్నాయి. పీసీబీ అంతర్జాతీయ మీడియా హక్కులు కలిగి ఉండటంతో పాటు.. ఆసియా, మధ్యప్రాచ్యంలో ఈ గ్రూపు మేజర్ ఈవెంట్లను ప్రసారం చేస్తోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ల ప్రసార హక్కులు కూడా ఈ సంస్థవే.ఈ నేపథ్యంలో బీసీసీఐ అఫ్గాన్ బోర్డు ప్రకటనపై ఎలా స్పందిస్తుందోనని క్రీడా వర్గాల్లో ఆసక్తి పెరిగింది. కాగా భారత్- పాక్ మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా కప్, టీ20 ప్రపంచకప్-2026 మేజర్ టోర్నీల్లో ఇరుజట్ల ఆటగాళ్లు కనీసం కరచాలనం చేసుకోలేదు.మరోవైపు.. ఆసియా కప్ ఫైనల్లో పాక్ను ఓడించి భారత్ టైటిల్ గెలిచింది. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించగా.. నక్వీ ట్రోఫీని ఇప్పటికీ తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. అఫ్గాన్ జట్టు ఇటీవల భారత్లో పర్యటించింది. శుబ్మన్ గిల్ సేనతో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడి ఓడిపోయి ఇంటిబాటపట్టింది.చదవండి: భారత జట్టు ప్రకటన.. సెహ్వాగ్, ద్రవిడ్ కుమారులకు చోటు -
IND vs ENG T20: ఇంగ్లండ్ను మట్టికరిపించిన భారత్
ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇండియన్ మిక్స్డ్ డిజెబిలిటి క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. ‘క్రికెట్ పుట్టినిల్లు’గా భావించే స్టేడియంలో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టును ఏకంగా 118 పరుగుల తేడాతో మట్టికరిపించింది.ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాదిరి లార్డ్స్ బాల్కనీలో షర్టు విప్పేసి ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకుంటూ.. ఐకానిక్ మూమెంట్ను రిపీట్ చేశారు. కాగా ఏడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు భారత పురుషుల దివ్యాంగ జట్టు ఇంగ్లండ్కు వెళ్లింది.కెప్టెన్ తుఫాన్ ఇన్నింగ్స్ఇందులో భాగంగా ఇంగ్లండ్ నాలుగు మ్యాచ్లు గెలిచి సిరీస్ సొంతం చేసుకోగా.. భారత్ రెండు మ్యాచ్లలో విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య లార్డ్స్ వేదికగా బుధవారం నామమాత్రపు ఏడో టీ20 జరగగా.. భారత బ్యాటర్లు దుమ్ములేపారు.ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 206 పరుగులు సాధించింది. కెప్టెన్ మజీద్ మాగ్రే కేవలం 19 బంతుల్లోనే 63 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. అర్జున్ గవ్రే 44 బంతుల్లో 68 పరుగులతో రాణించాడు. అనంతరం ఇంగ్లండ్ లక్ష్య ఛేదనకు దిగగా.. భారత బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.88 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్దీంతో ఇంగ్లండ్ దివ్యాంగ జట్టు కేవలం 88 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో హిలాల్ అహ్మద్ వనీ నాలుగు వికెట్లు కూల్చగా.. జయేశ్ పర్మార్ మూడు వికెట్లు పడగొట్టి.. ఇంగ్లండ్ను ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక లార్డ్స్ విజయంతో భారత్ ఈ సిరీస్లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 4-3కి తగ్గించగలిగింది.గంగూలీ మాదిరి సెలబ్రేషన్ఇదిలా ఉంటే.. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్పై గెలుపొందగానే భారత జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. సహాయక సిబ్బంది, ఆటగాళ్లు కలిసి ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి షర్టు విప్పేసి.. గంగూలీ ఐకానిక్ లార్డ్స్ మూమెంట్ను రిపీట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత దివ్యాంగ క్రికెట్ మండలి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్గా మారింది.కాగా ఇంగ్లండ్- ఇండియా- శ్రీలంక మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ నాట్వెస్ట్ ట్రోఫీ ఫైనల్-2002 ఫైనల్లో.. భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. లార్డ్స్లో జరిగిన టైటిల్ పోరులో గంగూలీ సారథ్యంలోని టీమిండియా ఇంగ్లండ్ను రెండు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో బాల్కనీలో గంగూలీ షర్టు విప్పేసి గాల్లో ఊపుతూ సంబరాలు చేసుకున్నాడు. చదవండి: దంచికొట్టిన సెహ్వాగ్ కుమారుడు.. వీడియో వైరల్When India wins at Lord’s, the celebrations hit different. A moment of pure cricketing joy on the Lord’s Balcony — coats off, spirits high, and the Tricolour flying with pride.118 runs. One unforgettable celebration.@imRaviKChauhan@official_idca pic.twitter.com/o6IuoRJto8— Differently Abled Cricket Council of India (@dcciofficial) August 19, 2026 -
బుడ్జోడి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే
-
వైభవ్ విషయంలో నేనైతే అది అంగీకరించను: ఆసీస్ దిగ్గజం
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ గురించి ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ పదిహేనేళ్ల పిల్లాడి ఆటకు తాను ఫిదా అయ్యానని.. అతడు కేవలం పొట్టి ఫార్మాట్కే పరిమితం కాబోడని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్తో టీ20 సిరీస్ సందర్భంగా వైభవ్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.ఆరంభంలో విఫలమైనా..ఈ సిరీస్లో వైభవ్ (13,15,14) విఫలమైనప్పటికీ.. జింబాబ్వే గడ్డ మీద అదరగొట్టాడు. మూడు మ్యాచ్లలో కలిపి 151 పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా టీ20 సిరీస్లో జింబాబ్వేను 3-0తో క్లీన్స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించి.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు.ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ దేశవాళీ రెడ్బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీకి సిద్ధమవుతున్నాడు. ఈస్ట్ జోన్ జట్టుకు అతడు ఏకంగా వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో విమర్శలు రాగా.. మాథ్యూ హెడెన్ తాజాగా స్పందించాడు.ఫిట్గా ఉండటం ముఖ్యంANIతో మాట్లాడుతూ.. ‘‘కొంతమంది వైభవ్ కేవలం పొట్టి ఫార్మాట్ ప్లేయర్ మాత్రమే అని అంటున్నారు. నేనైతే ఆ విషయాన్ని అంగీకరించను. సంప్రదాయ ఫార్మాట్లోనూ అదరగొట్టగల సత్తా అతడికి ఉంది. అయితే, ఇందుకు వైభవ్ ఫిట్గా ఉండటం ముఖ్యం.అంతకంటే ముందు.. మానసికంగా అతడు మరింత దృఢంగా మారాలి. ఏదేమైనా పదిహేనేళ్ల వయసులోనే అతడు అద్భుతమైన ఆట తీరుతో తనను తాను నిరూపించుకున్నాడు. ఐపీఎల్ వంటి బ్లాక్బస్టర్ టోర్నమెంట్లో కేవలం పాల్గొనడమే కాకుండా.. ఏకంగా సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగానూ నిలిచాడు. దీనిని బట్టి వైభవ్ స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.వరల్డ్క్లాస్ ప్లేయర్గా ఎదుగుతాడుఅతడు కచ్చితంగా వరల్డ్క్లాస్ ప్లేయర్గా ఎదుగుతాడు. అయితే, వైభవ్ ఆట తీరును మరింత మెరుగపరచుకోవాల్సి ఉంటుంది. అతడికి అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. అయితే, వాటిని ఎలా ఉపయోగిస్తాడన్నదే ముఖ్యం’’ అని మాథ్యూ హెడెన్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగిన వైభవ్.. 776 పరుగులు చేశాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. చదవండి: నాడు పావురాల రెట్టల వల్ల పోయిన పరువు.. తాజా పరిణామంపై సింధు స్పందన -
IND vs AFG: బంగ్లాదేశ్కు షాకిచ్చిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. అఫ్గానిస్తాన్ భారత్లో టీమిండియాకు ఆతిథ్యమిస్తుందని ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా వెల్లడించింది.అఫ్గాన్ క్రికెట్కు అండగా ఉంటాముఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ‘‘అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు భారత్లో టీమిండియాతో టీ20 సిరీస్కు ఆతిథ్యమివ్వడం పట్ల బీసీసీఐ సంతోషంగా ఉంది. భారత్- అఫ్గానిస్తాన్ జట్ల మధ్య పోరు చాలా ఏళ్లుగా ప్రేక్షకులకు వినోదం పంచుతోంది. ఇరుజట్లలోనూ మంచి నైపుణ్యాలున్న క్రికెటర్లు ఉన్నారు.అఫ్గానిస్తాన్ ఆటగాళ్లలో చాలా మందికి భారత్లోనూ అభిమానులు ఉన్నారు. ఇరు దేశాల క్రికెట్ సంబంధాలు రోజురోజుకీ మరింత మెరుగుపడుతున్నాయి. 2018లో తొలిసారి బారత్ అఫ్గానిస్తాన్కు ఇక్కడ ఆతిథ్యం ఇచ్చింది.చిరస్మరణీయంఅప్పటి నుంచి ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మరింత పటిష్టంగా మారాయి. ఇటీవలే జూన్లో అఫ్గాన్తో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడింది. ఇప్పుడు ఇరుజట్లు టీ20 సిరీస్లో తలపడబోతున్నాయి. ఢిల్లీలో అఫ్గాన్ జట్టు టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వడం చిరస్మరణీయంగా మిగిలిపోనుంది’’ అని పేర్కొన్నాడు.కాగా సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో అఫ్గానిస్తాన్- టీమిండియా మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదిక. అయితే, అఫ్గాన్తో టీమిండియా సిరీస్ ఖరారైన నేపథ్యంలో బంగ్లాదేశ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.బంగ్లాదేశ్కు షాక్నిజానికి సెప్టెంబరులో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వస్తుందని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆశలు పెట్టుకుంది. కానీ బీసీసీఐ మాత్రం అఫ్గాన్ను రంగంలోకి దింపి బంగ్లాకు చెక్ పెట్టింది.కాగా టీ20 ప్రపంచకప్-2026 సమయంలో భారత్లో తమకు భద్రత లేదంటూ అప్పటి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) వద్ద పంచాయితీ పెట్టిన సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య అప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగ్లా బోర్డు తమ జట్టు భారత్కు వెళ్లేది లేదంటూ భీష్మించుకుని కూర్చుంది. దీంతో ఐసీసీ రంగంలోకి దిగి ఒప్పించే ప్రయత్నం చేయగా.. బంగ్లా పట్టువీడలేదు. వేదిక మార్చలేదు కాబట్టి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. టోర్నీ నుంచే తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. దీంతో బంగ్లా బోర్డు- బీసీసీఐ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.ఇక లేనట్లేనా?అయితే, ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వం బీసీసీఐతో బంధాలు పునరుద్ధరించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. బంగ్లా బోర్డు అధ్యక్షుడిగా నియమితుడైన మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్.. ఈ బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. బీసీసీఐతో పలుమార్లు సంప్రదింపులు జరిపానని.. అయితే, ద్వైపాక్షిక సిరీస్ విషయంలో వారిదే అంతిమ నిర్ణయం అని ఇటీవల పేర్కొన్నాడు. అయితే, బీసీసీఐ మాత్రం బంగ్లాతో సిరీస్ విషయంలో ఇప్పటికీ స్పష్టతనివ్వలేదు. అదే సమయంలో అఫ్గాన్తో సిరీస్ ఖరారు చేసి.. భారత్ను ఆతిథ్య దేశంగా ఉపయోగించుకునే బంపరాఫర్ ఇచ్చింది.అఫ్గానిస్తాన్ వర్సెస్ టీమిండియా టీ20 సిరీస్ షెడ్యూల్తొలి టీ20: సెప్టెంబరు 13- ఆదివారంరెండో టీ20: సెప్టెంబరు 15- మంగళవారంమూడో టీ20: సెప్టెంబరు 17- గురువారంవేదిక: ఢిల్లీ.చదవండి: టెస్టులలో ఎవరికీ సాధ్యం కాని ఘనత.. జైసూ సరికొత్త ఫీట్ -
టీమిండియాతో సిరీస్ ఖరారు.. భారత్లో వారి ఆతిథ్యం!
అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) టీమిండియాతో టీ20 సిరీస్ను ఖరారు చేసింది. ఇందులో భాగంగా భారత జట్టుతో మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. అయితే, అఫ్గాన్ భారత్లోనే టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం.కాగా అఫ్గానిస్తాన్లో మ్యాచ్లు నిర్వహించే పరిస్థితి లేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ భారత్ లేదంటే యూఏఈలలో పలు సిరీస్లకు ఆతిథ్యమిస్తోంది. ఈ క్రమంలో తాజాగా టీమిండియాతో భారత్లో తలపడేందుకు సిద్ధమైంది.షెడ్యూల్ ఖరారుఇందులో భాగంగా ఢిల్లీ వేదికగా టీమిండియా- అఫ్గానిస్తాన్ మధ్య సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మూడు మ్యాచ్లు నిర్వహిస్తారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. గతంలో ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లకు అఫ్గానిస్తాన్ భారత్లో ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. 2017లో ఐర్లాండ్తో వైట్బాల్ సిరీస్ ఆడిన అఫ్గాన్ జట్టు.. 2017లో విండీస్తో ఆల్ ఫార్మాట్ సిరీస్ ఆడింది.టెస్టు, వన్డేలలో ఓటమిఇక ఇటీవల అఫ్గానిస్తాన్ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో జూన్లో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడింది. న్యూ చండీగఢ్లోని ముల్లన్పూర్ స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత్.. అఫ్గాన్ను ఏకంగా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో మట్టికరిపించింది.ఇక మూడు వన్డేల సిరీస్లోనూ ఆతిథ్య భారత జట్టు.. అఫ్గాన్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. తాజాగా మరోసారి అఫ్గాన్ టీమిండియాతో తలపడేందుకు సిద్ధమైంది. ఈసారి భారత్లో ఆతిథ్య దేశంగా అఫ్గాన్.. శ్రేయస్ అయ్యర్ సేనతో టీ20 సిరీస్ ఆడుతుంది.పరాభవాల తర్వాత గెలుపు బాట పట్టిన భారత టీ20 జట్టుఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లో భారత్ను చాంపియన్గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించిన బీసీసీఐ.. శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించింది. అయితే, యూకే టూర్లో భాగంగా అతడికి ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది.పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్లో భారత్ 2-0తో వైట్వాష్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలోనూ 4-0తో క్లీన్స్వీప్నకు గురై ఘోర పరాభవం ఎదుర్కొంది. అనంతరం జింబాబ్వే పర్యటనకు వెళ్లి.. ఆతిథ్య జట్టును 3-0తో వైట్వాష్ చేసి తిరిగి విజయాల బాట పట్టింది.శ్రీలంక పర్యటనలోఇక టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా ఆతిథ్య జట్టుతో గిల్ సేన రెండు మ్యాచ్లు ఆడుతుంది. ఇరుజట్ల మధ్య ఆగష్టు 15న తొలి టెస్టు.. ఆగష్టు 23న రెండో టెస్టు మొదలుకానున్నాయి. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. చదవండి: T20 WC 2028: పోర్చుగల్ కెప్టెన్గా SRH మాజీ ప్లేయర్ -
ఆసీస్ గడ్డపై వినూత్న సిరీస్.. జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
న్యూజిలాండ్-ఎ జట్టు వైట్బాల్ సిరీస్లలో తలపడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా కివీస్ జట్టు టాప్ ఎండ్ టీ20 సిరీస్తో పాటు ప్రత్యేకమైన వన్డే సిరీస్లోనూ పాల్గొననుంది. ఈ సిరీస్ల కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇందులో ఏకంగా 13 మంది అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉండడం గమనార్హం. కివీస్ తొలుత టీ20 సిరీస్లో తలపడనుంది. ఈ టాప్ ఎండ్ టీ20 సిరీస్లో మొత్తం 9 జట్లు పాల్గోనున్నాయి. ప్రతి జట్టు 6 రౌండ్-రాబిన్ మ్యాచ్లు ఆడుతుంది. అనంతరం టాప్-4 జట్లు సెమీఫైనల్స్, ఫైనల్ ఆడతాయి. ఈ సిరీస్ డార్విన్లో ఆగస్టు 21 నుండి 30 వరకు జరగనుంది. అనంతరం న్యూజిలాండ్ ‘ఎ’ జట్టు మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్లు ఆస్ట్రేలియా-ఎతో కాకుండా టాస్మానియా, సౌత్ ఆస్ట్రేలియా, నేపాల్ వంటి జట్లతో కివీస్ ఆడనుండడం విశేషం.న్యూజిలాండ్ ‘ఎ’ 16 మంది సభ్యుల జట్టుముహమ్మద్ అబ్బాస్, ఆదిత్య అశోక్, మ్యాట్ బాయిల్, మ్యాక్స్ చూ, కటేన్ క్లార్క్ (టీ20లకు మాత్రమే), క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, మ్యాట్ ఫిషర్, డీన్ ఫోక్స్క్రాఫ్ట్, జాక్ గిబ్సన్, మిచ్ హే, బెవాన్ జేకబ్స్, జేడెన్ లెన్నాక్స్, బెన్ లకేర్, రైస్ మారియూ (వన్డేలకు మాత్రమే), టిమ్ రాబిన్సన్. -
వైభవ్నే పక్కనపెడతారా?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం విషయంలో మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరు సరికాదని విమర్శించాడు. ఈ పిల్లాడిని ఐర్లాండ్పై గడ్డపై ఆడిస్తే ఫలితం వేరుగా ఉండేదని అభిప్రాయపడ్డాడు.కాగా ఐపీఎల్, భారత అండర్-19 జట్టు తరఫున అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీని టీమిండియా సెలక్టర్లు యూకే పర్యటనకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత ఐర్లాండ్, ఆ తర్వాత ఇంగ్లండ్తో టీ20 సిరీస్లు ఆడింది భారత జట్టు.సంజూ వరుస వైఫల్యాలుఅయితే, ఐర్లాండ్లో సంజూ శాంసన్- అభిషేక్ శర్మను ఓపెనింగ్ జోడీగా కొనసాగించిన యాజమాన్యం.. వైభవ్ను బెంచ్కే పరిమితం చేసింది. ఈ సిరీస్లో భారత జట్టు ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్వాష్ అయింది. ఇక సంజూ ఐర్లాండ్తో రెండు మ్యాచ్లలోనూ తేలిపోయాడు.అరంగేట్రంలో తేలిపోయిన వైభవ్అనంతరం ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ సంజూ విఫలం కావడంతో.. ఎట్టకేలకు వైభవ్కు రెండో టీ20 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. అయితే, పదిహేనేళ్ల ఈ బిహారీ పిల్లాడు.. తొలి మ్యాచ్లో కేవలం 13 పరుగులే చేశాడు. ఆ తర్వాత 15,14 పరుగులకే నిష్క్రమించాడు.జింబాబ్వే గడ్డ మీద దూకుడుదీంతో ఇంగ్లండ్తో ఐదో టీ20 నుంచి వైభవ్ను తప్పించి మరోసారి సంజూకే అవకాశమిచ్చారు. అయితే, జింబాబ్వేతో టీ20 సిరీస్ నుంచి సంజూకు విశ్రాంతినివ్వగా.. వైభవ్కు మళ్లీ ఓపెనింగ్ చేసే అవకాశం వచ్చింది. ఈ సిరీస్లో భాగంగా ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 50, 20, 81 పరుగులు సాధించాడు.జింబాబ్వేను 3-0తో క్లీన్స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు.ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్‘‘వైభవ్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. చిన్న వయసులోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ఐపీఎల్లో అతడి సత్తా ఏమిటో అంతా చూశారు. వరుస మ్యాచ్లలో అదరగొట్టి ఏకంగా ఆరెంజ్క్యాప్ గెలుచుకున్నాడు.నిజానికి ఐర్లాండ్లోనే అతడి అరంగేట్రం జరగాల్సింది. అప్పుడే అతడు నిర్భయంగా ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టి.. అక్కడా రాణించేవాడు. కానీ మేనేజ్మెంట్ ఏం చేసింది. ఆరెంజ్ క్యాప్ విన్నర్ను ఐర్లాండ్లో పక్కనపెట్టి.. నీళ్ల బాటిళ్లు మోయమని బెంచ్కే పరిమితం చేసింది.వైభవ్ ఒక ప్రత్యేకమైన ఆటగాడు. అతడిని మీరు ఐర్లాండ్లోనే ఆడిస్తే.. గొప్పగా ఉండేది. ఇంగ్లండ్లో అతడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించేవాడు. కానీ ఇంగ్లండ్లో అతడు తేలిపోయాడు. దీంతో మళ్లీ తుదిజట్టు నుంచి అతడిని తప్పించారు.అతడినే పక్కనపెడతారా?జోఫ్రా ఆర్చర్కు వైభవ్ ఆట తీరు తెలుసు కాబట్టి అతడిని సులువుగానే అవుట్ చేయగలిగాడు. ఏదేమైనా వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున మున్ముందు అదరగొట్టడం ఖాయం. కానీ ఆరంభమే ఇంకాస్త సులువుగా ఉంటే బాగుండేది.అతడొక స్పెషల్ టాలెంట్. అతడిని తుదిజట్టు నుంచి తప్పించి ప్రయోగాలు చేయొద్దు. జింబాబ్వే మీద అతడు ఎలా ఆడాడో చూశారు కదా!.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు’’ అని మహ్మద్ కైఫ్ మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు గుప్పించాడు.చదవండి: సన్రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం.. 100 బంతుల్లోనే 241 రన్స్ -
SL Vs PAK: పరువు కాపాడుకున్న పాకిస్తాన్
శ్రీలంక పర్యటనను పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు విజయంతో ముగించింది. ఇరుజట్ల మధ్య మంగళవారం జరిగిన ఆఖరి టీ20లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడేందుకు పాక్ మహిళా జట్టు లంక పర్యటనకు వెళ్లింది.తొలుత వన్డే సిరీస్ జరుగగా.. తొలి మ్యాచ్లో పాక్ విజయం సాధించింది. అయితే, ఆ తర్వాత ఆతిథ్య లంక మహిళా జట్టు మిగిలిన రెండు వన్డేలు గెలిచి సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. అనంతరం టీ20 సిరీస్లో భాగంగా తొలి రెండు మ్యాచ్లలో లంక విజయం సాధించింది.పరువు కోసం పాక్ పోరాటంతద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ను సైతం కైవసం చేసుకుంది. ఈ క్రమంలో నామమాత్రపు మూడో టీ20లో గెలిచి క్లీన్స్వీప్ చేయాలని లంక భావించగా.. పాక్ పరువు చేసిన పోరాటంలో విజయం సాధించింది. దంబుల్లా వేదికగా టాస్ గెలిచిన పాక్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేసింది. టాపార్డర్లో ఓపెనర్లలో ఇమేషా దులాని (17) నిరాశపరచగా.. కెప్టెన్ చమరి ఆటపట్టు 34 పరుగులతో రాణించింది. వన్డౌన్ బ్యాటర్ సంజనా కవింది 20 పరుగులతో ఫర్వాలేదనిపించింది.నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది..మిగిలిన వాళ్లలో కవిశా దిల్హరి (12), కౌశాని నూత్యాంగన (12), కావ్యా కవింది (10 నాటౌట్) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. పాక్ బౌలర్లలో మొమినా రియాసత్ రెండు వికెట్లు తీయగా.. ఉమ్ ఈ హనీ, నష్రా సంధు, తూబా హసన్, ఆయేషా జాఫర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాక్ 18.2 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 115 పరుగులు సాధించింది. తద్వారా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది.. క్లీన్స్వీప్ గండం నుంచి బయటపడింది. పాక్ ఓపెనర్ షవాల్ జుల్ఫికర్ 21, ఆయేషా జాఫర్ 39 పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో చమరి ఆటపట్టు, కవిశా దిల్హరి చెరో రెండు వికెట్లు తీయగా.. మిమాష మీపగే ఒక వికెట్ పడగొట్టింది.చదవండి: గంభీర్పై ఫిర్యాదు చేసిన సీనియర్ ప్లేయర్లు -
‘అసాధారణమే కానీ మెరుగుపడాలి’.. వైభవ్కు చురకలు!
జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 49 బంతుల్లో 81 పరుగుల మెరపు ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. సిరీస్లో రెండు అర్ధసెంచరీలు సాధించిన వైభవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కూడా ఎగరేసుకుపోయాడు. ఈ నేపథ్యంలోనే జింబాబ్వే టూర్కు గంభీర్ స్థానంలో కోచ్గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. 15 ఏళ్ల వయసులోనే అద్భుతాలు చేస్తున్న వైభవ్కు ఎంతో భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు. చిన్న వయసులో అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న వైభవ్ ఫిట్నెస్ విషయంలో మాత్రం మరింత కష్టపడాలని యాజమాన్యం కోరుకుంటుందని లక్ష్మణ్ పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం లక్ష్మణ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు. 'వైభవ్ గురించి మాకు బాగా తెలుసు. సుమారు రెండున్నరేళ్ల క్రితం, 2024 అండర్-19 ప్రపంచకప్నకు ముందే అతని ప్రతిభను గుర్తించాం. విజయవాడలో జరిగిన క్వాడ్రాంగులర్ సిరీస్లో ఇండియా-బి తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో వైభవ్ ఒకడిగా ఉన్నాడు. అప్పటి నుంచి బీసీసీఐ ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) క్యాంపుల్లో వైభవ్ నిరంతరం శిక్షణ పొందుతున్నాడు. అంతేకాదు అండర్-19 ప్రపంచకప్లోనూ వైభవ్ సూర్యవంశీ టాప్ స్కోరర్గానూ నిలిచాడు. వైభవ్లో వచ్చిన పరిణతి, అవగాహన అసాధారణంగా పెరిగాయి. అందుకే కఠిన పరిస్థితులను సైతం తట్టుకుని, ఒత్తిడిలో మేటి ఆటగాళ్లపై రాణించగలుగుతున్నాడు. అయితే, అతను మెరుగుపరుచుకోవాల్సిన ముఖ్యమైన అంశం అతని ఫిట్నెస్. అతని వయసు కేవలం 15 ఏళ్లేనని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆఖరి మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడినా, మైదానంలోనే ఉండాలని అతను కోరుకున్నాడు. కానీ, మా ఫిజియో సూచన మేరకు అతన్ని బయటకు పంపించాల్సి వచ్చింది. జట్టు కోసం ప్రతీ విషయంలోనూ ది బెస్ట్ అందించాలనే తపన అతనిలో ఉంది' అని లక్ష్మణ్ పేర్కొన్నాడు. ये #VaibhavSooryavanshi के बारे में बात कर रहे है।“वैभव हर कीर्तिमान पार करेगा”इनका नाम VVS Laxman हैं जिन्हें तब की Mighty आस्ट्रेलियाई खिलाड़ी और मीडिया "Very Very special "Laxman" बोला करती थी।जिसने 134 टेस्ट मैच खेला है और कभी टीम इंडिया के मशहूर fab-4 का हिस्सा थे।…— Uday Yadav (@USY_79) July 27, 2026 -
సిరీస్ మనదే
హరారే: స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటిన భారత క్రికెట్ జట్టు... జింబాబ్వేపై టి20 సిరీస్ కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా 90 పరుగుల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సిరీస్ పట్టేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 81; 9 ఫోర్లు, 2 సిక్స్లు), హైదరాబాదీ తిలక్ వర్మ (29 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధశతకాలతో మెరిశారు. గత మ్యాచ్లో రికార్డు అర్ధ శతకం నమోదు చేసిన 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (9 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (19 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అభిషేక్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా... అరంగేట్ర పేసర్ యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో టి20 నేడు ఇక్కడే జరగనుంది. వైభవ్ ఆరంభ మెరుపులు... ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భారత బ్యాటింగ్ ఆర్డర్... ఈ మ్యాచ్లో దంచికొట్టింది. తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అభిషేక్ శర్మ (8) ఎక్కువసేపు నిలవలేకపోగా... ఇన్నింగ్స్ మూడో ఓవర్లో సూర్యవంశీ వరుసగా 4, 6, 4, 4 బాదాడు. అయితే అదే ఊపులో మరో భారీ షాట్ ఆడేందుకు ప్రయతి్నంచి అవుటయ్యాడు. మంచి టచ్లో కనిపించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25; 4 ఫోర్లు) భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోగా... 10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 95/3తో నిలిచింది. అక్కడి నుంచి ఇషాన్, తిలక్ ఇన్నింగ్స్ను నడిపించారు. మంచి బంతులను గౌరవించిన ఈ జోడీ... చెత్త బంతులపై విరుచుకుపడింది. ఈ క్రమంలో ఇషాన్ 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... ఇన్నింగ్స్ 13వ ఓవర్లో తిలక్ హ్యాట్రిక్ ఫోర్లతో హోరెత్తించాడు. మరుసటి ఓవర్లో ఇషాన్ 4, 4, 6 కొట్టడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ నిలకడగా రాణించడంతో మధ్య ఓవర్లలో భారత్ మెరుగైన స్కోరు చేసింది. ధాటిగా ఆడిన తిలక్ 23 బంతుల్లోనే హాఫ్సెంచరీ మార్క్ దాటాడు. తిప్పేసిన అభిషేక్... లక్ష్యఛేదనలో ఏ దశలోనూ జింబాబ్వే పోటీలో కనిపించలేదు. ఓపెనర్ బెన్నెట్ క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లు ఆడగా... అతడిని తొలి అంతర్జాతీయ టి20 ఆడుతున్న యశ్ ఠాకూర్ అవుట్ చేశాడు. ఆ వెంటనే బెన్ కరెన్ (1) పెవిలియన్ చేరగా... మైయర్స్ (12),సికందర్ రజా (0) విఫలమయ్యారు. దీంతో జింబాబ్వే 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. బర్ల్ (20; 2 ఫోర్లు), మరుమని (24; 1 ఫోర్, 1 సిక్స్), ఇవాన్స్ (19; 1 ఫోర్, 2 సిక్స్లు) తలాకొన్ని పరుగులు చేశారు. పిచ్ స్పిన్కు అనుకూలిస్తుండటంతో... భారత సారథి శ్రేయస్ బంతిని పార్ట్టైమ్ స్పిన్నర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మకు అందించాడు. వారిద్దరూ లోయర్ ఆర్డర్ పనిపట్టడంతో జింబాబ్వే ఆలౌటైంది.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: వైభవ్ (సి) ముజరబాని (బి) ఎన్గరవా 20; అభిషేక్ (సి) బర్ల్ (బి) ముజరబాని 8; ఇషాన్ (సి) బెన్నెట్ (బి) న్యూమన్ 81; శ్రేయస్ (సి) ఇవాన్స్ (బి) బెన్నెట్ 25; తిలక్ (నాటౌట్) 60; రింకూ (సి) బర్ల్ (బి) ఇవాన్స్ 12; శివమ్ దూబే (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–10, 2–29, 3–95, 4–189, 5–213. బౌలింగ్: సికందర్ రజా 4–0–47–0; ముజరబాని 4–0–36–1; ఎన్గరవా 3–0–43–1; ఇవాన్స్ 4–0–44–1; న్యూమన్ 3–0–25–1; బెన్నెట్ 2–0–22–1. జింబాబ్వే ఇన్నింగ్స్: బెన్నెట్ (సి) ఇషాన్ (బి) యశ్ 32; కరన్ (సి) శివమ్ దూబే (బి) ప్రిన్స్ 1; మైయర్స్ (బి) రవి బిష్ణోయ్ 12; బర్ల్ (సి) రింకూ (బి) తిలక్ 20; సికందర్ రజా (సి) ఇషాన్ (బి) ప్రిన్స్ 0; మదెవెరె (సి) శ్రేయస్ (బి) శివమ్ దూబే 2; మరుమని (బి) యశ్ 24; ఇవాన్స్ (బి) అభిషేక్ 19; న్యూమన్ (బి) అభిషేక్ 3; ఎన్గరవా (సి) రింకూ (బి) అభిషేక్ 1; ముజరబాని (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 8; మొత్తం (17.5 ఓవర్లలో ఆలౌట్) 129. వికెట్ల పతనం: 1–34, 2–34, 3–48, 4–49, 5–65, 6–82, 7–105, 8–119, 9–121, 10–129. బౌలింగ్: మయాంక్ 3–0–25–0; యశ్ ఠాకూర్ 4–0–30–2; ప్రిన్స్ 1.2–0–10–2; రవి బిష్ణోయ్ 4–0–20–1; శివమ్ దూబే 1.4–0–13–1; తిలక్ వర్మ 1–0–9–1; అభిషేక్ 2.5–0–17–3. -
‘వైభవ్ సూర్యవంశీతో బౌలింగ్ కూడా చేయిస్తాం’
విధ్వంసకర బ్యాటింగ్కు పెట్టింది పేరు టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ. ఒక్కసారి క్రీజులో కుదురుకోవాలే గానీ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు పదిహేనేళ్ల ఈ పిల్లాడు చుక్కలు చూపిస్తాడు. అయితే, ఇంగ్లండ్తో అరంగేట్రంలో విఫలమైనా.. తాజాగా జింబాబ్వే పర్యటనలో మాత్రం ఈ లెఫ్టాండర్ బ్యాటర్ శుభారంభం అందుకున్నాడు.మెరుపు అర్ద శతకంహరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం నాటి తొలి టీ20లో వైభవ్ పందమ్మిది బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి తన విలువను చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా తాత్కాలిక బౌలింగ్ కోచ్ సునిల్ జోషి వైభవ్పై ప్రశంసల వర్షం కురిపించాడు.అతడొక సంచలన బ్యాటర్భారత్- జింబాబ్వే మధ్య శనివారం రెండో టీ20 నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అతడొక సంచలన బ్యాటర్. తొలి మ్యాచ్లో అతడు అదరగొట్టాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ అంటే పూనకాలు వస్తాయి. నాలుగు నెలల క్రితం ఇక్కడే అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్పై వైభవ్ భారీ శతకం (80 బంతుల్లో 175) బాదాడు.జింబాబ్వేతో తొలి టీ20లోనూ మెరుపులు మెరిపించాడు. వైభవ్ ప్రస్తుతం తన బ్యాటింగ్ విషయంలో ఎంతో సౌకర్యంగా కనిపిస్తున్నాడు. ఒకవేళ అతడు బౌలింగ్ చేయాల్సిన టైమ్ వస్తే బెంగళూరులోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్లో నేను అతడితో సాధన చేయిస్తాను.వైభవ్తో బౌలింగ్ కూడా చేయిస్తాంఅతడు బౌలింగ్లోనూ మెరిశాడంటే.. కచ్చితంగా మేము అతడి సేవలను ఉపయోగించుకునే అంశంపై తప్పక దృష్టి సారిస్తాం’’ అని సునిల్ జోషి తెలిపాడు. కాగా జింబాబ్వేతో తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య శని, ఆది వారాల్లో మిగిలిన రెండు టీ20 మ్యాచ్లు జరుగనున్నాయి. ఇందుకు కూడా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక. దీంతో కళ్లన్నీ మరోసారి వైభవ్ సూర్యవంశీ మీదే కేంద్రీకృతమై ఉన్నాయి. చదవండి: తెలివితక్కువోడు తప్పిస్తే.. తానేంటో నిరూపించాడు! -
IND vs ZIM: అతడు కోచ్గా ఉన్నాడంటే.. అన్నీ వైట్వాష్లే!
భారత టీ20 కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన తర్వాత శ్రేయస్ అయ్యర్కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. యూకే పర్యటనలో భాగంగా అతడి సారథ్యంలో పసికూన ఐర్లాండ్ చేతిలో టీమిండియా 2-0తో వైట్వాష్కు గురైంది.అనంతరం ఇంగ్లండ్ గడ్డ మీద 4-0తో క్లీన్స్వీప్ అయింది. ఈ సిరీస్లో ఓ మ్యాచ్ వర్షం వల్ల రద్దైపోయింది. దీంతో కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి ఏడు మ్యాచ్లలోనూ శ్రేయస్ అయ్యర్కు గెలుపన్నదే లేకుండా పోయింది. ఈ క్రమంలో జింబాబ్వే గడ్డ మీద తొలి మ్యాచ్ సందర్భంగా ఎట్టకేలకు శ్రేయస్ సేన విజయాల ఖాతా తెరిచింది.సమిష్టిగా రాణించి ఆతిథ్య జింబాబ్వే జట్టుపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా వరుస పరాభవాల తర్వాత శ్రేయస్ తొలిసారి గెలుపు రుచిచూశాడు. అయితే, జింబాబ్వేపై విజయాన్ని కూడా ఇంతలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన పనిలేదంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.మిగిలిపోయిందైనా.. అది విందు భోజనం లాంటిదే!ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ శ్రేయస్ అయ్యర్కు మద్దతుగా నిలిచాడు. ‘‘జింబాబ్వే మీద విజయాన్ని గొప్పగా భావించవద్దని చాలా మంది అంటున్నారు. అయితే.. టీ20 ప్రపంచకప్ చాంపియన్గా నిలిచిన తర్వాత టీమిండియా టీ20మ్యాచ్లో విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూసింది.చాన్నాళ్ల ఆకలి తర్వాత దక్కిన గెలుపు ఇది. కాబట్టి ఇది మిగిలిపోయిందే అయినా.. పెళ్లి భోజనం లాంటిదే. శ్రేయస్ అయ్యర్కు కాస్త ఊరట లభించింది. అతడి కెప్టెన్సీ ఆరంభంలోనే టీమిండియా ఘోర పరాజయాలు చవిచూసింది.కాబట్టి ఇప్పుడు జింబాబ్వే మీద గెలిచినా సరే.. అది విజయమే. ఇప్పుడు ఇదే అతడికి బూస్ట్’’ అని సదగోపన్ రమేశ్ పేర్కొన్నాడు. అదే విధంగా.. జింబాబ్వే టూర్లో గౌతం గంభీర్కు బదులు తాత్కాలిక హెడ్కోచ్గా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్పై రమేశ్ ప్రశంసలు కురిపించాడు.వీవీఎస్ లక్ష్మణ్పై ప్రశంసలు‘‘ఈ విజయంలో వీవీఎస్ లక్ష్మణ్దే సింహభాగం. అతడు ఎప్పుడు కోచ్గా వ్యవహరించినా సరే.. అప్పుడు టీమిండియా తప్పక విజయాలు సాధిస్తుంది. అతడి మార్గదర్శనంలో టీమిండియా ప్రత్యర్థులను దాదాపుగా అన్ని సిరీస్లలోనూ వైట్వాష్ చేసింది.టీమిండియా వైట్వాష్లకు గురైన తర్వాత కూడా అతడు ఇలాంటి ఫలితాలు రాబట్టాడు. వరుస పరాజయాల తర్వాత ఇప్పుడు జింబాబ్వేతో తొలి మ్యాచ్లోనూ టీమిండియా గెలిచింది’’ అని రమేశ్ వీవీఎస్ లక్ష్మణ్ను ప్రశంసించాడు. కాగా జింబాబ్వేతో మూడు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా గురువారం నాటి తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి.. 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య శని, ఆది వారాల్లో మిగిలిన రెండు మ్యాచ్లు జరుగుతాయి. ఇందుకు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక.చదవండి: తెలివితక్కువోడు తప్పిస్తే.. తానేంటో నిరూపించాడు! -
తెలివితక్కువోడు తప్పిస్తే.. తానేంటో నిరూపించాడు!
జింబాబ్వే గడ్డపై టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ సత్తా చాటాడు. ఆతిథ్య జట్టుతో తొలి టీ20 మ్యాచ్లో కేవలం పందొమ్మిది బంతుల్లోనే అర్ధ శతకంతో విధ్వంసం సృష్టించాడు. జింబాబ్వే బౌలర్లను ఉతికారేస్తూ పరుగులు పిండుకున్నాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఇంగ్లండ్ గడ్డ మీద అరంగేట్రంఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా భారత అండర్-19, ఐపీఎల్లో సత్తా చాటిన వైభవ్.. పదిహేనేళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఐర్లాండ్తో టీ20 సిరీస్లో వైభవ్తో అరంగేట్రం చేయిస్తారనుకుంటే.. మేనేజ్మెంట్ అక్కడ ఈ పిల్లాడికి అవకాశం ఇవ్వలేదు. అయితే, ఐర్లాండ్తో రెండు టీ20లు, ఇంగ్లండ్తో తొలి టీ20 మ్యాచ్లో విఫలమైన తర్వాత సంజూ శాంసన్ను తప్పించి.. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీని ఆడించారు.మూడు మ్యాచ్లలో విఫలం ఇంగ్లండ్తో రెండో టీ20 సందర్భంగా అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. వరుసగా మూడు మ్యాచ్లలో 14, 13, 15 పరుగులు చేసి విఫలమయ్యాడు. దీంతో ఐదో టీ20 నుంచి ఈ లెఫ్టాండర్ బ్యాటర్ను తప్పించి మళ్లీ సంజూనే ఆడించారు. అయితే, జింజాబ్వే పర్యటనకు ఎంపికైన జట్టులో సంజూ లేకపోవడంతో.. వైభవ్కు ఓపెనర్గా అవకాశం దక్కింది.ఈ క్రమంలో జింబాబ్వేతో హరారే వేదికగా గురువారం నాటి తొలి టీ20లో వైభవ్ సూర్యవంశీ మెరుపు ఫిఫ్టీతో అలరించాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక్క పరుగుకే వెనుదిరిగినా.. ఈ బిహారీ పిల్లాడు దూకుడుగా ఆడి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.తెలివితక్కువ వాడు తప్పిస్తే.. తానేంటో చూపించాడు!ఈ పరిణామాల నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ వైభవ్ను ప్రశంసిస్తూ.. గంభీర్ను విమర్శించాడు. ‘‘సూర్యవంశీ అద్భుతమైన షాట్లతో అలరించాడు. షాట్ సెలక్షన్లో ఒక్క పొరపాటు కూడా చేయలేదు. ఈ పిల్లాడు చాలా ప్రత్యేమని అందుకే అంటాను.అయినా ఇంగ్లండ్తో మూడు మ్యాచ్లలో విఫలం కాగానే.. గౌతం గంభీర్ తెలివితక్కువతనంతో అతడిని జట్టు నుంచి ఎలా తప్పిస్తాడు?.. గంభీర్ నిర్ణయం వల్ల ఆ పిల్లాడి ఆత్మవిశ్వాసం దెబ్బతినదా?అయితే, అందరిలా అతడు కుంగిపోలేదు. ఇంగ్లండ్తో సిరీస్ ముగిసిన వెంటనే.. ఇంటికి వెళ్లకుండా తన ఐపీఎల్ జట్టు రాజస్తాన్ రాయల్స్ క్యాంపునకు వెళ్లాడు. అక్కడ తన బ్యాటింగ్లో.. ముఖ్యంగా షార్ట్ బాల్ ఆడటంలో ఎదురైన సవాళ్లకు పరిష్కారం కనుగొనేలా తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు.అంకిత భావానికి సెల్యూట్నిజంగా వైభవ్ అంకిత భావానికి సెల్యూట్. తన బ్యాటింగ్ లోపాల్ని సరిచేసుకుని జింబాబ్వేలో సత్తా చాటాడు. తాను ఎందుకు స్పెషలో మరోసారి ఈ ప్రపంచానికి చాటిచెప్పాలనుకున్నాడు. చేసి చూపించాడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు. కాగా జింబాబ్వే పర్యటన నుంచి గంభీర్ విరామం తీసుకోగా.. వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా తాత్కాలిక హెడ్కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి టీ20 గెలిచిన భారత్.. 1-0తో ముందంజలో ఉంది.చదవండి: బీసీసీఐ ఉపాధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు -
బంగ్లాదేశ్ అడ్డుపుల్ల.. ఆఫ్గన్తో టీ20 సిరీస్ వాయిదా?
టీమిండియాతో ఢిల్లీ వేదికగా చారిత్రక టీ20 సిరీస్ ఆడాలని భావించిన అఫ్గానిస్తాన్కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. సెప్టెంబర్లో జరగాల్సిన టీ20 సిరీస్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో బంగ్లాదేశ్ కూడా తమ దేశంలో టీమిండియాతో వైట్బాల్ టూర్ ప్లాన్ చేయనుండడమే వాయిదాకు కారణమని తెలుస్తోంది. అయితే దీనిపై ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మరోవైపు అఫ్గానిస్తాన్లో రాజకీయ అస్థిరత కారణంగానే ఆ జట్టు తమ మ్యాచ్లను యూఏఈ లేదా భారత్ వేదికగా ఆడాలని నిర్ణయిం చుకుంది. ఈ నేపథ్యంలోనే టీమిండియాతో టీ20 సిరీస్కు ప్లాన్ చేసింది. ఢిల్లీ వేదికగా ప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో మ్యాచ్ల షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ సిరీస్కు అఫ్గానిస్తాన్ హోస్ట్గా వ్యవహరిస్తుండగా, సొంతగడ్డపై టీమిండియా పర్యాటక జట్టుగా మ్యాచ్లు ఆడనుండడం విశేషం.బంగ్లాదేశ్ అడ్డుపుల్ల..కొన్నాళ్ల కిందట భారత్తో అంటీముట్టనట్లుగా వ్యవహరించిన బంగ్లాదేశ్ ఇప్పుడు మాత్రం మనతో సంబంధాలు తిరిగి బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సౌతాఫ్రికా వేదికగా జరిగిన 18వ బ్రిక్స్ సమావేశాల్లోనూ బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ భారత్తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే క్రికెట్తోనే ఆ బంధాన్ని తిరిగి మొదలుపెట్టాలని బంగ్లా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే సెప్టెంబర్ 1 నుంచి 13 మధ్య టీమిండియా తమ గడ్డపై ఆరు మ్యాచ్ల వైట్ బాల్ సిరీస్ (మూడు వన్డేలు, మూడు టీ20లు) ఆడేలా ఇప్పటికే బీసీసీఐకి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఒకవేళ భారత ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వస్తే బీసీసీఐ బంగ్లాదేశ్ టూర్కు పచ్చజెండా ఉపనుంది. ఒకవేళ బీసీసీఐ ఆమోదం పొందితే మాత్రం అదే సమయంలో జరగాల్సిన ఆఫ్గన్తో టీ20 సిరీస్ వెనక్కి వెళ్లే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి ఆసియా గేమ్స్ ఉండడం, ఆ తర్వాత సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్తో సిరీస్ ఉండడంతో అఫ్గానిస్తాన్తో సిరీస్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. ఈ లెక్కన విండీస్తో సిరీస్ ముగిసిన తర్వాత అంటే నవంబర్లో ఆఫ్గన్తో టీ20 సిరీస్ ఆడే అవకాశముంటుంది.రాజకీయ వివాదం..బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడం నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. బంగ్లాలోని యువత భారత్పై విష ప్రచారాలు చేస్తూ మతోన్మాద చర్యలకు పాల్పడ్డారు. దీంతో భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ చర్యలను సీరియస్గా తీసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే భారత ప్రభుత్వం ఆదేశాలతో కేకేఆర్ జట్టు బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ను తొలగించింది. దీంతో ఇరుదేశాల క్రికెట్ బోర్డుల మధ్య అగ్గి రాజుకుంది. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఆడలేమంటూ బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయినప్పటికీ బంగ్లా తన వైఖరిని మార్చుకోలేదు. దీంతో ఆ టోర్నీకి బంగ్లాదేశ్ దూరంగా ఉండిపోయింది. అయితే బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత తారిక్ రెహమాన్ అధికారం చేపట్టిన తర్వాత భారత్తో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నించారు.ఈ నేపథ్యంలోనే క్రికెట్ ద్వారా భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని తారిక్ రెహమాన్ ప్రభుత్వం భావిస్తోంది. మరి భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ టూర్లో పాల్గొనేందుకు బీసీసీఐకి అనుమతి ఇస్తుందో లేదో చూడాలి.Read: బీసీసీఐ కొత్త అవార్డు.. తొలి క్రికెటర్గా తిలక్ వర్మ రికార్డు -
భేష్.. గెలిచారు!.. మరి మీ ఐదో బౌలర్ ఎవరు?
టీమిండియా టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు విజయాల ఖాతా తెరిచాడు. అతడి నాయకత్వంలో జింబాబ్వేతో తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా ఏడు మ్యాచ్ల తర్వాత శ్రేయస్ అయ్యర్ తొలిసారి గెలుపు రుచిచూశాడు.హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం నాటి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా.. జింబాబ్వేను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. భారత బౌలర్లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన జింబాబ్వే.. 125 పరుగులకే పరిమితమైంది.ఏడు వికెట్ల తేడాతోఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ మూడు వికెట్లు నష్టపోయి 13.2 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించి మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే, ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించినప్పటికీ తుదిజట్టు కూర్పుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.మరి మీ ఐదో బౌలర్ ఎవరు?‘‘జట్టులో కేవలం నలుగురు బౌలర్లు.. పేసర్లు ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ.. స్పిన్నర్ రవి బిష్ణోయి మాత్రమే ఉన్నారు. మరి మీ ఐదో బౌలర్ ఎవరు?.. దీనికి జవాబు శివం దూబే అంటారేమో!.. మరి ఆరో బౌలర్?.. ఎవరూ లేరు.ఆరో బౌలర్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగింది. నిజానికి శివం దూబే ఆల్రౌండర్ కదా!.. అతడు ఈసారి బంతితో కాస్త మెరుగ్గానే రాణించాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్లో 32 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. నిజంగా ఇది పెద్ద విషయమేమంచి క్యాచ్ కూడా పట్టాడు. ఏదేమైనా నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేయించడం ద్వారా యాజమాన్యం అతడిపై పూర్తి విశ్వాసం కనబరిచింది. నిజంగా ఇది పెద్ద విషయమే.సరైన నిర్ణయంఇక మయాంక్ యాదవ్తో బౌలింగ్ ఎటాక్ ఆరంభించి కెప్టెన్ శ్రేయస్ మంచి పని చేశాడు. అశోక్ శర్మను కూడా ముందుగానే పంపించడం సరైన నిర్ణయం. ఏదేమైనా వీళ్లిద్దరిని జట్టులో చూడటం ఎంతో బాగుంది. ముఖ్యంగా మయాంక్ గాయం నుంచి కోలుకుని రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు. నిలకడగా బౌలింగ్ చేశాడు’’ అని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా యూకే పర్యటనతో భారత టీ20 జట్టు కెప్టెన్గా శ్రేయస్ ప్రయాణం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా తొలుత ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో టీమిండియా వైట్వాష్ అయింది.చదవండి: పిల్లాడినే.. నాకు ఆ అర్హత లేదు: వైభవ్ -
‘అతడి కెప్టెన్సీలో నాకు పూర్తి స్వేచ్ఛ’
దాదాపు రెండేళ్ల తర్వాత టీమిండియాలో పునరాగమనం చేశాడు మయాంక్ యాదవ్. ఐపీఎల్లో సత్తా చాటిన ఈ ‘ఫాస్టెస్ట్’ బౌలర్.. 2024లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత గాయాల కారణంగా కనుమరుగైపోయాడు. తాజాగా జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భగా మయాంక్ రీఎంట్రీ ఇచ్చాడు.హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం నాటి మ్యాచ్లో పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. తొలి బంతికే జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ను డకౌట్ చేసిన మయాంక్.. వన్డౌన్ బ్యాటర్ డియోన్ మైర్స్ (6)ను కూడా అవుట్ చేశాడు. నాలుగు ఓవర్ల కోటాలో 24 ఏళ్ల ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.. 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.Aate hi kaam shuru kar diye 🔥💪Watch it LIVE only on FanCode! 🇮🇳 👇https://t.co/q6VBxaRJz3#ZIMvIND #RokoNahiThoko #MayankYadav pic.twitter.com/Pg9RugnnTR— FanCode (@FanCode) July 23, 2026గొప్పగా అనిపించిందితద్వారా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మయాంక్ యాదవ్ స్పందిస్తూ.. ‘‘రెండేళ్లు జట్టుగా దూరంగా ఉండటం నా జీవితంలో అత్యంత కష్టకాలం. అప్పుడు నాకు 22-23 ఏళ్ల మధ్య వయసు. అంత చిన్నవయసులోనే గాయాల వల్ల సుదీర్ఘకాలం ఆటకు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపింది.అయితే, దేశానికి ఆడటం గొప్ప విషయం. అదే స్ఫూర్తిగా ముందుకు సాగి సవాళ్లను అధిగమించాను. జింబాబ్వేలో పిచ్లు ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తాయని విన్నాను. నేను హరారేలో ఆడటం ఇదే మొదటిసారి. గొప్పగా అనిపించింది. జట్టు విజయానికి నా వంతు సహకారం అందించాను’’ అని హర్షం వ్యక్తం చేశాడు.అతడి కెప్టెన్సీలో నాకు పూర్తి స్వేచ్ఛఅదే విధంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై మయాంక్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. ‘‘అతడి కెప్టెన్సీలో ఆడటం ఇదే తొలిసారి. మ్యాచ్కు ముందు మేము ఎక్కువగా మాట్లాడుకోలేదు కూడా!.. అయితే, మ్యాచ్ సమయంలో బౌలర్లపై అతడు పూర్తి నమ్మకం ఉంచాడు.నాకు నచ్చినట్లుగా బౌలింగ్ చేయమని చెప్పాడు. అతడూ కొన్ని సలహాలు ఇచ్చాడు. సారథి ఇచ్చిన ధైర్యంతో నేను ముందుకు సాగాను. అతడి కెప్టెన్సీలో నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అనిపించింది’’ అని మయాంక్ యాదవ్ చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లాదేశ్తో 2024 నాటి టీ20 సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్.. ఇప్పటికి నాలుగు మ్యాచ్లు ఆడి ఆరు వికెట్లు పడగొట్టాడు.చదవండి: నేనింకా పిల్లాడినే.. క్రెడిట్ నాకు ఇవ్వొద్దు: వైభవ్ -
సొంతగడ్డపై పర్యాటక జట్టుగా టీమిండియా!
టీమిండియా విచిత్ర పరిస్థితిని ఎదుర్కోనుంది. సొంతగడ్డ మీదే పర్యాటక జట్టుగా మ్యాచ్లు ఆడనుంది. అవును.. మీరు చదివింది కరెక్టే!.. ఇంతకీ సంగతి ఏమిటంటే.. అఫ్గానిస్తాన్కు స్వదేశంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించే పరిస్థితులు లేవు.ఇప్పటికే పలు మ్యాచ్లు ఈ నేపథ్యంలో భారత్ అఫ్గాన్ క్రికెట్ బోర్డు (ACB)కు అండగా నిలుస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సహకారంతో ఏసీబీ భారత్లో ఆతిథ్య దేశంగా తమ మ్యాచ్లు నిర్వహించుకుంటోంది. డెహ్రాడూన్, గ్రేటర్ నోయిడా, లక్నోలను తమ హోంగ్రౌండ్లుగా గతంలో ఎంచుకుంది. అంతేకాదు.. న్యూజిలాండ్తో ఏకైక టెస్టుకు కూడా షెడ్యూల్ను ఖరారు చేసుకుంది. అయితే, ఒక్క బంతి పడకుండానే ఈ మ్యాచ్ రద్దై పోయింది. తాజాగా టీమిండియాకే భారత్లో ఆతిథ్యం ఇచ్చేందుకు అఫ్గాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఢిల్లీలో అఫ్గాన్- భారత్ సిరీస్టీమిండియా- శ్రీలంక టెస్టు సిరీస్ ... ఆసియా క్రీడలు-2026 మధ్య విరామంలో టీమిండియా- అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆగష్టు 27 నుంచి భారత్- శ్రీలంక టెస్టు సిరీస్ మొదలుకానుండగా.. ఆసియా క్రీడలకు సెప్టెంబరు 24న తెర లేవనుంది.ఈ క్రమంలో సెప్టెంబరు 13 నుంచి టీమిండియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు అఫ్గాన్ బోర్డు ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక అని తెలుస్తోంది. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో కథనం వెలువరించింది.గెలుపు బోణీఇదిలా ఉంటే.. ఇటీవలే అఫ్గాన్ జట్టు భారత్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆతిథ్య టీమిండియాతో ఏకైక టెస్టులో ఓడిపోయిన అఫ్గాన్.. మూడు వన్డేల సిరీస్లో 0-3తో క్లీన్స్వీప్ అయింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లో చాంపియన్గా నిలిచిన తర్వాత విదేశీ పర్యటనలో భాగంగా తొలిసారి టీ20 సిరీస్ ఆడిన టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది.పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్వాష్ అయిన శ్రేయస్ సేన.. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో 4-0తో క్లీన్స్వీప్ అయింది. తాజాగా జింబాబ్వే గడ్డ మీద గురువారం నాటి తొలి టీ20లో గెలిచి ఎట్టకేలకు.. ఏడు మ్యాచ్ల తర్వాత తొలి విజయం సాధించింది.చదవండి: విజయానికి క్రెడిట్ నాకు ఇవ్వొద్దు.. ఆ అర్హత లేదు: వైభవ్ -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ రికార్డు
వరుస వైఫల్యాల తర్వాత టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జింబాబ్వేతో తొలి టీ20లో కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు.తద్వారా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యంత పిన్న వయసులోనే హాఫ్ సెంచరీ చేసిన క్రికెటర్గా సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల 118 రోజుల వయసులోనే ఈ ఘనత అందుకుని ప్రపంచ రికార్డు సాధించాడు. 🇿🇼 𝐒𝐄 𝐊𝐄𝐇 𝐃𝐄𝐍𝐀 𝐒𝐎𝐎𝐑𝐘𝐀𝐕𝐀𝐍𝐒𝐇𝐈 𝐀𝐀𝐘𝐀 𝐇𝐀𝐈 🥵𝐑𝐔𝐊𝐄𝐆𝐀 𝐍𝐀𝐇𝐈, 𝐓𝐇𝐎𝐊𝐄𝐆𝐀 😎Watch it LIVE on FanCode! 🇮🇳 👇https://t.co/q6VBxaRJz3 #ZIMvIND #IndiaCricket #RokoNahiThoko pic.twitter.com/ACaAC23Zoq— FanCode (@FanCode) July 23, 2026భారత అండర్-19, ఐపీఎల్లో విధ్వంసకర బ్యాటింగ్తో అరుదైన ఫీట్లు నమోదు చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఇటీవల ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.ఇంగ్లండ్లో విఫలంఇంగ్లండ్తో రెండో టీ20 సందర్భంగా సంజూ శాంసన్ను తప్పించిన యాజమాన్యం.. వైభవ్ను అరంగేట్రం చేయించింది. అయితే, తొలి మ్యాచ్లో పదిహేనేళ్ల ఈ లెఫ్టాండ్ ఓపెనర్ 13 పరుగులే చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత మూడు, నాలుగో టీ20లలో వరుసగా 14, 15 పరుగులు చేసి నిష్క్రమించాడు. దీంతో వైభవ్ ఆట తీరుపై విమర్శలు వచ్చాయి.ఈ క్రమంలో ఐదో టీ20 నుంచి వైభవ్ను తప్పించి.. మళ్లీ సంజూను ఆడించారు. అయితే, జింబాబ్వేతో సిరీస్కు మాత్రం సంజూ శాంసన్ను పక్కనపెట్టిన మేనేజ్మెంట్.. అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేసింది. ఇక జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం నాటి తొలి టీ20లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు వైభవ్ సూర్యవంశీ శుభారంభం అందించాడు.ఆకాశమే హద్దుగా..తొలి ఓవర్లో అభిషేక్, వైభవ్ పెద్దగా పరుగులు చేయలేదు. బ్లెస్సింగ్ ముజర్బానీ బౌలింగ్లో కేవలం చెరో పరుగు చేశారు. అయితే, రెండో ఓవర్లో రిచర్ట్ నగవర బౌలింగ్కు రాగా.. మొదటి బంతికి పరుగులేమీ రాబట్టలేకపోయినప్పటికీ.. రెండు, మూడు, నాలుగు బంతుల్లో వైభవ్ వరుసగా 6,4,6 బాదాడు. రెండో ఓవర్లో మొత్తంగా 20 పరుగులు పిండుకున్నాడు.ఈ క్రమంలో మూడో ఓవర్ ఐదో బంతికి అభిషేక్ శర్మ (1)ముజర్బానీ బౌలింగ్లో అవుట్ అయినప్పటికీ.. వైభవ్ జోరు కొనసాగించాడు. కేవలం పద్దెనిమిది బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. ఏడో ఓవర్లో నగరవ బౌలింగ్లో తొలి బంతికే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆ మరుసటి బంతికే బెన్ కర్రాన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చెప్పాడు.. చేసి చూపించాడుఅయితే, నాలుగు నెలల క్రితం ఇదే వేదిక మీద.. అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్ మీద వైభవ్ 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి భారత్కు టైటిల్ అందించాడు. జింబాబ్వేకు తొలి టీ20కి ముందు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తనకు హరారే స్పోర్ట్స్ క్లబ్ మీద ఆడిన అనుభవం, పిచ్ గురించి పూర్తి అవగాహన ఉందన్నాడు. అన్నట్లుగానే విధ్వంసకర హాఫ్ సెంచరీతో తళుక్కుమన్నాడు.అంతర్జాతీయ టీ20లలో అత్యంత పిన్న వయసులో తొలి అర్ధ శతకం బాదిన క్రికెటర్లు👉వైభవ్ సూర్యవంశీ (ఇండియా): జింబాబ్వే మీద హరారే వేదికగా 2026లో 15 ఏళ్ల 118 రోజుల వయసులో ఫిఫ్టీ👉లూయీస్ బ్రూస్ (గిబ్రాల్టర్): మాల్టా మీద అల్బేగరియా వేదికగా 2021లో 16 ఏళ్ల 56 రోజుల వయసులో ఫిఫ్టీ👉కవిన్ చద్దా (ఇండోనేషియా): స్వీడన్ మీద బాలి వేదికగా 2026లో 16 ఏళ్ల 76 రోజుల వయసులో ఫిఫ్టీ👉ఆల్సినే టురే (సియెర్రా లియోన్): ఘనా మీద బెనోని వేదికగా 2023లో 16 ఏళ్ల 89 రోజుల వయసులో ఫిఫ్టీ👉టెంజిన్ రాబ్గే (భూటాన్): చైనా మీద కౌలాలంపూర్ వేదికగా 2023లో 16 ఏళ్ల 118 రోజుల వయసులో ఫిఫ్టీసచిన్ రికార్డు బ్రేక్ఫుల్ మెంబర్ జట్లలో భాగంగా అఫ్గనిస్తాన్ స్టార్ రహ్మనుల్లా గుర్బాజ్ 17 ఏళ్ల 296 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా.. వైభవ్ తాజాగా అతడిని అధగమించాడు. అంతేకాదు.. ఫుల్ మెంబర్ జట్ల తరఫున అంతర్జాతీయ క్రికెట్ (ఆల్ ఫార్మాట్)లో అతి పిన్న వయసులోనే అర్ధ శతకం చేసిన తొలి బ్యాటర్గానూ చరిత్రకెక్కాడు. గతంలో సచిన్ టెండ్కులర్ పాకిస్తాన్ మీద 1989 నాటి టెస్టు మ్యాచ్లో 16 ఏళ్ల 213 రోజుల వయసులో అర్ధ శతకం చేయగా.. వైభవ్ ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టాడు. -
నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. జింబాబ్వే స్కోరెంతంటే?
టీమిండియాతో తొలి టీ20 మ్యాచ్లో జింబాబ్వే బ్యాటర్లు తేలిపోయారు. భారత బౌలర్ల ధాటికి తాళలేక పెవిలియన్కు వరుస కట్టారు. దీంతో ఆతిథ్య జట్టు నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత్- జింబాబ్వే మధ్య గురువారం నాటి తొలి మ్యాచ్కు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక. తొలి బంతికే వికెట్ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. జింబాబ్వే బ్యాటింగ్కు దిగింది. మయాంక్ యాదవ్ భారత బౌలింగ్ అటాక్ ఆరంభించి.. తొలి బంతికే బ్రియాన్ బెన్నెట్ను డకౌట్ చేశాడు.Aate hi kaam shuru kar diye 🔥💪Watch it LIVE only on FanCode! 🇮🇳 👇https://t.co/q6VBxaRJz3#ZIMvIND #RokoNahiThoko #MayankYadav pic.twitter.com/Pg9RugnnTR— FanCode (@FanCode) July 23, 2026మరో ఓపెనర్, అరంగేట్ర ఆటగాడు బెన్ కర్రాన్ (10) ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో అవుట్ కాగా.. వన్డౌన్ బ్యాటర్ డియోన్ మైర్స్ (6)ను మయాంక్ యాదవ్ వెనక్కి పంపాడు. కెప్టెన్ సికిందర్ రజా (4) వికెట్ను శివం దూబే తన ఖాతాలో వేసుకోగా.. నిలకడగా ఆడుతున్న ర్యాన్ బర్ల్ (26)ను రవి బిష్ణోయి వెనక్కి పంపాడు.BACK TO BACK WICKETS IN BACK TO BACK OVERS! 💪Full THOKO mode power-play mein 🔥Watch it LIVE on FanCode! 🇮🇳 👇https://t.co/q6VBxaRJz3 #ZIMvIND #RokoNahiThoko pic.twitter.com/6vpRLxPZ5I— FanCode (@FanCode) July 23, 2026రాణించిన మెధెవెరెఈ క్రమంలో వెస్లే మెధెవెరె ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆరో స్థానంలో వచ్చిన ఈ ఆల్రౌండర్.. 34 బంతుల్లో 39 పరుగులతో జింబాబ్వే ఇన్నింగ్స్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. దురదృష్టవశాత్తూ అతడు రనౌట్ అయ్యాడు. మిగతా వాళ్లలో బ్రాడ్ ఎవాన్స్ డకౌట్ కాగా.. వికెట్ కీపర్ బ్యాటర్ తాడివనాషే మరుమాణి (20 బంతుల్లో 27) కాస్త వేగంగా ఆడాడు. జింబాబ్వే స్కోరెంతంటే?న్యూమన్ ఒక్క పరుగు చేసి మరుమాణితో కలిసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయగా.. శివం దూబే, రవి బిష్ణోయి తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. చదవండి: టీమిండియా తరఫున అతడి అరంగేట్రం -
IND vs ZIM: టీమిండియా తరఫున అతడి అరంగేట్రం
జింబాబ్వేతో తొలి టీ20 సందర్భంగా అశోక్ శర్మ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈ ఫాస్ట్ బౌలర్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో సీనియర్లను పక్కనపెట్టిన యాజమాన్యం.. పేస్ దళంలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ వంటి యువ క్రికెట్లతో పాటు తొలిసారి అశోక్ శర్మను ఎంపిక చేసింది.ఎవరీ అశోక్ శర్మ?రాజస్తాన్లోని జైపూర్కి సమీపంలో గల రాంపుర అనే గ్రామంలో 2002లో జన్మించాడు అశోక్ శర్మ. అతడి తండ్రి సాధారణ రైతు. కుటుంబ పరిస్థితి ఆర్థికంగా అంతంత మాత్రమే. అయినప్పటికీ అశోక్తో పాటు అతడి అన్న అక్షయ్ శర్మ కూడా క్రికెటర్ కావాలనే కలలు కన్నాడు.జిల్లా స్థాయిలో అక్షయ్ ఆడాడు. అయితే, తమ్ముడి కోసం తన కెరీర్ను త్యాగం చేశాడు. దీంతో అశోక్కు మార్గం సుగమమైంది. ఈ విషయం గురించి అశోక్ శర్మ స్వయంగా జాతీయ మీడియాకు వెల్లడించాడు.లీడింగ్ వికెట్ టేకర్కుటుంబ సహకారంతో తన కలలను నిజం చేసుకునే క్రమంలో అశోక్ శర్మ.. 2025-26 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ దేశీ టీ20 టోర్నీ తాజా ఎడిషన్లో పది మ్యాచ్లలో కలిపి 22 వికెట్లు కూల్చి.. లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. గంటకు 150కి పైగా కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సత్తా ఉన్న అశోక్ శర్మ.. ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిలో పడ్డాడు.ఫాస్టెస్ట్ బాల్ఈ క్రమంలో ఐపీఎల్-2026 వేలంలో గుజరాత్ టైటాన్స్ అశోక్ను రూ. 90 లక్షలకు కొనుగోలు చేసింది. ఆకాశ్ నెహ్రా మార్గదర్శనంలో అతడు రాటుదేలాడు. ఈ ఏడాది రాజస్తాన్తో మ్యాచ్ సందర్భంగా గంటకు 154.2 కిలో మీటర్లకు పైగా వేగంతో బంతిని విసిరి హాట్ టాపిక్గా మారాడు. మొత్తంగా ఈ సీజన్లో ఆరు మ్యాచ్లు ఆడిన ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ ఆరు వికెట్లు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన 24 ఏళ్ల అశోక్ శర్మ.. తాజాగా అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. జింబాబ్వేతో తొలి టీ20లో భారత్ ముగ్గురు సీమర్లు, ఒక స్పిన్నర్తో బరిలోకి దిగింది. తుదిజట్టులో ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్లతో పాటు అశోక్ శర్మ కూడా పేస్ విభాగంలో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు.. జింబాబ్వే తరఫున బెన్ కర్రాన్ అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు.తుదిజట్లుభారత్వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్జింబాబ్వేబ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి (వికెట్ కీపర్), బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ -
IND vs ZIM: వైభవ్ మెరుపులు.. టీమిండియా ఘన విజయం
హరారే వేదికగా గురువారం నాటి తొలి టీ20లో భారత్-జింబాబ్వే జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. భారత్ లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. 13.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది.ఓపెనర్లలో అభిషేక్ శర్మ (1) విఫలమైనప్పటికీ.. వైభవ్ సూర్యవంశీ మెరుపు అర్ద శతకంతో రాణించాడు. కేవలం 18 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్లు బాది 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అతడికి తోడుగా వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 35) రాణించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (28*), వైస్ కెప్టెన్ తిలక్ వర్మ (6*)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా 13.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి భారత్ 126 పరుగులు చేసింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.Updates10 ఓవర్లలో టీమిండియా స్కోరు: 96-2ఇషాన్ 26, శ్రేయస్ అయ్యర్ 17 పరుగులతో ఉన్నారు.వైభవ్ మెరుపు అర్ధ శతకం6.1: నగరవ బౌలింగ్లో రెండు పరుగులు పూర్తి చేసుకుని యాభై పరుగుల మార్కు అందుకున్న వైభవ్. కేవలం 18 బంతుల్లోనే తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ. ఆ మరుసటి బంతికే అవుటయ్యాడు. స్కోరు: 68-2. ఇషాన్ 16 పరుగులతో ఉన్నాడు. శ్రేయస్ క్రీజులోకి వచ్చాడు.భారత్ తొలి వికెట్ డౌన్టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన అభిషేక్ శర్మ.. ముజరబాని బౌలింగ్లో ఔటయ్యాడు. మరోవైపు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 9 బంతుల్లోనే 21 పరుగులు చేశాడు. 3 ఓవర్లకు భారత స్కోర్: 23/1 టీమిండియా టార్గెట్ ఎంతంటే?జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్లో మధెవెరే(39) టాప్ స్కోరర్గా నిలవగా.. మరుమణి(27), బర్ల్(26) రాణించారు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ దూబే, బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు.వరుసగా రెండు వికెట్లుఆఖరి ఓవర్లో జింబాబ్వే వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. రెండో బంతికి మధెవెరే(39), మూడో బంతికి ఎవాన్స్(0) ఔటయ్యారు.ఐదో వికెట్ డౌన్13.1: రవి బిష్ణోయి బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన బర్ల్ (26). మెధెవెరె 8 పరుగులతో ఉండగా.. స్కోరు: 64-5. మరుమాణి క్రీజులోకి వచ్చాడు.పది ఓవర్లలో జింబాబ్వే స్కోరు: 46-4 (10)మెధెవెరె 5, బర్ల్ 12 పరుగులతో ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే బౌలింగ్లో సికిందర్ రజా(4) ఔటయ్యాడు. మెధెవెరె క్రీజులోకి వచ్చాడు.పవర్ ప్లేలో జింబాబ్వే స్కోరు: 26-3 (6)బర్ల్ 1, రజా 4 పరుగులతో ఉన్నారు.పీకల్లోతు కష్టాల్లో జింబాబ్వేజింబాబ్వే మూడో వికెట్ కోల్పోయింది. మయాంక్ యాదవ్ బౌలింగ్లో డియాన్ మైర్స్(6) ఔటయ్యాడు. మయాంక్కు ఇది రెండో వికెట్ కావడం గమనార్హం. 5 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 21/2జింబాబ్వే రెండో వికెట్ డౌన్జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన బెన్ కర్రాన్.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 20/2తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వేభారత బౌలింగ్ అటాక్ ఆరంభించిన మయాంక్ యాదవ్ బౌలింగ్లో తొలి బంతికే... వికెట్ కీపర్ ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగిన బ్రియాన్ బెన్నెట్ (0). క్రీజులోకి డియాన్ మైర్స్. జింబాబ్వే స్కోరు: 6-1 (1). బెన్ కర్రాన్ సున్నా, డియాన్ మైర్స్ ఆరు పరుగులతో ఉన్నారు.అశోక్ శర్మ అరంగేట్రంరాజస్తాన్ పేసర్ అశోక్ శర్మ ఈ మ్యాచ్తో భారత్ తరపున అరంగేట్రం చేశాడు. అదేవిధంగా యువ పేసర్ మయాంక్ యాదవ్ దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. మరోవైపు యువ ఆటగాళ్లు న్యూమాన్ న్యామ్హురి, బెన్ కరన్ జింబాబ్వే తరపున డెబ్యూ చేశారు.తుది జట్లుజింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బెన్ కర్రాన్, డియాన్ మైర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీభారత్ : వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్ -
వాళ్లకు అన్యాయం చేశారు: టీమిండియా దిగ్గజం ఫైర్
టీమిండియా సెలక్టర్ల తీరుపై భారత మాజీ కెప్టెన్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అర్హత ఉన్న ఆటగాళ్లను జింబాబ్వే సిరీస్కు ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించాడు. ప్రభ్సిమ్రన్ సింగ్ ఒక్కడికే సెలక్టర్లు న్యాయం చేశారని.. కానీ మిగతా ఐపీఎల్ స్టార్లకు మాత్రం అన్యాయం చేశారని చిక్కా విమర్శించాడు.వరుస పరాజయాల తర్వాతకాగా ఐర్లాండ్, ఇంగ్లండ్లతో టీ20 సిరీస్లలో వరుసగా 2-0, 4-0తో క్లీన్స్వీప్నకు గురైన టీమిండియా.. తాజాగా జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు టీ20 మ్యాచ్లు ఆడుతుంది. ఈ క్రమంలో గురువారం ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుండగా.. హరారే స్పోర్ట్స్ క్లబ్ ఇందుకు వేదిక.ఇదిలా ఉంటే.. జింబాబ్వేతో సిరీస్కు సంజూ శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ (ప్రస్తుతం గాయపడ్డాడు), అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ వంటి సీనియర్లను పక్కనపెట్టారు. రవి బిష్ణోయికి కూడా ముందుగా ఈ జట్టులో చోటు దక్కలేదు. అయితే, ఆ తర్వాత మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది.కొత్తగా వీళ్లుఇదిలా ఉంటే.. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక కాగా.. ప్రభ్సిమ్రన్ సింగ్కు కూడా యాజమాన్యం ఈ సిరీస్ ఆడే జట్టులో చోటిచ్చింది. మయాంక్ యాదవ్, హర్ష్ దూబే కూడా జట్టులోకి వచ్చారు.రింకూ ఎక్కడి నుంచి వచ్చాడు?ఈ పరిణామాల నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్యం వైఖరిని ప్రశ్నించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ప్రభ్సిమ్రన్ సింగ్ను ఎంపిక చేశారు. మంచి సెలక్షన్. కానీ ఆర్సీబీకి వరుసగా రెండుసార్లు టైటిల్ అందించిన రజత్ పాటిదార్ సంగతేంటి?పాపం.. వాళ్లకు అన్యాయంఅసలు ఈ రింకూ సింగ్ మళ్లీ అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చాడు? అతడికి బదులు పాటిదార్ను సెలక్ట్ చేసి ఉండాల్సింది. అంతేకాదు.. స్పిన్ విభాగంలో రవి బిష్ణోయి లేదంటే హర్ష్ దూబే స్థానంలో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన కృనాల్ పాండ్యాను ఎంపిక చేస్తే బాగుండేది.మీడియం పేసర్లకు బదులు ఆర్సీబీ స్టార్, స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ను ఎంపిక చేస్తే ఇంకా బాగుండేది. అసలు జింబాబ్వేతో సిరీస్కు జట్టును ఈ సెలక్టర్లు ఎలా ఎంపిక చేశారో నాకైతే అర్థం కావడం లేదు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు. నిలకడగా రాణిస్తున్నప్పటికీ.. ఆర్సీబీ ప్లేయర్లకు అన్యాయం చేశారంటూ ఈ మాజీ చీఫ్ సెలక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదవండి: IND vs ZIM: తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే! -
IND vs ZIM: తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే!
ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో క్లీన్స్వీప్ల తర్వాత భారత టీ20 జట్టు జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య గురువారం నాటి తొలి టీ20కి హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక. ఇక మూడు మ్యాచ్ల సిరీస్ నుంచి ఓపెనర్ సంజూ శాంసన్ను పక్కనపెట్టిన యాజమాన్యం.. వైభవ్ సూర్యవంశీని మాత్రం కొనసాగించింది.అదే విధంగా.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రభ్సిమ్రన్ సింగ్, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ తదితర యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్లను తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక చేసింది. అదే విధంగా.. రింకూ సింగ్ను కూడా తిరిగి పిలిపించింది.అభిషేక్ జోడీగా ఎవరు?ఈ నేపథ్యంలో జింబాబ్వేతో తొలి టీ20కి భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతున్న అంశం ఆసక్తికరంగా మారింది. అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా.. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీని ఆడిస్తారా? లేదంటే వైభవ్ను ఎంపిక చేస్తారా? అన్న చర్చ జరుగుతోంది. ఇంగ్లండ్ పర్యటనలో వైభవ్ 14, 13, 15 పరుగులు చేసి విఫలమయ్యాడు.అయితే, హరారే వేదికగా ఈ ఏడాది అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్పై వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లోనే 175 పరుగులతో విధ్వంసం సృష్టించి.. జట్టును చాంపియన్గా నిలిపాడు. కానీ టీమిండియా తరఫున అరంగేట్రం తర్వాత మాత్రం అతడు అంచనాలు అందుకోలేకపోతున్నాడు.ప్రభ్సిమ్రన్ సింగ్కు అవకాశం ఉంటుందా?అదే సమయంలో గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న ప్రభ్సిమ్రన్ సింగ్.. ఈ ఏడాది కూడా 510 పరుగులతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుత టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోనే పంజాబ్ తరఫున ప్రభ్సిమ్రన్ ఈ మేరకు రాణించాడు.నా జట్టు ఇదేఇలాంటి తరుణంలో భారత మాజీ క్రికెటర్ ఎస్. బద్రీనాథ్ తన తుదిజట్టులో ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీకే పెద్దపీట వేశాడు. వన్డౌన్లో ఇషాన్ కిషన్, నాలుగో నంబర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో వైస్ కెప్టెన్ తిలక్ వర్మను కొనసాగించిన బద్రీనాథ్.. ఆరు, ఏడు స్థానాల్లో ఆల్రౌండర్లు శివం దూబే, సూర్యాంశ్ షెడ్గేలను ఎంచుకున్నాడు. రింకూ సింగ్ను మాత్రం పక్కనపెట్టాడు.ఇక స్పిన్ విభాగంలో హర్ష్ దూబే, రవి బిష్ణోయి రూపంలో ఇద్దరిని ఎంపిక చేసిన బద్రీనాథ్.. పేస్ దళంలో ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్లకు చోటిచ్చాడు.జింబాబ్వేతో తొలి టీ20కి బద్రీనాథ్ ఎంచుకున్న జట్టువైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, సూర్యాంశ్ షెడ్గే, హర్ష్ దూబే, రవి బిష్ణోయి, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్.చదవండి: ICC ODI WC 2027: దమ్ముంటే అతడిని తప్పించండి -
వైఫల్యాలపై స్పందించిన వైభవ్ సూర్యవంశీ
వరుస బ్యాటింగ్ వైఫల్యాలపై టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ స్పందించాడు. గత నాలుగు నెలల కాలంలో తన కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశానన్నాడు. అయితే, క్రికెట్లో ఇవన్నీ భాగమేనని.. జట్టు ప్రయోజనాల కోసం తాను ఎల్లప్పుడూ వందశాతం కష్టపడతానని స్పష్టం చేశాడు.కాగా ఐపీఎల్, భారత్ అండర్-19 జట్టు తరఫున విధ్వంసకర బ్యాటింగ్తో దుమ్ములేపిన వైభవ్ సూర్యవంశీ.. పదిహేనేళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తద్వారా అత్యంత పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన భారత తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు.భారీ అంచనాల నడుమఈ పరిణామాల నేపథ్యంలో భారీ అంచనాల నడుమ ఇంగ్లండ్తో రెండో టీ20 సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన వైభవ్.. పూర్తిగా విఫలమయ్యాడు. ఓపెనర్గా సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేసిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మూడు మ్యాచ్లలో వరుసగా 14, 13 , 15 పరుగులు మాత్రమే చేశాడు.ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. దీంతో ఇంగ్లండ్తో ఐదో టీ20లో ఈ బిహారీ పిల్లాడిని తప్పించి.. మళ్లీ సంజూనే ఆడించింది మేనేజ్మెంట్. ఇక ఈ సిరీస్లో ఇంగ్లండ్ చేతిలో భారత్ 4-0తో క్లీన్స్వీప్ అయింది.అయితే, జింబాబ్వేతో తాజాగా మరో టీ20 సిరీస్ను గురువారం నుంచి మొదలుపెట్టనుంది. ఈ క్రమంలో సంజూ శాంసన్ను జట్టు నుంచి తప్పించిన యాజమాన్యం.. అభిషేక్ శర్మకు జోడీగా జింబాబ్వే సిరీస్కు వైభవ్ను ఎంపిక చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ..వంద శాతం కష్టపడతాను‘‘గడిచిన నాలుగు నెలల కాలంలో నేను ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. క్రికెట్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే, ఆటను మెరుగుపరచుకునే ప్రక్రియపై మాత్రమే నేను దృష్టి పెట్టాను. జట్టు కోసం వందకు వంద శాతం కష్టపడతాను’’ అని వైభవ్ సూర్యవంశీ తెలిపాడు.అదే విధంగా.. ‘‘కోచ్లు, ఇతర సిబ్బంది నాకు మార్గదర్శనం చేస్తున్నారు. ప్రాక్టీస్ సమయంలో నాకేం కావాలో అన్నీ సమకూరుస్తున్నారు. అంతా బాగుంది. ఈ అనుభూతి గొప్పగా అనిపిస్తోంది. రోజురోజుకీ ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతోంది.ఈ పిచ్లపై నాకు అవగాహన ఉందిఇక జింబాబ్వేతో టీ20 సిరీస్ జరిగే హరారే స్పోర్ట్స్ క్లబ్ నా మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇక్కడే నాలుగు నెలల క్రితం అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో మేము గెలిచాం. అప్పుడు యువ జట్టు తరఫున.. ఇప్పుడు టీమిండియా తరఫున ఇదే గ్రౌండ్లో ఆడటం గొప్పగా ఉంది. ఈ పిచ్లపై నాకు అవగాహన ఉంది. కాబట్టి జట్టు గెలుపులో నా వంతు కృషి చేస్తాను’’ అని వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు. కాగా అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో వైభవ్ ఇంగ్లండ్ మీద 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించాడు. తద్వారా భారత్ ప్రపంచకప్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. చదవండి: శ్రీలంకతో టెస్టు.. భారీ ఆధిక్యంలో భారత్ -
తొలి బంతి నుంచే హిట్టింగ్ ఆడగలను కానీ..: టీమిండియా స్టార్
ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో వైట్వాష్ తర్వాత భారత టీ20 జట్టు జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం తొలి టీ20 నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇందుకు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగ.ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడగల సత్తా తనకు ఉందని.. అయితే, పరిస్థితులకు తగ్గట్లుగానే తాను బ్యాటింగ్ చేస్తానని పేర్కొన్నాడు. వైస్ కెప్టెన్గా తనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయని.. అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తానంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు.తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవాలుకాగా ఐర్లాండ్తో సిరీస్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ టీ20లలో ఇవ్వడంతో పాటు కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఇక టీ20 ప్రపంచకప్ టోర్నీలో మంచి ప్రదర్శన కనబరిచిన తిలక్ వర్మకు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ లభించింది. అయితే, ఐర్లాండ్తో పాటు ఇంగ్లండ్ చేతుల్లో టీమిండియా వరుసగా 2-0, 4-0తో క్లీన్స్వీప్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.బ్యాటర్గా శ్రేయస్ ఫర్వాలేదనిపించినా.. సారథిగా అతడికి చేదు అనుభవమే మిగిలింది. మరోవైపు.. తిలక్ వర్మ స్లోగా బ్యాటింగ్ చేస్తున్నాడనే విమర్శలు వచ్చాయి. ఐర్లాండ్తో సిరీస్లో అతడి స్ట్రైక్రేటు 110 కాగా.. ఇంగ్లండ్తో సిరీస్లో 152.94కు చేరినప్పటికీ సగటు 26 మాత్రమే.ఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ వంటి మాజీ క్రికెటర్లు తిలక్ వర్మను జట్టు నుంచే తొలగించాలనే డిమాండ్లు చేశారు. ఈ క్రమంలో జింబాబ్వేతో తొలి టీ20కి ముందు తిలక్ వర్మ మాట్లాడుతూ.. ‘‘టీ20 ఫార్మాట్లో ఒక్కోసారి వేర్వేరు ఆటగాళ్లు వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్కు రావాల్సి ఉంటుంది.ఆ సత్తా నాకుంది.. కానీపిచ్ పరిస్థితులకు తగినట్లుగా ప్లాన్ ఉంటుంది. కాబట్టి ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. అంతిమంగా జట్టు ప్రయోజనాలే ముఖ్యం. ఒకవేళ ప్రణాళిక ప్రకారం.. తొలి బంతి నుంచే హిట్టింగ్ ఆడాలంటే నేను అదే పని చేస్తా. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడగల సత్తా నాకుంది. కానీ యూకే పిచ్ పరిస్థితుల్లో అది అంత సులువు కాదు. పైగా మ్యాచ్లో ఎలాంటి స్థితిలో ఉన్నామో కూడా చూసుకోవాలి.నేను బ్యాటింగ్కు వెళ్లేసరికి జట్టు పవర్ప్లేలోనే నాలుగైదు వికెట్లు కోల్పోతూ వచ్చింది. అలాంటప్పుడు వచ్చీ రాగానే షాట్లు ఆడటం సరైంది కాదు. పైగా వైస్ కెప్టెన్ అంటే నేను మరింత బాధ్యతగా ఆడాల్సి ఉంటుంది. అందుకే తొలి బంతి నుంచే దూకుడుగా ఆడేందుకు ఆలోచించాల్సి వచ్చింది. పోరాటపటిమ ఉన్న జట్టుగత రెండేళ్లుగా ఎక్కువగా ఆసియాలోని పిచ్లపైనే ఎక్కువ మ్యాచ్లు ఆడిన మేం ఇంగ్లండ్కు వెళ్లగానే ఇబ్బంది పడ్డాం’’ అని తిలక్ వర్మ తనను విమర్శించిన వారికి కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా.. జింబాబ్వే మంచి పోరాటపటిమ ఉన్న జట్టు అని ప్రశంసించిన తిలక్ వర్మ.. వారిని ఓడించడం కూడా అంత సులువేమీ కాదన్నాడు. చదవండి: టీమిండియాపై గెలవగలం: జింబాబ్వే కెప్టెన్ -
IND vs ZIM: సిరీస్లో టీమిండియా ఫేవరెట్ కాదు: జింబాబ్వే కెప్టెన్
విదేశీ పర్యటనలో ఉన్న టీమిండియా వరుస పరాజయాలు చవిచూసింది. యూకే టూర్లో భాగంగా తొలుత ఐర్లాండ్తో టీ20 సిరీస్లో తలపడ్డ భారత జట్టు.. అనూహ్య రీతిలో పసికూన చేతిలో 2-0తో క్లీన్స్వీప్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టి ఆతిథ్య జట్టు చేతిలో 4-0తో వైట్వాష్ అయింది.దీంతో యూకే పర్యటనతో భారత టీ20 జట్టు కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు అత్యంత చేదు అనుభవమే మిగిలింది. విజయమన్నదే లేకుండా అతడు ఈ రెండు సిరీస్లను అవమానకర రీతిలో ముగించాల్సి వచ్చింది.ఇపుడు జింబాబ్వేతో సిరీస్అనంతరం.. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో శుబ్మన్ గిల్ సారథ్యంలోనూ టీమిండియా ఓటమిపాలైంది. ప్రత్యర్థికి 1-2తో సిరీస్ను సమర్పించుకుంది. ఇక ఇప్పుడు భారత జట్టు జింబాబ్వేలో అడుగుపెట్టింది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది.ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ బృందం ఎలాగైనా ఈసారి గెలుపు ఖాతా తెరిచి.. సిరీస్లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. అయితే, అదేమీ అంత తేలిక కాదు. ఐరిష్ జట్టు వంటి పసికూన చేతిలో ఓడిన టీమిండియాకు.. జింబాబ్వే కూడా కఠిన సవాలు విసురుతోంది.అసాధారణ విజయాలుఇటీవలి కాలంలో ఆ జట్టు సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనం. టీ20 ప్రపంచకప్-2026లో అనూహ్య రీతిలో మాజీ చాంపియన్, పటిష్ట ఆస్ట్రేలియా జట్టునే జింబాబ్వే మట్టికరిపించింది. ఏకంగా 23 పరుగుల తేడాతో ఓడించి గ్రూప్ దశలోనే ఆసీస్ను ఎలిమినేట్ చేసింది. ఆ తర్వాత శ్రీలంక, బంగ్లాదేశ్లపై కూడా విజయాలు సాధించింది.ఇక ఇటీవల బంగ్లాదేశ్ జట్టు తమ దేశంలో పర్యటించగా ఏకైక టెస్టులో బంగ్లాను ఏకంగా ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో జింబాబ్వే మట్టికరిపించింది. ఆ తర్వాత వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే, టీ20 సిరీస్ను మాత్రం 1-2తో బంగ్లాకు కోల్పోయింది. ఏదేమైనా ఇటీవల అన్ని ఫార్మాట్లలో చెప్పుకోదగ్గ విజయాలతో జింబాబ్వే పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.టీమిండియా ఫేవరెట్ కాదుఈ నేపథ్యంలో తాజా టీ20 సిరీస్లో టీమిండియా హాట్ ఫేవరెట్ కదా అన్న ప్రశ్నకు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా ఇచ్చిన సమాధానం వైరల్గా మారింది. ‘‘అదేం లేదు. ఈ సిరీస్లో గెలిచేందుకు ఇరుజట్లకు సమాన అవకాశాలు ఉన్నాయి.ఏదేమైనా నేనొక విషయం కచ్చితంగా చెప్పగలను. జింబాబ్వే ఇటీవలి కాలంలో అత్యంత నిలకడగా ఆడుతూ క్రికెట్లోని అసలైన మజాను అందిస్తోంది. ఈ సిరీస్ ద్వారా కూడా జింబాబ్వే కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది.వార్వన్ సైడ్ కానే కాదుప్రస్తుతం టీమిండియా సంధి దశలో ఉంది. జింబాబ్వే పరిస్థితి కూడా అంతే. కాబట్టి ఈ సిరీస్ ఎంతమాత్రం ఏకపక్షంగా ఉండబోదని చెప్పగలను’’ అని రజా పేర్కొన్నాడు. కాగా టీమిండియా- జింబాబ్వే మధ్య జూలై 23, 25, 26 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక. చదవండి: iND vs ENG: ప్రపంచంలోనే బెస్ట్.. అతడిని ఎందుకు ఆడించలేదు?Another exciting challenge awaits Team India! 🇮🇳Zimbabwe skipper Sikandar Raza is excited for the upcoming series against India and believes fans are in for an entertaining contest! 👊🔥#ZIMvIND pic.twitter.com/6iyXDzZbLn— Star Sports (@StarSportsIndia) July 21, 2026 -
టీ20 సిరీస్.. జింబాబ్వేకు బయల్దేరి వెళ్లిన టీమిండియా
జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా శనివారం రాత్రి భారత్ నుంచి బయల్దేరి వెళ్లింది. ఈ సిరీస్కు హెడ్కోచ్ గంభీర్కు విశ్రాంతినివ్వడంతో అతడి స్థానంలో జట్టు మెంటార్గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వీవీఎస్ లక్ష్మణ్ సహా తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఇతర క్రికెటర్లు జింబాబ్వే టూర్కు వెళ్తున్న ఫొటోలను బీసీసీఐ పంచుకుంది. ఇంగ్లండ్ టూర్లో ఇవాళ చివరి వన్డే ఆడిన అనంతరం టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, శివమ్ దూబేలు నేరుగా జింబాబ్వేకు పయనం కానున్నారు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో టీ20 కెప్టెన్గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా.. ఐర్లాండ్, ఇంగ్లండ్లతో జరిగిన టీ20 సిరీస్ల్లో ఓటమిపాలైంది. తన కెప్టెన్సీలో శ్రేయస్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడంతో జింబాబ్వే సిరీస్ అతడికి కీలకం కానుంది. జింబాబ్వే టూర్లో టీమిండియానే ఫెవరెట్గా కనిపిస్తున్నప్పటికీ ఆతిథ్య జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో జూలై 23 నుంచి మొదలుకానుంది. తొలి టీ20 జూలై 23న హరారే వేదికగా సాయంత్రం 4.30 గంటలకు జరగనుంది. 2024 జూలైలో చివరగా జింబాబ్వేలో పర్యటించిన భారత్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది.ఇక ఈ సిరీస్కు సంజూ శాంసన్ను పక్కకు తప్పించారు. రింకూ సింగ్, మయాంక్ యాదవ్లతో పాటు ప్రబ్సిమ్రన్లను జింబాబ్వే టూర్కు ఎంపిక చేసింది.జింబాబ్వే టూర్కు టీమిండియా: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యాష్ ఠాకూర్, అశోక్ శర్మ, ప్రబ్సిమ్రన్, మయాంక్ యాదవ్.𝙀𝙣 𝙧𝙤𝙪𝙩𝙚 𝙩𝙤 𝙕𝙞𝙢𝙗𝙖𝙗𝙬𝙚 🇿🇼#TeamIndia | #ZIMvIND pic.twitter.com/akRFqycwXC— BCCI (@BCCI) July 18, 2026చదవండి: రిటైర్మెంట్ ఊహాగానాలపై రోహిత్ తొలి స్పందన! -
వాళ్లిద్దరికి అస్సలు పడట్లేదు!.. డీకే సంచలన వ్యాఖ్యలు
గతంలో ఎన్నడూ లేని విధంగా పొట్టి ఫార్మాట్లో టీమిండియాకు ఇటీవల ఘోర పరాభవాలు ఎదురయ్యాయి. టీ20 ప్రపంచకప్ చాంపియన్గా ఐర్లాండ్ గడ్డ మీద అడుగుపెట్టిన భారత్.. పసికూన అయిన ఆతిథ్య జట్టు చేతిలో 2-0తో క్లీన్స్వీప్ అయింది.తీవ్రస్థాయిలో విమర్శలుఅనంతరం ఇంగ్లండ్కు వెళ్లి అక్కడా ఆతిథ్య జట్టు చేతిలో 4-0తో వైట్వాష్కు గురైంది. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా తుదిజట్టులో తరచూ మార్పులు, వరల్డ్కప్ హీరో సంజూ శాంసన్ను పక్కనపెట్టడం విమర్శలకు కారణమయ్యాయి.అంతేకాదు.. అంతకుముందు టీ20 జట్టు కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను నియమించే విషయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రధాన పాత్ర పోషించినట్లు.. హెడ్కోచ్ గౌతం గంభీర్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వరుస ఓటముల నేపథ్యంలో ఈ విషయం కూడా మరోసారి తెరమీదకు వచ్చింది.దినేశ్ కార్తిక్ సంచలన వ్యాఖ్యలుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్- అగార్కర్ మధ్య విభేదాల వల్లే భారత జట్టుకు ఈ దుస్థితి వచ్చిందని పరోక్షంగా దుయ్యబట్టాడు. వీరి వైఖరి కారణంగా ఆటగాళ్లలో ఒక రకమైన గందరగోళం నెలకొందని పేర్కొన్నాడు.ఈ మేరకు.. ‘‘చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా పటిష్ట జట్టును తయారు చేయాలని భావిస్తున్నాడు. అయితే, కోచ్ గంభీర్ మాత్రం అలా కాదు. ప్రతి ఒక్క మ్యాచ్, ప్రతి ఒక్క సిరీస్ గెలవాలనే లక్ష్యంతో ఉన్నాడు.ఆటగాళ్లకు మంచిది కాదుఒకరేమో దీర్ఘకాలిక ప్రయోజనాలు.. మరొకరు ఇప్పటికిప్పుడు వచ్చే ఫలితాల గురించి ఆలోచించడం వల్ల బహుశా ఇద్దరి మధ్య ఒక రకమైన ఘర్షణ జరిగి ఉంటుంది. దీంతో ఆటగాళ్ల మనసుల్లో గందరగోళం నెలకొంది. చీఫ్ సెలక్టర్, కోచ్ ఆలోచనల మధ్య వ్యత్యాసం ఆటగాళ్లకు మంచిదేనా? అంటే అస్సలు కాదనే చెప్తాను.ఇలాంటి సమయంలో వారికి జట్టులో తమ స్థానం గురించి అభద్రతాభావం ఏర్పడుతుంది. అది ఫలితాలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ విభేదాలు పరిష్కరించుకుంటే జట్టుకు మంచిది’’ అని దినేశ్ కార్తిక్ చెప్పుకొచ్చాడు.చదవండి: టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్! -
టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్!
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాను చాంపియన్గా నిలిపిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. కానీ ఈ మెగా టోర్నీ తర్వాత జట్టు ఆడిన తొలి సిరీస్లోనే ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్పై వేటు పడింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. కెప్టెన్గా తప్పించడమే కాకుండా.. జట్టులోనే అతడికి స్థానం లేకుండా చేసింది.గత ఏడాదిన్నర కారణంగా బ్యాటర్గా సూర్యకుమార్ వ్యక్తిగత వైఫల్యలే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్కు సారథ్య బాధ్యతలు అప్పగించిన యాజమాన్యం.. చిచ్చర పిడుగు, పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీని జాతీయ జట్టుకు ఎంపిక చేసింది.ఘోర పరాభవం!అయితే, అయ్యర్ కెప్టెన్సీలో తొలి సిరీస్లోనే భారత్కు ఘోర పరాభవం ఎదురైంది. పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్లో 2-0తో టీమిండియా వైట్వాష్కు గురైంది. ఇక ఇంగ్లండ్ చేతిలోనూ 4-0తో క్లీన్స్వీప్ అయింది. దీంతో తాజా యూకే టూర్ భారత క్రికెట్ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది.ఈ నేపథ్యంలో సూర్యను గుర్తు చేసుకుంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అతడిని కొనసాగించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమోనని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి తరుణంలో టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్టు కరిష్మా సింగ్ సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.బీసీసీఐ గ్రీన్ సిగ్నల్!.. కానీ ఓ కండిషన్!సూర్యకు టీమిండియా తలుపులు శాశ్వతంగా ఏమీ మూసుకుపోలేదన్నారు. అతడు త్వరలోనే తిరిగి భారత టీ20 జట్టులోకి వచ్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే, అందుకోసం సూర్య దేశవాళీ క్రికెట్లో ముంబై తరఫున.. అదే విధంగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫునా కచ్చితంగా రాణించాల్సి ఉంటుందని కరిష్మా చెప్పుకొచ్చారు.అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. సూర్యకు మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగానే ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నట్లు కరిష్మా తెలిపారు. బంతి ఇప్పుడు సూర్య కోర్టులోనే ఉందన్నారు. దేశీ క్రికెట్లో రాణిస్తే తప్పక అతడు తిరిగి టీమిండియాలో అడుగుపెడతారని జోస్యం చెప్పారు. కాగా మాజీ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, దినేశ్ కార్తిక్ తదితరులు కొన్నాళ్లపాటు జాతీయ జట్టుకు దూరమైనా.. దేశీ క్రికెట్లో సత్తా చాటి తిరిగి జట్టులో స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే.చదవండి: ఇంగ్లండ్తో తొలి వన్డేకు భారత జట్టు ఇదే! -
‘అందుకే వైభవ్ను తప్పించి.. సంజూను ఆడించాము’
టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లండ్లతో టీ20 సిరీస్లలో క్లీన్స్వీప్ కావడమే ఇందుకు కారణం. తొలుత ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్వాష్ గురైన శ్రేయస్ అయ్యర్ సేన.. ఆ తర్వాత ఇంగ్లండ్ సిరీస్నూ విజయమన్నదే లేకుండా ముగించింది. ఇంగ్లిష్ జట్టు చేతిలో 4-0తో క్లీన్స్వీప్ అయింది.ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ కోసం వరల్డ్కప్ హీరో సంజూ శాంసన్ను పక్కనపెట్టడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. కాగా సంజూ ఐర్లాండ్తో రెండు టీ20లు (5, 0).. అదే విధంగా ఇంగ్లండ్తో తొలి టీ20 (1)లో విఫలమయ్యాడు.ఈ క్రమంలోనే సంజూను తప్పించి.. అతడి స్థానంలో ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ రెండో టీ20తో అరంగేట్రం చేశాడు. అయితే, వరుసగా మూడు మ్యాచ్లు ఆడిన వైభవ్.. 13, 14, 15 పరుగులు చేశాడు. అంతేగాక వైభవ్ రాకతో టాపార్డర్లో ముగ్గురూ (ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్.. వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్) లెఫ్టాండర్లే అయ్యారు.ఈ నేపథ్యంలో నామమాత్రపు ఐదో టీ20లో మాత్రం వైభవ్ సూర్యవంశీని తప్పించి.. సంజూ శాంసన్ను తిరిగి తీసుకువచ్చారు. ఈ విషయంపై ఓటమి అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వివరణ ఇచ్చాడు. మీడియాతో మాట్లాడుతూ..‘‘సౌతాంప్టన్ పిచ్ పరిస్థితికి తగ్గట్లు మేము అత్యుత్తమ ఓపెనింగ్ కాంబినేషన్తో ముందుకు వెళ్లాలని అనుకున్నాము. అభిషేక్ శర్మతో కలిసి కుడిచేతి వాటం బ్యాటర్తో ఓపెనింగ్ చేయించాలని ఫిక్స్ అయ్యాము. అందుకే వైభవ్ను తప్పించాము. ఈ మ్యాచ్కు ఇలా చేయడమే సరైన నిర్ణయం. సంజూ గన్ బ్యాటర్. గతంలో ఒంటిచేత్తో ఎన్నో సిరీస్లు గెలిపించాడు’’ అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. కాగా ఐదో టీ20లో సంజూ 27 పరుగులు చేయగా.. అభిషేక్ 3 రన్స్ చేసి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేయగా.. టీమిండియా 201 పరుగులకే కుప్పకూలింది. -
‘వైభవ్ కోసం అతడిని బలిపశువును చేశారు’
టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ వైభవ్ సూర్యవంశీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అతడికి వచ్చిన హైప్ను దృష్టిలో పెట్టుకొని సీనియర్ జట్టుకు ఎంపిక చేయడాన్ని తప్పుబట్టాడు. వైభవ్ చేత అంత త్వరగా అంతర్జాతీయ అరంగేట్రం చేయించాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు. కేవలం మీడియా సృష్టించిన హైప్, ప్రజల్లోని ఎమోషన్స్ చూసి సెలెక్టర్లు తొందరపడ్డారని పేర్కొన్నాడు.ఐర్లాండ్తో టీ20 సిరీస్కు అవకాశం లభించని వైభవ్కు ఇంగ్లండ్ పర్యటనలో రెండో టీ20లో అవకాశం దక్కింది. మొదటి మ్యాచ్ ఆడిన సంజు శాంసన్ను రెండో మ్యాచ్లో పక్కన పెట్టి అతడి స్థానంలో వైభవ్కు అవకాశం ఇచ్చారు. అయితే వరుసగా మూడు మ్యాచ్ల్లో వైభవ్ కేవలం 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో ఐదో టీ20 మ్యాచ్లో అతన్ని పక్కన పెట్టి మళ్లీ శాంసన్ను జట్టులోకి తీసుకున్నారు. ఈ ప్రయోగాలపై స్పందించిన వసీం జాఫర్.. అసలు శాంసన్ ఫామ్లో లేడనే బలమైన నమ్మకం ఉంటే తప్ప ఇలాంటి మార్పులు చేయకూడదని హితవు పలికాడు. సంజు శాంసన్ లాంటి మ్యాచ్ విన్నర్కు జట్టులో క్రమబద్ధమైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. వైభవ్ సూర్యవంశీ ఇంకా చాలా చిన్న వయస్కుడని, అతనికి ఇంకా చాలా సమయం ఉందని జాఫర్ గుర్తుచేశాడు. అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే ముందే కేవలం టీమ్తో ప్రయాణిస్తూ, వెలుపల నుండి ఆటను గమనిస్తూ అతను ఎంతో నేర్చుకోవచ్చని సూచించాడు. 2026 టీ20 ప్రపంచకప్ను టీమిండియా గెలవడంలో కీలకపాత్ర పోషించిన శాంసన్ను కేవలం వైభవ్ కోసం పక్కనబెట్టి అతడిని బలిపశువును చేయడం సరైన చర్య కాదన్నాడు.కేవలం మీడియాలో వస్తున్న వార్తల ప్రభావంతో కంగారుగా జట్టులోకి తెచ్చి ఒత్తిడి పెంచడం పద్ధతి కాదన్నాడు. తదుపరి జింబాబ్వే టూర్ కోసం వైభవ్ను ఎంపిక చేసి, కేవలం ఒకే ఫార్మాట్ ఆడే సంజు శాంసన్ను పక్కన పెట్టడం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని వసీం జాఫర్ తెలిపాడు.చదవండి: సెమీస్ సమరం.. ఎవరి బలమెంత? -
టీ20 సిరీస్ ఓటమి.. నంబర్వన్ ర్యాంక్ గోవిందా
నాలుగు నెలల కిందట జరిగిన టీ20 ప్రపంచకప్ను మూడోసారి కైవసం చేసుకొని నంబర్వన్ స్థానాన్ని అధిరోహించిన టీమిండియా తాజాగా ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ఓటమితో ఆ స్థానాన్ని కోల్పోయింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 0-4తో ఇంగ్లండ్కు అప్పగించి దారుణ పరాజయం మూటగట్టుకున్న భారత జట్టు సిరీస్తో పాటు నంబర్వన్ స్థానాన్ని కూడా ఇంగ్లండ్కు అప్పగించేసింది. 1605 రోజుల తర్వాత టీమిండియా టీ20 ర్యాంకింగ్స్లో నంబర్వన్ స్థానాన్ని కోల్పోవడం గమనార్హం.పాయింట్ల పరంగా మార్పు లేనప్పటికీ మ్యాచ్ల పరంగా తేడా ఉండడంతో ఇంగ్లండ్ తొలి స్థానాన్ని ఆక్రమించింది. రెండో స్థానంలో భారత్ (268 పాయింట్లు), మూడో స్థానంలో ఆస్ట్రేలియా (260 పాయింట్లు) కొనసాగుతున్నాయి. గత నాలుగేళ్లలో నంబర్వన్ ర్యాంకు కోల్పోవడంతో పాటు రెండు వరుస టీ20 సిరీస్లు ఓడడం కూడా టీమిండియాకు ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ఓటమి ద్వారా పలు చెత్త రికార్డులను కూడా భారత్ తన పేరిట లిఖించుకుంది.👉టీమిండియాకు పరుగుల పరంగా (56 పరుగులు) ఇది నాలుగో అతిపెద్ద ఓటమి. గతంలో 2026లో ఇంగ్లండ్ చేతిలోనే 125 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 2091లో న్యూజిలాండ్ చేతిలో 80 పరుగులు, 2026లో సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.👉ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో టీమిండియా నాలుగు మ్యాచ్లు ఓడడం ద్వారా ఒక సిరీస్లో అత్యధిక ఓటములు చవిచూసినట్లయింది. గతంలో 2009 మహిళల ప్రపంచకప్లో మూడు ఓటములు, 2010 మహిళల ప్రపంచకప్లో మూడు ఓటములు, 2023 వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లో మూడు ఓటములు చవిచూసింది.👉కెప్టెన్గా తొలి ఏడు టీ20 మ్యాచ్ల్లో గెలుపు లేని ఆటగాళ్ల జాబితాలో శ్రేయస్ అయ్యర్ చోటు సంపాదించాడు. గతంలో బ్రెండన్ టేలర్ (జింబాబ్వే), ఎల్టన్ చిగుంబరా (జింబాబ్వే), తిసారా పెరీరా (శ్రీలంక) ఈ ఫీట్ సాధించారు. ఇక భారత కెప్టెన్లలో రెండు వరుస టీ20 సిరీస్లతో పాటు ఏడు మ్యాచ్ల్లో గెలుపు రుచి చూడని తొలి కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు నమోదు చేశాడు.👉 భారత క్రికెటర్ ప్రిన్స్ యాదవ్ ఒక చెత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. అంబటి రాయుడు తర్వాత తాను ఆడిన మొదటి నాలుగు మ్యాచ్ల్లోనూ ప్రిన్స్ యాదవ్ ఓటమి చవిచూడడం గమనార్హం. 🚨 INDIA’S REIGN AS THE NO.1 RANKED T20I TEAM IS OVER AFTER 1,605 DAYS. 🚨 pic.twitter.com/LOr51llcdt— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2026చదవండి: 'ఇది మాకు గుణపాఠం.. ఓటమికి కారణం అదే' -
'ఇది మాకు గుణపాఠం.. ఓటమికి కారణం అదే'
ఐర్లాండ్ టూర్లో 0-2తో క్లీన్స్వీప్ అయిన టీమిండియా ఇంగ్లండ్ టూర్లోనూ అదే కంటిన్యూ చేసింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 0-4తో ఇంగ్లండ్కు అప్పజెప్పి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. శనివారం రాత్రి జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ 56 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో టీమిండియా టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు ఇది వరుసగా ఏడు మ్యాచ్ల్లో ఆరో ఓటమి (ఒక మ్యాచ్ వర్షంతో రద్దు) కావడం గమనార్హం. ఏడు మ్యాచ్లుగా గెలుపు మొహం చూడని శ్రేయస్ అయ్యర్ టీమిండియా తరఫున అత్యంత చెత్త కెప్టెన్గా రికార్డులకెక్కాడు. మ్యాచ్ ఓటమి అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లండ్తో సిరీస్ ఓటమి తమకు ఒక గుణపాఠం లాంటిదని పేర్కొన్నాడు. బ్యాటింగ్లో రాణించినప్పటికీ పేలవ ఫీల్డింగ్తో పాటు నాణ్యత లేని బౌలింగ్ జట్టు ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయని తెలిపాడు. అయ్యర్ మాట్లాడుతూ.. 'నిజాయితీగా చెప్పాలంటే ఇంకా మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంగ్లండ్ పరిస్థితులకు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాం. ఐదు మ్యాచ్ల సిరీస్లో మేము ఆడిన ప్రతి మైదానంతో పోలిస్తే మేము ఆడిన వికెట్లలో ఇదే బహుశా అత్యుత్తమమైనది కావొచ్చు. మ్యాచ్ మ్యాచ్కు పరిస్థితులు మారిపోతున్నాయి. తొలుత ఇంగ్లండ్ గడ్డపై బ్యాటింగ్ చేయడానికే చాలా కష్టపడ్డాం. కానీ ఇవాళ్టి మ్యాచ్లో బ్యాటింగ్లో చాలా మెరుగయ్యామనిపించింది. ప్రొఫెషనల్ ఆటలో ఓటములు సహజమే. కానీ ఈ సిరీస్ ఓటమి మాకు గుణపాఠం లాంటిది. మ్యాచ్లు గెలవడంలో ఫీల్డింగ్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది. నేటి మ్యాచ్లో మూడు క్యాచ్లు జారవిడవడంతో పాటు పేలవంగా ఫీల్డింగ్ చేశాము. 200-210 పరుగుల టార్గెట్ను ఈ గ్రౌండ్లో ఈజీగా ఛేదించవచ్చు. 200 నుంచి 225 పరుగులు చేయాల్సిన ఇంగ్లండ్ మా తప్పిదాల వల్ల మరో 25 నుంచి 30 పరుగులు అదనంగా రాబట్టింది. పేలవ ఫీల్డింగ్తో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇక బ్యాటింగ్ సమయంలో పవర్ ప్లేలో వెనువెంటనే వికెట్లు కోల్పోవడం కూడా విజయాన్ని దూరం చేసినట్లయింది. మంచి భాగస్వామ్యాలు నమోదు చేయడంలో విఫలమయ్యాం. బౌలింగ్ కూడా మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బుమ్రా, పాండ్యా వంటి అనుభవజ్ఞలైన బౌలర్లు లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇంగ్లండ్ మ్యాచ్ విజయానికి అర్హులు. మొదట బట్లర్.. ఆ తర్వాత కెప్టెన్ హ్యారీ బ్రూక్ వేగంగా ఆడి మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. ఏది ఏమైనా ఈ సిరీస్ ఓటమి మాకు గుణపాఠం లాంటిది. ఇంగ్లండ్ గడ్డపై మరోసారి టీ20 సిరీస్ ఆడేందుకు వచ్చినప్పుడు మా కుర్రాళ్లు జాగ్రత్తగా ఆడతారని నేను అనుకుంటున్నా. కెప్టెన్గా సిరీస్ ఓటమి నాకు బాధ కలిగించింది. కానీ కెప్టెన్గా మాత్రం చాలా విషయాలు నేర్చుకున్నా.' అని ముగించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్స్లు) టీ20ల్లో రెండో సెంచరీతో చెలరేగగా...కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్స్లు) త్రుటిలో ఆ అవకాశాన్ని కోల్పోయాడు. అనంతరం భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్స్లు), తిలక్ వర్మ (25 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. శ్రేయస్ అయ్యర్ (16 బంతుల్లో 28; 4 ఫోర్లు), సంజు సామ్సన్ (14 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. ఇప్పటి వరకు ఐసీసీ టి20 టీమ్ ర్యాంకింగ్స్లో నంబర్వన్గా ఉన్న భారత్ను వెనక్కి నెట్టి తాజా ఫలితంతో ఇంగ్లండ్ అగ్రస్థానానికి చేరుకుంది. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జూలై 14న ప్రారంభం కానుంది.చదవండి: ఫిఫా ప్రపంచ కప్: ఇంగ్లండ్ సెమీస్కి.. నార్వే ఇంటికి.. -
నిషేధం ఎత్తివేసినా!.. ఐపీఎల్ ఆడే ప్రసక్తే లేదు!
ఇంగ్లండ్ టీ20 జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ జోష్లో ఉన్నాడు. స్వదేశంలో అతడి సారథ్యంలో.. ఇంగ్లండ్ తొలిసారి టీమిండియాపై టీ20 సిరీస్ను 3-0తో గెలిచింది. ఇటు సారథిగా.. అటు బ్యాటర్గా ఈ విజయంలో బ్రూక్ది కీలక పాత్ర.ఈ క్రమంలో ఇంగ్లండ్- టీమిండియా మధ్య శనివారం నాటి నామమాత్రపు ఐదో టీ20లోనూ గెలిచి క్లీన్స్వీప్ చేయాలని బ్రూక్ పట్టుదలగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సౌతాంప్టన్ మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.గొప్ప అనుభవం.. కానీ ఆడలేను‘‘ఐపీఎల్లో ఆడటం నిజంగా గొప్ప అనుభవం. ఐపీఎల్ ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదించాను. అయితే, దురదృష్టవశాత్తూ నేనిప్పుడు అక్కడ ఆడేందుకు సమయం కేటాయించే పరిస్థితిలో లేను.నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం నేను మూడు ఫార్మాట్లు ఆడుతూ.. రెండు ఫార్మాట్ల (వన్డే, టీ20)కు కెప్టెన్గా ఉంటూ.. ఐపీఎల్ కూడా ఆడటం అంటే కష్టమే. ప్రస్తుతం నా షెడ్యూల్ కిక్కిరిసి పోయి ఉంది. మహా అయితే ఓ మూడు నెలల విరామం దొరుకుతుంది.అప్పుడు నేను ఆ సమయాన్ని ఐపీఎల్ కోసం పెట్టలేను. కాస్త విరామం తీసుకుని.. ఆ తర్వాత ఫిట్నెస్, ఆటపై దృష్టి పెడతాను. ఇంగ్లిష్ క్రికెట్ కోసం నేను చేయగలిగిందంతా చేస్తాను’’ అని స్వదేశీ, జాతీయ క్రికెట్ పట్ల తనకు ఉన్న అంకితభావాన్ని హ్యారీ బ్రూక్ వివరించాడు.నిషేధం ఎత్తివేసినా సరే కుదరదుకాగా 2023లో హ్యారీ బ్రూక్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున మొత్తంగా 11 మ్యాచ్లలో కలిపి 190 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సన్రైజర్స్ అతడిని వదిలివేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కొనుక్కుంది.అయితే, 27 ఏళ్ల హ్యారీ బ్రూక్ 2024, 2025 సీజన్లలో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఫ్రాంఛైజీకి హ్యాండిచ్చాడు. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. అతడిపై 2028 వరకు ఐపీఎల్ నిర్వాహకులు నిషేధం విధించారు. అయితే, బ్రూక్ తాజా వ్యాఖ్యలను బట్టి.. ఒకవేళ గడువు తీరి నిషేధం ఎత్తివేసినా సరే తాను ఇప్పట్లో ఐపీఎల్ ఆడే ప్రసక్తే లేదని చెప్పకనే చెప్పినట్లయింది. ఇక ప్రస్తుతం ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్గా ఉన్న బ్రూక్.. త్వరలోనే టెస్టు సారథిగానూ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.చదవండి: వెస్టిండీస్ క్రికెటర్ రిటైర్మెంట్ -
వాళ్లిద్దరినీ తొలగించారు.. గంభీర్పైనా వేటు వేయండి!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్కోచ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో బీసీసీఐ అతడి స్థానాన్ని గౌతం గంభీర్తో భర్తీ చేసింది. అయితే, గంభీర్ మార్గదర్శనంలో తొలుత శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్ను గెలిచిన భారత్.. రెండున్నర దశాబ్దాల తర్వాత తొలిసారి వన్డే సిరీస్ను లంకకు కోల్పోయింది.ఇక ఆ తర్వాత కూడా గంభీర్ మార్గదర్శనంలో మిశ్రమ ఫలితాలే వచ్చాయి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ చాంపియన్గా నిలిచినప్పటికీ.. అందుకు ద్రవిడ్కే క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుందని.. నాటి కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.ఆ రెండూ మినహా...ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లోనూ టీమిండియా విజేతగా నిలిచినప్పటికీ.. స్వదేశంలో సిరీస్ జరగడం సానకూలంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ రెండు మెగా టోర్నీలు గెలిచినప్పటికీ.. గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా అత్యంత ఘోర పరాభవాలు చవిచూసింది.సొంతగడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతుల్లో టెస్టు సిరీస్లో వైట్వాష్ కావడం.. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరకపోవడం ఇందులో ప్రధానమైనవి. అంతేకాదు స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్కు వన్డే సిరీస్ను కూడా భారత్ కోల్పోయింది.వ్యంగ్యాస్త్రాలు తాజాగా టీ20 ప్రపంచకప్-2026 చాంపియన్ హోదాలో ఐర్లాండ్లో అడుగుపెట్టి.. పసికూన చేతిలో ఏకంగా 2-0తో వైట్వాష్ అయింది. అనంతరం ఇంగ్లండ్కు కూడా 0-3తో టీ20 సిరీస్ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ గంభీర్, జట్టు యాజమాన్యంపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.‘‘అయినా అతడి (గంభీర్)ని ప్రశ్నించేందుకు ఎవరైనా ఉన్నారా?.. అతడిని తప్పుకోమని చెప్పగల ధైర్యం ఉందా?.. ఈరోజు ఇంతజరిగినా ఎవరూ ఏమీ అనరు. ఎందుకంటే కొన్ని నెలల క్రితమే అతడు ప్రపంచకప్ గెలిచాడని చెబుతారు.వాళ్లిద్దరినీ తొలగించారు.. అతడిపైనా వేటు వేయండి!మరి సూర్యకుమార్ యాదవ్ కూడా కెప్టెన్గా కప్పు గెలిచాడు. అయినా సరే అతడిపై నిర్దాక్షిణ్యంగా వేటు వేశారు. జట్టు చాంపియన్గా నిలవడంలో సంజూ శాంసన్ది కీలక పాత్ర. అయినా కూడా అతడిని తుదిజట్టు నుంచి తప్పించారు.మరి వాళ్లిద్దరిలాగే గంభీర్పై వేటు వేయలేరా?.. మీ ఆలోచనా విధానం ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉంటుందా?’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ యాజమాన్యం తీరును తూర్పారబట్టాడు. అదే విధంగా.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓడిపోయినప్పటికీ గంభీర్ ముఖంలో కాస్తైనా బాధ కనిపించలేదని చిక్కా మండిపడ్డాడు.కొంచెం కూడా బాధ లేదు‘‘తననూ ఎవరు టచ్ చేయలేరని అతడికి తెలుసు. అందుకే డగౌట్లో కూర్చుని నవ్వులు చిందిస్తున్నాడు. అసలు జట్టు ఓడిపోతోందన్న బాధ అతడిలో కొంచెం కూడా కనిపించలేదు. ఎన్నో సిరీస్లలో వైట్వాష్లు, ఘోర పరాభవాలు.అయినా సరే అతడిని కదిలించేవారే లేరు. తనను ఎవరూ ఏమీ చేయలేరన్న నమ్మకంతోనే అతడు ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. వాటి గురించి నిర్భయంగా మాట్లాడుతున్నాడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: IND vs ENG 5th T20I: భారత తుదిజట్టు ఇదే! -
IND vs ENG: భారత తుదిజట్టు ఇదే!.. వైభవ్పై వేటు!
టీ20 ప్రపంచకప్ చాంపియన్ టీమిండియాకు ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పసికూన ఐర్లాండ్తో టీ20 సిరీస్లో 2-0తో క్లీన్స్వీప్నకు గురైన భారత జట్టు.. ఇంగ్లండ్కూ సిరీస్ను 0-3తో కోల్పోయింది. ఇక సౌతాంప్టన్ వేదికగా శనివారం నాటి ఆఖరిదైన ఐదో టీ20లో గెలిస్తేనే మరో వైట్వాష్ నుంచి టీమిండియా బయటపడుతుంది.పరువు దక్కాలంటేఈ నేపథ్యంలో కనీస పరువు దక్కాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో వరుసగా మూడు మ్యాచ్లలో విఫలమైన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై వేటు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నాకౌట్ మ్యాచ్లలో వరుసగా 97*, 89, 89 పరుగులతో రాణించి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు సంజూ శాంసన్. అయితే, ఐర్లాండ్తో రెండు టీ20లలో 5, 0 పరుగులు చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఇంగ్లండ్తో తొలి టీ20లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.సంజూ శాంసన్పై వేటు వేసిఈ నేపథ్యంలో సంజూ శాంసన్పై వేటు వేసిన యాజమాన్యం.. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీతో అరంగేట్రం చేయించింది. అయితే, పదిహేనేళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇంగ్లండ్తో వరుసగా మూడు మ్యాచ్లలో 13, 14, 15 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఇందుకు తోడు జట్టు సైతం వరుస పరాజయాలతో సిరీస్ కోల్పోయింది.తిరిగి తుదిజట్టులోకి ఇక వైభవ్తో పాటు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సైతం విఫలమవుతున్నారు. ఇలాంటి తరుణంలో హెడ్కోచ్ గౌతం గంభీర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో ఐదో టీ20 సందర్భంగా సంజూ శాంసన్ను తిరిగి తుదిజట్టులోకి తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.టాపార్డర్లో ముగ్గురూ లెఫ్టాండర్లే (అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్) ఉండటం కూడా సమస్యగా మారిందని.. ఈసారి సంజూను చేర్చి లెఫ్ట్- రైట్ కాంబినేషన్తో ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. లేదంటే వైభవ్ను కొనసాగించి.. తిలక్ వర్మ లేదంటే ఇషాన్ కిషన్ను తప్పిస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది.అయితే, తిలక్ ప్రస్తుతం వైస్ కెప్టెన్గా ఉన్నాడు. కాబట్టి అతడిని తుదిజట్టు నుంచి తీసేయడం కష్టం. మరోవైపు.. ఇషాన్ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా ఉన్నప్పటికీ.. వన్డౌన్లో సంజూ ఆడగలడు కాబట్టి అతడు ఇషాన్ను రీప్లేస్ చేసే అవకాశం ఉంది. ఇక అక్షర్ పటేల్, ప్రసిద్ కృష్ణ స్థానంలో రవి బిష్ణోయి, సూర్యాంశ్ షెడ్గే రానున్నట్లు సమాచారం.ఇంగ్లండ్తో ఐదో టీ20కి భారత తుదిజట్టు (అంచనా)అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, సూర్యాంశ్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయి. -
భారత టీ20 జట్టులోకి ఊహించని ప్లేయర్!
ఇంగ్లండ్ చేతిలో క్లీన్స్వీప్ గండం నుంచి తప్పించుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. సౌతాంప్టన్ వేదికగా ఆతిథ్య జట్టుతో ఆఖరి టీ20 మ్యాచ్లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. కాగా విదేశీ గడ్డ మీద టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే.తొలుత పసికూన చేతిలోటీ20 ప్రపంచకప్-2026 చాంపియన్గా ఐర్లాండ్లో అడుగుపెట్టిన భారత జట్టు.. అనూహ్య రీతిలో పసికూన చేతిలో 2-0తో వైట్వాష్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్లలో భారత్ ఓటమిపాలైంది.ఫలితంగా ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ను 3-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం మూడో టీ20 జరుగనున్న నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.అనుచిత నిర్ణయాల వల్లే సెలక్షన్ విషయంలో అనుచిత నిర్ణయాల వల్లే టీమిండియాకు ఈ గతి పట్టిందని చిక్కా మండిపడ్డాడు. ఈ క్రమంలో టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యుడైన కేఎల్ రాహుల్ను తిరిగి టీ20 జట్టులోకి తీసుకోవాలని యాజమాన్యానికి సూచించాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..గిల్కు ఛాన్స్ ఇచ్చారు..‘‘ప్రస్తుత పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ను భారత టీ20 జట్టులోకి తిరిగి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నిజానికి శుబ్మన్ గిల్కు ఓ అవకాశం దక్కింది. వన్డే, టెస్టు కెప్టెన్ అయిన అతడిని నేరుగా టీ20 జట్టు వైస్ కెప్టెన్గా నియమించారు.అతడిని టీ20 ఫార్మాట్లోనూ ఆడించండికానీ అతడు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కాబట్టి ఆ తర్వాత గిల్ను పక్కనపెట్టేశారు. అయితే, కేఎల్ రాహుల్కు కనీసం అలాంటి ఒక్క అవకాశం కూడూ దక్కలేదు. రాహుల్ను కేవలం టెస్టు, వన్డేలకే పరిమితం చేయాలని యాజమాన్యం భావిస్తోంది.ఫ్లాట్ పిచ్ల మీదే మనోళ్ల ప్రతాపంనిజానికి అతడి టీ20 రికార్డు అద్భుతంగా ఉంది. ఎలాంటి పిచ్ మీద అయినా రాహుల్ ఆడగలడు. ప్రస్తుత టీమిండియా బ్యాటింగ్ లైనప్ కేవలం ఫ్లాట్ పిచ్ల మీద మాత్రమే పరుగుల వరద పారిస్తోంది. సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ టోర్నీలో సౌతాఫ్రికా భయపెట్టగానే.. వెంటనే పిచ్లు మార్చమని మనోళ్లు అడిగారు. ఇక ఐపీఎల్లో లక్నో పిచ్ మీద భారత బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డారు. మన బ్యాటర్లు తడి టెన్నిస్ బాల్తో ప్రాక్టీస్ చేస్తూ పేస్, బౌన్సీ కండిషన్లకు మరింతగా అలవాటు పడాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా పొట్టి ఫార్మాట్లో కేఎల్ రాహుల్ చివరగా 2022 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ సందర్భంగా టీమిండియాకు ఆడాడు. ఇప్పటికి మొత్తంగా 72 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 2265 పరుగులు సాధించాడు. సగటు 37.7 కాగా స్ట్రైక్రేటు 139.13. రాహుల్ ఖాతాలో 22 టీ20 అర్ధ శతకాలు, రెండు సెంచరీలు ఉన్నాయి.చదవండి: అతడు భయపడుతున్నాడు.. జట్టు నుంచి తీసేయండి -
కోహ్లి రహస్య సంభాషణ బట్టబయలు!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కండరాల గాయంతో అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా గాయం నుంచి కోలుకున్న కోహ్లి ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్ ఆరంభించిన కోహ్లి తొలి వన్డేలో రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. తాజాగా కోహ్లికి సంబంధించి ఒక సీక్రెట్ సంభాషణను ఇంగ్లండ్ క్రికెటర్ జోర్డాన్ కాక్స్ లీక్ చేయడం వైరల్గా మారింది. కొన్ని రోజుల క్రితం ఇంగ్లండ్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్ కోహ్లితో జరిపిన పర్సనల్ సంభాషణకు సంబంధించిన ఫొటోలు తాజాగా బయటికి వచ్చాయి. దీనిపై జోర్డాన్ కాక్స్ స్పందించాడు. 'గత నెలలో కోహ్లిని లండన్లో కలిశాను. అయితే కోహ్లితో సమావేశాన్ని గోప్యంగా ఉంచాలని భావించాను. కానీ మేమిద్దరం మాట్లాడుకుంటున్న ఫొటోలు ఎవరో రహస్యంగా చిత్రీకరించారు. తాజాగా ఆ ఫొటోలు బయటికి లీకయ్యాయి. మేమిద్దరం మాట్లాడుకుంటున్న సమయంలో కొందరు మా పక్క నుంచి మాట్లాడుకుంటూ వెళ్లారు. నాకు తెలిసి వాళ్లలోనే ఎవరో ఒకరు మా ఫొటోలు తీసి సోషల్ మీడియలో షేర్ చేశారనిపించింది. నిజానికి కోహ్లి లండన్లో ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని అనుకున్నాడంట. కానీ ఇక్కడ కూడా తనకు పాపులారిటీ రావడంతో ఇకపై లండన్లో స్వేచ్ఛగా తిరిగే హక్కు కోల్పోతానేమో అని కోహ్లి నాతో చెప్పాడు. ఇక ఐపీఎల్ సమయంలో కోహ్లి నాకు అండగా నిలబడ్డాడు. కొంతమంది ఆటగాళ్లు తమ ఆటపై మాత్రమే దృష్టి పెడుతుంటారు. కానీ కోహ్లి మాత్రం తనతో పాటు ఉండే సహచరులకు సంబంధించి అన్ని విషయాలపై దృష్టి పెట్టడమే గాక అవసరమైతే సలహాలు కూడా ఇస్తుంటాడు. ఇదే అతడిని ప్రత్యేకంగా నిలిపింది' అని జోర్డాన్ కాక్స్ చెప్పుకొచ్చాడు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్కు, ఆ తర్వాత టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత కోహ్లి అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశం కూడా ఉంది. కోహ్లితో పాటు రోహిత్ శర్మ కూడా తన రిటైర్మెంట్పై ఒక నిర్ణయానికి వచ్చే చాన్స్ ఉంది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా.. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతోంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 3-0తో సిరీస్ గెలుచుకుంది. సిరీస్లో చివరి మ్యాచ్ నేడు సౌతాంప్టన్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి వైట్వాష్ గండం నుంచి తప్పించుకోవాలని టీమిండియా భావిస్తోంది.ఇక జూలై 14 నుంచి 19 మధ్య ఇంగ్లండ్, భారత్ మధ్య మూడు వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. వన్డేల్లో కోహ్లి ఇప్పటివరకు 311 వన్డేల్లో 14,797 పరుగులు సాధించాడు. ఇందులో 54 సెంచరీలు, 77 అర్ధసెంచరీలు ఉన్నాయి.చదవండి: ఇంగ్లండ్తో సిరీస్ ఓటమి.. తొలి దెబ్బ అతడికేనా? -
చెప్పి మరీ ఔట్ చేశాడు.. వైభవ్కు ఆర్చర్ స్ట్రోక్!
ఐపీఎల్ 2026 సీజన్లో తన బ్యాటింగ్తో అలరించిన వైభవ్ సూర్యవంశీ రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఇదే జట్టులో సహచరుడిగా ఉన్న జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ సమయంలో వైభవ్ను ఔట్ చేయడానికి మీ దగ్గర ఎలాంటి అస్త్రాలున్నాయని అడిగినప్పుడు, అదేంటనేది ఐపీఎల్ ముగిసిన తర్వాత మీకే తెలుస్తోందని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. తాజాగా ఇంగ్లండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో వైభవ్ సూర్యవంశీని జోఫ్రా ఆర్చర్ రెండుసార్లు ఔట్ చేయడం గమనార్హం. షార్ట్ పిచ్ బంతులు ఆడడంలో తన బలహీనతను బయటపెట్టుకున్న వైభవ్ ఆర్చర్కు దొరికిపోయాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ ఆర్చర్ షార్ట్ పిచ్ బంతులు ఆడలేక వికెట్ ఇచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్చర్ చెప్పి మరీ వైభవ్కు స్ట్రోక్ ఇచ్చారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఐపీఎల్లో ఇరగదీసిన వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గడ్డపై ఇబ్బంది పడడం వెనుక ప్రధాన కారణం ఇంగ్లండ్, ఇండియాలోని పిచ్ల మధ్య ఉన్న తేడానే. ఈ సిరీస్ లో ఇప్పటివరకు వైభవ్ సూర్యవంశీ ఆర్చర్ బౌలింగ్లో రెండు సార్లు ఔటయ్యాడు. ఈ రెండు సార్లు కూడా వైభవ్ బంతి ఎక్కువగా బౌన్స్ అవ్వడం వల్ల ఇబ్బంది పడ్డాడు. మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీ ఓ షార్ట్ బాల్కు తన బ్యాట్ తగిలి వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత నాలుగో టీ20లో బంతి మంచి లెంగ్త్లో రాగా.. వైభవ్ సూర్యవంశీ ఓ భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించి.. బ్యాట్ పైభాగానికి తగిలి 30 గజాల సర్కిల్ లోపల క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. Jofra Archer was asked about how to bowl against Vaibhav Suryavanshi & he said, I will tell you after the IPL as he knew India & England will play after IPL.& here, he got Vaibhav out in 2 consecutive games🔥🔥pic.twitter.com/O3aiDalTQh— Rajiv (@Rajiv1841) July 9, 2026 Does Jofra Archer really have the secret to stop Vaibhav Sooryavanshi? 🤔😅Scorecard ▶️ https://t.co/OBIYYIuhbt #TATAIPL | #Eliminator | #TheFinalLeap | #SRHvRR pic.twitter.com/MN65hq2gH9— IndianPremierLeague (@IPL) May 27, 2026Read: ఒళ్లు మండిన గాఫ్.. బదులు తీర్చుకుంటానని హెచ్చరిక! -
BCCI సంచలన నిర్ణయం? అప్పుడు గిల్.. ఇప్పుడు తిలక్
-
తీవ్ర అసంతృప్తిలో బీసీసీఐ!.. గంభీర్కు గండం!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో చాంపియన్గా నిలిచిన టీమిండియా.. మెగా ఈవెంట్ తర్వాత దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఈ ఐసీసీ టోర్నీ ముగిసిన తర్వాత భారత జట్టు తొలిసారిగా టీ20 సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లింది.అత్యంత చేదు అనుభవంవరల్డ్కప్లో జట్టును విజేతగా నిలిపిన సూర్యకుమార్ యాదవ్పై అనూహ్యంగా వేటు వేసిన యాజమాన్యం.. అతడి స్థానంలో ఈ టూర్ నుంచి శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించింది. అయితే, శ్రేయస్కు సారథిగా తొలి ప్రయత్నంలోనే అత్యంత చేదు అనుభవం ఎదురైంది.ఇంగ్లండ్ పర్యటనలోనూఐర్లాండ్ చేతిలో టీమిండియా 2-0తో క్లీన్స్వీప్ అయింది. ఐరిష్ జట్టు చేతిలో ఓటమి చెందడం.. సిరీస్ను భారత్ చేజార్చుకోవడం ఇదే తొలిసారి. ఇక ఇంగ్లండ్ పర్యటనలోనూ ఇదే తరహా ఫలితం పునరావృతమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్లలో టీమిండియా ఓటమి పాలైంది.తీవ్ర స్థాయిలో విమర్శలుఈ క్రమంలో ఇంగ్లండ్ 3-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో పాటు హెడ్కోచ్ గౌతం గంభీర్పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుదిజట్టు ఎంపికలో గంభీర్దే అంతిమ నిర్ణయం అని.. తరచూ మార్పులు చేస్తూ కెప్టెన్ను సైతం గందరగోళానికి గురిచేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.నిజానికి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కావడం గంభీర్కు ఇష్టం లేదని.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఒత్తిడితోనే అతడు ఇందుకు అంగీకరించాడనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో టీమిండియా వరుసగా రెండు టీ20 సిరీస్లు కోల్పోవడం సందేహాలకు తావిస్తోంది.తీవ్ర అసంతృప్తిలో బీసీసీఐ!ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సైతం వరుస ఓటములపై తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్ సేనతో పాటు.. గంభీర్ టీమ్పైనా బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.వేటు పడుతుందా?ఈ విషయాల గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ANIతో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా స్వదేశానికి తిరిగి రాగానే వరుస ఓటములపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. గంభీర్పై కూడా స్క్రుటినీ ఉంటుంది’’ అని తెలిపాయి. కాగా గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ సిబ్బందిలో ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్గా సితాన్షు కొటక్, బౌలింగ్ కోచ్గా మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్గా ర్యాన్ టెన్ డష్కాటే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ఉన్నారు.ఇక తాజా సిరీస్లలో టీమిండియా అన్ని విభాగాల్లోనూ విఫలం కావడంతో ఎవరిపైనైనా వేటు పడుతుందా? లేదంటే గంభీర్ చెప్పినట్లు సంధి దశ కాబట్టి పదవీకాలం పూర్తయ్యేంత వరకు వీరిని కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. కాగా గంభీర్ కాంట్రాక్టు 2027 వరకు ఉన్న సంగతి తెలిసిందే.గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా డిజాస్టర్లు ఇవే👉స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్లో 3-0తో వైట్వాష్👉పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (ఆస్ట్రేలియాతో)ని చేజార్చుకున్న భారత్👉పాతికేళ్ల తర్వాత తొలిసారి సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో 2-0తో వైట్వాష్ 👉అరంగేట్రం నుంచి మూడు సీజన్లలో డబ్ల్యూటీసీ ప్రపంచకప్ ఫైనల్కు చేరకపోవడం ఇదే తొలిసారి (2023-25)👉సొంతగడ్డపై న్యూజిలాండ్కు తొలిసారి వన్డే సిరీస్ను కోల్పోయిన భారత్👉ఐర్లాండ్కు తొలిసారి టీ20 సిరీస్ కోల్పోయిన భారత్👉ఇంగ్లండ్కు తొలిసారి టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా👉అంతర్జాతీయ టీ20లలో పరుగుల పరంగా టీమిండియాకు అతిపెద్ద ఓటమి (ఇంగ్లండ్తో రెండో టీ20లో 125 పరుగుల తేడాతో చిత్తు) etc.చదవండి: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్ -
‘శ్రేయస్ను నిందించొద్దు.. అదే అసలు సమస్య’
ఐర్లాండ్ గడ్డపై సిరీస్ ఓటమితో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై అదే దారుణ ఆటతీరును ప్రదర్శిస్తూ వస్తోంది. తొలి టీ20 వర్షార్పణం కాగా, ఆ తర్వాత జరిగిన మూడు టీ20ల్లోనూ పరాజయం చవిచూసిన టీమిండియా 0-3తో ఇంగ్లండ్కు సిరీస్ను కోల్పోయింది. కనీసం చివరి టీ20లోనైనా విజయం సాధించి గౌరవప్రదంగా సిరీస్ను ముగించాలని టీమిండియా భావిస్తోంది. ఇక కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు ఏదీ కలిసిరావడం లేదు. బ్యాటర్గా రాణిస్తున్నప్పటికీ కెప్టెన్గా వరుస ఓటములు అతడిని ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. అతడి కెప్టెన్సీలో టీమిండియా ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదింట ఓటమి (ఒక మ్యాచ్ రద్దు) పాలయ్యింది. దీంతో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా టీ20ల్లో ఇప్పటిదాకా గెలుపు రుచి చూడలేదు. అటు టీమిండియా కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఒక్క టీ20 మ్యాచ్ కూడా గెలవకపోవడం గమనార్హం. దీంతో అయ్యర్ కెప్టెన్సీపై అప్పుడే నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈసారి అయ్యర్తో పాటు కోచ్ గంభీర్పై కూడా కత్తి వేలాడుతోందనే వార్తలు వస్తున్నాయి. అదీగాక జింబాబ్వే టూర్తో పాటు ఆసియా గేమ్స్కు హెడ్కోచ్ గంభీర్కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ను టీమిండియా వెంట పంపించాలని బీసీసీఐ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా అసిస్టెంట్ కోచ్ రెయాన్ టెన్డెస్కటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్రిస్టల్ వేదికగా నాలుగో టీ20లో టీమిండియా ఓటమి పాలైన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో టెన్ డస్కటే మాట్లాడాడు. 'టీమిండియా టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఇప్పుడే బాధ్యతలు చేపట్టాడు. అతడి కెప్టెన్సీలో టీమిండియాకు వెంటనే విజయాలు రావాలంటే ఎలా? కాస్త ఓపిక పట్టాల్సిన అవసరం ఉంటుంది. మ్యాచ్ ఓటములకు శ్రేయస్ను నిందించడం ఆపండి. అతడు కెప్టెన్గా నిలుదొక్కుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఇప్పుడు వచ్చే ఓటములే తర్వాత గెలుపుకు బాటలు వేస్తాయి. నిజానికి శ్రేయస్ తన నాయకత్వాన్ని బాధ్యతగా నిర్వహిస్తున్నాడు. బ్యాటింగ్లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. కేవలం కొన్ని మ్యాచ్లకే అతడు కెప్టెన్గా వైఫల్యం చెందాడని పేర్కొనడం సరికాదు. అంతకముందు సూర్యకుమార్ కూడా ఆరంభంలో ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాడు. కానీ ఆ తర్వాత సూర్య కెప్టెన్సీలో టీమిండియా ఎలాంటి విజయాలు సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతకాలం ఒక కెప్టెన్సీలో ఆడి ఇప్పుడు మరో కొత్త కెప్టెన్తో ఆడుతుండడంతో జట్టులో సమతుల్యం లోపించింది. రాబోయే రోజుల్లో అది చక్కబడి మళ్లీ అంతా సవ్యంగా సాగుతుంది. ఇక జట్టులో పాండ్యా, బుమ్రా లోటు కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇక బ్యాటర్గా శ్రేయస్ అయ్యర్ బాగా రాణిస్తున్నాడు. నాలుగు ఇన్నింగ్స్లు కలిపి 190 పరుగులు సాధించడమే గాక కోహ్లీ రికార్డును కూడా సమం చేశాడు. టీమిండియా మ్యాచ్లు ఓడుతున్నప్పటికీ అయ్యర్ మాత్రం బ్యాటర్గా విఫలం కాలేదు' అని చెప్పుకొచ్చాడు. ఇక ఇంగ్లండ్, టీమిండియా మధ్య చివరి టీ20 మ్యాచ్ సౌతాంప్టన్ వేదికగా ఆడనున్నాయి. 🔴 STOP BLAMING SHREYAS IYER – COACH SAYS HE NEEDS TIME 🤯🎙️: Ryan ten Doeschate backed Shreyas, saying he deserves time as captain. He praised Iyer's leadership, accountability, and batting, urging everyone not to judge him after just a few matches.pic.twitter.com/tqNDEQAXEm— Sam (@cricsam02) July 10, 2026Read: అరుదైన ఫీట్తో ఫిఫా చరిత్రను తిరగరాసిన ఎంబాపె -
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ గడ్డపై గత రెండు టీ20 సిరీస్లను సొంతం చేసుకున్న టీమిండియా ఈసారి మాత్రం తేలిపోయింది. బ్రిస్టల్ వేదికగా గురువారం ఇంగ్లండ్ జట్టుతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో భారత్ ఇంగ్లండ్ చేతిలో ఏకంగా 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు 0–3తో కోల్పోయింది. సిరీస్లోని తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా... తర్వాతి మూడు మ్యాచ్ల్లో భారత జట్టుకు ఓటమి ఎదురైంది. దీంతో కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు తీవ్ర నిరాశే మిగిలింది.అయితే, ఇంగ్లండ్తో నాలుగో టీ20లో వ్యక్తిగతంగా మాత్రం శ్రేయస్ అయ్యర్ మంచి ప్రదర్శన కనబరిచాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 49 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు.డివిలియర్స్ ప్రపంచ రికార్డు బద్దలుఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్ గడ్డ మీద కెప్టెన్ హోదాలో ద్వైపాక్షిక టీ20 సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా చరిత్రకెక్కాడు.కాగా ఇంగ్లండ్తో సిరీస్లో భాగంగా తొలి టీ20లో శ్రేయస్ అయ్యర్ 47 బంతుల్లో 68 పరుగులు సాధించాడు. ఇక రెండో టీ20లో 37 పరుగులు చేసిన కెప్టెన్ సాబ్.. మూడో టీ20లో మాత్రం ఐదు పరుగులకే అవుటయ్యాడు. తాజాగా నాలుగో టీ20లో 80 పరుగులతో సత్తా చాటి.. ఇప్పటికి మొత్తంగా 190 పరుగులు పూర్తి చేసుకున్నాడు.ఇంగ్లండ్ గడ్డపై ద్వైపాక్షిక టీ20 సిరీస్లో కెప్టెన్ హోదాలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లు👉శ్రేయస్ అయ్యర్ (ఇండియా)- 2026లో నాలుగు మ్యాచ్లలో కలిపి 190 పరుగులు (రెండు అర్ధ శతకాలు)👉ఏబీ డివిలియర్స్ (సౌతాఫ్రికా)- 2017లో మూడు మ్యాచ్లలో కలిపి 146 పరుగులు (ఒక అర్ధ శతకం)👉ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)- 2020లో మూడు మ్యాచ్లలో కలిపి 125 పరుగులు👉జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 2024లో రెండు మ్యాచ్లలో కలిపి 123 పరుగులు (రెండు అర్థ శతకాలు)👉బాబర్ ఆజం (పాకిస్తాన్)- 2021లో మూడు మ్యాచ్లలో కలిపి 118 పరుగులు (ఒక అర్ధ శతకం)కోహ్లి రికార్డు సమంఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ గడ్డ మీద టీ20 సిరీస్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన భారత కెప్టెన్గానూ శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. అదే విధంగా ఇంగ్లండ్ జట్టుపై అత్యధిక వ్యక్తిగత టీ20 స్కోరు నమోదు చేసిన కెప్టెన్గా విరాట్ కోహ్లి (80 నాటౌట్) రికార్డును కూడా శ్రేయస్ సమం చేశాడు. కాగా ఐర్లాండ్ పర్యటనతో టీమిండియా టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం మిగిలింది. కనీవినీ ఎరుగని రీతిలో ఐరిష్ జట్టు చేతిలో టీమిండియా 2-0తో వైట్వాష్ అయింది. తాజాగా ఇంగ్లండ్కు సిరీస్ను చేజార్చుకుంది.చదవండి: ఆఖరి బంతికి సింగిల్... భారత్కు షాకిచ్చిన శ్రీలంక -
నేను బాగానే ఆడాను.. కానీ ఏం లాభం?: శ్రేయస్ అయ్యర్
టీమిండియా వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇంగ్లండ్తో నాలుగో టీ20లోనూ భారత జట్టు పరాజయం పాలైంది. ఆతిథ్య జట్టు చేతిలో తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 3-0తో సిరీస్ సొంతం చేసుకోగా.. టీమిండియా వరుసగా రెండో టీ20 సిరీస్ను చేజార్చుకుంది.ఓటమికి కారణం అదేఈ నేపథ్యంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టీమిండియా ఓటమిపై స్పందించాడు. ‘‘మరోసారి మాకు నిరాశే మిగిలింది. ఈ పిచ్పై 158 అనేది కచ్చితంగా కాపాడుకోగలిగే స్కోరైతే కాదు. అందుకు తగ్గట్లుగానే ఇంగ్లండ్ వేగంగానే ఈ లక్ష్యాన్ని ఛేదించింది.మిడిల్ స్టంప్, లెగ్ స్టంప్ మీదకు బంతులు వేయమని మా బౌలర్లకు చెప్పాను. అలా అయితే బ్యాటర్లు బౌండరీలు రాబట్టడం కష్టతరమవుతుంది. అయితే, మా ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యాము. ఎప్పుడైతే మా వ్యూహాన్ని కొద్దిగా మార్చామో ఆ సమయంలో వాళ్లు పరుగులు పిండుకున్నారు.నేను బాగానే ఆడాను.. కానీ ఏం లాభం?అయితే, నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల మాత్రం నేను సంతోషంగానే ఉన్నాను. కానీ గెలుపునకు నా ఇన్నింగ్స్ ఉపయోగపడలేదంటే దానికి ఎటువంటి అర్థం ఉండదు. నిజానికి నేను బాగా ఆడిన దాదాపు ప్రతిసారీ జట్టు గెలిచేది. కానీ దురదృష్టవశాత్తూ ఈసారి అలా జరగలేదు. తదుపరి మ్యాచ్లోనైనా ఆటంకాలు అధిగమించి అనుకున్న ఫలితం రాబట్టగలమనే అనుకుంటున్నాం.When the chips were down, the skipper stood tallest. 💙A magnificent innings from Shreyas Iyer. 🙌 Watch #ENGvIND LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork #MamlaPersonalHai #ExtraaaInnings pic.twitter.com/E5Lx13kGYs— Sony Sports Network (@SonySportsNetwk) July 9, 2026పొరపాట్లు సహజమేప్రస్తుతం జట్టు సంధి దశలో ఉంది. మా వల్ల చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. యువ క్రికెటర్లలో చాలా మంది తొలిసారి ఇలాంటి పిచ్లపై ఆడుతున్నారు. కాబట్టి తప్పులు సహజమే. అయితే, వీటి నుంచి ఎంత తొందరగా పాఠాలు నేర్చుకుంటామనేదే ముఖ్యం.బలంగా తిరిగి వస్తాముమా జట్టులో క్విక్ లెర్నర్స్ ఉన్నారు. కచ్చితంగా విదేశీ గడ్డ మీది పరిస్థితులను అర్థం చేసుకుని.. వికెట్ను సరిగ్గా అంచనా వేసి మరింత బలంగా తిరిగి వస్తారని నమ్ముతున్నా’’ అని శ్రేయస్ అయ్యర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా బ్రిస్టల్ వేదికగా గురువారం రాత్రి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.శ్రేయస్ మెరిసినా..నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన టీమిండియా 158 పరుగులకే పరిమితమైంది. శ్రేయస్ అయ్యర్ 49 బంతుల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలిన వారిలో శివం దూబే (22) మాత్రమే ఇరవై పరుగులు దాటాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 13.5 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ కోల్పోయి పని పూర్తి చేసింది.ఓపెనర్ ఫిల్ సాల్ట్ అజేయ అర్ధ శతకం (59*)తో రాణించగా.. హ్యారీ బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్ (35 బంతుల్లో 79 నాటౌట్)తో మెరిశాడు. ఇక ఇంగ్లండ్- భారత్ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. రెండు, మూడు.. తాజాగా నాలుగో టీ20లో గెలిచి ఆతిథ్య జట్టు 3-0తో సిరీస్ గెలుచుకుంది. కాగా అంతకుముందు టీమిండియా ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్వాష్కు గురైన సంగతి తెలిసిందే.చదవండి: వైభవ్ సూర్యవంశీ అట్టర్ఫ్లాఫ్ -
జట్టులో దండగ.. అతడినే టీమిండియా కెప్టెన్ని చేస్తారేమో!
విదేశీ పర్యటనలో టీమిండియా టీ20 వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. తొలుత ఐర్లాండ్ చేతిలో 2-0తో క్లీన్స్వీప్ అయిన భారత జట్టు.. ఇంగ్లండ్తో తొలి టీ20 వర్షం వల్ల రద్దు కావడంతో ఊపిరి పీల్చుకుంది. ఇక రెండు, మూడు మ్యాచ్లలో ఆతిథ్య ఇంగ్లండ్ గెలిచి 2-0తో ఆధిక్యంలో నిలిచింది.వైస్ కెప్టెన్గా తిలక్ వర్మఈ నేపథ్యంలో బ్రిస్టల్ వేదికగా గురువారం జరిగే నాలుగో టీ20లో టీమిండియా చావోరేవో తేల్చుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్ టూర్తో భారత టీ20 జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ పగ్గాలు చేపట్టగా.. తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా నియమితుడయ్యాడు.అయితే, ఈ ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేయడం లేదు. శ్రేయస్ బ్యాటర్గా ఫర్వాలేదనిపిస్తున్నా.. సారథిగా వరుస పరాజయాలతో చెత్త రికార్డులు మూటగట్టుకుంటున్నాడు. మరోవైపు.. తిలక్ వర్మ ఆటగాడిగా ఫెయిల్ అవుతూ ఒక రకంగా జట్టుకు భారమయ్యాడని పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.ముఖ్యంగా ఇంగ్లండ్తో మూడో టీ20లో తిలక్ రెగ్యులర్గా వచ్చే ఐదో స్థానంలో కాకుండా.. ఆరో నంబర్లో బ్యాటింగ్కు చేయడం ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తిలక్ వర్మపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు. సంజూ శాంసన్ పేరును ప్రస్తావిస్తూ తిలక్ వర్మ స్థానాన్ని ప్రశ్నించాడు.అతడిని కెప్టెన్ను కూడా చేస్తారేమోఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘తిలక్ ఇప్పటికే వైస్ కెప్టెన్గా ఉన్నాడు. పరిస్థితి చూస్తుంటే త్వరలోనే అతడిని కెప్టెన్ను కూడా చేస్తారేమో అనిపిస్తోంది. కాబట్టి జట్టులో తన స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని అతడు భావిస్తున్నాడేమో!..ఏదేమైనా ఇంగ్లండ్తో మ్యాచ్లో అతడు పేస్, బౌన్స్ను ఎదుర్కొనే ధైర్యం లేక కాస్త ఆలస్యంగా బ్యాటింగ్కు వెళ్లినట్లు అనిపిస్తోంది. క్రీజులోకి వెళ్లాక కూడా.. దూకుడుగా ఆడలేక అతడు బిక్కమొఖం వేశాడు.బలహీనత మీకు తెలుసుతిలక్ వర్మ ప్రధాన బ్యాటర్గా భావించే అతడిని వైస్ కెప్టెన్ని చేశారు కదా!.. అయినా సరే ఫాస్ట్ బౌలింగ్ను ఎదుర్కోకుండా మీరే (యాజమాన్యం) అతడిని కాపాడుతున్నారు. అతడి బలహీనత మీకు తెలుసు కాబట్టే ఇలా చేస్తున్నారు.అందుకే తిలక్కు బదులు అక్షర్ను ముందుగా పంపి బలిచేశారు. షార్ట్ పిచ్ బంతులను తిలక్ ఎదుర్కోలేడని మీకు ముందుగానే తెలుసు. అందుకే అతడి బలహీనతను కప్పిపుచ్చేందుకు అక్షర్ను ముందుకు తోశారు. ఆడలేక ఇబ్బంది పడుతున్నపుడు అతడిని జట్టు నుంచి తప్పించాలి. నేను పదే పదే ఈ మాట చెబుతున్నాను. తిలక్ వర్మకు బదులు సంజూ శాంసన్ను ఆడిస్తే బాగుంటుంది. కానీ యాజమాన్యం మాత్రం తిలక్ను తప్పించడం లేదు’’ అని క్రిస్ శ్రీకాంత్ చురకలు అంటించాడు. కాగా ఇంగ్లండ్తో తొలి టీ20లో 13 పరుగులు చేసిన తిలక్ వర్మ.. రెండో మ్యాచ్లో 24*, మూడో టీ20లో 3 పరుగులు చేసి నిష్క్రమించాడు.చదవండి: తుదిజట్టులోకి సంజూ.. కానీ ఓ కండిషన్! -
IND vs ENG: తుదిజట్టులోకి సంజూ.. కానీ ఓ కండిషన్!
ఇంగ్లండ్తో నాలుగో టీ20 రూపంలో టీమిండియా కఠిన సవాలు ముంగిట నిలిచింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే శ్రేయస్ అయ్యర్ సేన పోటీలో ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం.. ఐదు మ్యాచ్ల సిరీస్ను ఆతిథ్య ఇంగ్లండ్ 3-0తో సొంతం చేసుకుంటుంది.లెఫ్టాండర్లు ఎక్కువయ్యారుఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి మరోసారి చర్చ మొదలైంది. సంజూ శాంసన్ తిరిగి ఆడించాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్ల సంఖ్య ఎక్కువైందని.. ఇది కూడా ఓ సమస్యగా పరిణమించిందని అభిప్రాయపడుతున్నారు.సంజూను కాదని వైభవ్కు అవకాశంకాగా ఐర్లాండ్తో రెండు టీ20లు, ఇంగ్లండ్తో తొలి మ్యాచ్లో సంజూ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ మూడు మ్యాచ్లలో అతడు చేసిన పరుగులు వరుసగా 5, 0, 1. ఈ నేపథ్యంలో సంజూను తప్పించి.. అతడి స్థానంలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని ఓపెనర్గా బరిలోకి దించింది యాజమాన్యం.రెండు మ్యాచ్లలోనూ విఫలంఇంగ్లండ్తో రెండో టీ20 సందర్భంగా అరంగేట్రం చేసిన వైభవ్.. ఇప్పటికి రెండు మ్యాచ్లలో వరుసగా 14, 13 పరుగులు చేశాడు. ఇక వైభవ్ రాకతో టాపార్డర్ మొత్తం లెఫ్లాండర్లతో నిండిపోయింది. ఈ పదిహేనేళ్ల పిల్లాడితో పాటు అభిషేక్ శర్మ, వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా లెఫ్లాండరే.అదే విధంగా.. తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివం దూబే, అర్ష్దీప్ సింగ్ కూడా ఎడమచేతి వాటం గల ఆటగాళ్లే. ఈ నేపథ్యంలో కుడిచేతి వాటం గల సంజూ అవసరం ఎంతగానో ఉందంటూ పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.సంజూను ఆడించాల్సిందేఓపెనర్గా కాకపోయినా.. మిడిల్ ఆర్డర్లోనైనా సంజూను ఆడించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ అభిషేక్ నాయర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. టాపార్డర్లో ఆడిస్తే మాత్రమే సంజూకు తిరిగి తుదిజట్టులో చోటు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.అలా అయితేనే తుదిజట్టులోకి తీసుకోండి‘‘ఒకవేళ నిజంగా సంజూను తిరిగి తుదిజట్టులోకి తీసుకోవాలనే ఆలోచన ఉంటే.. అతడు ఏ స్థానంలోనైతే సక్సెస్ అయ్యాడో ఆ స్థానంలోనే ఆడించాలి. అంతేగానీ సంజూను మళ్లీ తీసుకువచ్చి.. నాలుగు, ఐదు లేదంటే ఆరో స్థానంలో ఆడిస్తామంటే ఫలితం ఉండదు.లేదంటే ఆడించకపోవడమే మంచిదిఅతడు మళ్లీ ఇబ్బంది పడతాడు. నిజానికి సంజూ టాప్-3లో మాత్రమే విజయవంతంగా బ్యాటింగ్ చేయగలడు. ఒకవేళ అతడి పట్ల నిజంగానే మీకు నమ్మకం ఉంటే.. టాపార్డర్లో ఆడించండి. లేదంటే అసలు ఆడించకపోవడమే మంచిది’’ అని అభిషేక్ నాయర్ కుండబద్దలు కొట్టినట్లుగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.ఓపెనర్గా ఇలా..కాగా సంజూ ఇప్పటికి టీమిండియా టాప్-3 బ్యాటర్గా 36 ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 1023 పరుగులు సాధించాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఓపెనర్గా నాకౌట్ మ్యాచ్లలో ఏకంగా 97*, 89, 89 పరుగులు సాధించి.. జట్టు చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మొత్తంగా టాప్-3లో 36 ఇన్నింగ్స్లో ఆడి ఏకంగా 171కి పైగా స్ట్రైక్రేటుతో సంజూ పరుగులు రాబట్టడం విశేషం.మిడిలార్డర్లో అలామరోవైపు.. టాప్-3 బ్యాటర్గా కాకుండా మిడిలార్డర్లో వచ్చి సంజూ 21 ఇన్నింగ్స్లో కేవలం 382 పరుగులే చేశాడు. స్ట్రైక్రేటు 124. ఈ నేపథ్యంలోనే అభిషేక్ నాయర్ సంజూను ఓపెనర్గా మాత్రమే పంపాలని నొక్కివక్కాణించడం గమనార్హం. కాగా టీ20 సిరీస్లో ఐర్లాండ్ చేతిలో 2-0 వైట్వాష్ అయింది టీమిండియా. అనంతరం ఇంగ్లండ్తో తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. రెండు, మూడు మ్యాచ్లలో ఆతిథ్య జట్టు గెలిచింది. తద్వారా 2-0తో ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉండగా.. బ్రిస్టల్ వేదికగా నాలుగో టీ20లో తప్పక గెలవాల్సిన స్థితిలో టీమిండియా నిలిచింది. చదవండి: అందుకే వైభవ్ను ఆడిస్తున్నాం: గంభీర్ -
ముందుగా రాకుండా దాక్కున్నాడు: మొయిన్ అలీ ఫైర్
టీమిండియా ఆట తీరుపై ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ మొయిన్ అలీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఓపెనర్లను తప్పుపట్టాల్సిన పని లేదని.. సమస్యంతా లోయర్ ఆర్డర్లోనే ఉందన్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్తో మూడో టీ20లో శివం దూబే ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు రావడం వారి వ్యూహాత్మక తప్పిదాలకు నిదర్శనమని విమర్శించాడు.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా... తొలి టీ20 వర్షార్పణమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాంచెస్టర్ వేదికగా రెండో మ్యాచ్లో ఓడిపోయిన టీమిండియా.. తాజాగా మూడో టీ20లోనూ పరాజయం పాలైంది. నాటింగ్హామ్లో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఆతిథ్య జట్టు చేతిలో భారత్ ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది.ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు భారత బ్యాటర్లు పెవిలియన్కు వరుస కట్టారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ (10), వైభవ్ సూర్యవంశీ (13), వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (13) పూర్తిగా తేలిపోయారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (5) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు.ఇక ఐదో స్థానంలో రావాల్సిన తిలక్ వర్మ (3) ఆరో స్థానంలో రాగా.. అక్షర్ పటేల్ (10) ఐదో నంబర్లో బ్యాటింగ్ చేశాడు. మరోవైపు.. హర్షిత్ రాణా (9) ఏడో స్థానానికి ప్రమోట్ అయి విఫలం కాగా.. ఎనిమిదో స్థానంలో వచ్చి శివం దూబే (2) ఫెయిల్ అయ్యాడు.ఫలితంగా 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 11.4 ఓవర్లలోనే కేవలం 76 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మొయిన్ అలీ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.‘‘భారత బ్యాటింగ్ ఆర్డర్లోనే సమస్య ఉంది. అక్షర్ పటేల్ మరీ ముందుగా వచ్చాడు. తిలక్ వర్మ లేటయ్యాడు. ఇక శివం.. అతడు కేవలం స్పిన్నర్ల బౌలింగ్లోనే ఆడతాడు. అందుకే ముందుగా బ్యాటింగ్కు రాకుండా దాక్కుండిపోయాడు.నిజానికి జట్టు కోసం అతడు అన్నీ చేయాలి. కానీ స్పిన్నర్ల బౌలింగ్లో మాత్రమే ఆడితే ఎలా?.. టీమిండియా ఓపెనర్లను తప్పుపట్టాల్సిన పనిలేదు. నిజానికి వాళ్లిద్దరు ఆడతున్న తీరు నాకు ముచ్చటగొలుపుతుంది.ఒకవేళ అభిషేక్ ఆరు ఓవర్లు ఆడాడంటే.. అతడు అర్ధ శతకానికి చేరువకావడం ఖాయం. ఇక వైభవ్ సూర్యవంశీ గురించి మనకు తెలిసిందే. అతడు ఫిఫ్టీ పూర్తి చేసుకున్నా ఆశ్చర్యం లేదు’’ అని మొయిన్ అలీ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా వైభవ్ సూర్యవంశీకి మరిన్ని అవకాశాలు వస్తాయని.. అప్పుడు కూడా విఫలమైతే మాత్రం పరిస్థితి చేజారిపోతుందని అభిప్రాయపడ్డాడు. -
టీమిండియాకు ఆర్చర్ చురకలు.. ‘వైభవ్కు ఇదే నా సవాల్’
ఇంగ్లండ్ గడ్డపై తేలిపోతున్న టీమిండియాకు స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ చురకలు అంటించాడు. ఇంగ్లండ్ గడ్డపై ఆడడమంటే ఐపీఎల్లో ఆడినంత తేలిక కాదని, ఇక్కడి పిచ్లు బౌలర్లకు అనుకూలంగా ఉంటాయని, గుడ్లెంగ్త్తో బంతులు విసిరితేనే ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నాడు. టీమిండియాకు చురకలు అంటించడంతో పాటు వైభవ్ సూర్యవంశీకి కూడా ఓపెన్ చాలెంజ్ విసిరడం ఆసక్తిగా మారింది. మూడో టీ20లో ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన ఆర్చర్ మాట్లాడుతూ.. ‘ఇంగ్లండ్ గడ్డపై పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఐపీఎల్లో బౌలర్లకు కఠినంగా ఉంటుంది. బ్యాటర్లకు అనుకూలంగా అక్కడి మైదానాల్లోని బౌండరీలను తక్కువ దూరంలోనే ఉంటాయి. కానీ ఇంగ్లండ్లో పరిస్థితులు అలా ఉండవు. గుడ్ లైన్ అండ్ లెంగ్త్తో బంతులు విసిరితేనే ఇక్కడ వికెట్లు లభిస్తాయి. ఇక్కడి మైదానాల్లో బౌండరీల దూరం తక్కువ ఉన్నప్పటికీ బంతి వికెట్ల మీదకు వస్తుంది కాబట్టే ఆడడం కాస్త కష్టతరంగా ఉంటుంది. ఐపీఎల్లో 200 స్కోరు చేసినా కూడా ఓడిన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. కానీ ఇంగ్లీష్ పిచ్లపై 200 స్కోరు అంటే ఆషామాషీ కాదు. జాగ్రత్తగా ఆడకపోతే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి.’ అని చెప్పుకొచ్చాడు. అయితే వైభవ్ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఆర్చర్ బౌలింగ్లో సిక్సర్లు కొట్టడంపై ఆర్చర్ను ప్రశ్నించగా.. ‘రాబోయే మ్యాచ్ల్లో అతడిని ఎదుర్కొనే సమయంలో స్పష్టమైన ప్రణాళిక వేసుకున్నా. వైభవ్కు ఇదే నా సవాల్ (నవ్వుతూ)* అని ఆర్చర్ తెలిపాడు. మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ 125 పరుగుల తేడాతో టీమిండియాపై భారీ విజయాన్ని సాధించింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పూర్తి ఓవర్లు ఆడకుండానే 11.4 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. ఆర్చర్ 29 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా, జోష్ టంగ్ 28 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (70), సామ్ కరన్ (44 నాటౌట్) రాణించారు. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇంగ్లండ్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 గురువారం రాత్రి 10 గంటలకు బ్రిస్టల్ వేదికగా జరగనుంది.Read: IND vs ENG: సూర్యకుమార్ గుర్తొస్తున్నాడు -
IND vs ENG: హర్షిత్ రాణాపై ప్రశంసలు
టీమిండియా యువ ఆటగాడు హర్షిత్ రాణాపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. అవకాశం వచ్చిన ప్రతిసారీ అతడు గొప్పగా ఆడుతున్నాడని కొనియాడాడు. ఈ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్.. ఇటు బంతితోనూ.. అటు బ్యాట్తోనూ రాణిస్తున్నాడని ప్రశంసించాడు.గంభీర్కు ప్రియశిష్యుడిగా పేరుఅయినప్పటికీ హర్షిత్ రాణాపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోందని ఆకాశ్ చోప్రా ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్కు ప్రియశిష్యుడిగా హర్షిత్ రాణాకు పేరు. గంభీర్ అండతోనే అతడు అరంగేట్రం చేయగలిగాడని.. అర్హులను కాదని మరీ హర్షిత్కు పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు చాన్నాళ్లుగా కొనసాగుతున్నాయి.ఇక తాజాగా ఇంగ్లండ్తో మూడో టీ20 సందర్భంగా బ్యాటింగ్ ఆర్డర్లో ఏడో స్థానంలో శివం దూబేను కాదని.. హర్షిత్ను పంపించారు. అతడు 13 బంతుల్లో 9 పరుగులు చేసి నిష్క్రమించాడు. మరోవైపు.. దూబే 2 పరుగులకే అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో హర్షిత్ను ముందుగా ఎందుకు పంపించారనే ప్రశ్నలు వచ్చాయి.అవకాశం వచ్చిన ప్రతిసారీఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘హర్షిత్ రాణా గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. అతడిని మనందరం చాలాసార్లు చాలా రకాలుగా ట్రోల్ చేశాము. కానీ అతడు మాత్రం అవకాశం వచ్చిన ప్రతిసారీ జట్టు కోసం ఎంతగానో కృషి చేస్తున్నాడు.క్లిష్ట పరిస్థితుల్లో బంతిని అతడి చేతికిచ్చినా మెరుగ్గానే రాణిస్తున్నాడు. బ్యాట్తోనూ అదరగొడుతున్నాడు. అయితే, కొన్నిసార్లు విఫలం కావడం సహజం. ఏదేమైనా నిందలు, తిట్లకు హర్షిత్ అర్హుడు కాదు.నిజానికి ఐర్లాండ్తో రెండో టీ20లో దాదాపు అతడు జట్టును గెలిపించినంత పని చేశాడు. పది బంతుల్లో 21 పరుగులు చేశాడు (ఈ మ్యాచ్లో టీమిండియా ఒకే ఒక్క పరుగుతో ఓడి వైట్వాష్ అయింది). హర్షిత్ రాణా కొత్త, పాత బంతితో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. లోయర్ ఆర్డర్ నుంచి కాస్త టాప్నకు ప్రమోట్ చేసినా బ్యాట్తో రాణించగలడు.సెలక్షన్లో అతడి తప్పేమీ లేదే!తుదిజట్టుకు ఎంపిక కావడం అతడి తప్పేమీ కాదే. అతడిని తరచూ విమర్శించే వారు బాగా ఆడినప్పుడు ఎందుకు ప్రశంసించడం లేదు. అనవసరంగా ట్రోల్ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు’’ అని ఆకాశ్ చోప్రా ట్రోలర్స్కు చురకలు అంటించాడు. కాగా ఇంగ్లండ్తో మూడో టీ20లో టీమిండియా 125 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్లో హర్షిత్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చదవండి: అందుకే వైభవ్ను ఆడిస్తున్నాం: గంభీర్ -
తిలక్ వర్మపై అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు మరో పరాజయం ఎదురైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన మూడో టీ20లో శ్రేయస్ అయ్యర్ సేన 125 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఫలితంగా సిరీస్లో 0–2తో వెనుకబడింది. నాటింగ్హామ్ వేదికగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.ఓపెనర్ ఫిల్ సాల్ట్ (44 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధశతకంతో అదరగొట్టగా... జోస్ బట్లర్ (21 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్లు), సామ్ కరన్ (24 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు) వేగంగా ఆడారు. టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బ్యాట్లెత్తేశారుఅనంతరం భారీ లక్ష్యఛేదనలో టీమిండియా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. మరీ దారుణంగా 11.4 ఓవర్లలో 76 పరుగులకే ఆలౌటైంది. టాపార్డర్లో పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ (5 బంతుల్లో 13; 2 సిక్స్లు), అభిషేక్ శర్మ (10; 1 సిక్స్), ఇషాన్ కిషన్ (13; 1 ఫోర్, 1 సిక్స్) పూర్తిగా విఫలమయ్యారు. ఇక సారథి శ్రేయస్ అయ్యర్ (5), అక్షర్ పటేల్ (10), తిలక్ వర్మ (3), హర్షిత్ రాణా (9), శివమ్ దూబే (2) కూడా బ్యాట్లెత్తేశారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి మనవాళ్లు పెవలియన్కు వరుస కట్టారు.దారుణ వైఫల్యంకనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా క్రీజులో నిలిచే ప్రయత్నం చేయకుండా... షాట్లు ఆడేందుకు ప్రయత్నించి వికెట్లు సమర్పించుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 4 వికెట్లు పడగొట్టగా... జోఫ్రా ఆర్చర్కు మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లతో పాటు యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి చెత్త ప్రదర్శన మునుపెన్నడూ చూడలేదని.. తుదిజట్టులో తరచూ మార్పులే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తన అభిప్రాయాలు పంచుకున్నాడు. జియోహాట్స్టార్ షోలో మాట్లాడుతూ.. నాలుగో టీ20లో మాత్రం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్లో ఎలాంటి మార్పులు చేయవద్దని సూచించాడు. ముఖ్యంగా మూడు మ్యాచ్లలో విఫలమైనప్పటికీ తిలక్ వర్మను కొనసాగించాలని కుంబ్లే అభిప్రాయపడ్డాడు.తుదిజట్టులో మార్పులు వద్దు‘‘తుదిజట్టులో ఎలాంటి మార్పులు అవసరం లేదని నేను భావిస్తున్నాను. అలా చేస్తేనే జట్టులో ఆత్మవిశ్వాసం పెంపొందించగలరు. ఇక తిలక్ వర్మ.. అతడు ఇప్పుడు వైస్ కెప్టెన్. అతడికి ఓ బాధ్యత అప్పగించారు. కాబట్టి అతడికి మరొక్క అవకాశం ఇవ్వాల్సిందేనని నా భావన.బౌలర్లు మారాలిమన బౌలర్లు కూడా తమ ఆట తీరును మార్చుకోవాల్సి ఉంది. మనోళ్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న చోట.. ప్రత్యర్థి జట్టు మాత్రం 76 పరుగులకే మనోళ్లను ఆలౌట్ చేసింది. ఇక్కడే తేడా స్పష్టంగా తెలుస్తోంది. మన ప్రణాళికలు, వ్యూహాలు పరిస్థితులకు తగ్గట్లుగా మార్చుకోవాలి’’ అని అనిల్ కుంబ్లే హితవు పలికాడు.కాగా ఇంగ్లండ్తో తొలి టీ20లో 13 పరుగులు చేసిన తిలక్ వర్మ.. రెండో టీ20లో 24 (నాటౌట్) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, మంగళవారం నాటి మూడో మ్యాచ్లో మాత్రం 11 బంతులు ఎదుర్కొని మూడు పరుగులకే నిష్క్రమించాడు.ఇదిలా ఉంటే.. తొలి టీ20లో ఆడిన సంజూ శాంసన్పై వేటు వేసిన యాజమాన్యం.. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీని కొనసాగిస్తోంది. ఇక రెండో టీ20లో దారుణంగా విఫలమైన రవి బిష్ణోయిని తప్పించి.. అతడి స్థానంలో మూడో టీ20లో ప్రిన్స్ యాదవ్ను ఆడించారు. ఇరుజట్ల మధ్య గురువారం జరిగే నాలుగో టీ20కి బ్రిస్టల్ వేదిక.ఇంగ్లండ్తో మూడో టీ20 ఆడిన భారత తుదిజట్టుఅభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అక్షర్ పటేల్, తిలక్ వర్మ, హర్షిత్ రాణా, శివం దూబే, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్. చదవండి: అందుకే వైభవ్ను ఆడిస్తున్నాం: కుండబద్దలు కొట్టిన గంభీర్ -
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
టీమిండియా ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఐర్లాండ్తో టీ20 సిరీస్లో 2-0తో క్లీన్స్వీప్ అయిన భారత జట్టు.. ఇంగ్లండ్తో సిరీస్లోనూ చెత్త ప్రదర్శన కొనసాగిస్తోంది. నాటింగ్హామ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో శ్రేయస్ సేన ఇంగ్లండ్ చేతిలో మట్టికరిచింది.ఇంగ్లండ్ భారీ స్కోరుఆతిథ్య ఇంగ్లండ్ టీమిండియాను ఏకంగా 125 పరుగుల తేడాతో చిత్తు చేసి ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. కాగా ట్రెంట్బ్రిడ్జ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది.చతికిల పడ్డ టీమిండియాఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 11.4 ఓవర్లలో కేవలం 76 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టాపార్డర్ రెండంకెల స్కోరు చేయగా.. లోయర్ ఆర్డర్ సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (13), వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (13) పరుగులతో టాప్ రన్ స్కోరర్లుగా నిలిచారు.ఇక ఈ మ్యాచ్లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఏడు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ సాయంతో 10 పరుగులు చేసి నిష్క్రమించాడు. జోష్ టంగ్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అయితే, ఇంతటి ఫ్లాప్ షోలోనూ అభిషేక్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ జట్టుపై టీ20 ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్గా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ చరిత్రకెక్కాడు.ఇంగ్లండ్పై టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్లు🏏అభిషేక్ శర్మ- 28🏏హార్దిక్ పాండ్యా- 27🏏విరాట్ కోహ్లి- 19🏏రోహిత్ శర్మ- 18🏏సూర్యకుమార్ యాదవ్ -18.మూడో టీ20 సందర్భంగా టీమిండియా నమోదు చేసిన చెత్త రికార్డులు ఇవే👉అంతర్జాతీయ టీ20లలో పరుగుల పరంగా టీమిండియాకు ఇదే అతిపెద్ద ఓటమి. (125 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో చిత్తు)👉ఇంగ్లండ్లో టీ20 మ్యాచ్లో అతి తక్కువ స్కోరుకే ఆలౌట్ అయిన జట్టుగా టీమిండియా (76/10).👉ఐదు టీ20 మ్యాచ్లలో విజయమన్నదే లేకుండా టీమిండియా పరాజయాల పరంపర కొనసాగించడం ఇదే తొలిసారి. ఐర్లాండ్ చేతిలో రెండు, ఇంగ్లండ్ చేతిలో రెండు మ్యాచ్లు ఓడిన టీమిండియా. ఇక వర్షం వల్ల ఇంగ్లండ్తో తొలి టీ20 రద్దు కాగా.. మొత్తంగా వరుసగా ఐదు మ్యాచ్లలో టీమిండియాకు గెలుపున్నదే లేకుండా పోయింది.👉టీ20 మ్యాచ్లో 11.4 (అతి తక్కువ) ఓవర్లలో టీమిండియా ఆలౌట్ కావడం ఇదే మొదటిసారి. చదవండి: అందుకే వైభవ్ను ఆడిస్తున్నాం: కుండబద్దలు కొట్టిన గంభీర్ -
అందుకే వైభవ్ను ఆడిస్తున్నాం: కుండబద్దలు కొట్టిన గంభీర్
విదేశీ గడ్డ మీద భారత టీ20 జట్టు వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. తొలుత ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్వాష్ అయిన టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనలోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. తాజాగా మూడో టీ20లో మరీ ఘోరంగా ఆతిథ్య జట్టు చేతిలో ఏకంగా 125 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 2-0తో ముందంజ వేయగా.. మిగిలిన రెండు మ్యాచ్లలో తప్పక గెలవాల్సిన స్థితిలో టీమిండియా నిలిచింది. ఈ నేపథ్యంలో యాజమాన్యం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సంజూ గురించి నాకు క్లారిటీ ఉందిముఖ్యంగా సంజూ శాంసన్ను తప్పించి.. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీని ఓపెనర్గా ఆడించడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. వరల్డ్కప్ హీరోనే పక్కనపెట్టడానికి గల కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.ఈ విషయంపై హెడ్కోచ్ గౌతం గంభీర్ తాజాగా స్పందించాడు. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముందుగా సంజూ గురించి స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. హెడ్కోచ్, ఆటగాడి మధ్య జరిగిన సంభాషణ గురించి బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎప్పటికీ బయటకు రాదు.సంజూ విషయంలో మాకు పూర్తి స్పష్టత ఉంది. అతడు టీమిండియా కోసం ఏం చేశాడో మాకు తెలుసు. అయితే, కొన్నిసార్లు ఫామ్ విషయంలో ఏ ఆటగాడికైనా ఇబ్బందులు తప్పవు. దానర్థం అతడు ఇక జట్టులోకి తిరిగి రాడని కాదు’’ అని గంభీర్ పేర్కొన్నాడు.కుండబద్దలు కొట్టిన గంభీర్ఇక వైభవ్ సూర్యవంశీ గురించి ప్రస్తావన రాగా.. ‘‘అంతర్జాతీయ క్రికెట్లో ఫలితాలు అత్యంత ముఖ్యమైనవి. అనుకున్న ఫలితం రాబట్టడం కోసమే అత్యుత్తమ తుదిజట్టును ఎంపిక చేసుకుంటాము. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని నేను భావిస్తాను’’ అని గంభీర్ సమర్థించుకున్నాడు. కొత్త కాంబినేషన్లు ప్రయత్నిస్తున్నామని.. అందుకే వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు అవకాశం ఇస్తు న్నామంటూ కుండబద్దలు కొట్టాడు.అందుకే ఓడిపోతున్నాంఇక విదేశీ గడ్డ మీద పిచ్లకు తాము ఇంకా పూర్తిగా అలవాటు పడలేదని.. అందుకే వరుసగా మ్యాచ్లు ఓడిపోతున్నామని గంభీర్ జట్టు ఆట తీరును తప్పుబట్టాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్లలో కలిపి వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోవడాన్ని బట్టే తమ ఆట తీరు ఎలా ఉందో తెలుస్తోందన్నాడు. కాగా ఇంగ్లండ్- భారత్ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 2-0తో ఆధిక్యంలో ఉండగా.. ఇరుజట్ల మధ్య గురువారం నాలుగో టీ20 జరుగనుంది. ఇందుకు బ్రిస్టల్ వేదిక. చదవండి: టీమిండియా ఆట తీరుపై శ్రేయస్ అయ్యర్ ఆగ్రహం -
చెలరేగిన సాల్ట్, సామ్ కరన్.. టీమిండియా టార్గెట్ 202 రన్స్
ట్రెంట్బ్రిడ్జి వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (44 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్తో మెరిశాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (21 బంతుల్లో 36) పర్వాలేదనిపించాడు. ఈ ఇద్దరు తొలి వికెట్కు 43 పరుగులో జోడించారు. ఆ తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఇంగ్లండ్ స్కోరు మందగించింది. ఒక దశలో 160 నుంచి 170 పరుగులకు పరిమితమవుతుందనుకున్న ఇంగ్లండ్.. చివర్లో సామ్ కరన్ (24 బంతుల్లో 41 నాటౌట్), విల్ జాక్స్ (7 బంతుల్లో 14) మెరుపులతో 200 పరుగుల మార్క్ను దాటింది. భారత బౌలర్లలో హర్షిత్ రానా, ప్రిన్స్ యాదవ్ చెరో 2 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు. -
టాస్ గెలిచిన టీమిండియా.. శ్రేయస్ అరుదైన ఫీట్
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండో టీ20లో ఓటమి పాలైన భారత్ ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేయాలని భావిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం విజయం సాధించి ఆధిక్యంలో నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్కు టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. రవి బిష్ణోయి స్థానంలో ప్రిన్స్ యాదవ్ తుదిజట్టులోకి రాగా.. ఇంగ్లండ్ జట్టు ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా, రెండో టీ20లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో భారత్పై విజయాన్ని అందుకుంది.అయితే మ్యాచ్ ఆరంభానికి ముందే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఫీట్ సాధించాడు. భారత టీ20 కెప్టెన్గా అయ్యర్ టాస్ గెలవడం ఇది ఐదోసారి. ఈ నేపథ్యంలో అంతర్ర్జాతీయ టీ20 క్రికెట్లో టీమిండియా కెప్టెన్లలో అత్యధికసార్లు టాస్ నెగ్గిన జాబితాలో శ్రేయస్ అయ్యర్ రోహిత్ శర్మ, ధోనిలతో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరికంటే ముందు ఎంఎస్ ధోని ఏడుసార్లు (మే 2010 నుంచి ఫిబ్రవరి 2012 వరకు), విరాట్ కోహ్లి ఆరుసార్లు (ఆగస్టు 2019 నుంచి డిసెంబర్ 2019 వరకు), తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్భారత్: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి🚨 Toss 🚨#TeamIndia have won the toss and elected to bowl first at Trent Bridge.Updates ▶️ https://t.co/jan4S8zsaV#ENGvIND pic.twitter.com/ptcxBFxRP5— BCCI (@BCCI) July 7, 2026చదవండి: సెమీస్కు దూసుకెళ్లిన గాఫ్.. పిన్న వయస్కురాలిగా చరిత్ర -
జట్టు ఎంపికలో శ్రేయస్ మార్క్.. ఆర్సీబీ ఏం పాపం చేసింది?
జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్కు బీసీసీఐ సోమవారం భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. జింబాబ్వేతో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో ఐపీఎల్లో రాణించిన ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యత కల్పించారు. ఈ సిరీస్ కోసం రెగ్యులర్ జట్టును కాకుండా రెండో జట్టును అక్కడికి పంపుతున్న నేపథ్యంలో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ సిరీస్కు సంబంధించి టీమిండియా ఎంపికలో ప్రస్తుత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. జింబాబ్వే సిరీస్కు ఎంపికైన ఆటగాళ్లలో శ్రేయస్ సహా నలుగురు ఆటగాళ్లు పంజాబ్ కింగ్స్ జట్టుకు చెందినవారే కావడం విశేషం. కెప్టెన్ శ్రేయస్తో పాటు సూర్యాన్ష్ షెడ్గే, ప్రబ్సిమ్రన్ సింగ్, యష్ ఠాకూర్లు ఎంపికయ్యారు. వీరంతా ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించారు. మిగిలిన ఆటగాళ్ల విషయానికొస్తే ఎస్ఆర్హెచ్కు ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు (అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హర్ష్ దూబే), కేకేఆర్ నుంచి వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్ ఉన్నారు. ఇక లక్నో సూపర్జెయింట్స్ నుంచి మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్లు ఉండగా, సీఎస్కే నుంచి శివమ్ దూబే, రాజస్తాన్ రాయల్స్ నుంచి వైభవ్ సూర్యవంశీ, ముంబై ఇండియన్స్ నుంచి తిలక్ వర్మ, గుజరాత్ టైటాన్స్ నుంచి అశోక్ శర్మకు చోటు దక్కింది. అయితే మిగిలిన రెండు ఫ్రాంచైజీలు ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి మాత్రం ఒక్క ఆటగాడు కూడా ఎంపిక కాలేదు. 'ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టు ఎంపికలో శ్రేయస్ అయ్యర్ హవా నడుస్తుందని.. చాంపియన్గా నిలిచిన ఆర్సీబీ నుంచి మాత్రం ఒక్క క్రికెటర్కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది' అని పేర్కొన్నారు. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జూలై 23న హరారే వేదికగా జింబాబ్వే, భారత్ తొలి టీ20 మ్యాచ్ ఆడనున్నాయి.జింబాబ్వే పర్యటనకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రబ్సిమ్రన్ (వికెట్ కీపర్)Read: శ్రీ చరణి సంచలనం.. ఏకైక భారత క్రికెటర్గా ఘనత -
అతడికి ముందుగా ఏం చెప్పలేదు.. వరల్డ్కప్ ప్లాన్లో భాగమే!
విదేశీ పర్యటనలో టీమిండియాకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. తొలుత ఐర్లాండ్తో టీ20 సిరీస్లో 2-0తో క్లీన్స్వీప్నకు గురైన భారత జట్టు.. ఇంగ్లండ్తో సిరీస్ను కూడా ఓటమితో మొదలుపెట్టింది. తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. మాంచెస్టర్ వేదికగా రెండో టీ20లో శ్రేయస్ సేన ఓటమి పాలైంది.ఇక ఇరుజట్ల మధ్య మంగళవారం నాటింగ్హామ్ వేదికగా మూడో టీ20 జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ మీడియాతో మాట్లాడాడు. ‘‘మేము బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో బాగా మెరుగుపడాల్సి ఉంది.వరల్డ్కప్ ప్లాన్లో భాగమే!టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత.. మరో వరల్డ్కప్ గెలవడమే లక్ష్యంగా రెండేళ్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. మేము మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే ఆలోచనలో ఉన్నాము. ఇందుకోసం అన్ని విభాగాలూ కలిసి కట్టుగా కృషి చేస్తున్నాయి.గత రెండేళ్లలో మేము ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. అయితే, ఇప్పుడు మూడు మ్యాచ్లు ఓడిపోగానే అందరూ మా వైఫల్యాల గురించే మాట్లాడుతున్నారు. ఆటలో గెలుపోటములు సహజం. జట్టులో మార్పులు జరుగుతున్నాయి. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నాం’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు.ముందుగా ఏం చెప్పలేదుఇక వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుతూ.. ‘‘టీమిండియాకు ఎంపికైన నాటి నుంచే అతడు అరంగేట్రం కోసం సిద్ధంగా ఉన్నాడు. అంతేగానీ రెండో టీ20కి ముందే అతడిని సిద్ధంగా ఉండమని మాత్రం చెప్పలేదు.అతడి ఆట ఎలా ఉంటుందో మాకు తెలుసు. అతడి ఆలోచనా విధానం, దూకుడు గురించి మాకు అవగాహన ఉంది. అయితే, ఇలా ఆడాలి.. అలా ఆడాలి అని మాత్రం అతడికి మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు’’ అని సితాన్షు కొటక్ తెలిపాడు.కాగా ఇంగ్లండ్తో రెండో టీ20 సందర్భంగా వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. సంజూ శాంసన్ స్థానంలో అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగాడు. కానీ.. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. మరోవైపు.. వైభవ్ను ఆడించేందుకు సంజూను తప్పించడం అన్యాయం అంటూ యాజమాన్యంపై విమర్శలు వచ్చాయి. -
సంజూపై వేటు.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్
జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ సోమవారం టీమిండియా జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టులో ఓపెనర్ సంజూ శాంసన్కు చోటు దక్కలేదు. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున సంచలన ప్రదర్శన కనబరిచిన ఓపెనర్ ప్రబ్సిమ్రన్ సింగ్ జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్నాడు.ఇక 2026 టీ20 ప్రపంచకప్ను టీమిండియా గెలవడంలో సంజూ శాంసన్ది కీలకపాత్ర. టోర్నీలో టాప్ స్కోరర్గా నిలిచిన సంజూ శాంసన్ ఐర్లాండ్తో జరిగిన రెండు టీ20లతో పాటు ఇంగ్లండ్తో తొలి టీ20 మ్యాచ్లో ఆడినప్పటికీ విఫలమయ్యాడు. దీంతో రెండో టీ20కి శాంసన్ను తప్పించి వైభవ్కు అవకాశమిచ్చారు. ఇక జింబాబ్వేతో టీ20 సిరీస్కు సంజూ శాంసన్ను పూర్తిగా పక్కనబెట్టారు. చిన్న జట్టుతో సిరీస్ కావడంతో శాంసన్కు రెస్ట్ ఇచ్చి ఉంటారని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు. ఇక జాతీయ జట్టుకు తొలిసారి ఎంపికైన ప్రబ్సిమ్రన్ ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున 168.87 స్ట్రైక్రేట్తో 510 పరుగులు సాధించాడు. ఇతర మార్పుల విషయానికొస్తే రింకూ సింగ్, మయాంక్ యాదవ్ తిరిగి రీఎంట్రీ ఇవ్వగా.. హర్ష్దూబే, యష్ ఠాకూర్, గుజరాత్ టైటాన్స్ స్టార్ అశోక్ శర్మకు పిలుపొచ్చింది.జింబాబ్వే పర్యటనకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రబ్సిమ్రన్ (వికెట్ కీపర్).జింబాబ్వే పర్యటనలో టీమిండియా షెడ్యూల్:తొలి టీ20: జూలై 23, హరారే (సమయం: సాయంత్రం 4.30 గంటల నుంచి)రెండో టీ20: జూలై 25, హరారే (సమయం: సాయంత్రం 4.30 గంటల నుంచి)మూడో టీ20: జూలై 26, హరారే (సమయం: సాయంత్రం 4.30 గంటల నుంచి)Read: టీమిండియాతో మూడో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన -
టీమిండియాతో మూడో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన
టీమిండియాతో మూడో టీ20 మ్యాచ్కు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. రెండో మ్యాచ్లో ఆడిన ప్లేయింగ్ ఎలెవన్నే కొనసాగిస్తామని తెలిపింది. కాగా సొంతగడ్డపై భారత్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇంగ్లండ్ శుభారంభం అందుకున్న సంగతి తెలిసిందే.ఇరుజట్ల మధ్య చెస్టర్ లీ వేదికగా జరిగిన మ్యాచ్ ఫలితం తేలకుండానే వర్షం వల్ల రద్దైపోయింది. ఈ క్రమంలో మాంచెస్టర్ వేదికగా శనివారం జరిగిన రెండో టీ20లో మాత్రం ఆతిథ్య ఇంగ్లండ్ అదరగొట్టింది. టీమిండియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి 1-0తో ముందంజ వేసింది.టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ భారత్ను 190 పరుగులకు కట్టడి చేయగలిగింది. సామ్ కర్రాన్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, విల్ జాక్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి పనిపూర్తి చేసింది.ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ డకౌట్ అయినా.. హ్యారీ బ్రూక్ మెరుపు ఇన్నింగ్స్ (15 బంతుల్లో 39) ఆడి జట్టును ఆదుకున్నాడు. జేకబ్ బెతెల్ ధనాధన్ దంచికొట్టి (46 బంతుల్లో 76 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చాడు. టామ్ బాంటన్ (39) కూడా రాణించాడు. ఈ క్రమంలో రెండో మ్యాచ్లో గెలిపించిన తుదిజట్టునే ఇంగ్లండ్ మూడో మ్యాచ్కూ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.టీమిండియాతో మూడో టీ20కి భారత తుదిజట్టుఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్.బెంచ్: రెహాన్ అహ్మద్, సాకిబ్ మహమూద్, సోనీ బేకర్, జేమ్స్ కోల్స్, జోర్డాన్ కాక్స్, ల్యూక్ వుడ్. -
గాయమా?.. వేటు వేశారా?.. అదే నిజమైతే: మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యంపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకవేళ సంజూ శాంసన్ను గనుక కావాలని తప్పించి ఉంటే.. అంతకంటే దారుణం మరొకటి ఉండదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత్ విజేతగా నిలవడంలో సంజూ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.ఈవెంట్ ఆరంభంలో తుదిజట్టులో చోటు సంపాదించుకోలేకపోయిన సంజూ.. ఆ తర్వాత వచ్చి నాకౌట్ మ్యాచ్లో దుమ్ములేపాడు. 97*, 89, 89 పరుగులతో రాణించి... ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచాడు. ఐపీఎల్-2026లోనూ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సత్తా చాటాడు.అయితే, ఆ తర్వాత ఐర్లాండ్ పర్యటనలో మాత్రం సంజూ దారుణంగా విఫలమయ్యాడు. రెండు మ్యాచ్లలో వరుసగా 5, 0 పరుగులు చేశాడు. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ఒక్క పరుగే చేసి అవుటయ్యాడు. అదే సమయంలో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం గురించి డిమాండ్లు వెల్లువెత్తాయి.ఓవైపు గత మూడు మ్యాచ్లలో సంజూ వైఫల్యాలు.. మరోవైపు వైభవ్ విషయంలో ఒత్తిడి.. ఇలాంటి తరుణంలో ఇంగ్లండ్తో రెండో టీ20 నుంచి సంజూను తప్పించి.. వైభవ్ను అరంగేట్రం చేయించింది యాజమాన్యం. అయితే, సంజూ మాదిరే విఫలమైన వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను మాత్రం కొనసాగించింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఘాటుగా స్పందించాడు. ‘‘వైభవ్ను టీమిండియా జెర్సీలో చూడటం సంతోషంగా అనిపించింది. కానీ సంజూ శాంసన్ సంగతేంటి? అతడిపై వేటు వేశారా? మీరు నాతో జోక్ చేయడం లేదు కదా!నేనైతే ఇది జోక్ కాదనే అనుకుంటున్నా. బహుశా సంజూ గాయపడి ఉంటాడని నా సందేహం. ఇదే నిజమవ్వాలని కోరుకుంటున్నా. అలా కాకుండా అతడిని తప్పించారంటే మాత్రం ఇంతకంటే విచిత్రమైన, దారుణమైన సెలక్షన్ మరొకటి ఉండదు.ఎందుకంటే వైభవ్ సూర్యవంశీని తప్పకుండా తుదిజట్టులో ఆడించాలంటే.. సంజూ మూడో స్థానంలోనైనా సులువుగా బ్యాటింగ్ చేసేవాడు’’ అని సంజయ్ మంజ్రేకర్ ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. -
వైభవ్ ‘అరంగేట్రం’పై విమర్శలు.. స్పందించిన బీసీసీఐ
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్తో రెండో టీ20 సందర్భంగా ఈ బిహారీ పిల్లాడు టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తద్వారా భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.సంజూ స్థానంలో...కేవలం పదిహేనేళ్ల 99 రోజుల వయసులో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఈ ఘనత సాధించాడు. గత మూడు మ్యాచ్లలో విఫలమైన ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ స్థానంలో వైభవ్ తుదిజట్టులోకి వచ్చాడు. అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ పది బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్ల సాయంతో 14 పరుగులు చేసి నిష్క్రమించాడు.అయితే, వైభవ్ను ఐర్లాండ్ పర్యటనలోనే అరంగేట్రం చేయాల్సిందంటూ విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. యాజమాన్యం కావాలనే అతడిని వేచి చూసేలా చేస్తోందంటూ పలువురు మాజీ క్రికెటర్లు సైతం విమర్శించారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు.విమర్శలపై బీసీసీఐ స్పందనవైభవ్ సూర్యవంశీ అరంగేట్రం నేపథ్యంలో ANIతో మాట్లాడుతూ.. ‘‘అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీకి శుభాభినందనలు. గొప్ప అవకాశం అందుకున్నావు. బీసీసీఐ ఎవరి విషయంలోనూ అన్యాయంగా ప్రవర్తించదు. వివక్ష చూపించదు.అర్హత ఉన్న వాళ్లకు కచ్చితంగా అవకాశం ఇస్తుంది. అయితే, వైభవ్ అరంగేట్రానికి ముందు సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. అతడికి అవకాశాలు ఇవ్వడం లేదంటూ కొంతమంది గగ్గోలు పెట్టారు. కోచ్, కెప్టెన్ను నిందించారు. కానీ అందులో అర్థం లేదు.సరైన సమయం వచ్చినపుడు వైభవ్ తప్పకుండా అరంగేట్రం చేస్తాడని నేను ముందు నుంచే చెప్తున్నాను. అందుకు తగ్గట్లుగా శనివారం అతడు తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. గొప్పగా ఆడుతూ భవిష్యత్తును బంగారం చేసుకుంటాడని నమ్ముతున్నాను. వైభవ్ విషయంలో యాజమాన్యం అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. అందుకు వారిని తప్పక ప్రశంసించాల్సిందే’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో రెండో టీ20లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. ఇక ఇరుజట్ల మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైన సంగతి తెలిసిందే.చదవండి: వైభవ్ తప్పు చేశాడు: గావస్కర్An incredibly special moment in the #TeamIndia camp today 🥹💙🎥 Presenting T20I cap no. 122, Vaibhav Sooryavanshi 🧢#ENGvIND pic.twitter.com/hvOZdSN3Ow— BCCI (@BCCI) July 4, 2026 -
ఓటమి తప్పలేదు
మాంచెస్టర్: ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనలో భారత్కు ఇంకా గెలుపు బోణీ దక్కలేదు. తొలి విజయం కోసం జట్టు ఇంకా ఎదురు చూడాల్సిన పరిస్థితిలోనే నిలిచింది. అయితే మ్యాచ్ ఫలితంకంటే ఎక్కువగా ఆసక్తి రేపిన, టీమిండియా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన క్షణం ఈ మ్యాచ్లో వచ్చింది. సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ భారత 122వ టి20 ఆటగాడిగా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. శనివారం జరిగిన రెండో టి20లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 49; 6 ఫోర్లు), అభిషేక్ శర్మ (24 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (22 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా...చివర్లో తిలక్ వర్మ (11 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) ధాటిగా ఆడాడు. వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 2 సిక్స్లతో 14 పరుగులు చేశాడు. అనంతరం ఇంగ్లండ్ 19 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జాకబ్ బెతెల్ (46 బంతుల్లో 76 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ సెంచరీ చేయగా...కెప్టెన్ హ్యారీ బ్రూక్ (15 బంతుల్లో 39; 4 ఫోర్లు, 3 సిక్స్లు), టామ్ బాంటన్ (32 బంతుల్లో 39; 6 ఫోర్లు) రాణించారు. చివర్లో విజయం కోసం ఇంగ్లండ్ 24 బంతుల్లో 49 పరుగులు చేయాల్సి ఉండటంతో భారత్దే పైచేయిగా కనిపించగా... 17వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ ఏకంగా 29 పరుగులు ఇవ్వడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) బాంటన్ (బి) కరన్ 43; వైభవ్ (స్టంప్డ్) బట్లర్ (బి) జాక్స్ 14; ఇషాన్ కిషన్ (సి) డాసన్ (బి) కరన్ 49; అయ్యర్ (సి) బాంటన్ (బి) డాసన్ 37; దూబే (సి) బాంటన్ (బి) కరన్ 5; తిలక్ (నాటౌట్) 24; అక్షర్ (రనౌట్) 2; రాణా (సి) బట్లర్ (బి) ఆర్చర్ 6; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–50, 2–65, 3–130, 4–146, 5–157, 6–165, 7–190. బౌలింగ్: ఆర్చర్ 4–0–40–1, టంగ్ 4–0–46–0, జాక్స్ 3–0–22–1, స్యామ్ కరన్ 4–0–33–3, డాసన్ 3–0–27–1, రషీద్ 2–0–21–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఇషాన్ కిషన్ (బి) అర్ష్ దీప్ 0; బట్లర్ (సి) వరుణ్ (బి) అర్ష్ దీప్ 0; బ్రూక్ (సి) ఇషాన్ కిషన్ (బి) అక్షర్ 39; బెతెల్ (నాటౌట్) 76; బాంటన్ (సి) తిలక్ (బి) అర్ష్ దీప్ 39; జాక్స్ (ఎల్బీ) (బి) వరుణ్ 9; కరన్ (సి) వైభవ్ (బి) రాణా 7; ఆర్చర్ (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 11; మొత్తం (19 ఓవర్లలో 6 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–0, 2–1, 3–51, 4–118, 5–133, 6–179. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–40–3, హర్షిత్ రాణా 3–0–30–1, బిష్ణోయ్ 4–0–60–0, అక్షర్ 4–0–20–1, వరుణ్ 4–0–37–1.1 అతి పిన్న వయసులో భారత్ తరఫున అంతర్జాతీయ (పురుషుల) క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల 205 రోజులు) పేరిట ఉన్న రికార్డును అతను బద్దలుకొట్టాడు. -
టాస్ గెలిచిన టీమిండియా: అతడిపై వేటు.. వైభవ్ అరంగేట్రం
ఇంగ్లండ్తో రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో భారత చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఓపెనర్గా సంజూ శాంసన్ స్థానాన్ని పదిహేనేళ్ల వైభవ్ భర్తీ చేశాడు.టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘మేము ఈసారి కూడా తొలుత బ్యాటింగ్ చేస్తాం. మా తుదిజట్టులో ఒక మార్పు. సంజూ స్థానంలో వైభవ్ ఆడతాడు. గత రెండు నెలలుగా అతడు అద్భుతంగా ఆడుతున్నాడు.అత్యుత్తమ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అతడు ఒత్తిడికి లోనుకాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలకడగా ఆడగలడు’’ అని వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. కాగా 15 ఏళ్ల 99 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వైభవ్.. అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన భారత క్రికెటర్గా చరిత్రకెక్కాడు. మరోవైపు.. గత మూడు మ్యాచ్లలో విఫలమైన సంజూ (5, 0, 1)పై యాజమాన్యం వేటు వేసింది.తుదిజట్లుటీమిండియావైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.ఇంగ్లండ్ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్.చదవండి: శ్రీలంకతో వన్డే.. భారత్ ఘన విజయం -
‘నిన్ను ఆడించడం కుదరదని అతడికి చెప్పేయండి’
భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ. ఈ చిచ్చరపిడుగును వీలైనంత త్వరగా టీమిండియాకు ఆడించాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, యాజమాన్యం మాత్రం వైభవ్ను బెంచ్కే పరిమితం చేస్తూ వస్తోంది.వాళ్లు విఫలమవుతున్నా..ఐర్లాండ్ పర్యటనలోనే వైభవ్ (Vaibhav Suryavanshi) అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. కానీ రెండు మ్యాచ్లలోనూ ఈ లెఫ్టాండర్ బ్యాటర్కు మొండిచేయే ఎదురైంది. ఇక ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలి టీ20లోనూ పదిహేనేళ్ల ఈ పిల్లాడిని పక్కనపెట్టేశారు. మరోవైపు.. టాపార్డర్లో ఓపెనర్ సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వరుసగా విఫలమవుతున్నారు.ఇలాంటి తరుణంలో వైభవ్ సూర్యవంశీని ఆడిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడిని కావాలనే పక్కనపెడుతున్నారనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.అతడితో జాగ్రత్తగా వ్యవహరించాలిస్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్ సిరీస్లో ఏదో ఒక మ్యాచ్లో వైభవ్కు కచ్చితంగా ఆడే అవకాశం వస్తుందని నేను నమ్ముతున్నాను. అయితే, ప్రస్తుతానికి కోచింగ్ సిబ్బంది అతడికి సరైన రీతిలో కమ్యూనికేట్ చేయాలి. నిరాశ చెందిన బ్యాటర్కు.. ‘నువ్వు రేసులోనే ఉన్నావు’ అనే విషయాన్ని తెలియజేయాలి.ఇలా చేయడం ద్వారా అతడిలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. ఒకవేళ అతడిని ఆడించడం కుదురలేదంటే.. ఆ నిజాన్ని కూడా నేరుగా అతడితోనే చెప్పాలి. వైభవ్ పదిహేనేళ్ల పిల్లాడు. అతడితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.తను నిరాశ చెందకుండా చూసుకోవాలి. తుదిజట్టులో స్థానం కోసం ఓపికతో ఎదురుచూడాల్సి ఉంటుందని సానుకూలంగా తెలియజెప్పాలి. అప్పుడే అతడి మనసు కాస్త స్థిమితంగా ఉంటుంది’’ అని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు.ఇప్పుడు వైభవ్ను ఆడించడం కుదరదుఅదే విధంగా.. ‘‘సంజూ శాంసన్ ప్రపంచకప్ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఇషాన్ కిషన్ ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్లో నంబర్వన్గా ఉన్నాడు. అభిషేక్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇలాంటి తరుణంలో కచ్చితంగా వైభవ్కు టాపార్డర్లో చోటు ఉండదు. ఇదే విషయాన్ని అతడికి అర్థమయ్యేలా చెప్పాలి’’ అని హెడ్కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ సిబ్బందికి పార్థివ్ పటేల్ విజ్ఞప్తి చేశాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. ఇరుజట్ల మధ్య శనివారం రెండో మ్యాచ్ జరుగనుంది. ఇందుకు మాంచెస్టర్ వేదిక.చదవండి: తుదిజట్టులో దక్కని చోటు.. వైభవ్ పోస్ట్ వైరల్! -
భారత్తో రెండో టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన! యువ ప్లేయర్కు చోటు
మాంచెస్టర్ వేదికగా శనివారం భారత్తో జరగనున్న రెండో టీ20 కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. తొలి టీ20కు విశ్రాంతి తీసుకున్న స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చాడు. పేసర్లు ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్ స్థానాల్లో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్లకు తుది జట్టులో చోటు దక్కింది.ఈ మ్యాచ్తో జోష్ టంగ్ ఇంగ్లండ్ తరపున టీ20 అరంగేట్రం చేయనున్నాడు. టంగ్ ఇప్పటికే టెస్ట్ జట్టులో రెగ్యులర్ బౌలర్గా కొనసాగుతున్నాడు. ఈ రైట్ ఆర్మ్ పేసర్ ఇప్పటివరకు ఇంగ్లండ్ తరపున 12 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. టీ20ల్లో మాత్రం అతడికి పెద్దగా అనుభవం లేదు. ఇప్పటివరకు కేవలం 21 టీ20లు మాత్రమే ఆడాడు. అతడి పేరిట 29 టీ20 వికెట్లు ఉన్నాయి.సాకిబ్పై వేటుకాగా తొలి మ్యాచ్లో సాకిబ్ మహమూద్ 33 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టినప్పటికి.. ఆర్చర్ కోసం అతన్ని పక్కన పెట్టడం గమనార్హం. 2026 టీ20 ప్రపంచకప్ తర్వాత ఆర్చర్కు ఇదే మొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్. కచ్చితంగా పవర్ప్లేలో అతడి నుంచి భారత బ్యాటర్లకు కఠిన సవాల్ ఎదురు కానుంది.ఇంగ్లండ్ తుది జట్టుఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్. -
టీమిండియాకు బ్యాడ్ న్యూస్..! ఇంగ్లండ్ జట్టులోకి స్పీడ్ గన్ ఎంట్రీ?
మాంచెస్టర్ వేదికగా శనివారం ఇంగ్లండ్తో రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాలని భారత్ పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్కు ముందు శ్రేయస్ అయ్యర్ సేనకు ఓ బ్యాడ్ న్యూస్. తొలి టీ20కు దూరంగా ఇంగ్లండ్ స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చర్.. ఇప్పుడు రెండో మ్యాచ్లో ఆడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జట్టుతో కలిసిన అతడు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో చివరి రెండు మ్యాచ్ల్లో అవిరామంగా బౌలింగ్ చేయడంతో, ఆర్చర్కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మొదటి టీ20 నుంచి తప్పించింది. అయితే మిగిలిన నాలుగు టీ20ల్లో జోఫ్రా ఆడనున్నాడు. శనివారం నాటి మ్యాచ్లో అతడు లూక్ వుడ్ లేదా లియామ్ డాసన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఆర్చర్ పునరాగమనం చేస్తే ఇంగ్లీష్ జట్టు బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది. పవర్ప్లేలో ఈ రాజస్తాన్ స్పీడ్ స్టార్ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఐపీఎల్లో అత్యధిక సార్లు తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టి తన శుభారంభాన్ని అందించేవాడు. కొత్త బంతితో అతడు అద్భుతాలు చేస్తాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేసి బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో ఆర్చర్ దిట్ట. మరి భారత టాపార్డర్ బ్యాటర్లు ఆర్చర్ను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. టీ20 ప్రపంచకప్-2026 తర్వాత ఆర్చర్ ఆడుతున్న మొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.భారత్తో రెండో టీ20కు ఇంగ్లండ్ తుది జట్టు(అంచనా)ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్ -
IND vs ENG: ఇంగ్లండ్ కెప్టెన్పై మాజీ క్రికెటర్ ఫైర్!
ఇంగ్లండ్తో తొలి టీ20లో టీమిండియా ఆదిలో తడబడినా మెరుగైన స్కోరు సాధించింది. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఓపెనర్లలో సంజూ శాంసన్ (1) మరోసారి విఫలం కాగా.. అభిషేక్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ (24 బంతుల్లో 59) సాధించాడు.21 బంతుల్లో 42వన్డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ డకౌట్ కాగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అర్ధ శతకం (47 బంతుల్లో 68)తో రాణించి.. అభిషేక్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మిగిలిన వారిలో ఆల్రౌండర్ శివం దూబే దూకుడుగా ఆడాడు. కేవలం 21 బంతుల్లోనే రెండు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 42 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేయగలిగింది. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ శివం దూబేపై ప్రశంసలు కురిపించాడు. టీమిండియా ఫినిషర్గా దూబే నిలకడగా రాణిస్తున్నాడని కొనియాడాడు.SHIVAM DUBE HAS 69 FOURS & 68 SIXES IN JUST 51 INNINGS 🥶🔥- A T20 machine for India, Dube.pic.twitter.com/XOop15dsiS— Johns. (@CricCrazyJohns) July 2, 2026అదే సమయంలో దూబే విషయంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అనుసరించిన వ్యూహాలను పార్థివ్ పటేల్ విమర్శించాడు. స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ స్వరూపాన్ని మార్చడానికి ఒక్క ఆటగాడు చాలు. టీమిండియా ఫినిషర్గా దూబే గత కొన్నాళ్లుగా ఇదే పని చేస్తున్నాడు. అతడు తన పాత్రను చక్కగా పోషించాడు.ఇంగ్లండ్ వ్యూహం చెత్తగా ఉందికానీ ఇంగ్లండ్ వ్యూహమే చెత్తగా ఉంది. శివం దూబే బ్యాటింగ్కు వచ్చాడని తెలిసీ.. వాళ్లు స్పిన్నర్ లియామ్ డాసన్కు బంతిని ఇచ్చారు. ఇక 19వ ఓవర్లో కూడా స్పిన్నర్తోనే బౌలింగ్ వేయించారు. ఇదేమన్నా రాకెట్ సైన్సా?శివం దూబే స్పిన్నర్ల బౌలింగ్లో చితక్కొడతాడన్న విషయం కూడా తెలియదా? ఐపీఎల్ చూస్తేనైనా ఈ విషయం అర్థం కావాలి. లేదంటే అంతర్జాతీయ మ్యాచ్లను పరిశీలించినా ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది.స్పిన్ బౌలింగ్లో అతడికి ఉన్న రికార్డు గురించి ఆ మాత్రం తెలియదా?.. ఇంగ్లండ్ బౌలర్లకు అతడు చుక్కలు చూపించాడు. చక్కటి (200) స్ట్రైక్రేటుతో పరుగులు పిండుకున్నాడు’’ అని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య బుధవారం రాత్రి జరిగిన తొలి టీ20 భారీ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. మొదట టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 పరుగులు చేయగా... ఇంగ్లండ్ బ్యాటింగ్కు దిగే అవకాశం ఇవ్వకుండా వర్షం దంచికొట్టింది. దీంతో మ్యాచ్ను రద్దు చేశారు. ఇరు జట్ల మధ్య శనివారం రెండో టీ20 జరగనుంది. ఇందుకు మాంచెస్టర్ వేదిక.చదవండి: IND vs SL: టెస్టు సిరీస్ నుంచి కీలక ప్లేయర్ అవుట్! -
‘వైభవ్ సూర్యవంశీ ఇప్పుడే వద్దు.. అతడికే నా మద్దతు’
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో సత్తా చాటిన టీమిండియా స్టార్ సంజూ శాంసన్.. ఈ మెగా ఈవెంట్ తర్వాత మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. ఐర్లాండ్ పర్యటనలో రెండు మ్యాచ్లలో 5, 0 పరుగులతో పూర్తిగా నిరాశపరిచాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్.తాజాగా ఇంగ్లండ్ పర్యటనను కూడా సంజూ (Sanju Samson) పేలవ ప్రదర్శనతో ఆరంభించాడు. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో ఏడు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.అతడిని తప్పించండిఇలా వరుసగా గత మూడు మ్యాచ్లలో సంజూ శాంసన్ విఫలమైన నేపథ్యంలో అతడిని తుదిజట్టు నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. సంజూకు బదులు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ని అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా పంపాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ మాత్రం భిన్నంగా స్పందించాడు. వైభవ్ సూర్యవంశీ విషయంలో తొందరపాటు తగదని.. సంజూ- అభిషేక్నే ఓపెనింగ్ జోడీగా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు.సంజూకే నా మద్దతు.. క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘సంజూ శాంసన్ మరోసారి విఫలమైన మాట వాస్తవమే. గత మూడు ఇన్నింగ్స్లో అతడు దారుణ ప్రదర్శన కనబరిచాడు. దీంతో వైభవ్ సూర్యవంశీకి మద్దతు మరింతగా పెరుగుతోంది. అయితే, నా అభిప్రాయం ప్రకారం.. సంజూ శాంసన్ ఓపెనర్గా సరైనోడే.ప్రపంచకప్ టోర్నీలో తీవ్రమైన ఒత్తిడిలోనూ అతడు రాణించి.. జట్టును గెలిపించాడు. చాలా మంది వైభవ్ ఇంకెప్పుడు ఆడతాడంటూ చర్చోపర్చలు చేస్తున్నారు. వారి ఆవేదన, ఆలోచనలను నేను అర్థం చేసుకోగలను. వైభవ్ ఆ హక్కు సంపాదించుకోవాలికానీ నేను ఇప్పటికీ సంజూ శాంసన్కే మద్దతు ప్రకటిస్తాను. ప్రపంచకప్ టోర్నీలో అతడు రాణించిన తీరు అద్భుతం. అలా అని నేనేమీ వైభవ్కు వ్యతిరేకం కాదు. అయితే, వైభవ్ తుదిజట్టులో చోటు దక్కించుకునే హక్కును సంపాదించుకోవాలి. అంతర్జాతీయ క్రికెట్లోనూ ఈ పిల్లాడు అద్భుతంగా రాణిస్తాడు’’ అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్-2026 నాకౌట్ మ్యాచ్లలో సంజూ 97*, 89, 89 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా భారత్ చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్- భారత్ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైపోయింది.చదవండి: IND vs ENG: ఇషాన్ రనౌట్.. తప్పు నీదే! -
IND vs ENG: నువ్వసలు ఏం చేస్తున్నావు?.. తప్పు నీదే!
ఇంగ్లండ్తో తొలి టీ20లో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ పూర్తిగా విఫలమయ్యాడు. తన తొందరపాటు చర్యతో మూల్యం చెల్లించుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఇషాన్ కిషన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.అసలేం జరిగిందంటే.. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా బుధవారం తొలి టీ20 ఆడింది. చెస్టర్ లీ స్ట్రీట్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో సంజూ శాంసన్ (1) వైఫల్యాల పరంపర కొనసాగించగా.. అభిషేక్ శర్మ మెరుపు అర్ధ శతకం (24 బంతుల్లో 59) సాధించాడు.నువ్వసలు ఏం చేస్తున్నావు?ఇక వన్డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ రెండు బంతులు ఎదుర్కొని డకౌట్గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్లో సకీబ్ మహ్మూద్ బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమైన ఇషాన్.. అక్కడ పరుగుకు ఆస్కారం లేకున్నా సింగిల్ కోసం పరిగెత్తాడు.మరో ఎండ్లో ఉన్న అభిషేక్ శర్మ బంతిని గమనించి సింగిల్కు అవకాశం లేదని అక్కడే ఉండిపోయాడు. ‘‘నువ్వసలు ఏం చేస్తున్నావు?’’ అంటూ ఒకింత అసహనంతో ఇషాన్ను హెచ్చరించాడు కూడా!.. దీంతో ఇషాన్ క్రీజులోకి చేరుకునేందుకు డైవ్ కూడా చేశాడు.A costly mix-up in the middle. 🫣Moments after the run-out: Abhishek Sharma and Ishan Kishan share a brief conversation.#ENGvIND 1st T20I 👉 Streaming LIVE on JioHotstar! pic.twitter.com/1kagvrBjV9— Star Sports (@StarSportsIndia) July 1, 2026కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ వికెట్లను గిరాటేయడంతో ఇషాన్ కిషన్ పరుగుల ఖాతా తెరవకుండానే రనౌట్గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో ఇషాన్- అభిషేక్లలో తప్పెవరిది అన్న చర్చ జరుగుతుండగా.. సునిల్ గావస్కర్ అభిషేక్కు మద్దతుగా నిలిచాడు.ఇందుకు పూర్తి బాధ్యుడు అతడే‘‘వీలైనంత త్వరగా క్రీజులోకి చేరుకోవాల్సింది. ముఖ్యంగా ఈ ఫార్మాట్లో అన్నీ క్షణాల్లో జరిగిపోతాయి. ఇందులో అభిషేక్ శర్మ తప్పేమీ లేదు. ఇది ఇషాన్ కిషన్ స్వీయ తప్పిదం. ఇందుకు పూర్తి బాధ్యుడు అతడే’’ అని గావస్కర్ తీవ్ర స్థాయిలో ఇషాన్ను విమర్శించాడు.కాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఇషాన్ కిషన్ బుధవారమే నంబర్వన్ స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు రెండో ర్యాంక్లో ఉన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఒక స్థానం మెరుగుపర్చుకొని 876 పాయింట్లతో టాప్ ర్యాంక్ను అందుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు నంబర్వన్గా ఉన్న ఇషాన్ సహచరుడు అభిషేక్ శర్మ (869) రెండో స్థానానికి పడిపోయాడు.గంటల్లోనే హీరో నుంచి జీరోగా..అయితే, నంబర్ వన్గా ఎదిగిన కొన్ని గంటల్లోనే ఇషాన్ కిషన్ ఇలా ‘జీరో’ స్కోరుతో పెవిలియన్ చేరడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్- టీమిండియా మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైపోయింది. ఈ మ్యాచ్లో అభిషేక్తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 68), శివం దూబే (21 బంతుల్లో 42 నాటౌట్) రాణించారు.చదవండి: కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన శ్రేయస్Another Disappointing start for Team India.Sanju Samson again fails to score.Followed by a run out of in-form Ishan Kishan.Not the Start we imagined.#ENGvINDpic.twitter.com/y9H3qfFIh7— TheFakeFakeer (@TheFakeFakeer) July 1, 2026 -
కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్
భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ వర్షార్పణమైనప్పటికీ టీమిండియా ఆటగాళ్లు మాత్రం పలు రికార్డులు తమ పేరిట లిఖించుకున్నారు. ఇప్పటికే అభిషేక్ శర్మ ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో అరుదైన ఫీట్ సాధించగా, తాజాగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏకంగా చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లి రికార్డును బద్దలుకొట్టాడు. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్తో తొలి టీ20లో అయ్యర్ 47 బంతుల్లో 68 పరుగులతో రాణించాడు. ఐర్లాండ్తో టీ20 సిరీస్లో విఫలమైన శ్రేయస్ ఇంగ్లండ్ గడ్డపై మాత్రం బ్యాట్ ఝలిపించాడు. ఈ క్రమంలో 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 5వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీమిండియా తరఫున 5వేల పరుగులు పూర్తి చేసుకున్న 29వ బ్యాటర్గా అయ్యర్ నిలిచాడు. 147 ఇన్నింగ్స్ల్లో (అన్ని ఫార్మాట్లు) అయ్యర్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఇందులో ఆరు సెంచరీలు, 37 అర్ధసెంచరీలున్నాయి. ఇక తొలి టీ20లో హాఫ్ సెంచరీ సాధించిన అయ్యర్ ఇంగ్లండ్ గడ్డపై కెప్టెన్గా ఫిఫ్టీ సాధించిన తొలి ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. గతంలో టీ20 కెప్టెన్గా కోహ్లి చేసిన 47 పరుగులే అత్యుత్తమంగా ఉండేది. 8 ఏళ్ల తర్వాత కోహ్లి రికార్డును అయ్యర్ బద్దలు కొట్టాడు. అంతేకాదు టీ20 కెరీర్లో శ్రేయస్ అయ్యర్కు ఇది మూడో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ (59), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 68) అర్ధసెంచరీలతో రాణించారు. ఆఖర్లో శివమ్ దూబే (21 బంతుల్లో 42 నాటౌట్) పవర్హిట్టింగ్తో టీమిండియా భారీ స్కోరు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహ్మూద్ 3 వికెట్లు తీయగా, ఆదిల్ రషీద్, సామ్ కరన్లు చెరో వికెట్ పడగొట్టారు. -
వర్షం కారణంగా తొలి టీ20 రద్దు.. భారత్కు అచ్చిరాని వేదిక
చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ను వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం జోరందుకున్న వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు తెలిపారు. అయితే చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా భారత్ ఆడిన మూడు మ్యాచ్లు కూడా వర్షం కారణంగా రద్దవ్వడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. ఈ వేదిక టీమిండియాకు అంతగా కలసిరాలేదు. 2002లో తొలిసారి ఈ వేదికలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ వర్షార్ప ణమైంది. ఆ తర్వాత 2011లో మరోసారి ఇరుజట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. తాజాగా మూడోసారి అదే ఫలితం పునరావృతం కావడం గమనార్హం. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ (59), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 68) అర్ధసెంచరీలతో రాణించారు. ఆఖర్లో శివమ్ దూబే (21 బంతుల్లో 42 నాటౌట్) పవర్హిట్టింగ్తో టీమిండియా భారీ స్కోరు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహ్మూద్ 3 వికెట్లు తీయగా, ఆదిల్ రషీద్, సామ్ కరన్లు చెరో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా జరగనుంది.తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్ ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్ దురదృష్టవశాత్తూ రనౌట్గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అభిషేక్, శ్రేయస్లు కలిసి భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఈ ఇద్దరు మూడో వికెట్కు 82 పరుగులు జోడించిన తర్వాత అభిషేక్ శర్మ వెనుదిరిగాడు. అప్పటివరకు స్లోగా ఆడిన అయ్యర్ వేగం పెంచాడు. ఈ దశలో 38 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అయితే స్కోరును పెంచే క్రమంలో అయ్యర్ ఔటైనప్పటికీ ఫినిషర్ రోల్కు న్యాయం చేస్తూ శివమ్ దూబే సిక్సర్లతో విరుచుకుపడడంతో టీమిండియా 180 పరుగుల మార్క్ను దాటింది.The 1st #ENGvIND T20I in Durham has been called off due to rains.Scorecard ▶️ https://t.co/occSMon7Q9#TeamIndia pic.twitter.com/cjIdYQcHUR— BCCI (@BCCI) July 1, 2026 -
ఇంగ్లండ్ గడ్డపై అభిషేక్ అరుదైన రికార్డు
టీమిండియా విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్తో టీ20 సిరీస్లోనూ తన ఫామ్ను కంటిన్యూ చేస్తున్నాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ అభిషేక్ మాత్రం తన బ్యాటింగ్లో దూకుడు కొనసాగించాడు. తద్వారా 20 బంతుల్లోనే అర్ధశతకం మార్క్ అందుకున్న అభిషేక్ శర్మ ఇంగ్లండ్ గడ్డపై అరుదైన ఫీట్ సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై టీ20ల్లో టీమిండియా తరఫున తక్కువ బంతుల్లో ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. గతంలో కేఎల్ రాహుల్ 2018లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన టీ20లో 27 బంతుల్లో ఫిఫ్టీ సాధించడమే ఇప్పటివరకు రికార్డుగా ఉంది. తాజాగా అభిషేక్ కేఎల్ రాహుల్ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో పాటు అభిషేక్ ఖాతాలో మరో అరుదైన రికార్డు కూడా వచ్చి చేరింది. టీ20 క్రికెట్లో అభిషేక్ శర్మ వంద సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ కంటే ముందు టీమిండియా తరఫున రోహిత్ శర్మ (205 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (179 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (126 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (124 సిక్సర్లు) ఉన్నారు. అయితే టీమిండియా తరఫున టీ20ల్లో వంద సిక్సర్లు కొట్టిన తొలి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా అభిషేక్ శర్మ నిలిచాడు. 49 మ్యాచ్ల్లోనే అభిషేక్ వంద సిక్సర్లు పూర్తి చేసుకోవడం మరో విశేషం. ఇక అభిషేక్ శర్మకు టీ20ల్లో 48 ఇన్నింగ్స్ల్లో ఇది పదకొండో ఫిఫ్టీ కావడం గమనార్హం. Milestone unlocked 🔓1️⃣0️⃣0️⃣ T20I sixes and counting for the power-packed Abhishek Sharma 👏Updates ▶️ https://t.co/occSMon7Q9#TeamIndia | #ENGvIND | @OfficialAbhi04 pic.twitter.com/lAohcmYvOG— BCCI (@BCCI) July 1, 2026 -
బౌలర్లను ఉతికారేసిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు సమయం అసన్నమైంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టీ20 బుధవారం డర్హమ్ వేదికగా జరనగనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు మరోసారి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురుంచి క్రికెట్ వర్గాల్లో చర్చనడుస్తోంది. ఈ 15 ఏళ్ల చిచ్చరపిడుగు సీనియర్ జట్టు తరపున అరంగేట్రం చేస్తాడా లేదా అన్నదే ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారింది. ఐర్లాండ్తో సిరీస్కు ఎంపికైనప్పటికి వైభవ్కు మాత్రం డెబ్యూ చేసే అవకాశం లభించలేదు. సంజూ శాంసన్, అభిషేక్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉండడంతో వైభవ్ను మేనెజ్మెంట్ బెంచ్కే పరిమితం చేసింది.ఈ క్రమంలో హెడ్కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లపై చాలా మంది మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. ఐపీఎల్లో దుమ్ములేపిన వైభవ్కు ఓ అవకాశం ఇవ్వాలని మేనెజ్మెంట్ను సూచించారు. కానీ ఇంగ్లండ్ టూర్లో కూడా వైభవ్ అరంగేట్రం చేసే అవకాశాలు కనిపించడం లేదు.Vaibhav Suryavanshi is taking out his frustration from the Ireland T20 series loss in the nets at Durham.😭🔥 pic.twitter.com/80T3ovtnRY— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) June 30, 2026సీనియర్లకు తమ మద్దతు ఉంటుందని కెప్టెన్ అయ్యర్ మరోసారి స్పష్టం చేశాడు. ఏదేమైనప్పటికి వైభవ్ మాత్రం తన ప్రాక్టీస్ను ఆపడం లేదు. తొలి టీ20కు ముందు జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్లో భారత బౌలర్లపై వైభవ్ విరుచుకుపడ్డాడు. ప్రసిద్ద్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, అర్ష్దీప్ సింగ్ వంటి సీనియర్ పేసర్లను సూర్యవంశీ సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.తుది జట్లుభారత్(అంచనా): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చక్రవర్తిఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్చదవండి: మ్యాచ్ రద్దయినా రూ.8 లక్షలు ఫిక్స్! అంపైర్ల సంపాదన ఎంతంటే? -
భారత్తో తొలి టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ఇదే
ఐర్లాండ్ చేతిలో దారుణ సిరీస్ ఓటమి అనంతరం టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బుధవారం ఇంగ్లండ్, టీమిండియా మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సోమవారం రాత్రి తొలి టీ20 మ్యాచ్లో ఆడే ప్లేయింగ్ ఎలెవెన్ జట్టును ప్రకటించింది.అయితే టీమిండియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు ఇంగ్లండ్ బోర్డు 17 మందితో కూడిన సభ్యుల బృందాన్ని ప్రకటించింది. హ్యారీ బ్రూక్ జట్టును నడిపించనుండగా, జాస్ బట్లర్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బట్లర్తో పాటు సీనియర్లు సామ్ కరన్, ఆదిల్ రషీద్తో పాటు టీ20 సంచలన ఆటగాళ్లు జాకనబ్ బెథెల్, టామ్ బాంటన్, లియామ్ డాసన్లకు అవకాశం కల్పించింది. అయితే స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్కు తొలి టీ20 మ్యాచ్కు విశ్రాంతి ఇచ్చినట్లు బోర్డు తెలిపింది. అయితే ఆర్చర్కు ఎందుకు రెస్ట్ ఇచ్చారనే దానిపై మాత్రం ఈసీబీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇటీవలే న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆర్చర్ నాలుగు ఇన్నింగ్స్లు కలిపి 11 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2026 సీజన్లోనూ రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన ఆర్చర్ 25 వికెట్లు తీశాడు. అయితే ఐర్లాండ్తో సిరీస్ను కోల్పోయిన టీమిండియా ఇంగ్లండ్తో సిరీస్లో దానిని పునరావృతం చేయకూడదనే సంకల్పంతో ఉంది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం ఈ ఏడాది టీ20 ప్రపంచకప్లో సెమీస్లో టీమిండియా చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. అందుకే సొంతగడ్డపై జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ను ఓడించి ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూస్తోంది. ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టీ20కి చెస్టర్ లె స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్ వేదిక కానుంది.తొలి టీ20కి ఇంగ్లండ్ తుది జట్టు:ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్.Our XI is IN! 🦁Click below to see our team for our series opener with India...— England Cricket (@englandcricket) June 30, 2026 -
IND vs ENG: అతడికే మా మద్దతు.. వైభవ్ ఎదురుచూడాల్సిందే!
ఐర్లాండ్తో టీ20 సిరీస్లో 2-0తో క్లీన్స్వీప్నకు గురైన టీమిండియాపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేసి.. చెత్త ప్రదర్శనతో మూల్యం చెల్లించారని విమర్శిస్తున్నారు. ప్రపంచ చాంపియన్గా ఐరిష్ గడ్డపై అడుగుపెట్టి అతి విశ్వాసంతో కొంపముంచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బెంచ్కే పరిమితంఇక మరికొందరు.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అరంగేట్రం చేయించకపోవడాన్ని కూడా తప్పుబడుతున్నారు. ఈ పిల్లాడిని ఆడిస్తేనైనా ఫలితం వేరేలా ఉండేదేమోనని అభిప్రాయపడుతున్నారు. అయితే, యాజమాన్యం మాత్రం వైభవ్ను రెండు మ్యాచ్లలోనే బెంచ్కే పరిమితం చేసింది.ఐర్లాండ్ చేతిలో వైట్వాష్ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటనలోనైనా వైభవ్ సూర్యవంశీని ఆడిస్తారేమోనన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే ఆ అవకాశం లేదని సంకేతాలు ఇచ్చాడు.సంజూకు మా మద్దతు ఉంటుంది‘‘అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు వైభవ్ సూర్యవంశీ పూర్తి స్థాయిలో సిద్ధంగానే ఉన్నాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, సంజూ శాంసన్ను తుదిజట్టు నుంచి తప్పించడం కూడా సాధ్యం కాదు.మూడు నెలల క్రితం జట్టు ప్రపంచకప్ గెలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్లోనూ 2026లో సత్తా చాటాడు. ఈ సిరీస్లో అతడు విఫలం కావొచ్చు. అయినప్పటికీ మా ఆటగాళ్లకు మేము మద్దతుగానే నిలబడతాము.అతడిలో ఆత్మవిశ్వాసం పెంచేలానే మా చర్యలు ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మేము ముందుకు సాగుతాము. అరంగేట్రం చేసేందుకు వైభవ్ ఎంత ఆసక్తిగా ఉన్నాడో.. అతడి ఆటను చూడాలని మేమూ అంతే ఆతురతతో ఎదురుచూస్తున్నాం.వైభవ్ వేచిచూడక తప్పదు!అయితే, అందుకు ఇంకాస్త సమయం ఉంది. మిగతా ఆటగాళ్ల గురించి కూడా మేము ఆలోచించాల్సి ఉంటుంది. అంతమాత్రాన వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటలేడని మేము భావిస్తున్నట్లు కానేకాదు’’ అని డష్కాటే పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటనలోనూ వైభవ్ అరంగేట్రం చేయకపోవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.ఇదిలా ఉంటే.. ఐర్లాండ్తో మ్యాచ్లో టీమిండియా టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. తొలి మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ (49) రాణించగా.. మరో ఓపెనర్ సంజూ శాంసన్ (5), వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (1) నిరాశపరిచారు.ఇక రెండో టీ20లో సంజూ, అభిషేక్.. ఇద్దరూ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగి జట్టు కొంపముంచారు. ఇషాన్ కిషన్ (12) అనవసరంగా పరుగుకు వెళ్లి రనౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. తద్వారా సిరీస్ను పసికూన ఐర్లాండ్కు కోల్పోయింది. భారత క్రికెట్ చరిత్రలోనే ఇదొక మాయని మచ్చగా మిగిలిపోనుంది.చదవండి: IND vs IRE 2nd T20: టీమిండియా తరఫున ఆ ఇద్దరి అరంగేట్రం🔴 NO PLACE FOR VAIBHAV YET! TEAM INDIA BACKS SANJU SAMSON🤯Q🎙️: Coach, How far Vaibhav Suryavanshi from debut?Ryan ten doeschate🎙️: Vaibhav is absolutely ready for international cricket, but we won't rush him. Sanju played a big role in India's T20 World Cup win and had a… pic.twitter.com/4FrYEXD9O2— Sam (@cricsam02) June 29, 2026 -
IND vs IRE: గంభీర్పై ఐస్లాండ్ క్రికెట్ పోస్ట్ వైరల్
టీ20 ప్రపంచకప్-2026 చాంపియన్ టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టు.. అనూహ్య రీతిలో తొలి టీ20లో ఓటమి పాలైంది. ఆటలో గెలుపోటములు సహజం.. రెండో మ్యాచ్లోనైనా తప్పు దిద్దుకుంటారని భావించిన అభిమానులకు మరోసారి భంగపాటే ఎదురైంది.ఒక్క పరుగు తేడాతో..తాజాగా రెండో టీ20 మ్యాచ్లోనూ శ్రేయస్ అయ్యర్ సేన ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలై.. సిరీస్ను చేజార్చుకుంది. ఇక ఐర్లాండ్ తొలిసారి టీమిండియాను 2-0తో క్లీన్స్వీప్ చేసి తమ క్రికెట్ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించింది.ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా హెడ్కోచ్ గౌతం గంభీర్ మరోసారి విమర్శకులకు టార్గెట్ అయ్యాడు. ఆల్రౌండర్లకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తామంటే ఫలితం ఇలాగే ఉంటుందంటూ గంభీర్కు మాజీ క్రికెటర్లు చురకలు అంటిస్తున్నారు.మిడిలార్డర్లో నిఖార్సైన బ్యాటర్ కావాలిఐర్లాండ్ చేతిలో టీమిండియా పరాభవం నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సైతం గంభీర్పై విమర్శనా బాణాలు ఎక్కుపెట్టాడు. ‘‘గంభీర్ మార్గదర్శనంలో ఇది జరిగింది. అయితే, ఇప్పుడే ఓ అంచనాకు రాకూడదు. కానీ ఇక్కడ ఆల్రౌండర్లకే ప్రాధాన్యం కదా!..నిజానికి టీమిండియాకు మిడిలార్డర్లో నిఖార్సైన బ్యాటర్ అవసరం ఉంది’’ అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. ఇక తమదైన శైలిలో ట్వీట్లు చేస్తూ నెటిజన్లను అలరించే ఐస్లాండ్ క్రికెట్ సైతం ఈసారి గంభీర్ పట్ల కాస్త వ్యంగ్యంగానే స్పందించింది.మాకు కోచ్గా వద్దు‘‘గౌతం గంభీర్ను మా జట్టుకు హెడ్కోచ్గా కోరుకోవడం లేదని ధ్రువీకరిస్తున్నాం. అతడు గొప్ప ప్రతిభావంతుడు. అయినప్పటికీ మాకైతే వద్దు. ఐర్లాండ్లో ఏదైతే జరిగిందో.. నిజంగా ఆ ఫలితాలు నిజంగా చిరకాలం గుర్తుండిపోయే బహుమతులు’’ అంటూ ఐస్లాండ్ క్రికెట్ సెటైర్లు వేసింది.ఛీ.. ఆఖరికి వీళ్లకూ లోకువైపోయాం!దీంతో.. ‘ఛీ.. ఆఖరికి అనామక క్రికెట్ బోర్డు చేతిలోనూ మాటలు పడేలా చేశారు’ అంటూ గంభీర్, ఆటగాళ్లపై భారత జట్టు అభిమానులు మండిపడుతున్నారు. కాగా బెల్ఫాస్ట్ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా.. ఐర్లాండ్ను 154 పరుగులకు కట్టడి చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడిన భారత్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది.చదవండి: అభిషేక్, సంజూ వల్ల టీమిండియాకు అప్రతిష్ట We can confirm that we don't wish to add Gautam Gambhir to our coaching staff. He clearly has talent, though. To take those Indian players and deliver those results in Ireland takes truly remarkable gifts.— Iceland Cricket (@icelandcricket) June 28, 2026 -
మళ్లీ నగుబాటే...
బెల్ఫాస్ట్: ఐర్లాండ్ పర్యటనలో భారత పురుషుల క్రికెట్ జట్టు పూర్తిగా విఫలమైంది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో భారీ స్కోరు ఛేదించలేక చతికిలబడిన టీమిండియా... రెండో మ్యాచ్లో చిన్న లక్ష్యాన్ని కూడా అందుకోలేకపోయింది. ఆదివారం జరిగిన రెండో టి20లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా ఒక పరుగు తేడాతో ఐర్లాండ్ చేతిలో ఓడింది. దీంతో ఐర్లాండ్ 2–0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఏ ఫార్మాట్లోనైనా ఐర్లాండ్కు టీమిండియాపై ఇదే తొలి సిరీస్ విజయం కాగా... టి20ల్లో వరుసగా 16 సిరీస్ విజయాల తర్వాత భారత్కు తొలి ఓటమి ఎదురైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్... నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్ (47 బంతుల్లో 53; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్సెంచరీ సాధించగా... బెన్ కాలిట్జ్ (23 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... శివమ్ దూబే రెండు వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. తిలక్ వర్మ (46 బంతుల్లో 55; 3 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేయగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో జై ముంద్రా, హోలార్డ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ముంద్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’అవార్డులు దక్కాయి. ఈ మ్యాచ్ ద్వారా భారత యువ పేసర్ ప్రిన్స్ యాదవ్, ఆల్రౌండర్ సూర్యాన్ష్ షెడ్గే అంతర్జాతీయ టి20 అరంగేట్రం చేయగా... 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి మరోసారి ఎదురుచూపులు తప్పలేదు. ఐర్లాండ్ పర్యటనను ముగించుకున్న భారత్... బుధవారం నుంచి ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో పాల్గొననుంది. పారని అయ్యర్ పాచిక ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సమర్థులు ఉన్నారనే నమ్మకంతో వరుసగా రెండో మ్యాచ్లోనూ భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ మాదిరిగానే ఈ సారి కూడా మన బౌలర్లు ఆరంభంలోనే వికెట్లు పడగొట్టారు. టిమ్ టెక్టర్ (5), రాస్ అడెయిర్ (16; 1 ఫోర్, 2 సిక్స్లు) ఎక్కువసేపు నిలవలేకపోవడంతో... 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ టకర్ (15) కూడా విఫలం కాగా... ఈ దశలో కాలిట్జ్ అండతో హ్యారీ టెక్టర్ కీలక పరుగులు సాధించాడు. చాపకింద నీరులా ముందుకు సాగిన టెక్టర్ జట్టుకు పోరాడే స్కోరు అందించి చివరి ఓవర్లో వెనుదిరిగాడు. టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన శ్రేయస్ అయ్యర్... తాజా ఐపీఎల్ అనంతరం అనూహ్య పరిణామాల మధ్య జట్టులోకి రావడంతో పాటు సారథ్య అవకాశం కూడా దక్కించుకున్నా మైదానంలో మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. పరుగులు నియంత్రించడంతో పాటు వికెట్లు తీస్తున్న హర్షిత్ రాణా కోటా పూర్తి చేయించలేకపోయిన శ్రేయస్... ఆ తర్వాత బ్యాటింగ్లోనూ స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. అభిషేక్, సామ్సన్ గోల్డెన్ డక్... ఈ మ్యాచ్లోనూ ఛేదనకే మొగ్గు చూపిన టీమిండియాకు తొలి ఓవర్లోనే డబుల్ షాక్ తగిలింది. టి20 ప్రపంచకప్లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’గా నిలిచిన సంజూ సామ్సన్ (0) ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోగా... నాలుగో బంతికి అభిషేక్ శర్మ (0) కూడా ‘గోల్డెన్ డకౌట్’గా వెనుదిరిగాడు. మూడో ఓవర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (10) కూడా అవుటయ్యాడు. ఈ మూడు వికెట్లు జై ముంద్రా ఖాతాలోకే వెళ్లాయి. ఇషాన్ కిషన్ (12) రనౌట్ రూపంలో వెనుదిరిగడంతో భారత జట్టు 35/4తో పీకల్లోతూ కష్టాల్లో పడింది. గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్లో జట్టును గెలిపించిన అనుభవం ఉన్న హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ ఇన్నింగ్స్ నడిపించే బాధ్యత తీసుకోగా... అతడికి అక్షర్ పటేల్ (14), శివమ్ దూబే (20) కాస్త సహకరించారు. దీంతో జట్టు గాడినపడ్డట్లే అనుకుంటుండగా... 18వ ఓవర్ రెండో బంతికి తిలక్ అవుటయ్యాడు. అరంగేట్ర ఆటగాడు సూర్యాన్ష్ (1) ప్రభావం చూపలేకపోగా... హర్షిత్ రాణా (10 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమయ్యాయి. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ప్రిన్స్ (6 నాటౌట్) సిక్స్ కొట్టినా అప్పటికే ఆలస్యమైపోయింది.స్కోరు వివరాలు ఐర్లాండ్ ఇన్నింగ్స్: టిమ్ టెక్టర్ (సి) అభిషేక్ (బి) రాణా 5; అడెయిర్ (సి) తిలక్ (బి) అర్ష్ దీప్ 16; హ్యారీ టెక్టర్ (సి) ఇషాన్ (బి) ప్రిన్స్ 53; టకర్ (సి) ఇషాన్ (బి) ప్రిన్స్ 15; కాలిట్జ్ (సి) తిలక్ (బి) దూబే 37; డెలానీ (బి) దూబే 0; డాక్రెల్ (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 19; మెక్కార్టీ (సి) ఇషాన్ (బి) ప్రిన్స్ 2; జై ముంద్రా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–17, 2–21, 3–48, 4–113, 5–113, 6–144, 7–153, 8–154. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–35–2; హర్షిత్ రాణా 3–0–17–1; ప్రిన్స్ 4–0–22–3; శివమ్ దూబే 3–0–25–2; సూర్యాన్ష్ 2–0–25–0; అక్షర్ 4–0–28–0. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (ఎల్బీ) (బి) ముంద్రా 0; అభిషేక్ (సి) హోలార్డ్ (బి) ముంద్రా 0; ఇషాన్ (రనౌట్) 12; శ్రేయస్ (బి) ముంద్రా 10; తిలక్ (సి) మెక్కార్టీ (బి) హోలార్డ్ 55; అక్షర్ (సి) టకర్ (బి) హోలార్డ్ 14; శివమ్ దూబే (సి) డాక్రెల్ (బి) హంఫ్రీస్ 20; సూర్యాన్ష్ (సి) టిమ్ టెక్టర్ (బి) హోలార్డ్ 1; హర్షిత్ రాణా (సి) టిమ్ టెక్టర్ (బి) హ్యారీ టెక్టర్ 21; అర్ష్ దీప్ (నాటౌట్) 4; ప్రిన్స్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–0, 2–1, 3–19, 4–35, 5–74, 6–109, 7–117, 8–121, 9–147. బౌలింగ్: జై ముంద్రా 4–0–32–2; హంఫ్రీస్ 4–0–28–1; హోలార్డ్ 4–0–26–3; మెక్కార్టీ 4–0–22–0; హ్యారీ టెక్టర్ 4–0–40–1. -
ఐర్లాండ్తో రెండో టీ20.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ఐర్లాండ్తో రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా బౌలర్లు మెరుగ్గా రాణించారు. ప్రత్యర్థిని నామమాత్రపు స్కోరుకే పరిమితం చేయగలిగారు. కాగా రెండు టీ20 మ్యాచ్లు ఆడేందుకు భారత జట్టు ఐర్లాండ్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా బెల్ఫాస్ట్ వేదికగా తొలి టీ20లో శ్రేయస్ అయ్యర్ సేన అనూహ్య రీతిలో ఓటమి పాలైంది. ఆతిథ్య జట్టు చేతిలో 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో తాజాగా అదే వేదికపై మళ్లీ టాస్ గెలిచిన భారత్.. మరోసారి తొలుత బౌలింగ్నే ఎంచుకుంది.హ్యారీ టెక్టార్ అర్ధ శతకంకెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నమ్మకాన్ని నిజం చేస్తూ పేసర్ హర్షిత్ రాణా తొలి ఓవర్లోనే ఐరిష్ ఓపెనర్ టిమ్ టెక్టార్ (5)ను వెనక్కి పంపాడు. ఇక అర్ష్దీప్ సింగ్ మరో ఓపెనర్ రాస్ అడైర్ (16)ను పెవిలియన్కు చేర్చాడు. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ హ్యారీ టెక్టార్ అర్ధ శతకం (53)తో రాణించగా.. బెంజమిన్ కాలిట్జ్ (37) అతడికి తోడుగా నిలబడ్డాడు.మిగిలిన వారిలో గెరెత్ డెలానీ డకౌట్ కాగా.. కెప్టెన్ లోర్కాన్ టక్కర్ 15 జార్జ్ డాక్రెల్ 19 పరుగులు చేసి వెనుదిరిగారు. ఆఖరి ఓవర్లో ప్రిన్స్ యాదవ్ హ్యారీ టెక్టార్, లియామ్ మెక్కార్తీ (2)లను పెవిలియన్కు పంపాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐర్లాండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. తద్వారా టీమిండియాకు 156 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఇకభారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, శివం దూబే చెరో రెండు, హర్షిత్ రాణా ఒక వికెట్ పడగొట్టారు. -
IND vs IRE: సిరీస్ క్లీన్స్వీప్ చేసిన ఐర్లాండ్
ఐర్లాండ్తో రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఫలితంగా బెల్ఫాస్ట్ వేదికగా ఐరిష్ జట్టు మరోసారి తొలుత బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగులు చేయగా... టీమిండియా లక్ష్య ఛేదనలో తేలిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 153 పరుగులే చేసింది. ఫలితంగా ఒక్క పరుగు తేడాతో గెలుపొంది ఐర్లాండ్ సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసింది.***********************************************************************************ఎనిమిదో వికెట్ డౌన్17.5: హోలార్డ్ బౌలింగ్లో సూర్యాంశ్ (1) అవుట్.ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా17.2: హోలార్డ్ బౌలింగ్లో మెక్కార్తికి క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్గా వెనుదిరిగిన తిలక్ వర్మ (55). విజయానికి 16 బంతుల్లో 38 పరుగులు కావాలి.ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా16.1: హంఫ్రేస్ బౌలింగ్లో శివం దూబే (20) అవుట్. స్కోరు: 109-6(16.1). తిలక్ 48 పరుగులతో ఉన్నాడు.15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 104-5తిలక్ 46, శివం దూబే 17 పరుగులతో ఉన్నారు.ఐదో వికెట్ డౌన్11.3: మాథ్యూ హోలార్డ్ బౌలింగ్ టక్కర్కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్గా వెనుదిరిగిన అక్షర్ పటేల్ (14). స్కోరు: 74-5(11.3)పది ఓవర్లలో టీమిండియా స్కోరుతిలక్ వర్మ 27 , అక్షర్ పటేల్ 12 పరుగులతో ఉన్నారు. విజయానికి 60 బంతుల్లో 89 పరుగులు కావాలి. వర్షం వల్ల ఆటకు అంతరాయంఎనిమిది ఓవర్ల తర్వాత ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. భారత్ విజయానికి 72 బంతుల్లో 101 పరుగులు కావాలి. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి.ఎనిమిది ఓవర్లలో టీమిండియా స్కోరు: 54-4అక్షర్ పటేల్ ఏడు, తిలక్ వర్మ 21 పరుగులతో ఉన్నారు.పవర్ ప్లేలో టీమిండియా స్కోరు:41-4(6)తిలక్ 14, అక్షర్ పటేల్ 1 పరుగుతో ఉన్నారు. విజయానికి 84 బంతుల్లో 114 పరుగులు కావాలి.నాలుగో వికెట్ కోల్పోయిన భారత్4.5: జై ముంద్రా బౌలింగ్లో తిలక్ వర్మ బంతిని ఎదుర్కోగా.. ఇషాన్ (12) సింగిల్ కోసం వెళ్లి రనౌట్ అయ్యాడు. స్కోరు: 35-4(4.5). తిలక్ వర్మ 13 పరుగులతో ఉండగా.. అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు.మూడో వికెట్ డౌన్2.4: జై ముంద్రా బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ (7 బంతుల్లో 10) బౌల్డ్. స్కోరు: 19-3(2.4). విజయానికి 136 పరుగులు కావాలి. తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (9*) క్రీజులో ఉన్నారు.సంజూ, అభిషేక్ శర్మ డకౌట్తొలి ఓవర్లోనే ఐర్లాండ్ లెఫ్టార్మ్ పేసర్, భారత సంతతి ఆటగాడు జై ముంద్రా సంచలనం సృష్టించాడు. తొలి బంతికే సంజూను గోల్డెన్ డకౌట్గా వెనక్కి పంపిన జై.. నాలుగో బంతికి అభిషేక్ శర్మను డకౌట్ చేశాడు. భారత్ స్కోరు: 1-2(0.5). ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు.టీమిండియా టార్గెట్ ఎంతంటే?ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు19.6: ఆఖరి బంతికి ఇషాన్కు క్యాచ్ ఇచ్చి అవుటైన మెక్కార్తి (2)19.4: ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన హ్యారీ టెక్టార్ (53).ఆరో వికెట్ డౌన్18.3: అర్ష్దీప్ బౌలింగ్లో అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్గా వెనుదిరిగిన జార్జ్ డాక్రెల్ (14 బంతుల్లో 19). స్కోరు 144-6(18.4)👉 వర్షం అంతరాయం.. నాలుగు నిమిషాల్లో మళ్లీ మొదలైన మ్యాచ్ (7.28 PM)ఐదో వికెట్ డౌన్14.5: వరుసగా రెండో వికెట్ తీసిన శివం దూబే. డెలానీని బౌల్డ్ చేసి డకౌట్గా వెనక్కి పంపిన దూబే. స్కోరు: 113-5(14.5). జార్జ్ డాక్రెల్ క్రీజులోకి వచ్చాడు. పదిహేను ఓవర్లలో ఐర్లాండ్ స్కోరు: 114-5(15).నాలుగో వికెట్ కోల్పోయిన ఐర్లాండ్14.4: శివం దూబే బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా వెనుదిరిగిన బెంజమిన్ (23 బంతుల్లో 37). క్రీజులోకి డెలానీ. స్కోరు: 113-4(14.4). హ్యారీ టెక్టార్ 37 పరుగులతో ఉన్నాడు.సెంచరీ కొట్టిన ఐర్లాండ్13.2: హర్షిత్ రాణా బౌలింగ్ ఫోర్ బాదిన బెంజమిన్. సెంచరీ పూర్తి చేసుకున్న ఐర్లాండ్. 102-3(13.3).12 ఓవర్లలో ఐర్లాండ్ స్కోరు: 88-3బెంజమిన్ 18, హ్యారీ టెక్టార్ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు.మూడో వికెట్ డౌన్7.3: ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్గా వెనుదిరిగిన లోర్కాన్ టక్కర్ (18 బంతుల్లో 15). ఐర్లాండ్ స్కోరు: 50-3 (8). బెంజమిన్, హ్యారీ టెక్టార్ క్రీజులో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఐర్లాండ్2.2: అర్ష్దీప్ బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన రాస్ అడైర్ (7 బంతుల్లో 16). కెప్టెన్ లోర్కాన్ టక్కర్ క్రీజులోకి వచ్చాడు. ఐర్లాండ్ స్కోరు: 26-2(3). టక్కర్ 1, హ్యారీ టెక్టార్ 4 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఐర్లాండ్1.5: హర్షిత్ రాణా బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ఇచ్చి పెవిలియన్ చేరిన టిమ్ టెక్టార్ (6 బంతుల్లో 5). హ్యారీ టెక్టార్ క్రీజులోకి వచ్చాడు. ఇద్దరి అరంగేట్రంఈ మ్యాచ్ సందర్భంగా తమ జట్టు తరఫున సూర్యాంశ్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్ (టీ20) అరంగేట్రం చేస్తున్నట్లు టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. సూర్యాంశ్ ఐపీఎల్లో సత్తా చాటాడని.. అతడి ఆట తీరుపై తమకు నమ్మకం ఉందని పేర్కొన్నాడు. అయితే, చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీకి మాత్రం మరోసారి మొండిచేయి ఎదురైంది.తొలి టీ20లో విఫలమైన వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణపై వేటు పడింది. వారిద్దరి స్థానాల్లో సూర్యాంశ్, ప్రిన్స్ యాదవ్ తుదిజట్టులోకి వచ్చారు. అయితే, ఐర్లాండ్ మాత్రం తొలి టీ20లో టీమిండియాపై గెలుపొందిన జట్టునే కొనసాగించింది. కాగా బెల్ఫాస్ట్ వేదికగా తొలి టీ20లో ఆతిథ్య ఐర్లాండ్ టీమిండియాను 34 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా తొలిసారి భారత జట్టుపై గెలుపు నమోదు చేసింది.తుదిజట్లుటీమిండియాఅభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.ఐర్లాండ్టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్(కెప్టెన్, వికెట్ కీపర్), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై ముంద్రా, మాథ్యూ హోలార్డ్. -
రెండో టీ20 ఆడనున్న వైభవ్.. వేటు పడేది ఎవరిపైనో!
ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా అనూహ్య ఓటమిని చవిచూసింది. బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే టీమిండియా సంచలనం వైభవ్ సూర్యవంశీకి జట్టులో చోటు లభించకపోవడంపై విమర్శలు వచ్చాయి. వైభవ్ నిన్నటి మ్యాచ్లో ఉండుంటే పరిస్థితి వేరుగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరంభంలోనే ఫోర్లు, సిక్సర్లు బాది ప్రత్యర్థిపై ఒత్తడి పెట్టే ప్రయత్నం చేసేవాడని కొంతమంది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న రెండో టీ20 మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు కూడా పెరిగిపోతున్నాయి. అయితే వైభవ్కు తుదిజట్టులో చోటు దక్కాలంటే ఎవరిని తప్పించాలనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఒకవేళ వైభవ్ జట్టులోకి వస్తే ఓపెనర్గానే ఆడే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన వైభవ్ కోసం సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మల్లో ఒకరు తమ స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఏడాది భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో సంజూ శాంసన్ది కీలకపాత్ర. టీ20 ప్రపంచకప్లో శాంసన్ 321 పరుగులు సాధించి జట్టులో తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు. అయితే ఐర్లాండ్తో తొలి టీ20లో మాత్రం శాంసన్ విఫలమయ్యాడు. నాలుగు బంతులెదుర్కొన్న శాంసన్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అదే సమయంలో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడమే గాక తన స్థానాన్ని మరింత పదిలపరుచుకున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా మంచి ఫామ్లో ఉన్నప్పటికీ ఐర్లాండ్తో మ్యాచ్లో విఫలమయ్యాడు. ఐర్లాండ్తో మ్యాచ్లో ఐదు బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే వైభవ్ సూర్యవంశీ జట్టులోకి రావాలంటే మాత్రం ఇషాన్ కిషన్ను తప్పించడమే తొలి మార్గం. ఎందుకంటే అభిషేక్తో కలిసి వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ వస్తే, సంజూ శాంసన్ వన్డౌన్లో బ్యాటింగ్కు రానున్నాడు. అంతేకాదు శాంసన్ మూడో స్థానంలో మంచి బ్యాటింగ్ రికార్డు ఉంది. ఐపీఎల్లో మూడో స్థానంలో 94 మ్యాచ్ల్లో 143 స్ట్రైక్రేట్తో 3,096 పరుగులు సాధించాడు. శాంసన్తో పాటు ఇషాన్ కిషన్ను జట్టులో ఉంచాలనుకుంటే ఆఖరి ఆప్షన్ మాత్రం తిలక్ వర్మే. అయితే తిలక్ వర్మ ఎక్కువగా మిడిలార్డర్లో బ్యాటింగ్కు వస్తున్నాడు. నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్కు వస్తూ ఫినిషర్గా రాణిస్తున్నాడు. ఆసియా కప్ 2025 ఫైనల్లో 69 పరుగుల కీలక ఇన్నింగ్స్తో మెరిశాడు. అయితే టీ20 ప్రపంచకప్లో 9 ఇన్నింగ్స్ల్లో తిలక్ వర్మ 209 పరుగులు సాధించిన తిలక్ వర్మ స్ట్రైక్ రొటేట్ చేయడంలో ఇబ్బంది పడ్డాడు. అయితే ఇన్ని బేరీజులు వేసుకున్నప్పటికీ వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్తో రెండో టీ20లో మాత్రం ఆడే అవకాశాలు తక్కువే అని చెప్పొచ్చు.Read: టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు -
ఒక్క ఓవర్లోనే అన్ని పరుగులా?.. ఇదేం బౌలింగ్?
టీమిండియా పేసర్ ప్రసిద్ కృష్ణ ఆట తీరును భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా విమర్శించాడు. ఐపీఎల్లో బాగానే ఆడుతున్నప్పటికీ.. జాతీయ జట్టు తరఫున మాత్రం తేలిపోతున్నాడని పెదవి విరిచాడు. ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓటమికి ప్రధాన కారణాల్లో ప్రసిద్ ఒకడని విమర్శలు గుప్పించాడు.34 పరుగుల తేడాతో కాగా టీ20 ప్రపంచకప్-2026లో చాంపియన్గా నిలిచిన టీమిండియా.. ఆ తర్వాత ఆడిన తొలి మ్యాచ్లోనే ఘోర పరాభవం చవిచూసింది. బెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్తో శుక్రవారం జరిగిన తొలి టీ20లో 34 పరుగుల తేడాతో చాంపియన్ జట్టు ఓటమిపాలైంది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గాయం నుంచి కోలుకుని ఈ మ్యాచ్తో పునరాగమనం చేసిన హర్షిత్ రాణా మూడు వికెట్లతో సత్తా చాటగా.. అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు.. శివం దూబే ఒక వికెట్ పడగొట్టారు. వీరంతా సగటున 6 ఎకానమీతో పరుగులు ఇచ్చారు.దారుణ ప్రదర్శన అయితే, ఈ మ్యాచ్లో ప్రసిద్ కృష్ణ మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి ఏకంగా 57 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఎకానమీ 14.20. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా ప్రసిద్ కృష్ణ ఆటను విమర్శించాడు.‘‘హర్షిత్ రాణా రీఎంట్రీలో అత్యద్భుతంగా బౌలింగ్ చేశాడు. అర్ష్దీప్ కూడా రాణించాడు. అక్షర్ కూడా ఓకే. శివం దూబే మూడు ఓవర్లు వేసి వికెట్ తీయగలిగాడు. కానీ ప్రసిద్ కృష్ణ మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు.ఒక్క ఓవర్లోనే అన్ని పరుగులా?ఇప్పటి వరకు టీమిండియా తరఫున అతడు ఆరు టీ20 మ్యాచ్లు ఆడి.. 24 ఓవర్లలో ఎనిమిది వికెట్లు తీశాడు. అతడు ప్రతీ మ్యాచ్లోనూ తన నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయడం మంచి విషయం. కానీ ఓవర్కు సగటున 11.5 పరుగుల చొప్పున సమర్పించుకున్నాడు.అయితే ఐపీఎల్లో మాత్రం గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రసిద్ బాగానే రాణిస్తున్నాడు. గతేడాది అత్యధిక వికెట్ల వీరుడిగా పర్పుల్ క్యాప్ కూడా అందుకున్నాడు. టీమిండియానే అతడి సేవల్ని సద్వినియోగం చేసుకోలేకపోతోందా?’’ అని ఆకాశ్ చోప్రా తన పేర్కొన్నాడు. కాగా టీమిండియా- ఐర్లాండ్ మధ్య ఆదివారం నిర్ణయాత్మక రెండో టీ20 సైతం బెల్ఫాస్ట్ వేదికగానే జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రసిద్ను తప్పించి.. ప్రిన్స్ యాదవ్ను ఆడిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చదవండి: ‘నేను 13 సిక్సర్లు కొడతాను.. మిగతాది మీరు చూసుకోండి’ -
‘నేను 13 సిక్స్లు కొడతా.. మిగతాది మీరు చూసుకోండి’
టీమిండియాకు ఘోర అవమానం జరిగింది. ఐర్లాండ్ చేతిలో భారత జట్టు మొట్టమొదటిసారి పరాజయం పాలైంది. బెల్ఫాస్ట్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో సమిష్టి వైఫల్యంతో టీమిండియా ఘోర పరాభవం మూటగట్టుకుంది.ముఖ్యంగా ఐరిష్ బౌలర్ల దెబ్బకు టీమిండియా స్టార్ బ్యాటర్లు పెవిలియన్కు వరుస కట్టారు. టాపార్డర్లో అభిషేక్ శర్మ (49) ఒక్కడు రాణించగా.. సంజూ శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (3) సైతం పూర్తిగా విఫలమయ్యాడు.బెంచ్కే పరిమితంకాగా ఐర్లాండ్తో మ్యాచ్ సందర్భంగా భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అరంగేట్రం చేస్తాడనే ప్రచారం జరిగింది. అయితే, అనుభవానికే పెద్దపీట వేసిన యాజమాన్యం వైభవ్ను బెంచ్కే పరిమితం చేసింది. ప్రపంచకప్ గెలిచిన జట్టులోని సభ్యులను తప్పించలేమంటూ ఈ పదిహేనేళ్ల పిల్లాడికి మొండిచేయి చూపింది.అయితే, ఐర్లాండ్ చేతిలో ఓటమి నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ తుదిజట్టులో ఉండి ఉంటే.. పరాభవం తప్పేదంటూ అభిమానులు పేర్కొంటున్నారు. అతడిని ఆడిస్తే ఫలితం వేరేలా ఉండేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో రాజస్తాన్ రాయల్స్ హెడ్కోచ్ కుమార్ సంగక్కర చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.నా దగ్గరకు వచ్చి కన్నుగీటి మరీ..‘‘లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్. మేము ముందుగా ఫీల్డింగ్ చేశాము. లక్నో విధించిన 220 పరుగుల లక్ష్యం ఛేదించాల్సి ఉంది. అప్పుడు వైభవ్ నడుస్తూ నా దగ్గరకు వచ్చి కన్నుగీటి మరీ.. ‘కోచ్. మీరేమీ ఆందోళన పడకండి. ఇది మనం చేసి తీరతాము’ అని చెప్పాడు.నేను 13 సిక్సర్లు బాదతానుడ్రెసింగ్రూమ్లో డొనోవాన్ ఫెరీరా, లువాన్ డ్రి ప్రిటోరియస్ దగ్గరకు వెళ్లి.. ‘మీ ఇద్దరూ కాస్త వినండి. నేను ఈరోజు 13 సిక్సర్లు బాదబోతున్నాను. నేను నా పని పూర్తి చేసిన తర్వాత మీరు మిగతాది చూసుకోండి’ అని చెప్పాడు. అన్నట్లుగానే ఏకంగా పది సిక్సర్లు కొట్టాడు.అతడు ఐదు సిక్సర్లు బాదిన తర్వాత డొనోవాన్, ప్రిటోరియస్ కింద కూర్చుని మరీ.. సిక్సర్లు లెక్కించడం మొదలుపెట్టారు. ఈ పిల్లాడు చెప్పింది చేసేట్లుగానే ఉన్నాడే అని ఆశ్చర్యపోయారు. వైభవ్ ఆత్మవిశ్వాసం అచంచలమైనది’’ అని సంగక్కర ‘స్కై స్పోర్ట్స్’తో వ్యాఖ్యానించాడు.పదిహేనేళ్లకే ఆరెంజ్ క్యాప్కాగా ఐపీఎల్-2026లో భాగంగా మే 19న జైపూర్లో లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ ఇన్నింగ్స్ బ్రేక్ సందర్భంగా.. ఈ ఘటన జరిగినట్లు సంగక్కర మాటల ద్వారా అర్థమైంది. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ 38 బంతుల్లోనే ఏడు ఫోర్లు, పది సిక్సర్లు బాది 93 పరుగులు చేశాడు. రాజస్తాన్ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.ఇక మొత్తంగా ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ పదహారు మ్యాచ్లలో కలిపి 776 పరుగులు సాధించాడు. రాజస్తాన్ ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. పదిహేనేళ్లకే ఆరెంజ్ క్యాప్ గెలిచి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే ఏకంగా టీమిండియాకు ఎంపికయ్యాడు.చదవండి: చిన్న దేశం.. అతిపెద్ద విజయం.. సరికొత్త చరిత్ర -
అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు.. ఎందుకో తెలుసా?
ఐర్లాండ్ పర్యటన ఆరంభంలోనే టీమిండియాకు చుక్కెదురైంది. టీ20 ప్రపంచకప్-2026 చాంపియన్స్ నిలిచిన తర్వాత ఆడిన తొలి మ్యాచ్లోనే భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆతిథ్య ఐరిష్ జట్టు వరల్డ్కప్ విజేతను ఓ ఆట ఆడుకుంది.బెల్ఫాస్ట్ వేదికగా సమిష్టి కృషితో రాణించి టీమిండియాను 34 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా అన్ని ఫార్మాట్లలోనూ ఐర్లాండ్ తొలిసారిగా భారత్పై గెలుపు రుచిచూసింది. ఇక ఈ సిరీస్తో టీమిండియా టీ20 కెప్టెన్గా ప్రయాణం ఆరంభించిన శ్రేయస్ అయ్యర్కు కూడా ఇది కోలుకోలేని దెబ్బే!పెవిలియన్కు క్యూఇదిలా ఉంటే.. ఐర్లాండ్ విధించిన 183 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఆదిలోనే టపటపా వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఓపెనర్ సంజూ శాంసన్ (5) జై ముంద్రా పెవిలియన్కు పంపగా.. వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (3)ను మ్యాట్ హోలార్డ్ అవుట్ చేశాడు.ఇక నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (3)ను కూడా హోలార్డ్ సింగిల్ డిజిట్కే పరిమితం చేశాడు. తిలక్ వర్మ (19)ను మాథ్యూ హాంఫ్రేస్, వాషింగ్టన్ సుందర్ (9)ను హోలార్డ్ వెనక్కి పంపగా.. ఒంటరి పోరాటం చేసి శివం దూబే (14 బంతుల్లో 25) వికెట్ను జై ముంద్రా దక్కించుకున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్నామిగిలిన వారిలో అక్షర్ పటేల్ (15), హర్షిత్ రాణా (8), అర్ష్దీప్ సింగ్ (2) సైతం ఇలా వచ్చి అలా వెళ్లారు. అయితే, ఈ మ్యాచ్లో ఆకట్టుకున్న ఏకైక భారత ఆటగాడు అభిషేక్ శర్మ మాత్రమే. ఓవైపు వికెట్లు పడుతున్నా ఈ ఓపెనింగ్ బ్యాటర్ మాత్రం దూకుడుగానే ఆడుతూ స్కోరు బోర్డుపై పరుగులు జమ చేశాడు.ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ 19 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. ఇందుకు సంబంధించిన బీసీసీఐ ట్వీట్ కూడా చేసింది. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సైతం తన కెరీర్లోని మరో ‘ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ’ని సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే, ఆ వెంటనే లియామ్ మెకర్తీ బౌలింగ్లో బెంజమిన్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ పెవిలియన్కు చేరాడు.కథలో అసలు మలుపు అప్పుడే కథలో అసలు మలుపు వచ్చింది. అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీని రద్దు చేసినట్లు స్కోరు బోర్డులో రివైజ్డ్ స్కోరు వచ్చింది. ఇందుకు కారణం జై ముంద్రా బౌలింగ్ (భారత్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్)లో అభిషేక్ శర్మ సింగిల్ తీశాడు. అయితే, ఆ తర్వాత అది లెగ్బైగా తేలింది. దీంతో అభిషేక్ ఖాతా నుంచి ఆ పరుగు మైనస్ అయింది. ఫలితంగా 20 బంతుల్లో అభిషేక్ శర్మ 49 పరుగులు చేసినట్లు తేలింది.నిబంధనలు ఏం చెబుతున్నాయి?వైడ్ల మాదిరే లెగ్బై కూడా అదనపు పరుగుల్లో భాగం. బంతి బ్యాట్కు కాకుండా బ్యాటర్ శరీరానికి (బ్యాట్ పట్టుకున్న చేయి, గ్లోవ్స్ మినహా) తాకినా.. ఆ సమయంలో బ్యాటర్కు పరుగులు తీసే అవకాశం వచ్చినా.. లేదంటే బంతి బౌండరీని తాకినా జట్టు ఖాతాలో పరుగులు జమ అవుతాయి.కానీ బ్యాటర్ వ్యక్తిగత ఖాతాలో మాత్రం ఈ పరుగులు కౌంట్ అవ్వవు. అభిషేక్ శర్మ విషయంలో ఇదే జరిగింది. ముంద్రా బౌలింగ్లో వచ్చిన లెగ్బై టీమిండియా ఖాతాలో చేరి.. అతడి ఖాతా నుంచి మైనస్ అయింది. అయితే, ఇక్కడ అభిషేక్ అవుటైన తర్వాత అంపైర్లు ఈ విషయాన్ని గుర్తించడం వివాదానికి, గందరగోళానికి కారణమైంది. Same old story when Abhishek Sharma gets going. 🔥Watch #IREvIND LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/4SMkYA5LT6— Sony Sports Network (@SonySportsNetwk) June 26, 2026ఇక ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 49 పరుగులతో భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలవగా... మిగిలిన బ్యాటర్ల వైఫల్యం కారణంగా 18.5 ఓవర్లలో కేవలం 148 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా 34 పరుగుల తేడాతో ఓటమి పాలై 0-1తో వెనుబడింది.చదవండి: కెప్టెన్గా నాకిది గొప్ప ఆరంభం -
ఐర్లాండ్ చేతిలో ఓటమి.. కెప్టెన్గా నాకు గొప్ప ఆరంభం
టీమిండియా టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. పసికూనలా భావించే ఐర్లాండ్ చేతిలో భారత జట్టు అనూహ్య రీతిలో ఓడిపోయింది. బెల్ఫాస్ట్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో శ్రేయస్ సేన 34 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో పరాజయం పాలైంది.టక్కర్ అర్ధ శతకం ఐర్లాండ్తో మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టాపార్డర్ను కుదేలు చేసి శుభారంభం అందుకున్నా.. తర్వాత దానిని కొనసాగించలేకపోయింది. ఐరిష్ జట్టు కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన లోర్కాన్ టక్కర్ మెరుపు అర్ధ శతకం (38 బంతుల్లో 50)తో ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. గెరాత్ డెలనీ (50) కూడా రాణించాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐర్లాండ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా మూడు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలా రెండు.. శివం దూబే ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమింఇయా 18.5 ఓవర్లలో కేవలం 148 పరుగులు చేసి ఆలౌట్ అయింది.అభిషేక్ ఒక్కడే..ఓపెనర్ అభిషేక్ శర్మ (49) చెలరేగినా మిగతా వారి నుంచి అతడికి సహకారం అందలేదు. లోయర్ ఆర్డర్లో శివం దూబే (14 బంతుల్లో 25) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఐర్లాండ్ చేతిలో టీమిండియా తొలిసారి టీ20 మ్యాచ్లో పరాజయం నమోదు చేసింది.ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఇదొక గొప్ప ఆరంభం అని పేర్కొనడం గమనార్హం. ‘‘ఏదీ సులువుగా దొరకదు. కఠినంగా శ్రమిస్తేనే విజయం వరిస్తుంది. గతంలో ఏం జరిగిందన్న విషయంతో సంబంధం లేకుండా.. వర్తమానంలో జీవించడం ముఖ్యం.The perfect start for the Men in Blue.💙Harshit Rana strikes early, and Sanju Samson does the rest behind the stumps.👏Watch #IREvIND LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/esK99zoUwA— Sony Sports Network (@SonySportsNetwk) June 26, 2026కెప్టెన్గా గొప్ప ఆరంభంప్రత్యర్థిని కట్టడి చేసే అవకాశం లభిస్తే.. ఆ క్షణాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ చేజారనీయకూడదు. నిజానికి ఆరంభంలో మా బౌలర్లు అత్యద్భుతంగా బౌలింగ్ చేశారు. వరుసగా వికెట్లు పడగొట్టి సత్తా చాటారు. కానీ ఆ తర్వాత మేము మొమెంటమ్ కోల్పోయాము.ఇక్కడ వాళ్లు 140 పరుగులు చేయడం గొప్పే అనిపించింది. కానీ వారిని మేము కట్టడి చేయలేకపోయాము. ఏదేమైనా ఇక్కడ గొప్ప అనుభవం లభించింది. ఇలాంటి పిచ్లపై మరిన్ని మ్యాచ్లు ఆడాలి. అప్పుడే వికెట్పై మాకు ఓ అవగాహన వస్తుంది. ఏదేమైనా కెప్టెన్గా నాకిది గొప్ప ఆరంభమే’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.చదవండి: అందుకే వైభవ్ను ఆడించలేదు: శ్రేయస్The moment history was made! 💚#BackingGreen | #IREvIND | #FáilteSolar pic.twitter.com/irDjNkEbK9— Cricket Ireland (@cricketireland) June 26, 2026 -
టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు
ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 34 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తన తొలి మ్యాచ్లోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. టీ20 కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న తొలి మ్యాచ్లోనే ఓటమి చవిచూసిన టీమిండియా ఆటగాళ్ల జాబితాలో అయ్యర్ చోటు సంపాదించాడు. గతంలో విరాట్ కోహ్లీ (2017లో ఇంగ్లండ్పై), రిషబ్ పంత్ (2022లో సౌతాఫ్రికాపై), శుబ్మన్ గిల్ (2024లో జింబాబ్వేపై) కెప్టెన్లుగా తమ తొలి మ్యాచ్లో ఓటమి చవిచూశారు. తాజాగా వీరి సరసన శ్రేయస్ అయ్యర్ నిలిచాడు.👉2024 జనవరి నుంచి టీమిండియా ఒక్క టీ20 సిరీస్ను కోల్పోవడం జరగలేదు. 2023లో సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా 1-1తో డ్రా చేసుకుంది. అప్పటినుంచి టీమిండియా వరుసగా 12 సిరీస్లు గెలుచుకోవడం గమనార్హం.👉ఇక ఐర్లాండ్ 12సార్లు (అన్ని ఫార్మాట్లు) టీమిండియాతో తలపడింది. ఇందులో 9 టీ20లు, మూడు వన్డేలున్నాయి. కాగా ఐర్లాండ్కు టీమిండియాపై ఇదే తొలి విజయం కావడం విశేషం.👉అంతర్జాతీయ క్రికెట్లో భారత్ను ఓడించిన 11వ జట్టుగా ఐర్లాండ్ నిలిచింది. ఇక ఐర్లాండ్ చేతిలో ఓటమి చవిచూసిన 8వ దేశంగా భారత్ నిలిచింది. ఇక ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్ మాత్రమే మిగిలి ఉన్నాయి. -
తప్పు చేశారు.. వైభవ్కు అవకాశమివ్వాల్సింది!
ఐర్లాండ్తో తొలి టీ20లో టీమిండియా దారుణ పరాజయం చవిచూసింది. ఐర్లాండ్ విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 148 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అయితే పసికూన చేతిలో ప్రపంచ నంబర్వన్, చాంపియన్ అయిన భారత్ ఓటమిని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తన తొలి మ్యాచ్లోనే ఓటమి చవిచూసి చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్తో తొలి టీ20లో అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓటమి సంగతి పక్కనబెడితే.. ఇవాళ వైభవ్ జట్టులో ఉండుంటే అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ వచ్చేవాడు. ట్రై సిరీస్ ఫైనల్లో వైభవ్ విధ్వంసంర చూశాకా ఐర్లాండ్తో మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయకపోయినా వేగంగా పరుగులు చేసేవాడు. ఆరంభంలోనే ఐర్లాండ్ బౌలర్లపై విరుచుకుపడుతూ ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించేవాడేమో. అవసరమయితే 12 లేదా 13 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించేసేవాడేమో. అతడి విధ్వంసంతో తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుండేదేమో. అభిషేక్ శర్మ తన స్టైల్ ఆటను ఆడినప్పటికీ, ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్తో పాటు ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ కూడా తక్కువ స్కోర్లకే వెనుదిరగడం టీమిండియా కొంపముంచింది. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా తక్కువ స్కోరుకే వెనుదిరగడం టీమిండియాను మరింత కష్టాల్లోకి నెట్టేసింది. ఆదుకుంటాడునుకున్న తిలక్ వర్మ చేతులెత్తేయడం, ఆల్రౌండర్ ట్యాగ్లు తగిలించుకొని బరిలోకి దిగిన శివమ్ దూబే, అక్షర్పటేల్, వాషింగ్టన్ సుందర్లు బాధ్యతగా ఆడాల్సింది పోయి నిర్లక్ష్యంగా వికెట్లు పారేసుకోవడం కనిపించింది. ఇదంతా జరగకుండా ఉండాలని అనుకొని ఉంటే వైభవ్కు ఒక ఛాన్స్ ఇచ్చి ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది అన్నట్లుగా.. వైభవ్ను ఆడించకుండా తప్పు చేశారు అని చాలా మంది అభిమానులు సోషల్మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. 🚨 🚨 Shreyas Iyer creates history in his first match as captain 🚨 🚨 INDIA LOST FOR THE FIRST TIME TO IRELAND 💥 Imagine having Vaibhav Sooryavanshi ( who could have finished the game in 12th over) & not making him play. And instead going with Test players like washington… pic.twitter.com/3fgLG08qV7— TheFakeFakeer (@TheFakeFakeer) June 26, 2026 -
టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్
బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియాకు ఐర్లాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 18.5 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఐర్లాండ్ తొలి టీ20లో 34 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ (50) మినహా మిగిలినవారంతా దారుణంగా విఫలమయ్యారు. లోయర్ ఆర్డర్లో శివమ్ దూబే (25) పర్వాలేదనిపించాడు. ఐర్లాండ్ బౌలర్లలో మాథ్యూ హొల్లార్డ్, మాథ్యూ హంపేరీస్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, భారత మూలాలున్న జై మూంద్రా రెండు వికెట్లు తీశాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.కెప్టెన్ లోర్కాన్ టక్కర్ (50) అర్ధసెంచరీతో రాణించగా, గారెత్ డెలానీ (32 బంతుల్లో 49) మెరిశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు తీయగా, అక్షర్పటేల్, అర్ష్దీప్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇక ఐర్లాండ్తో మ్యాచ్ను తేలిగ్గా తీసుకోవడమే టీమిండియా కొంపముంచింది. ఆరంభంలో హర్షిత్ రానా, అర్ష్దీప్ మంచి ఈజ్తో బౌలింగ్ చేసినప్పటికీ మిడిల్ ఓవర్లలో ధారాళంగా పరుగులొచ్చాయి. ఆ తర్వాత బ్యాటింగ్లోనూ ఏ ఒక్క బ్యాటర్ కూడా నిలకడగా ఆడేందుకు ప్రయత్నించలేదు. మొత్తంగా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమైన అయ్యర్ సేన దారుణ ఓటమిని మూటగట్టుకుంది.ఇక టీ20 ర్యాంకింగ్స్లో నంబర్వన్, ప్రపంచ చాంపియన్ అయిన టీమిండియాను పసికూన ఐర్లాండ్ ఓడించడం ఆ జట్టుకు సంచలనం కిందే లెక్క. ఇక శ్రేయస్ అయ్యర్ టీమిండియా కెప్టెన్గా తొలి టీ20 మ్యాచ్లోనే ఓటమి చవిచూసి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకోవాల్సి వచ్చింది.ఇక భారత్పై ఐర్లాండ్ జట్టుకు ఇదే తొలి విజయం కావడం విశేషం. ప్రపంచ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమిండియాకు ఈ పరాజయం ఒక హెచ్చరిక లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్పై చారిత్రాత్మక విజయం ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.చదవండి: అభిషేక్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డు -
అభిషేక్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డు
ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డులు సాధించాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 19 బంతుల్లోనే అర్ధశతకం మార్క్ అందుకోవడం ద్వారా పలు రికార్డులను సవరించాడు. ఆ రికార్డులు ఏంటనేవి ఒకసారి పరిశీలిద్దాం.👉అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో 20 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేయడం అభిషేక్ శర్మకు ఇది ఐదోసారి కావడం విశేషం. టీ20 క్రికెట్లో ఒక ఫుల్ మెంబర్ టీమ్ తరఫునఅత్యధిక సార్లు తక్కువ బంతుల్లో ఫిఫ్టీ సాధించిన బ్యాటర్గా అభిషేక్ శర్మ రికార్డులకెక్కాడు.👉ఐర్లాండ్పై అత్యంత తక్కువ బంతుల్లో ఫిఫ్టీ సాధించిన మూడో బ్యాటర్గా అభిషేక్ నిలిచాడు. గతంలో 2014లో స్టీఫెన్ మైబర్గ్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా, 2023లో బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్ 18 బంతుల్లో, తాజాగా అభిషేక్ 19 బంతుల్లో, 2025లో ఆస్ట్రేలియా బ్యాటర్ ఫిల్ సాల్ట్ 20 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు.👉టీమిండియా తరఫున టీ20ల్లో తక్కువ బంతుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా అభిషేక్ నిలిచాడు. అభిషేక్ శర్మ వెయ్యి పరుగులు పూర్తి చేసుకునేందుకు 528 బంతులు తీసుకున్నాడు. గతంలో సూర్యకుమార్ యాదవ్ (573 బంతులు), శివమ్ దూబే (648 బంతులు), సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా (679 బంతులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
వైభవ్ను ఆడించకపోవడంపై శ్రేయస్ వివరణ!
ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. ట్రై సిరీస్లో ఇండియా- ఏ తరఫున ఫైనల్లో విధ్వంసకర ఇన్నింగ్స్తో మెరిసిన వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్తో తొలి టీ20లో ఆడిస్తారనుకున్నప్పటికీ నిరాశే ఎదురైంది. అయితే వైభవ్ను ఆడించకపోవడంపై టాస్ సమయంలో శ్రేయస్ అయ్యర్ క్లారిటీ ఇచ్చాడు. అయ్యర్ మాట్లాడుతూ.. ‘బెల్ఫాస్ట్ మైదానం వాతావరణం, కండిషన్స్ మాకు పూర్తిగా కొత్తవి.. అందుకే మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం.. ఇక వైభవ్ సూర్యవంశీ విషయానికి వస్తే.. దురదృష్టవశాత్తూ అతను ఈరోజు మ్యాచ్ ఆడటం లేదు.. మా జట్టులో అద్భుతమైన ప్లేయర్స్ ఉండడంతో ఎవరిని తీసేయలేని పరిస్థితి. ప్రస్తుతానికైతే గతంలో (టీ20 ప్రపంచకప్ 2026) మంచి ప్రదర్శన చేసిన సీనియర్ ప్లేయర్ల వైపే మేము మొగ్గు చూపుతున్నాం. ఖచ్చితంగా టైమ్ వచ్చినప్పుడు వైభవ్కు అవకాశం దక్కుతుంది. పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా టీమిండియా మేనేజ్మెంట్ పక్కా ప్లానింగ్తో బరిలోకి దిగుతుంది’ అని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఇక తొలి టీ20 కోసం కోసం భారత్ సెలక్ట్ చేసుకున్న కాంబినేషన్ లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఒక ఆల్రౌండర్, మరో ఇద్దరు స్పిన్నర్లని తుది జట్టులోకి తీసుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ లోర్కాన్ టక్కర్ (50) అర్ధసెంచరీతో రాణించగా, గారెత్ డెలానీ (32 బంతుల్లో 49) మెరిశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు తీయగా, అక్షర్పటేల్, అర్ష్దీప్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. -
షాకిచ్చిన ఐర్లాండ్.. తొలి టీ20లో టీమిండియా ఓటమి
బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియాకు ఐర్లాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 18.5 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఐర్లాండ్ తొలి టీ20లో 34 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.👉 ఐర్లాండ్తో తొలి టీ20లో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తోంది. అక్షర్ పటేల్ (15) గెరాత్ డెలానీ బౌలింగ్లో వెనుదిరగడంతో ఎనిమిదో వికెట్ కోల్పోయింది. టీమిండియా గెలవాలంటే 18 బంతుల్లో 45 పరుగులు అవసరం. 👉 25 పరుగులు చేసిన శివమ్ దూబే జై మూండ్రా బౌలింగ్లో కాట్ అండ్ బౌల్డ్గా వెనుదిరగడంతో టీమిండియా 135 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది.👉ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా కష్టాల్లో పడింది. వాషింగ్టన్ సుందర్ (9) రూపంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. అంతకముందు ఆదుకుంటాడునుకున్న తిలక్ వర్మ (19) వెనుదిరగడంతో టీమిండియా 90 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 14 ఓవర్లు ముగిసేసరికి భారత్ 6 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది.అభిషేక్ (50) ఔట్టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (50) అర్ధశతకం సాధించిన వెంటనే వెనుదిరిగాడు. మెక్కార్తీ బౌలింగ్లో మాథ్యూ హంపెరీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే అభిషేక్ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది.అయ్యర్ విఫలం.. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తడబడుతోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (3) మాట్ హాలండ్ బౌలింగ్లో జార్జ్ డాక్రెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో 60 పరుగుల వ ద్ద మూడో వికెట్ కోల్పోయింది. అంతకముందు సంజూ శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1) విఫలమయ్యారు.టీమిండియా టార్గెట్ 183 పరుగులుబెల్ఫాస్ట్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో ఐర్లాండ్ జట్టు టీమిండియా ముందు మంచి టార్గెట్నే నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ లోర్కాన్ టక్కర్ (50) అర్ధసెంచరీతో రాణించగా, గారెత్ డెలానీ (32 బంతుల్లో 49) మెరిశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు తీయగా, అక్షర్పటేల్, అర్ష్దీప్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకముందు జార్జ్ డాక్రెల్ (19) రూపంలో ఐర్లాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో డాక్రెల్ వెనుదిరిగాడు.లోర్కాన్ టక్కర్ (50) ఔట్అర్ధసెంచరీ సాధించిన వెంటనే కెప్టెన్ లోర్కాన్ టక్కర్ (50) హర్షిత్ రానా బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా హర్షిత్ రానాకు ఇది మూడో వికెట్ కావడం విశేషం. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. లోర్కాన్ టక్కర్ ఫిఫ్టీఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ ఫిఫ్టీ సాధించడంతో ఆ జట్టు కాస్త కోలుకుంది. 14 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ 4 వికెట్లు నష్టపోయి 111 పరుగులు చేసింది. టక్కర్ 35 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించాడు. గారెత్ డెలానీ (13) అతడికి సహకరిస్తున్నాడు.👉13 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. లోర్కాన్ టక్కర్ (43), గారెత్ డెలానీ (12) క్రీజులో ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్8 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ 4 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. కెప్టెన్ లోర్కాన్ టక్కర్ (10), గరెత్ డిలేని (1) పరుగుతో ఆడుతున్నారు. శివమ్ దూబే బౌలింగ్లో 15 పరుగులు చేసిన బెంజమిన్ కాలిట్జ్ ప్రసిధ్ క్రిష్ణకు క్యాచ్ ఇచ్చి వెదనుదిరగడంతో నాలుగో వికెట్ కోల్పోయింది.మూడో వికెట్ డౌన్30 పరుగుల వద్ద ఐర్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రానా బౌలింగ్లో 17 పరుగులు చేసిన టిమ్ టెక్టర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండు వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్కు టీమిండియా బౌలర్లు చుక్కులు చూపిస్తున్నారు. 25 పరుగుల వద్ద ఐర్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. అర్ష్దీప్ బౌలింగ్లో హారీ టెక్టర్ డకౌట్ అయ్యాడు. అంతకముందు హర్షిత్ రానా బౌలింగ్లో ఓపెనర్ రాస్ అడైర్ (12) కీపర్ శాంసన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బెల్ఫాస్ట్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో భారత్, ఐర్లాండ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు 8 టీ20 మ్యాచ్లు జరిగితే అన్నింటిలోనూ టీమిండియానే విజయం సాధించడం విశేషం. అయితే ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు. టైం వచ్చినప్పుడు వైభవ్ జట్టులోకి వస్తాడని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.తుది జట్లుటీమిండియా: అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణఐర్లాండ్: టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్(వి/సి), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై మూండ్రా, మాథ్యూ హోలార్డ్టీ20 ప్రపంచకప్లో రెండోసారి విజేతగా నిలిచిన తర్వాత భారత జట్టు తమ తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్కు సిద్ధమైంది. వరల్డ్ కప్ గెలిచిన జట్టులోనే లేని శ్రేయస్ అయ్యర్... ఐపీఎల్లో కనబర్చిన నాయకత్వ ప్రదర్శనతో ఇప్పుడు తొలిసారి భారత టి20 జట్టుకు సారథిగా బరిలోకి దిగుతున్నాడు. మరోవైపు గతంలో రెండు మ్యాచ్లలో తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించిన లోర్కాన్ టకర్ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఐర్లాండ్ కెప్టెన్గా బాధ్యతలు చేపడుతున్నాడు. ఐర్లాండ్తో మ్యాచ్ అంటే ఫలితం గురించి ఆలోచించాల్సిన అసవరం కూడా లేదు. సంజూ సామ్సన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ల విధ్వంసకర ఆటపై కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఐర్లాండ్తో తొలి టి20 మ్యాచ్ అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. దానికి ఒకే ఒక్కడు కారణం. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భారత సీనియర్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేస్తాడా అనేదే ఇప్పుడు చర్చనీయాంశం. -
ఐర్లాండ్లోనూ వైభవ్కు క్రేజ్.. నిమిషాల్లో అమ్ముడైన టికెట్లు
ఐర్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా మరికొద్దిసేపట్లో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. అయితే మ్యాచ్లో అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. లంక వేదికగా జరిగిన ట్రై సిరీస్లో శ్రీలంక-ఏతో జరిగిన ఫైనల్లో వైభవ్ 29 బంతుల్లోనే 94 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్లో సంచనల ప్రదర్శనతో భారత సీనియర్ జట్టుకు ఎంపికైన సూర్యవంశీ ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్లో హాట్టాపిక్గా మారిపోయాడు. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కుతుందా లేదా అనే సంగతి పక్కనబెడితే ఐర్లాండ్లో వైభవ్కు ఉన్న క్రేజ్ చూస్తుంటే మతిపోతోంది. డబ్లిన్ వేదికగా జరగనున్న తొలి టీ20కి మలాహిడే స్టేడియం ఆతిథ్యమివ్వాల్సింది. కానీ అక్కడ మ్యూజిక్ కాన్సెర్ట్ ఉండడంతో మ్యాచ్ వేదికను బెల్ఫాస్ట్కు మార్చారు. అయితే ఈ స్టేడియం సామర్థ్యం 4వేల నుంచి 6వేల మధ్యే ఉంటుంది. అయితే ఇంత తక్కువ కె పాసిటీ ఉన్నప్పటికీ టికెట్లు నిమిషాల వ్యవధిలోనే అమ్ముడవ్వడం విశేషం. వైభవ్ ఆటను కళ్లారా చూసేందుకే టికెట్లు ఎగబడి కొన్నట్లు పలువురు పేర్కొన్నారు. అయితే మ్యాచ్ను డబ్లిన్లో కాకుండా బెల్ఫాస్ట్లో నిర్వహించడం పట్ల అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ పదహారు మ్యాచ్లలో కలిపి 776 పరుగులు సాధించాడు. తద్వారా ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా పదిహేనేళ్లకే ఆరెంజ్ క్యాప్ అందుకుని చరిత్ర సృష్టించాడు. ఇక ఐర్లాండ్తో శుక్రవారం నాటి తొలి టీ20లో వైభవ్ గనుక అరంగ్రేటం చేస్తే.. టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అతిపిన్న వయస్కుడిగా నిలుస్తాడు. ప్రస్తుతం వైభవ్ వయస్సు 15 ఏళ్ల 91 రోజులు. అంతకు ముందు దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. చదవండి: కెప్టెన్ సూపర్ సెంచరీ.. భారత్ స్కోరెంతంటే? -
‘ఆ సంతోషాన్ని చెడగొట్టేందుకు సిద్ధంగానే ఉన్నాము’
టీమిండియా- ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్ నేపథ్యంలో కళ్లన్నీ భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. బెల్ఫాస్ట్ వేదికగా శుక్రవారం ఈ చిచ్చర పిడుగు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే, వైభవ్ కోసం ఎవరిని తప్పించాలో తెలియడం లేదంటూ టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ బాంబు పేల్చాడు. దీంతో మ్యాచ్ మొదలైనపుడే వైభవ్ అరంగేట్రంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.నిజంగా నమ్మలేని విషయంమ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పదిహేనేళ్ల పిల్లాడు టీమిండియాలో ఉండటం నిజంగా నమ్మలేని విషయం. ఇక ముందు కూడా ఇది సాధ్యమవుతుందని నేను అనుకోవడం లేదు. నిజానికి వైభవ్ సూర్యవంశీకి క్రెడిట్ ఇవ్వాల్సిందే.ఇదొక గొప్ప రోజుఅతడొక ప్రత్యేకమైన ఆటగాడు. ఈ వారంలోనే అతడు మాపై అరంగేట్రం చేయవచ్చు. అతడి కెరీర్లోనే ఇదొక గొప్ప రోజు అవుతుంది’’ అని టక్కర్ వైభవ్ను కొనియాడాడు. అయితే, అదే సమయంలో.. ‘‘వైభవ్ను త్వరగా పెవిలియన్కు పంపి అతడి సంతోషాన్ని చెడగొట్టేందుకు కూడా మేము ప్రయత్నాలు చేస్తాము. ఐర్లాండ్లో కూడా వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై భారీ అంచనాలు, హైప్ ఉన్నాయి. నిజంగానే అతడు అద్భుతమైన నైపుణ్యాలున్న బ్యాటర్. ఐపీఎల్లో సంచలనం సృష్టించాడు. పరిశోధనలు చేశాముఅయితే, అతడిని ఎలా త్వరగా అవుట్ చేయగలమన్న అంశం గురించి మేము చేయాల్సినన్ని పరిశోధనలు చేశాము. సానుకూల ఫలితం రాబట్టేందుకు కృషి చేస్తాం’’ అని వైభవ్కు టక్కర్ హెచ్చరికలు జారీ చేశాడు. కాగా ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ పదహారు మ్యాచ్లలో కలిపి 776 పరుగులు సాధించాడు. తద్వారా ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా పదిహేనేళ్లకే ఆరెంజ్ క్యాప్ అందుకుని చరిత్ర సృష్టించాడు.ఇక ఐర్లాండ్తో శుక్రవారం నాటి తొలి టీ20లో వైభవ్ గనుక అరంగ్రేటం చేస్తే.. టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అతిపిన్న వయస్కుడిగా నిలుస్తాడు. ప్రస్తుతం వైభవ్ వయస్సు 15 ఏళ్ల 91 రోజులు. అంతకు ముందు దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. చదవండి: శ్రీలంకతో టెస్టు.. శతకానికి చేరువలో భారత కెప్టెన్ -
నువ్వు అద్భుతాలు చేస్తావని నమ్ముతున్నా: గంభీర్
భారత టీ20 క్రికెట్లో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. నూతన కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తన ప్రయాణాన్ని ఆరంభించేందుకు సిద్ధమయ్యాడు. ఐర్లాండ్తో బెల్ఫాస్ట్ వేదికగా శుక్రవారం అతడు తొలిసారి టీమిండియా టీ20 సారథిగా బరిలోకి దిగబోతున్నాడు.కేవలం ఆటలోనే కాదు..ఈ నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ పర్యటనను ఆరంభించే ముందు.. టీమిండియా కొత్త కెప్టెన్గా నియమితుడైన శ్రేయస్కు నా శుభాకాంక్షలు. జాతీయ జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవం.నువ్వు ఈ బాధ్యతను చక్కగా నెరవేరుస్తూ.. అద్భుతంగా రాణించగలవని కచ్చితంగా చెప్పగలను. కేవలం ఆటలోనే కాదు.. మైదానం వెలుపలా నువ్వు గొప్పగా పనిచేయగలవు’’ అని గంభీర్.. శ్రేయస్ అయ్యర్ను ప్రశంసించాడు. కాగా టీమిండియా టీ20 ప్రపంచకప్-2026 అందించిన సూర్యకుమార్ యాదవ్పై వేటు వేసి మరీ.. యాజమాన్యం శ్రేయస్కు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే.దాదాపు మూడేళ్ల తర్వాతఈ క్రమంలో దాదాపు మూడేళ్ల తర్వాత శ్రేయస్.. ఏకంగా సారథిగా టీ20 జట్టులో పునరాగమనం చేయనున్నాడు. ఇక ఈ ముంబైకర్ను కెప్టెన్గా నియమించడంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ది కీలక పాత్ర అని సమాచారం. గంభీర్ వద్దన్నా పట్టుబట్టి మరీ శ్రేయస్నే కెప్టెన్గా నియమించినట్లు ప్రచారం జరుగుతోంది.గంభీర్తో విభేదాలు?కాగా ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఆ జట్టుకు టైటిల్ అందించాడు. అయితే, అతడి కంటే కూడా.. అప్పుడు ఆ జట్టు మెంటార్గా ఉన్న గౌతం గంభీర్కే ఈ విషయంలో ఎక్కువగా క్రెడిట్ దక్కింది. ఈ విషయంలో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి.కోల్కతా ఫ్రాంఛైజీతో తెగదెంపులుఅనంతరం గంభీర్ టీమిండియా హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టగా.. శ్రేయస్ కోల్కతా ఫ్రాంఛైజీతో తెగదెంపులు చేసుకున్నాడు. ఈ క్రమంలో గతేడాది పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 26.75 కోట్లకు అతడిని కొనుగోలు చేసి కెప్టెన్గా నియమించింది. ఇక 2025లో బ్యాటర్గా.. సారథిగా సత్తా చాటి తొలి ప్రయత్నంలోనే పంజాబ్ను ఫైనల్కు చేర్చాడు శ్రేయస్.పంజాబ్ సారథిగా సూపర్ హిట్ అయినా..అయితే, ఈ ఏడాది ఆరంభంలో వరుసగా విజయాలు సాధించిన శ్రేయస్ అయ్యర్ సేన.. ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ పరాజయాలతో చతికిలపడింది. దీంతో ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ చేరుకుండానే పంజాబ్ నిష్క్రమించింది. అయితే, ఆటగాడిగా శ్రేయస్ మాత్రం రాణించాడు. ఇక ఐపీఎల్తో పాటు దేశీ క్రికెట్లోనూ రాణించిన ఈ ముంబైకర్కు టీమిండియా యాజమాన్యం ఏకంగా కెప్టెన్గా ప్రమోషన్ ఇచ్చి.. తిరిగి జట్టులోకి తీసుకోవడం విశేషం.చదవండి: వైభవ్ అరంగేట్రం కోసం వాళ్లను బలి చేయలేము -
వైభవ్ అరంగేట్రం కోసం వాళ్లను తప్పించలేము: టీమిండియా కోచ్
వైభవ్ సూర్యవంశీ.. భారత క్రికెట్లో సరికొత్త సంచలనం. పదిహేనేళ్ల వయసులోనే ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఈ చిచ్చరపిడుగు.. ఏకంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే భారత జట్టుకు అతడు ఎంపికయ్యాడు.బ్యాటింగ్ కోచ్ ఏమన్నాడంటే?ఈ నేపథ్యంలో ఐర్లాండ్తో శుక్రవారం నాటి తొలి టీ20 మ్యాచ్తో వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెడతాడా? లేదంటే బెంచ్కే పరిమితమవుతాడా? అన్న చర్చ మొదలైంది. ఐర్లాండ్తో మ్యాచ్ కాబట్టి వైభవ్ అరంగేట్రం ఖాయమని అభిమానులు ఫిక్సయిపోగా.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ మాత్రం భిన్నంగా స్పందించాడు.బెల్ఫాస్ట్ వేదికగా టీమిండియా- ఐర్లాండ్ మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడిన సితాన్షు కొటక్.. వైభవ్ అరంగేట్రంపై సస్పెన్స్ కొనసాగించాడు. హెడ్కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిర్ణయానుసారమే తుదిజట్టు కూర్పు ఉంటుందని స్పష్టం చేశాడు.వైభవ్ అరంగేట్రం కోసం వాళ్లను తప్పించలేము‘‘ఈ విషయంలో మా కెప్టెన్, హెడ్కోచ్దే తుది నిర్ణయం. ఒకవేళ వైభవ్ ఆడితే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. ఒకవేళ అతడు ఆడకపోయినా నాకు గొప్పే. ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే అతడు టీమిండియాకు ఎంపికయ్యాడు కదా!వైభవ్కు కచ్చితంగా అవకాశాలు వస్తాయి. అయితే, కేవలం అతడిని ఆడించేందుకు ఇప్పటికే పరుగులు రాబడుతూ జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆటగాళ్లను తప్పించలేము కదా!.. అలా చేయడం కూడా సరికాదు.ఒకరికి అవకాశం ఇచ్చేందుకు బాగా ఆడుతున్న మరొక ఆటగాడిని బలి చేయడం అన్యాయమే అవుతుంది’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. కాగా వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ బ్యాటర్ అన్న సంగతి తెలిసిందే. అయితే, భారత టీ20 జట్టులో ఇప్పటికే అభిషేక్ శర్మ- సంజూ శాంసన్ ఓపెనర్లుగా పాతుకుపోయారు.ఆడతాడా? లేదా?కొన్నిసార్లు అభిషేక్ విఫలమైనా యాజమాన్యం అతడిని కొనసాగించింది. కానీ సంజూ బ్యాటింగ్ ఆర్డర్ను మాత్రం చాలాసార్లు మార్చడమే కాకుండా.. కొన్నిసార్లు అతడిని పక్కనపెట్టింది కూడా!.. అయితే, టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో నాకౌట్ దశలో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సంజూ.. వరుసగా 94*, 89, 89 పరుగులతో దుమ్ములేపాడు.తద్వారా భారత్ ప్రపంచకప్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఐపీఎల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఫర్వాలేదనిపించాడు. దీంతో గతంలో మాదిరి సంజూను తప్పించేందుకు ఆస్కారం లేదు. ఇక వన్డౌన్లో ఇషాన్ కిషన్ ప్రపంచకప్లో తనను తాను నిరూపించుకున్నాడు. కాబట్టి అతడిపైనా వేటు పడదు.దీంతో వైభవ్కు టాపార్డర్లో చోటు దక్కదు కాబట్టి.. ఇప్పట్లో అరంగేట్రం కష్టమనే సంకేతాలు వస్తున్నాయి. కానీ.. ఐర్లాండ్తో సిరీస్కు అంతటి ప్రాధాన్యం లేదు కాబట్టి వైభవ్ను ఆడించేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా అయితే.. కాగా ఇంగ్లండ్తో టీ20లతో పాటు వన్డేలకూ ఇషాన్ కిషన్ ఎంపికయ్యాడు. కాబట్టి అతడికి ఇప్పుడు కాస్త విశ్రాంతినిచ్చి.. సంజూను వన్డౌన్కు డిమోట్ చేసి.. అభిషేక్కు జోడీగా వైభవ్ను ఓపెనర్గా పంపే అవకాశాలనూ కొట్టిపారేయలేము.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ.. 16 మ్యాచ్లలో కలిపి ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఇటీవల శ్రీలంకలో ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి భారత్- ‘ఎ’ జట్టును విజేతగా నిలిపాడు.చదవండి: చరిత్ర సృష్టించిన కివీస్ ఓపెనర్లు! -
ఇంగ్లాండ్ భారీ స్కెచ్.. వైభవ్ కు పోటీగా 16 ఏళ్లు కుర్రాడు
-
ఐర్లాండ్ బయల్దేరిన టీమిండియా.. ప్రత్యేక ఆకర్షణగా వైభవ్!
ఐర్లాండ్తో టీ20 సిరీస్ ఆడేందుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా మంగళవారం చెన్నై నుంచి బయల్దేరింది. ఈ నేపథ్యంలో సిరీస్కు ఎంపికైన నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. చెన్నై అంతర్జాతీయ ఎయిర్పోర్టులో టీమిండియా బృందం ప్రత్యేక ఫ్లైట్ ఎక్కింది. 'ఐర్లాండ్ టూర్కు సిద్ధం’ అన్నట్లుగా వైభవ్ సూర్యవంశీ తన సహచర ప్లేయర్ అభిషేక్ శర్మతో కలిసి సెల్ఫీని పంచుకున్నాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి ఇదే తొలి అంతర్జాతీయ సిరీస్ కానుండడం విశేషం. ఐర్లాండ్తో టీ20 సిరీస్లో ఆడనున్న వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయనున్న అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డులకెక్కనున్నాడు. శ్రీలంక పర్యటనలో ఇండియా-ఏ జట్టు ట్రై సిరీస్ విజేతగా నిలవడంలో వైభవ్ కూడా కీలకపాత్ర పోషించాడు. శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన ఫైనల్లో వైభవ్ 29 బంతుల్లోనే 94 పరుగుల సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఊపులోనే ఐర్లాండ్తో టీ20 సిరీస్కు సన్నద్ధమవుతున్నాడు. ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ఎంపికైనప్పటికీ తుదిజట్టులో చోటు దక్కించుకోవాలంటే ఐర్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్లో వైభవ్ తన ప్రతాపం చూపించాల్సిన అవసరముంది. ఇక డుబ్లిన్ వేదికగా రెండు వన్డేలు ఆడనున్న టీమిండియా ఆ తర్వాత జూలై 1 నుంచి ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ఆడనుంది. జూలై 1 నుంచి 11 మధ్య ఐదు టీ20 మ్యాచ్లు, ఆ తర్వాత జూలై 14 నుంచి 19 మధ్య మూడు వన్డేలు ఆడనుంది. వన్డే జట్టును గిల్ నడిపించనుండగా, టీ20 జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు ఇదే తొలి సిరీస్ కానుంది. VAIBHAV SOORYAVANSHI HAS DEPARTED TO CREATE HISTORY IN IRELAND. 🇮🇳- Youngest ever to receive the Indian jersey. 🔥 pic.twitter.com/uq2ZxEceWQ— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2026Read: మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్.. అల్జీరియా సంచలన విజయం -
భారత్తో టీ20 సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! యువ సంచలనానికి ఛాన్స్
స్వదేశంలో భారత్తో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా హ్యారీ బ్రూక్ వ్యవహరించనున్నాడు. కాగా టీ20 ప్రపంచకప్తో పాటు ఐపీఎల్లోనూ పేలవ ప్రదర్శన కనబరిచిన స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్కు సెలక్టర్లు మరో అవకాశమిచ్చారు. అతడితో పాటు ఆదిల్ రషీద్, పేసర్ జోఫ్రా ఆర్చర్, ఫిల్ సాల్ట్, టామ్ బాంటన్, సామ్ కరన్ వంటి సీనియర్ ప్లేయర్లు ఈ జట్టులో ఉన్నారు. మరోవైపు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన జోర్డాన్ కాక్స్, సన్నీ బేకర్, సాకిబ్ మహమూద్లు తిరిగి జట్టులోకి వచ్చారు. యువ ఆటగాళ్లు జాకబ్ బెథెల్, విల్ జాక్స్, జోష్ టంగ్ కూడా తమ స్ధానాలను నిలబెట్టుకున్నారు.అయితే ఈ సిరీస్కు స్టార్ ఆల్రౌండర్లు బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్లు ఇద్దరూ గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో ససెక్స్ ఆల్రౌండర్ 22 ఏళ్ల జేమ్స్ కోల్స్ తొలిసారి ఇంగ్లండ్ జాతీయ జట్టులో చోటు దక్కింది. టీ20 క్రికెట్లో కోల్స్కు అద్భుతమైన రికార్డు ఉంది. 71 టీ20 మ్యాచ్లు ఆడిన కోల్స్.. 1,373 పరుగులతో పాటు 53 వికెట్లు పడగొట్టాడు. వైటాలిటీ బ్లాస్ట్, ది హండ్రెడ్ టోర్నీలతో పాటు సౌతాఫ్రికా టీ20 వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో ఆడిన అనుభవం ఉంది.భారత్తో సిరీస్ కోసం ఇంగ్లండ్ టీ20 జట్టు:హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సన్నీ బేకర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, జేమ్స్ కోల్స్, జోర్డాన్ కాక్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్. -
ఐర్లాండ్తో టీ20 సిరీస్.. వైభవ్తో పాటు వీళ్లకు కీలకమే!
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా సీనియర్ బృందం నేరుగా ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టనుంది. ఈ గ్యాప్లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో యువకులతో నిండిన జట్టు ఐర్లాండ్ టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. అయ్యర్కు కెప్టెన్గా ఇదే తొలి టీ20 సిరీస్ కానుండగా, వైభవ్ సూర్యవంశీ తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. వీరిద్దరితో పాటు మరికొందరు కొత్త క్రికెటర్లకు కూడా రాణించేందుకు ఇదే మంచి అవకాశం కానుంది. మిగతావారి సంగతి పక్కనబెడితే ఒక నలుగురు క్రికెటర్లకు మాత్రం ఐర్లాండ్ సిరీస్ కీలకం కానుంది. వాళ్లే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైభవ్ సూర్యవంశీ, తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, స్పిన్నర్ రవి బిష్ణోయి.శ్రేయస్ అయ్యర్..ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా 2025 సీజన్లో పంజాబ్ను ఫైనల్ చేర్చిన శ్రేయస్ అయ్యర్ 2024 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ను విజేతగా నిలిపాడు. అయితే 2026 సీజన్లో పంజాబ్ ప్లేఆఫ్ చేరడంలో విఫలమైనప్పటికీ కెప్టెన్గా, బ్యాటర్గా శ్రేయస్ అయ్యర్ సక్సెస్ అయ్యాడు. తన కెప్టెన్సీతో బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో ఫామ్ కోల్పోయి జట్టుకు భారంగా మారిన సూర్యకుమార్ను కెప్టెన్సీ నుంచి తొలగించి ఆ బాధ్యతలు శ్రేయస్కు అప్పగించారు. ఐర్లాండ్తో సిరీస్ కెప్టెన్గా అయ్యర్కు మొదటి సిరీస్ కానుంది. అయితే బ్యాటర్గా తనను తాను ఎప్పుడో నిరూపించుకున్న అయ్యర్ ఇక కెప్టెన్గా ఐపీఎల్ ప్రదర్శనను చూపిస్తాడా లేదా అన్నది చూడాలి. 2028లో జరగనున్న టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్ చేసినట్లు బీసీసీఐ తెలిపింది. మరి వారి అంచనాలను ఎంతమేర అందుకుంటాడనేది ఐర్లాండ్ సిరీస్తో తేలిపోనుంది.వైభవ్ సూర్యవంశీ..ఐర్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్లో అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి. ఆదివారం ముగిసిన ట్రై సిరీస్ ఫైనల్లో టీ20 తరహా బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. కొద్దిలో ఫాస్టెస్ట్ సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ 11 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతకముందు ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున విధ్వంసం సృష్టించిన వైభవ్ 16 మ్యాచ్ల్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ఎగురేసుకుపోయాడు. వన్డే క్రికెట్లోనూ టీ20 తరహా ఆటతీరును ప్రదర్శించిన వైభవ్ పొట్టి ఫార్మాట్లో మరింత రెచ్చిపోయేందుకు ఆస్కారముంది. అయితే తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుండడం వైభవ్పై అంచనాలను పెంచేసింది. ఇంగ్లండ్తో టూర్కు ముందు ఐర్లాండ్ టీ20 సిరీస్లో అంచనాలను అందుకొని భారీ స్కోర్లతో చెలరేగాలని వైభవ్ భావిస్తున్నాడు. ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ఎంపికైన వైభవ్కు ఆ జట్టులో చోటు దక్కడం కాస్త కష్టమే అయినప్పటికీ, ఐర్లాండ్తో సిరీస్లో రాణిస్తే ఇంగ్లండ్తో టీ20 సిరీస్లోనూ ఆడే అవకాశాలు మెండుగా ఉంటాయి.నితీశ్కుమార్ రెడ్డి..హార్దిక్ పాండ్యా గాయపడడంతో ఆల్రౌండర్ స్థానాన్ని భర్తీ చేసుకునేందుకు నితీశ్కుమార్ రెడ్డికి ఇదే మంచి అవకాశం. ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ తరఫున ఆడిన నితీశ్ మంచి ప్రదర్శనే కనబరిచాడు. బ్యాటింగ్, బౌలింగ్లో కీలక సమయాల్లో రాణించగలడన్న పేరున్న నితీశ్కుమార్ ఐర్లాండ్తో టీ20 సిరీస్లో రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే టెస్టు ఫార్మాట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్న నితీశ్రెడ్డి టీ20 జట్టులోనూ తన స్థానాన్ని నిలుపుకునేందుకు ఐర్లాండ్ టూర్ మంచి అవకాశం అని చెప్పొచ్చు.రవి బిష్ణోయి..ఐర్లాండ్తో టీ20 సిరీస్కు గాయంతో వరుణ్ చక్రవర్తి దూరం కావడంతో అతడి స్థానంలో రవి బిష్ణోయి చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ వన్డేలకు పరిమితం కావడంతో టీ20ల్లో రాణించేందుకు రవి బిష్ణోయికు ఐర్లాండ్సిరీస్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన రవి బిష్ణోయి 9 మ్యాచ్ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ఐర్లాండ్తో సిరీస్లో రవి బిష్ణోయి ఫ్రంట్లైన్ స్పిన్నర్గా సేవలందించేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ జూన్ 26 (శుక్రవారం) బెల్ఫాస్ట్ వేదికగా జరగనుంది.Read: 90 నిమిషాలు అడ్డుగోడలా.. రోమాలు నిక్కబొడిచే ప్రదర్శన! -
హోల్డర్ సిక్సర్ల వర్షం.. సిరీస్ కైవసం చేసుకున్న విండీస్
స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను వెస్టిండీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన మూడో టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయాన్ని అందుకుంది. విండీస్ బౌలర్ షమర్ జోసెఫ్ ఐదు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా, బ్యాటింగ్లో రూథర్ఫోర్డ్, హోల్డర్ మెరుపులు మెరిపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. దునిత్ వెల్లలాగె (43 పరుగులు) టాప్ స్కోరర్గా నిలవగా, కమిల్ మిశారా (28), నిస్సాంక (26) పర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో షమర్ జోసెఫ్ 5 వికెట్లు తీయగా, అకిల్ హొసెన్, మాథ్యూ ఫోర్డె, జాసన్ హోల్డర్, రోస్టన్ చేజ్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి విజయం సాధించింది. 53 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విండీస్ను రోవ్మెన్ పావెల్ (33), రూథర్ఫోర్డ్ (54 నాటౌట్) చక్కదిద్దడమే గాక జట్టును విజయంవైపు నడిపించారు. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్కు 81 పరుగులు జోడించారు. విజయానికి చేరువవుతున్న క్రమంలో పావెల్ ఔటైనప్పటికీ, క్రీజులోకి వచ్చిన జాసన్ హోల్డర్ (5 బంతుల్లో 21 నాటౌట్) మూడు భారీ సిక్సర్లు బాది వెస్టిండీస్ను గెలిపించాడు. లంక బౌలర్లలో హసరంగ రెండు వికెట్లు తీయగా, వెల్లలాగె, దుష్మంత చమీర, తీక్షణ తలా ఒక వికెట్ తీశారు. షమర్ జోసెఫ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ కూడా గెలుచుకున్నాడు. 2024 తర్వాత వెస్టిండీస్ తమ సొంతగడ్డపై టీ20 సిరీస్ నెగ్గడం విశేషం. ఇరుజట్ల మధ్య జూన్ 25 నుంచి అంటిగ్వా వేదికగా తొలి టెస్టు జరగనుంది.మ్యాచ్లో నమోదైన పలు రికార్డులు..👉ఈ మ్యాచ్లో ఐదు వికెట్లు తీయడం ద్వారా షమర్ జోసెఫ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సబీనా పార్క్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్ల్లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా షమర్ జోసెఫ్ నిలిచాడు. గతంలో ఈ మైదానంలో ఐర్లాండ్కు బౌలర్ అలెక్స్ కుసాక్ (4/11) అత్యుత్తమంగా ఉండేది. తాజాగా ఆ రికార్డును జోసెఫ్ బద్దలు కొట్టాడు.👉టీ20 క్రికెట్లో వెస్టిండీస్ తరఫున ఐదు వికెట్లు తీసిన తొమ్మిదో బౌలర్గా షమర్ జోసెఫ్ నిలిచాడు. ఇక శ్రీలంకతో మ్యాచ్లో ఐదు వికెట్ల హాల్ అందుకున్న రెండో బౌలర్గా జోసెఫ్ నిలిచాడు. గతంలో ఓషెన్ థామన్ ఈ ఫీట్ సాధించాడు.👉శ్రీలంకతో మ్యాచ్లో ఐదు వికెట్లు తీయడం ద్వారా షమర్ జోసెఫ్ టీ20 క్రికెట్లో 50 వికెట్ల మార్క్ పూర్తి చేసుకున్నాడు.చదవండి: శ్రీలంక-ఏతో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ ప్లాఫ్ షో -
AUS vs BAN: ఆసీస్ గడ్డపై ‘మనోడి’ చరిత్ర
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తమ జట్టును ప్రకటించింది. మిచెల్ మార్ష్ సారథ్యంలో సిరీస్లో పాల్గొనే పదిహేడు మంది సభ్యుల పేర్లను తాజాగా వెల్లడించింది. ఈ జట్టులో భారత్కు చెందిన నిఖిల్ చౌదరికి సెలక్టర్లు చోటివ్వడం విశేషం.మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడేందుకు ఆసీస్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ మొదలుకాగా.. జూన్ 17, 19, 21 తేదీల్లో మూడు టీ20ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికఈ నేపథ్యంలో సీఏ తాజాగా బంగ్లాతో సిరీస్కు టీ20 జట్టును ప్రకటించింది. బిగ్బాష్ లీగ్లో రాణించిన ఆటగాళ్లకు సెలక్టర్లు ఈ జట్టులో చోటిచ్చారు. హోబర్ట్ హారికేన్స్ తరఫున సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్న నిఖిల్ చౌదరి (Nikhil Chaudhary)కి తొలిసారి జాతీయ జట్టులో అవకాశం దక్కింది.ఆల్రౌండ్ నైపుణ్యాలున్న 30 ఏళ్ల నిఖిల్ చౌదరి బంగ్లాదేశ్తో సిరీస్తో గనుక అరంగేట్రం చేస్తే.. 62 ఏళ్ల తర్వాత ఆసీస్కు ఆడిన జన్మతః భారతీయుడైన తొలి ఆటగాడిగా నిలుస్తాడు. కలకత్తా వేదికగా 1964లో రెక్స్ సెల్లార్స్ అనే భారతీయుడు ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగాడు. గుజరాత్లో జన్మించిన రెక్స్ లెగ్ స్పిన్నర్. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు నిఖిల్కు అవకాశం వచ్చింది.ఎవరీ నిఖిల్ చౌదరి?ఢిల్లీలో జన్మించిన నిఖిల్ చౌదరి దేశవాళీ క్రికెట్లో పంజాబ్కు ప్రాతినిథ్యం వహించాడు. భారత టెస్టు, వన్డే జట్ల ప్రస్తుత కెప్టెన్ శుబ్మన్ గిల్ సహా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్తో కలిసి పంజాబ్ జట్టుకు ఆడాడు.అదే విధంగా టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్లతో కలిసి పంజాబ్ తరఫున లిస్ట్-ఎ క్రికెట్ బరిలో దిగాడు. కానీ అతడికి ఆశించినంతగా అవకాశాలు రాలేదు. ఇక 2020లో క్వీన్స్లాండ్లో ఉన్న తన అంకుల్ను చూసేందుకు నిఖిల్ చౌదరి ఆస్ట్రేలియాకు వెళ్లాడు.అయితే, కోవిడ్ కారణంగా ప్రయాణాలపై నిషేధం విధించడంతో నిఖిల్ అక్కడే చిక్కుకుపోయాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోనే ఉండాలని నిర్ణయించుకున్న అతడు.. శాశ్వత నివాస హోదా పొందాడు. గత మూడేళ్లుగా బిగ్బాష్ లీగ్లో సత్తా చాటుతున్న నిఖిల్.. 2024-25లో హోబర్ట్ హారికేన్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.అలా దేశీ క్రికెట్లో అవకాశంలెగ్స్పిన్నింగ్ ఆల్రౌండర్ నిఖిల్కు ఊహించని రీతిలో ఆసీస్ దేశీ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం లభించింది. స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్ జాతీయ జట్టు విధుల్లోకి వెళ్లగా అతడి స్థానంలో టాస్మేనియా నిఖిల్ను పిలిపించింది.ఈ క్రమంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ షెఫీల్డ్ షీల్డ్లో టాస్మేనియాకు ఆడుతూ.. న్యూ సౌత్ వేల్స్తో మ్యాచ్లో శతకం (184 బంతుల్లో 163) సాధించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ఆసీస్ దేశవాళీ రెడ్బాల్ టోర్నీలో శతక్కొట్టిన భారత మూలాలున్న తొలి క్రికెటర్గా నిలిచాడు.ఏదేమైనా భారత్లో అవకాశాలు లేక ఆసీస్కు వెళ్లిన నిఖిల్ చౌదరి.. ఇప్పుడిలా అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటూ ఏకంగా ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికకావడం నిజంగా విశేషమే.బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్(కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, నిఖిల్ చౌదరి, కూపర్ కానొలీ, టిమ్ డేవిడ్, జోయెల్ డేవిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాథ్యూ కుహ్నెమాన్, రైలీ మెరెడిత్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, ఆడమ్ జంపా.చదవండి: వైభవ్ మారలేదు.. శ్రీలంకలో మెరుపులు -
BCCI: సిరాజ్ను తప్పించిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లే భారత టీ20 జట్టు నుంచి స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ను తప్పించింది. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోకాగా టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాను చాంపియన్గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఫామ్లేమితో బాధపడుతున్న సూర్యను తప్పించి.. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించింది. దాదాపు మూడేళ్ల తర్వాత అతడిని జట్టును ఎంపిక చేయడమే కాకుండా.. కెప్టెన్గా నియమించింది.ఇక శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా జూన్ 26 నుంచి ఐర్లాండ్లో పర్యటించనుంది. తొలుత ఐర్లాండ్తో రెండు టీ20లు ఆడి.. ఆ తర్వాత ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. వైభవ్ సూర్యవంశీకి చోటుఇందుకోసం ప్రకటించిన జట్టులో తొలిసారిగా పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్ పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తాడని యాజమాన్యం తొలుత ప్రకటించింది.అందుకే సిరాజ్ను తప్పిస్తు న్నాంతాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ‘‘మా వైద్య బృందంతో చర్చల అనంతరం.. సిరాజ్కు విశ్రాంతి కావాలని భావించాము. పనిభారాన్ని తగ్గించే క్రమంలో అతడిని ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటన నుంచి తప్పిస్తున్నాము. సుదీర్ఘమైన అంతర్జాతీయ క్రికెట్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.సిరాజ్ స్థానంలో ప్రసిద్ కృష్ణను సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. సిరాజ్కు బదులు ఐర్లాండ్, ఇంగ్లండ్లలో అతడు టీ20 సిరీస్లలో పాల్గొంటాడు’’ అని బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది. ఐర్లాండ్, ఇంగ్లండ్లతో టీ20 సిరీస్కు టీమిండియా (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ కృష్ణ.చదవండి: టీమిండియాలో చోటివ్వరా? సెంచరీతో కదంతొక్కాడు! -
వైభవ్ వచ్చేశాడు...
టి20 ప్రపంచ కప్లో భారత జట్టు విజేతగా నిలిపినా సరే... బ్యాటింగ్ ఫామ్ సూర్యకుమార్ యాదవ్కు ప్రతికూలంగా మారింది. ఊహించినట్లే సూర్యకుమార్ను కెప్టెన్సీ నుంచి తప్పించిన సెలక్టర్లు అంతటితో ఆగకుండా జట్టునుంచే తీసేశారు. విన్నింగ్ టీమ్లో సభ్యులైన మరో ఇద్దరిపై కూడా వేటు పడగా... అసాధారణ బ్యాటింగ్తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తొలిసారి సీనియర్ టీమ్లోకి దూసుకొచ్చాడు. ఐపీఎల్లో చక్కటి బ్యాటింగ్తో పాటు నాయకత్వ లక్షణాలు ప్రదర్శించిన శ్రేయస్ కొత్త సారథిగా బాధ్యతలు చేపడుతుండగా... హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ వైస్ కెప్టెన్సీ ప్రమోషన్ సాధించాడు. ముంబై: టి20 వరల్డ్ కప్ గెలుచుకున్న మూడు నెలల తర్వాత భారత క్రికెట్ జట్టు పలు మార్పులతో కొత్త సిరీస్కు సన్నద్ధమైంది. ఐర్లాండ్, ఇంగ్లండ్లలో జరిగే టి20 సిరీస్ల కోసం 16 మంది సభ్యుల భారత జట్టును అజిత్ అగార్కర్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. దీంతో పాటు జపాన్లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే 15 మంది సభ్యుల టీమ్ను కూడా సెలక్టర్లు ప్రకటించారు. జూన్ 26, 28 తేదీల్లో బెల్ఫాస్ట్లో ఐర్లాండ్తో 2 టి20ల్లో తలపడిన అనంతరం భారత జట్టు జులై 2 నుంచి 11 మధ్య ఇంగ్లండ్తో 5 టి20లు ఆడుతుంది. శ్రేయస్పై నమ్మకం... టి20 ప్రపంచకప్ ప్రస్తుత విజేత 2028లో జరిగే తర్వాతి టోర్నీకి సిద్ధమయ్యేందుకు రెండేళ్లకు పైగా సమయం ఉంది. అదే ఏడాది లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో కూడా భారత్ బరిలోకి దిగనుంది. వీటిని దృష్టిలో పెట్టుకుంటూ టీమ్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ బృందంలో 31 ఏళ్ల శ్రేయస్ అయ్యర్ నాయకుడిగా సరైన వ్యక్తి అని సెలక్టర్లు భావించారు. నిజానికి అయ్యర్ రెగ్యులర్గా టి20 జట్టులో సభ్యుడు కాదు. 2023 డిసెంబర్ తర్వాత అతను ఈ ఫార్మాట్లో భారత్కు ఆడలేదు. కానీ ఐపీఎల్ ప్రదర్శన అతడిని అందరికంటే ముందు నిలిపింది. మూడు వేర్వేరు టీమ్లు (ఢిల్లీ, కోల్తా, పంజాబ్)లను లీగ్లో ఫైనల్కు చేర్చిన ఏకైక కెప్టెన్గా గుర్తింపు పొందిన శ్రేయస్ నాయకత్వంలో 2024లో కోల్కతా టైటిల్ నెగ్గింది. బ్యాటర్గా కూడా గత ఏడాది విధ్వంసకర ప్రదర్శన కనబర్చిన అతను ఈ సీజన్లో కూడా మెరుగ్గా ఆడాడు. బ్యాటర్గా సూర్యకుమార్కు బదులుగా నాలుగో స్థానానికి అతను సరిగ్గా సరిపోతాడు కూడా. తిలక్కు అరుదైన చాన్స్... భారత టి20 జట్టులో రెగ్యులర్గా మారిన తిలక్వర్మకు కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వైస్ కెప్టెన్సీ పదవి దక్కింది. తిలక్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఎ టీమ్కు సారథిగా ఉన్నాడు. భారత్ తరఫున 49 మ్యాచ్లలో 145.54 స్టైక్రేట్తో 1390 పరుగులు సాధించిన తిలక్ ఖాతాలో 2 సెంచరీలు ఉన్నాయి. దీంతో పాటు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున నిలకడైన ప్రదర్శన కూడా అతనికి తగినంత గుర్తింపు తెచి్చంది. అక్షర్ స్థానంలో అతను వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. వైభవ్పై విశ్వాసం... అంచనాలకు తగినట్లుగానే కుర్రాడు వైభవ్ సూర్యవంశీని సెలక్టర్లు టీమ్లోకి ఎంపిక చేశారు. గత ఐపీఎల్ సీజన్లోనే ఆకట్టుకున్నా... ఈసారి మరింతగా విజృంభించి వైభవ్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా 237.30 స్ట్రైక్రేట్తో 776 పరుగులు చేసి టోర్నీలో అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన వైభవ్ను ఎంపిక చేసేందుకు ఇదే సరైన సమయంగా అంతా భావించారు. అందుకే సెలక్టర్లు కూడా అతనిపై విశ్వాసం ఉంచారు. వైభవ్ ఐర్లాండ్తో తొలి టి20లో బరిలోకి దిగితే...భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో (15 ఏళ్ల 92 రోజులు) అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల 205 రోజులు) రికార్డును బద్దలు కొడతాడు. స్థానం కోల్పోయిన రింకూ, కుల్దీప్... వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టులో సభ్యులైనవారిలో సూర్యతో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, బ్యాటర్ రింకూ సింగ్ టీమ్లో చోటు దక్కించుకోలేకపోయారు. రింకూ చాలా కాలంగా ఫామ్లో లేకపోగా... ఇటీవలి ఐపీఎల్ ఘోర వైఫల్యం కూడా కుల్దీప్పై వేటుకు ప్రధాన కారణం. ఆల్రౌండర్ హార్దిక్, పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్లనుంచి విశ్రాంతి కల్పించారు. నితీశ్ రెడ్డి పునరాగమనం... టి20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి టీమ్లోకి పునరాగమనం చేశాడు. అతను భారత్ తరఫున జనవరి, 2025లో ఆఖరి టి20 మ్యాచ్ ఆడాడు. ఇదే తరహాలో లెగ్స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా మళ్లీ జట్టులోకి ఎంపికయ్యాడు. అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు ఇప్పటికే ఎంపిక అయిన ఢిల్లీ పేసర్ ప్రిన్స్ యాదవ్కు ఇప్పుడు టి20 టీమ్లో స్థానం లభించింది. ఆసియా క్రీడలకు బుమ్రా.... విశ్రాంతి అనంతరం పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆసియా క్రీడల్లో పాల్గొంటాడు. ఈ మెగా ఈవెంట్ కోసం ప్రకటించిన 15 మంది టీమ్లో అతనికి స్థానం కల్పించారు. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్లకు ఎంపిక చేసిన జట్లలో ఉన్న మొహమ్మద్ సిరాజ్ స్థానంలో బుమ్రా వస్తాడు. 16వ ఆటగాడు ప్రిన్స్కు కూడా ఆసియా క్రీడల టీమ్లో చోటు దక్కలేదు.పాపం సూర్యకుమార్!గత ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని అందించిన తర్వాత కూడా తర్వాతి సిరీస్కు రోహిత్ శర్మ తన వన్డే కెప్టెన్సీని కోల్పోయాడు. రోహిత్తో పోలిస్తే సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి ఇంకా బాధాకరం. వరల్డ్ కప్ గెలిచాక కెప్టెన్సీతో పాటు అతనికి జట్టులో కూడా చోటు పోయింది. నిజానికి ప్రపంచ కప్కు ముందు చాలా కాలం పాటు అతని ఫామ్ పేలవంగా ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్పై మంచి ప్రదర్శనే ఇచ్చినా... ఆ తర్వాత మళ్లీ తడబాటు కనిపించింది. అయితే కీలకమైన టోర్నీకి ముందు కొత్త కెప్టెన్ వస్తే కష్టమని సెలక్టర్లు వెనక్కి తగ్గారు. మెగా టోర్నీలో అమెరికాపై మ్యాచ్ మినహా అతను అన్నింటా విఫలమయ్యాడు. ఆ తర్వాత ఐపీఎల్లో కూడా అంతే స్థాయిలో మళ్లీ పూర్తిగా విఫలమయ్యాడు. దాంతో సెలక్టర్లకు మరో ఆలోచన లేకపోయింది. పైగా 36 ఏళ్లకు చేరువవుతున్న ప్రస్తుత స్థితిలో మరో రెండేళ్ల తర్వాత జరిగే వరల్డ్ కప్కు కొనసాగించే అవకాశం ఎలాగూ లేదనేది వాస్తవం. ప్రపంచకప్, ఆసియా కప్లు గెలవడంతో పాటు తన సారథ్యంలో ఒక్క సిరీస్ కూడా కోల్పోని రికార్డు సూర్య సొంతం. టి20 క్రికెట్లో విధ్వంసక ఆటగాడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సూర్యకుమార్ అంతర్జాతీయ కెరీర్ ఇక ముగిసినట్లే. ‘ఇది చాలా కఠిన నిర్ణయం. అతని పేలవ ఫామ్ కొంత కారణమే అయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జట్టు అవసరాల కోసం తప్పలేదు. ప్రపంచ కప్ను గెలిపించిన తర్వాత జట్టునుంచి తప్పించడంపై చాలానే చర్చ జరిగింది. నేను కూడా అతనితో మాట్లాడి అంతా వివరించా’ అని అగార్కర్ వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టుశ్రేయస్ (కెప్టెన్), తిలక్ (వైస్ కెప్టెన్), అభిషేక్, సామ్సన్, వైభవ్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్, సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, సిరాజ్, అర్ష్ దీప్ , హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్. (ఆసియా క్రీడలకు సిరాజ్ స్థానంలో బుమ్రా ఎంపిక కాగా...ప్రిన్స్కు చోటు లేదు). -
చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో ఇంత వరకు ఏ ప్లేయర్కూ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించింది. టీమిండియా తరఫున 2009లో అరంగేట్రం చేసింది హర్మన్.అంచెలంచెలుగా ఎదిగి కెప్టెన్ స్థాయికి చేరుకున్న హర్మన్.. మహిళా క్రికెట్లో భారత్కు మొట్టమొదటి వన్డే వరల్డ్కప్ అందించింది. స్వదేశంలో గతేడాది జరిగిన మెగా టోర్నీలో జట్టును చాంపియన్గా నిలిపి.. దిగ్గజ కెప్టెన్ల సరసన చేరింది.ఇంగ్లండ్ పర్యటనలో..ఇటీవలే పద్మశ్రీ అవార్డు అందుకున్న 37 ఏళ్ల హర్మన్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఆతిథ్య జట్టు తొలి టీ20కి దూరమైన ఆమె.. రెండో మ్యాచ్ నుంచి జట్టుతో చేరింది. అయితే, హర్మన్ సారథ్యంలో రెండో టీ20తో పాటు.. తాజాగా మూడో టీ20లోనూ ఓటమిపాలైంది.సిరీస్ ఇంగ్లండ్దేటాంటన్ వేదికగా మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లండ్ కేవలం 18.3 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో హర్మన్ 40 బంతులు ఎదుర్కొని 56 పరుగులతో అజేయంగా నిలిచింది. ఇక ఈ విజయంతో ఇంగ్లండ్ టీ20 సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది.చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్కాగా హర్మన్ అంతర్జాతీయ కెరీర్లో ఇది 368వ మ్యాచ్. తద్వారా మహిళల క్రికెట్లో అత్యధిక ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా హర్మన్ ప్రపంచ రికార్డు సాధించింది. కాగా గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ స్టార్ సుజీ బేట్స్ పేరిట ఉండేది. ఆమె తన కెరీర్లో 367 మ్యాచ్లు ఆడింది.ఇక టీ20 ప్రపంచకప్-2026 తర్వాత సుజీ బేట్స్ రిటైర్ కానుండగా.. హర్మన్ప్రీత్ కౌర్ రిటైర్మెంట్ గురించి ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. తద్వారా మరికొన్ని మ్యాచ్లలో పాల్గొని.. అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా హర్మన్ తన పేరును సుస్థిరం చేసుకునే అవకాశం లేకపోలేదు.మహిళల క్రికెట్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ప్లేయర్లు🏏హర్మన్ప్రీత్ కౌర్ (భారత్)- 368🏏సుజీ బేట్స్ (న్యూజిలాండ్)- 367🏏ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా)- 357🏏మిథాలీ రాజ్ (భారత్)- 333🏏సోఫీ డివైన్ (న్యూజిలాండ్)- 313.చదవండి: కెప్టెన్గా శ్రేయస్.. భువీ రీఎంట్రీ! -
ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో భారత మహిళా క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. చెమ్స్ఫోర్డ్ వేదికగా తొలి టీ20లో 38 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా తొలుత ఈసీబీ డెవలప్మెంట్ వుమెన్స్ ఎలెవన్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన భారత్.. ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక అసలు పోటీలో భాగంగా గురువారం రాత్రి మ్యాచ్లో.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు భారత జట్టు తొలుత బ్యాటింగ్కు దిగింది.రాణించిన యస్తికా, జెమీమాఓపెనర్లు స్మృతి మంధాన (0), షఫాలీ వర్మ (2) తీవ్రంగా నిరాశపరచగా.. వన్డౌన్ బ్యాటర్ యస్తికా భాటియా అర్ధ శతకం (40 బంతుల్లో 54)తో రాణించింది. ఇక నాలుగో స్థానంలో బరిలోకి దిగిన జెమీమా రోడ్రిగ్స్ మెరుపు ఇన్నింగ్స్ (40 బంతుల్లో 69)తో ఆకట్టుకుంది.మిగిలిన వారిలో ఆల్రౌండర్ దీప్తి శర్మ (13 బంతుల్లో 22) చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత మహిళా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు.చెలరేగిన బౌలర్లుఓపెనర్లు అలిస్ క్యాప్సీ (6), సోఫియా డంక్లీ (16)లను క్రాంతి గౌడ్ వెనక్కి పంపగా.. అర్ధ శతకం (67)తో జోరు మీదున్న అమీ జోన్స్ (67)ను నందిని శర్మ అవుట్ చేసింది. మిగిలిన ఇంగ్లండ్ బ్యాటర్లలో హీదర్ నైట్ (21) మాత్రమే ఇరవై పరుగుల మార్కు దాటింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 150 పరుగుల వద్ద నిలిచిపోయింది.భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ రెండు వికెట్లు దక్కించుకోగా.. నందిని శర్మ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. శ్రీచరణి, దీప్తి శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక తొలి టీ20లో ఇంగ్లండ్పై 38 పరుగుల తేడాతో గెలిచిన మంధాన సేన.. మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.చదవండి: ‘అతడు ప్లే ఆఫ్స్లో విఫలమవుతూనే ఉన్నాడు’ -
ఏడు వికెట్ల తేడాతో భారత్ జయభేరి
చెమ్స్ఫోర్డ్: ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ముందు జరిగిన ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్లో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో ఈసీబీ డెవలప్మెంట్ ఉమెన్ ఎలెవన్పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఈసీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఫ్లోరెన్స్ మిల్లర్ (48; 7 ఫోర్లు), జోన్ గార్డ్నర్ (36; 3 ఫోర్లు, 1 సిక్స్), సోఫియా స్మేల్ (27; 3 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో హైదరాబాదీ అరుంధతి రెడ్డి 3 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు సాధించింది. 17వ ఓవర్ రెండో బంతికి భారత్ 155 పరుగుల విజయలక్ష్యాన్ని అందుకున్నా...మరింత ప్రాక్టీస్ కోసం ఇన్నింగ్స్ను 20 ఓవర్ల వరకు కొనసాగించారు. షఫాలీ వర్మ (25 బంతుల్లో 50 రిటైర్డ్ అవుట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... భారతి ఫుల్మలి (29 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్లు), యస్తిక భాటియా (35 బంతుల్లో 47; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. భారత్, ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య ఈ నెల 28, 30 తేదీల్లో చెమ్స్ఫోర్డ్, బ్రిస్టల్లలో తొలి రెండు టీ20లు జరగనుండగా... జూన్ 2న టాంటన్లో చివరి టి20 నిర్వహిస్తారు. ఆ తర్వాత జూన్ 12 నుంచి జరిగే టీ20 వరల్డ్ కప్లో భారత బృందం బరిలోకి దిగుతుంది. చదవండి: నకిలీ నవ్వులు.. వాళ్లిద్దరు చెత్త కెప్టెన్లు: సౌతాఫ్రికా దిగ్గజం -
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ క్రికెటర్
టీ20 క్రికెట్లో న్యూజిలాండ్ క్రికెటర్ ఇష్ సోదీ చరిత్ర సృష్టించాడు. శనివారం బంగ్లాదేశ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో వికెట్ తీయడం ద్వారా సోదీ న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. బంగ్లా బ్యాటర్ షమ్మీ హొసేన్ను ఔట్ చేయడం ద్వారా ఇష్ సోదీ ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు 141 మ్యాచ్ల్లో 8.16 ఎకానమీ రేటుతో 165 వికెట్లు తీశాడు. అంతేకాదు కివీస్ తరఫున టీ20ల్లో అత్యధిక సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్గానూ ఇష్ సోదీ నిలిచాడు. ఇప్పటివరకు నాలుగుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇక రెండో స్థానంలో టిమ్ సౌతీ ఉన్నాడు. సౌతీ 126 మ్యాచ్ల్లో 164 వికెట్లు పడగొట్టాడు.ఆ తర్వాతి స్థానంలో మిచెల్ సాంట్నర్ (138 మ్యాచ్ల్లో 142 వికెట్లు), నాలుగో స్థానంలో ట్రెంట్ బౌల్ట్ (83 వికెట్లు), లోకి ఫెర్గూసన్ (76 వికెట్లు) ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 14.2 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హృదోయ్ (33) టాప్ స్కోరర్. కివీస్ బౌలర్లలో జోష్ క్లార్క్సన్ 3 వికెట్లు తీయగా, నాథన్ స్మిత్, బెన్ సియర్స్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం న్యూజిలాండ్ 11.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. బెవన్ జాకబ్స్ (62 నాటౌట్) అజేయ అర్థసెంచరీతో జట్టును గెలిపించాడు. మూడు మ్యాచ్లో టీ20 సిరీస్లో రెండో మ్యాచ్ వర్షంతో రద్దుకాగా, ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సిరీస్ను సమం చేశాయి. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా బెవన్ జాకబ్స్, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా తౌహిద్ హృదోయ్ నిలిచాడు. అంతకముందు జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.చదవండి: సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు.. -
T20 WC 2026: పాఠాలు నేర్చుకున్నాం
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత మహిళల క్రికెట్ జట్టు టీ20 సిరీస్ కోల్పోయినా... ప్రపంచకప్నకు ముందు విలువైన పాఠాలు నేర్చుకుందని హెడ్ కోచ్ అమోల్ మజుందార్ అన్నాడు. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నాలుగు మ్యాచ్ల్లో ఓటమి చవిచూసిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా 1–4తో సిరీస్ కోల్పోయింది.ఈ నేపథ్యంలో మజుందార్ మాట్లాడుతూ... ‘సిరీస్ చాలా బాగా సాగింది. ప్రతి మ్యాచ్లో మన అమ్మాయిలు బాగా పోరాడారు. ఫలితం అనుకూలంగా రాలేదు. 1–4తో సిరీస్ కోల్పోవడం కాస్త నిరాశ పరిచింది. అయితే ఈ సిరీస్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. మంచి ఆరంభాలు లభించిన తర్వాత వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాం. ఈ అంశంపై మరింత కృషి చేయాల్సిన అవసరముంది.ఇక ప్రత్యర్థి బ్యాటర్లను పవర్ ప్లేలో కట్టడి చేయలేకపోయాం. దాని వల్లే మ్యాచ్ల్లో పైచేయి సాధ్యపడలేదు. పొరబాట్ల నుంచి పాఠాలు నేర్చుకొని మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం. సిరీస్ గెలిచేందుకు దక్షిణాఫ్రికా జట్టుకు పూర్తి అర్హత ఉంది. ముఖ్యంగా సఫారీ జట్టు కెప్టెన్ లౌరా వోల్వార్ట్ అద్భుత ఆటతీరు కనబర్చింది. ఐదు మ్యాచ్ల్లో వోల్వార్ట్ వరుసగా 51, 54, 115, 18, 92 పరుగులు చేసింది’ అని వివరించాడు. -
తొలిసారి 5 వికెట్లు.. భారత్ను గెలిపించిన దీప్తి శర్మ
సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత మహిళల జట్టు ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా శనివారం జోహన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో టీమిండియా వుమెన్ 14 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీప్తిశర్మ ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రోడ్రిగ్స్ (43), దీప్తిశర్మ (36 నాటౌట్), రిచా ఘోష్ (34 నాటౌట్) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో మారి మార్స్, యాలా రెనెకి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులకు పరిమితమయింది. ఓపెనర్ సునె లుస్ (40) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, తంజిమ్ బ్రిట్జ్ 30 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 5 వికెట్లు తీయగా, క్రాంతి, చరణి, కశ్వీ గౌతమ్, షెఫాలీ తలా ఒక వికెట్ తీశారు. సిరీస్లో భాగంగా చివరి టీ20 సోమవారం జరగనుంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా దీప్తి శర్మ టీ20ల్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం.4⃣ Overs1⃣9⃣ Runs5⃣ fantastic wickets 👏Deepti Sharma picks up her 𝗠𝗔𝗜𝗗𝗘𝗡 𝗙𝗜𝗩𝗘-𝗪𝗜𝗖𝗞𝗘𝗧 𝗛𝗔𝗨𝗟 in T20Is 🫡Scorecard ▶️ https://t.co/92BPfF0bsf#TeamIndia | #SAvIND | @Deepti_Sharma06 pic.twitter.com/Kj1CzmR8M7— BCCI Women (@BCCIWomen) April 25, 2026𝗦𝘁𝗮𝗻𝗱𝗶𝗻𝗴 𝘁𝗮𝗹𝗹 𝗮𝗻𝗱 𝘀𝗵𝗶𝗻𝗶𝗻𝗴 𝗯𝗿𝗶𝗴𝗵𝘁 ✨Deepti Sharma is adjudged the Player of the Match for her fabulous all-round performance as #TeamIndia clinch victory 🔝👌Scorecard ▶️ https://t.co/92BPfF0bsf#SAvIND | @Deepti_Sharma06 pic.twitter.com/sYwLVZ2cUm— BCCI Women (@BCCIWomen) April 25, 2026 -
పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్ బోర్డు
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్తో బిజీగా ఉంది. కివీస్తో సొంతగడ్డపై బంగ్లా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే రెండు వన్డేలు పూర్తి కాగా కివీస్, బంగ్లా తలా ఒక మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి.ఫామ్లో ఉన్న వాళ్లకు విశ్రాంతి?ఈ క్రమంలో న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తమ జట్టును తాజాగా ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టు నుంచి నహీద్ రాణా, ముస్తాఫిజుర్ రహమాన్, టస్కిన్ అహ్మద్లను తప్పించింది. అబ్దుల్ గఫార్ సక్లెయిన్ అనే అన్క్యాప్డ్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్కు మాత్రం తొలిసారి జట్టులో చోటు కల్పించింది.అదే విధంగా.. ఆసియా క్రీడలు-2023లో బంగ్లాకు ఆడిన రిపర్ మొండాల్కు కూడా మళ్లీ పిలుపునిచ్చారు సెలక్టర్లు. ఈ జట్టుకు లిటన్ దాస్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. మొహమ్మద్ సైఫ్ హసన్ వైస్ కెప్టెన్.పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్ బోర్డుబంగ్లా పేసర్ నహీద్ రాణా ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. కివీస్తో తొలి వన్డేలో ఒక వికెట్ తీయగలిగిన 23 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్.. రెండో వన్డేలో ఐదు వికెట్లతో చెలరేగాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించి బంగ్లాకు గెలుపు అందించాడు.అలాంటి ఆటగాడిని బంగ్లా బోర్డు టీ20 జట్టు నుంచి తప్పించడం గమనార్హం. కాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఆడేందుకే నహీద్కు జాతీయ జట్టు నుంచి విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. కాగా పీఎస్ఎల్-2026లో నహీద్ రాణా పెషావర్ జెల్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.జాతీయ జట్టును కాదని.. PSL వైపు మొగ్గుఇప్పటికే ఆ జట్టు తరఫున నాలుగు మ్యాచ్లు ఆడి ఏడు వికెట్లు తీశాడు. అయితే, వన్డే సిరీస్ ఆడేందుకు స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఇదిలా ఉంటే.. పెషావర్ జెల్మీ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరింది. ఈ నేపథ్యంలోనే టీ20 సిరీస్ను కాదని మరీ.. పీఎస్ఎల్ కోసం నహీద్ను పాకిస్తాన్కు పంపనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముస్తాఫిజుర్ విషయంలోనూ ఇదే జరిగినట్లు సమాచారం. కాగా చమురు సంక్షోభం కారణంగా పీఎస్ఎల్ను స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB).ఇక సీజన్ ఆరంభానికి ముందు అఫ్గనిస్తాన్పై పాక్ దాడుల నేపథ్యంలో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు నెలకొనగా విదేశీ ఆటగాళ్లు ఇక్కడికి వచ్చేందుకు భయపడ్డారు. ఈ క్రమంలో కరాచీ, లాహోర్ వేదికలకు మాత్రమే మ్యాచ్లను పరిమితం చేసింది. ఇలాంటి సమయంలో నహీద్ రాణా వంటి ఫామ్లో ఉన్న ఆటగాళ్లను పంపడం ద్వారా పీఎస్ఎల్కు కాస్త ఊరట దక్కేలా చేసింది బంగ్లా బోర్డు.న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు బంగ్లాదేశ్ జట్టులిటన్ దాస్ (కెప్టెన్), మొహమ్మద్ పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తాంజిద్ హసన్ తమీమ్, మొహమ్మద్సైఫ్ హసన్ (వైస్ కెప్టెన్), షమీమ్ హొస్సేన్ పట్వారీ, తౌహిద్ హృదయ్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, రిషాద్ హొసేన్, షోరిఫుల్ ఇస్లాం, తాంజిమ్ హసన్ సకీబ్, రిపన్ మొండాల్, మొహమ్మద్ సైఫుద్దీన్, అబ్దుల్ గఫార్ సక్లెయిన్.చదవండి: SRH vs DC: ఆ రెండు తప్పులే మా కొంపముంచాయి -
హర్మన్ మెరుపులు
డర్బన్: టి20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టి20 సిరీస్లో భారత మహిళల జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఐదు మ్యాచ్లో సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... జెమీమా రోడ్రిగ్స్ (29 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్), షఫాలీ వర్మ (20 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. మూడో వికెట్కు జెమీమాతో కలిసి హర్మన్ 71 పరుగులు జోడించింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (13), రిచా ఘోష్ (5), కాశ్వి గౌతమ్ (10) విఫలమయ్యారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన హర్మన్ బృందం... టి20లకు అవసరమైనంత వేగంగా ఆడటంలో విఫలమైంది. ఆఖరి ఐదు ఓవర్లలో టీమిండియా 33 పరుగులే చేసి 3 వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టగా... టుమీ రెండు వికెట్లు తీసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా కడపటి వార్తలు అందేసరికి 10 ఓవర్లలో 2 వికెట్లకు 88 పరుగులు చేసింది. -
భారత్ X దక్షిణాఫ్రికా
టి20 ప్రపంచ కప్కు ముందు సన్నాహకాల్లో భాగంగా భారత మహిళల క్రికెట్ జట్టు నేటి నుంచి దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడనుంది. ఇంగ్లండ్ వేదికగా ఈ ఏడాది జూన్లో ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో ఒక అగ్రశ్రేణి టీమ్తో సిరీస్ టీమిండియాకు ఉపయోగపడనుంది. ఇటీవల ఆస్ట్రేలియా, శ్రీలంకపై టి20 సిరీస్లు గెలిచిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా... సఫారీతో సిరీస్ ద్వారా జట్టు కూర్పును సరిచూసుకోవాలని భావిస్తోంది. కెప్టెన్ హర్మన్ప్రీత్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మతో భారత జట్టు బలంగా కనిపిస్తోంది. బౌలింగ్లో ఆంధ్ర అమ్మాయిలు అరుంధతి రెడ్డి, శ్రీచరణి కీలకం కానున్నారు. ‘వరల్డ్కప్నకు ముందు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాం. వన్డే ప్రపంచకప్ సాధించిన అనంతరం జట్టులో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది’ అని హర్మన్ వెల్లడించింది. రాత్రి గం.9:30 నుంచి జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
భారత్తో సిరీస్.. సౌతాఫ్రికా జట్టు ప్రకటన
టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా సౌతాఫ్రికా మహిళా జట్టు స్వదేశంలో భారత జట్టుతో తలపడేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 17- 27 మధ్య ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ సౌతాఫ్రికా (CSA) భారత్తో తలపడే తమ జట్టును ప్రకటించింది.పదిహేను మంది సభ్యులకు చోటుఈ జట్టులో పదిహేను మంది సభ్యులకు చోటు ఇచ్చినట్లు CSA తెలిపింది. ఇందుకు సంబంధించి తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత మహిళా జట్టుతో సిరీస్ కోసం టొబొగొ మచికేను తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. గాయపడిన కరాబో మెసో స్థానంలో 25 ఏళ్ల మచికేకు అవకాశం ఇచ్చినట్లు వెల్లడించింది.తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికఅదే విధంగా మసబటా క్లాస్ స్థానాన్ని ఎలిజ్ మేరీ మార్క్స్ భర్తీ చేసిందన్న CSA.. టీ20 ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకునే ఈ మేరకు ఇద్దరు కొత్త ప్లేయర్లకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రొటిస్ మహిళా జట్టు హెడ్కోచ్ మండ్లా మషింబియ్ మాట్లాడుతూ.. ‘‘టీ20 ప్రపంచకప్ టోర్నీకి సమయం ఆసన్నమవుతోంది.ఎలిజ్, టొబొగొలను జట్టుకు ఆడించడం కోసం మేము ఆతురతగా ఎదురుచూస్తున్నాం. వాళ్లిద్దరు గొప్పగా ఆడతారని విశ్వసిస్తున్నాం. కొత్త ముఖాలకు చోటు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. యువ ఆటగాళ్లు జట్టుతో ఉంటే నూతనోత్సాహంతో ముందుకు సాగగలం’’ అని పేర్కొన్నారు. కాగా భారత్తో టీ20 సిరీస్కు లారా వొల్వర్ట్ సౌతాఫ్రికా జట్టుకు సారథ్యం వహించనుంది.భారత్తో టీ20 సిరీస్కు సౌతాఫ్రికా మహిళా జట్టులారా వొల్వర్ట్ (కెప్టెన్), అనికె బాష్, తజ్మిన్ బ్రిట్స్, నదినె డి క్లెర్క్, ఆనెరి డెర్క్సన్, అయాండా హ్లుబి, సినాలో జాఫ్తా, అయబోంగా ఖాక, సునె లుస్, టొబొగొ మచికె, ఎలిజ్ మేరీ మార్క్స్, నొంకులులెకో మలబ, కాయ్లా రెయ్నికె, తుమి సెఖుఖునె, క్లో ట్రియాన్.సౌతాఫ్రికా- భారత్ మహిళా జట్ల టీ20 సిరీస్ షెడ్యూల్- 5 మ్యాచ్లు👉తొలి టీ20- ఏప్రిల్ 17- డర్బన్👉రెండో టీ20- ఏప్రిల్ 19- డర్బన్👉మూడో టీ20- ఏప్రిల్ 22- జొహన్నస్బర్గ్నాలుగో టీ20- ఏప్రిల్ 25- జొహన్నస్బర్గ్👉ఐదో టీ20- ఏప్రిల్ 27- బెనోని.చదవండి: సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత రియాన్ పరాగ్ వ్యాఖ్యలు -
బీసీసీఐకి మా రిక్వెస్ట్.. లేఖలో ఆ విషయాలు: బంగ్లాదేశ్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని సంప్రదించినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తాజాగా ధ్రువీకరించింది. భారత్తో క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ కోసం తాము ముందడుగు వేసినట్లు తెలిపింది. కాగా గత కొంతకాలంగా భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా క్రికెట్ సంబంధాలు కూడా దెబ్బతిన్న సంగతి తెలిసిందే.భద్రతా కారణాలు చూపుతూఈ క్రమంలో బంగ్లాదేశ్ ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ను ఐపీఎల్ నుంచి బీసీసీఐ తొలగించగా.. టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు భారత్కు వచ్చేందుకు బంగ్లా నిరాకరించింది. భద్రతా కారణాలు చూపుతూ తమ వేదికను శ్రీలంకను మార్చమని ఐసీసీని కోరగా.. ప్రతికూల నిర్ణయం రావడంతో టోర్నీ నుంచే తప్పుకొంది.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్కు వంత పాడుతూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసింది. ఐసీసీ సైతం బీసీసీఐ ఒత్తిడికి తలొగ్గి బంగ్లాదేశ్కు అన్యాయం చేసిందని ఆరోపించింది. ఇందుకు ప్రతిగా తాము భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామని ప్రగల్భాలు పలికి బొక్కబోర్లా పడింది.భారీగా నష్టపోయే ప్రమాదంఐసీసీ రంగంలోకి దిగడంతో టీమిండియాతో మ్యాచ్ ఆడటమే కాకుండా.. యథావిధిగా మరోసారి ఓటమిని మూటగట్టుకుంది పాకిస్తాన్. ఈ ఎపిసోడ్తో బంగ్లాదేశ్ ఆర్థికంగా భారీగా నష్టపోయే ప్రమాదం వచ్చిపడింది. ఆదేశంలోని మెజారిటీ ప్లేయర్ల క్రికెట్ కిట్లకు స్పాన్సర్లుగా ఉన్న భారత కంపెనీలు వైదొలుగుతాయనే భయం పట్టుకుంది.ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పలువురు మాజీ క్రికెటర్లు బంగ్లా బోర్డును హెచ్చరించారు కూడా!.. ఈ క్రమంలో తాజాగా బీసీబీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ నేపథ్యంలో బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ నజ్ముల్ అబెదిన్ ఫాహిమ్ ANIతో మాట్లాడుతూ కీలక విషయం వెల్లడించాడు. బీసీసీఐని సంప్రదించాము‘‘వివిధ దేశాల క్రికెట్ బోర్డులతో మేము సమన్వయం చేసుకుంటున్నాము. ఇటీవలే బీసీసీఐని కూడా సంప్రదించాము. ఇ-మెయిల్ ద్వారా లేఖ పంపించాము. అందులో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన గురించి ప్రస్తావించాము. ఈ ఏడాది సెప్టెంబరులో టీమిండియా బంగ్లాదేశ్లో పర్యటించాల్సిన విషయాన్ని గుర్తుచేశాము.అదే విధంగా మా మహిళా జట్టు భారత్లో పర్యటించాల్సి ఉంది. దీనితో పాటు పరస్పర ప్రయోజనాలు చేకూరేలా క్రికెట్కు సంబంధించి ఇతర కార్యక్రమాలు ఏమైనా నిర్వహించవచ్చన్న విషయాన్ని కూడా పరిశీలించాలని అభ్యర్థించాము’’ అని నజ్ముల్ తెలిపాడు. మూడు వన్డేలు, మూడు టీ20లు!కాగా బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా తారిక్ రహమాన్ ఎన్నికైన తర్వాత భారత్- బంగ్లా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఏప్రిల్ 7,8 తేదీల్లో బంగ్లాదేశ్ విదేశాంగ శాఖా మంత్రి డాక్టర్ ఖాలిలుర్ రహమాన్ భారత పర్యటనకు రానున్నారు.ఈ నేపథ్యంలో క్రికెట్లోనూ సంబంధాల పునరుద్ధరణ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది బంగ్లా బోర్డు. ఇదిలా ఉంటే గతేడాది ఆగస్టులో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. టూర్ వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబరు 1- 13 మధ్య బంగ్లాదేశ్తో భారత్ మూడు వన్డే, మూడు టీ20లు ఆడేలా షెడ్యూల్ ఖరారు కావాలని బీసీబీ కోరుకుంటోంది.చదవండి: టీమిండియాకు శుభవార్త: నితీశ్ రెడ్డిపై గావస్కర్ ప్రశంసలు -
జింబాబ్వే టూర్కు టీమిండియా.. షెడ్యూల్ విడుదల
ఐపీఎల్-2026 సీజన్ తర్వాత టీమిండియా వరుస సిరీస్లతో బీజీబీజీగా గడపనుంది. తొలుత జూన్లో అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్లో భారత్ తలపడనుంది. ఈ సిరీస్లో స్వదేశంలోనే జరగనుంది. అనంతరం ఐర్లాండ్ టూర్లో భాగంగా రెండు టీ20లు టీమిండియా ఆడనుంది.మెన్ ఇన్ బ్లూ అటు నుంచి అటు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లీష్ జట్టుతో ఐదు టీ20లు , మూడు వన్డేల సిరీస్లో భారత్ ఆడనుంది. భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన జూలై 1న మొదలై జూలై 19తో ముగియనుంది. అయితే అక్కడికి మూడు రోజుల తర్వాత టీమిండియా మూడు టీ20ల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటించనుంది.తాజాగా ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను జింబాబ్వే క్రికెట్ విడుదల చేసింది. భారత్-జింబాబ్వే మధ్య మూడు టీ20ల సిరీస్ కేవలం నాలుగు రోజుల వ్యవధిలో జరగనుంది. జూలై 23న ప్రారంభమై జూలై 26తో ముగిస్తుంది. అన్ని మ్యాచ్లు హరారే వేదికగా జింబాబ్వే వేదికగానే జరగనున్నాయి.భారత్, జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగనుండడం 2024 తర్వాత ఇదే తొలిసారి.అయితే వరుస సిరీస్ల నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి, ఐపీఎల్లో రాణించిన యువ ఆటగాళ్లను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం చేసే సూచనలు కన్పిస్తున్నాయి.భారత్-జింబాబ్వే టీ20 సిరీస్ షెడ్యూల్మొదటి టీ20: జూలై 23రెండో టీ20: జూలై 25మూడో టీ20: జూలై 26చదవండి: NZ vs SA: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
బంగ్లాదేశ్ పర్యటన.. కివీస్ వన్డే, టీ20 జట్ల ప్రకటన
బంగ్లాదేశ్ పర్యటనకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టును కివీస్ బోర్డు ప్రకటించింది. ఇందులో పేస్ త్రయం మ్యాట్ ఫిషర్, విలియం ఓ రూర్కీ, బ్లెయిర్ టిక్నర్లకు చోటు దక్కింది. కాగా భారత్తో టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో ఓడిన న్యూజిలాండ్.. రన్నరప్తో సరిపెట్టుకుంది.ఈ క్రమంలో ఐసీసీ టోర్నీ ముగిసిన వెంటనే దాదాపుగా ద్వితీయ శ్రేణి జట్టుతో స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడింది కివీస్ జట్టు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రొటిస్ జట్టు ఆతిథ్య న్యూజిలాండ్పై 3-2తో గెలిచింది.పరిమిత ఓవర్ల సిరీస్లుఇక ఈ సిరీస్ తర్వాత న్యూజిలాండ్ బంగ్లాదేశ్ పర్యటన (New Zealand tour of Bangladesh, 2026)కు వెళ్లేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. తొలుత ఏప్రిల్ 17న వన్డే సిరీస్ మొదలుకానుండగా.. మే 2 నాటి మూడో టీ20తో ఈ టూర్ ముగియనుంది.టామ్ లాథమ్ సారథ్యంలోఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో పరిమిత ఓవర్ల సిరీస్లకు కివీస్ బోర్డు తాజాగా తమ జట్లను ప్రకటించింది. మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) స్థానంలో వన్డే, టీ20 జట్లకు టెస్టు కెప్టెన్ టామ్ లాథమ్ సారథ్యం వహించనున్నాడు.కాగా సాంట్నర్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడితో పాటు పలువురు కీలక ప్లేయర్లు సైతం ఐపీఎల్, పాకిస్తాన్ సూపర్ లీగ్ విధులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్లేయర్లతో కివీస్ బోర్డు వన్డే, టీ20 జట్లను ప్రకటించింది.ఇక గాయాల నుంచి కోలుకున్న ఫిషర్, ఓరూర్కీ, టిక్నర్ తిరిగి జట్టుతో చేరడం పట్ల హెడ్కోచ్ రాబ్ వాల్టర్ హర్షం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే.. ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ డీన్ ఫాక్స్క్రాఫ్ట్ చాలా కాలం తర్వాత తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు.బంగ్లాదేశ్ పర్యటనకు న్యూజిలాండ్ వన్డే జట్టు (ఏప్రిల్ 17, 20, 23)టామ్ లాథమ్ (కెప్టెన్), ముహమ్మద్ అబ్బాస్, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, డేన్ క్లీవర్, డీన్ ఫాక్స్క్రాఫ్ట్, నిక్ కెల్లి, జేడెన్ లెనాక్స్, హెన్రీ నికోల్స్, విలియం ఓరూర్కీ, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.బంగ్లాదేశ్తో టీ20లకు న్యూజిలాండ్ జట్టు (ఏప్రిల్ 27, 29, మే 2)టామ్ లాథమ్ (కెప్టెన్), కెటెనె క్లార్క్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, డేన్ క్లీవర్, మ్యాట్ ఫిషర్, డీన్ ఫాక్స్క్రాఫ్ట్, బెవాన్ జేకబ్స్, నిక్ కెల్లి, జేడెన్ లెనాక్స్, టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్.చదవండి: ఇంగ్లండ్ టూర్కు వైభవ్ సూర్యవంశీని పంపండి: మైకేల్ వాన్ -
IND vs ENG: ఇంగ్లండ్ టూర్కు వైభవ్ సూర్యవంశీ!
భారత యువ సంచలనం, రాజస్తాన్ రాయల్స్ స్టార్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026 టోర్నీని ఘనంగా ఆరంభించాడు. చెన్నై సూపర్ కింగ్స్తో సోమవారం నాటి మ్యాచ్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ దుమ్మురేపాడు. మెరుపు అర్ధ శతకం బాది శెభాష్ అనిపించుకున్నాడు.ప్రశంసల వర్షంగువాహటి వేదికగా కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). అతడి విధ్వంసకర ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఇక వైభవ్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా రాజస్తాన్ చెన్నైపై అలవోక విజయం సాధించింది. 128 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కేవలం 12.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అయితే ఓ అడుగు ముందుకేసి.. వైభవ్ను వెంటనే టీమిండియాకు ఎంపిక చేయాలనే ప్రతిపాదన తెచ్చాడు. క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ..నేనే గనుక సెలక్టర్ అయి ఉంటే‘‘అతడు ఎప్పుడు టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తాడు? అని నేనెంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాను. ఇది కాస్త తొందరపాటే అని అనిపించవచ్చు. ఐపీఎల్ తాజా ఎడిషన్లో అతడికి ఇదే తొలి ఇన్నింగ్స్. ఏదేమైనా కొన్ని నెలల తర్వాత టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది.ఒకవేళ నేనే గనుక సెలక్టర్ అయి ఉంటే వైభవ్ను ఈ టూర్కు కచ్చితంగా ఎంపిక చేస్తా. ప్రస్తుతానికి అతడికి జట్టులో చేరాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ జట్టుకు అతడి అవసరం ఉంటుందేమో!.. పదిహేనేళ్ల పిల్లాడిని టూర్కు అనుమతిస్తారా? అంటే నేనేమీ చెప్పలేను.కానీ అతడు ఇప్పటికే ఆటగాడిగా పరిణతి సాధించాడు. టీమిండియా తరఫున కూడా కచ్చితంగా సత్తా చాటగలడు’’ అని మైకేల్ వాన్ పేర్కొన్నాడు. వీలైనంత త్వరగా వైభవ్ను జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి సూచించాడు.చదవండి: Ravindra Jadeja: రంగుమారిన మరుక్షణం మాట మార్చాడు! -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్.. ప్రపంచ రికార్డు
సౌతాఫ్రికా క్రికెటర్ కానర్ ఎస్తురూజెన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20లలో న్యూజిలాండ్పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్ ఓపెనింగ్ వికెట్ కీపర్ బ్యాటర్గా నిలిచాడు ఎస్తురూజెన్.సంగక్కర రికార్డు బద్దలుతద్వారా శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర 2009లో నెలకొల్పిన రికార్డును ఎస్తురూజెన్ బద్దలు కొట్టాడు. కాగా ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు న్యూజిలాండ్కు వెళ్లింది. ఈ సిరీస్లో ఎస్తురూజెన్ మొత్తంగా 200 పరుగులు స్కోరు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.ఇక బుధవారం ముగిసిన ఐదో టీ20లో ఎస్తురూజెన్ 33 బంతుల్లో 75 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ టీ20లలో న్యూజిలాండ్పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్ ఓపెనింగ్ వికెట్ కీపర్ బ్యాటర్గా చరిత్రకెక్కాడు. 2009లో సంగక్కర కివీస్పై 69 పరుగులు చేశాడు. 33 పరుగుల తేడాతో..మ్యాచ్ విషయానికొస్తే.. క్రైస్ట్చర్చ్ వేదికగా బుధవారం జరిగిన నిర్ణయాత్మక పోరులో కేశవ్ మహరాజ్ సారథ్యంలోని సౌతాఫ్రికా జట్టు 33 పరుగుల తేడాతో.. ఆతిథ్య న్యూజిలాండ్ను మట్టికరిపించింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్ను 3–2తో చేజిక్కించుకుంది. ఈ సిరీస్ ద్వారానే నలుగురుసౌతాఫ్రికా ప్లేయర్లు అరంగేట్రం చేసినా... వారంతా సమయానుకూలంగా మెరిపించడంతో సఫారీ జట్టు సులువుగా సిరీస్ కైవసం చేసుకుంది.ధనాధన్ హాఫ్సెంచరీన్యూజిలాండ్ గడ్డపై దక్షిణాఫ్రికా 2012లో 2–1తో... 2017లో 1–0తో టీ20 సిరీస్లను సొంతం చేసుకుంది. ఇక చివరిదైన ఐదో మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. గత మ్యాచ్లో అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కానర్ ఎస్తురూజెన్ (33 బంతుల్లో 75; 5 ఫోర్లు) మరోసారి ధనాధన్ హాఫ్సెంచరీతో చెలరేగాడు.రుబిన్ హెర్మన్ (39; 4 ఫోర్లు, 1 సిక్స్), ముల్డర్ (31; 2 ఫోర్లు, 2 సిక్స్లు) అతడికి సహకరించారు. కివీస్ బౌలర్లు ఆరంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో... పరుగుల రాక గగనమైంది. దీంతో 11 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 79/2తో నిలిచింది. ఈ దశలో కానర్ భారీ షాట్లతో చెలరేగిపోయాడు.నాలుగో వికెట్కు ఫోరెస్టర్ (21 నాటౌట్)తో కలిసి కానర్ 27 బంతుల్లో 61 పరుగులు జోడించడంతో సఫారీ జట్టు మంచి స్కోరు చేయగలిగింది. చివరి 10 ఓవర్లలో సౌతాఫ్రికాకా 111 పరుగులు రాబట్టింది. న్యూజిలాండ్ బౌలర్లలో బెన్ సీర్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.154 పరుగులకు పరిమితంఅనంతరం ఓ మాదిరి లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులకు పరిమితమైంది. బెవాన్ జాకబ్స్ (19 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ జేమ్స్ నీషమ్ (24), టిమ్ రాబిన్సన్ (25), క్లీవర్ (22) తలా కొన్ని పరుగులు చేశారు.అయితే, కివీస్ బ్యాటర్లు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోవడంతో... ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో కోట్జీ, ముల్డర్, బార్ట్మన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కానర్ ఎస్తురూజెన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. చదవండి: IPL 2026: ప్యాట్ కమ్మిన్స్ కీలక ప్రకటన -
శతక్కొట్టిన జార్జియా వోల్.. సిరీస్ క్లీన్స్వీప్
వెస్టిండీస్ పర్యటనలో ఆస్ట్రేలియా మహిళల జట్టు శుభారంభం చేసింది. వెస్టిండీస్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్స్వీప్ చేసింది. మంగళవారం కింగ్స్టౌన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా డక్వర్త్ లూయిస్ పద్దతిలో 40 పరుగుల తేడాతో వెస్టిండీస్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. జార్జియా వోల్ (53 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకంతో మెరిసింది. చివర్లో నికోలా కేరీ (24 నాటౌట్), సోఫీ మొలినెక్స్ (25) రాణించారు. అయితే ఆసీస్ చేసిన స్కోరులో సగం పరుగులు జార్జియావే ఉండడం విశేషం. కాగా జార్జియా వోల్కు ఇదే తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం విశేషం.వెస్టిండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 3 వికెట్లు తీయగా, జాజ్రా క్లాక్స్టన్ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ వర్షం అంతరాయం కలిగించే సమయానికి 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (30 నాటౌట్), డియాండ్రా దొతిన్ (11 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో ఎలీస్పెర్రీ, మేగన్ స్కాట్,లూసీ హామిల్టన్ తలా ఒక వికెట్ తీశారు. అయితే వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో పిచ్ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ను నిలిపివేసి డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు. సెంచరీతో విధ్వంసం సృష్టించిన జార్జియా వోల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోగా, అలానా కింగ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచింది. ఇరుజట్ల మధ్య తొలి వన్డే శుక్రవారం జరగనుంది.చదవండి: IPL 2026: ‘పరాగ్కు అంత సీన్ లేదు’ -
న్యూజిలాండ్ కెప్టెన్ ప్రపంచ రికార్డు!
న్యూజిలాండ్ మహిళల జట్టు కెప్టెన్ అమేలియా కెర్ అరుదైన రికార్డు సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అమేలియా కెర్ వరుసగా పదోసారి 30కి పైగా పరుగులు సాధించడం విశేషం. సౌతాఫ్రికా మహిళలతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ సందర్భంగా అమేలియా ఈ ప్రపంచ రికార్డును అందుకుంది. ఈ నేపథ్యంలోనే పురుషుల,మహిళల క్రికెట్లోనూ ఎవరికీ సాధ్యం కాని రికార్డు కూడా అమేలియా కెర్ తాజాగా తన పేరిట లిఖించుకుంది. గతంలో అమేలియా కెర్ సహా శ్రీలంకకు చెందిన చమేరి ఆటపట్టు, రోమానియాకు చెందిన రెబెక్కా బ్లేక్లు 9 సార్లు వరుసగా 30కి పైగా స్కోర్లు సాధించారు.తాజాగా వీరిని వెనక్కినెట్టిన అమేలియా కెర్ అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల క్రికెట్లో రోహిత్ శర్మ (భారత్), అభిషేక్ శర్మ (భారత్), మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్), హ్రిస్టో లాకోవ్లు వరుసగా ఏడుసార్లు 30కి పైగా స్కోర్లు సాధించారు. ఇదే మ్యాచ్లో మరో కివీస్ బ్యాటర్ సోఫీ డివైన్ కూడా అరుదైన రికార్డు సాధించింది. మ్యాచ్లో 34 బంతుల్లో 64 పరుగులు చేసిన సోఫీ డివైన్.. దక్షిణాఫ్రికా జట్టుపై 10సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన బ్యాటర్గా నిలిచింది. గతంలో బాబర్ ఆజమ్ (వర్సెస్ న్యూజిలాండ్), స్మృతి మంధాన (వర్సెస్ ఇంగ్లండ్), బెత్ మూనీ (వర్సెస్ భారత్) తొమ్మిదేసి సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించారు. మ్యాచ్ విషయానికి వస్తే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కివీస్ 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా మహిళల జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం కివీస్ మహిళలు 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 160 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జెస్ కెర్ ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. నామమాత్రమైన ఐదో టీ20 బుధవారం జరగనుంది.చదవండి: IPL 2026: అభిమానుల కన్నీటిపర్యంతం! -
సౌతాఫ్రికా విజయం.. రసపట్టులో టీ20 సిరీస్!
న్యూజిలాండ్, సౌతాఫ్రికాల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ రసవత్తరంగా మారింది. ఆదివారం వెల్లింగ్టన్ వేదికగ2ఆ జరిగిన నాలుగో టీ20లో దక్షిణాఫ్రికా 19 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా 2-2తో రెండు జట్లు సమంగా నిలిచాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కొన్నర్ ఎస్తర్హూజిన్ (36 బంతుల్లో 57, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలవవగా, రుబిన్ హెర్మన్ (28 నాటౌట్), టోనీ డి జోర్జి (23) రాణించారు. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. టిమ్ రాబిన్సన్ (22 బంతుల్లో 32) టాప్ స్కోరర్గా నిలవగా, డేన్ క్లెవర్ (26) పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జీ 3 వికెట్లు పడగొట్టగా, బార్త్మన్, సుబ్రెయన్, కేశవ్ మహరాజ్లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. అర్థసెంచరీతో మెరిసిన ఎస్తర్హుజిన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు. మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. వియాన్ ముల్డర్ డకౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత టోనీ డిజార్జి, ఎస్తర్ హుజిన్లు రెండో వికెట్కు 81 పరుగులు జోడించి సఫారీ ఇన్నింగ్స్ను నిలబెట్టారు. టోనీ ఔటైన తర్వాత కఈజులోకి వచ్చిన రుబిన్ హెర్మన్ ధాటిగా ఆడాడు. ఎస్తర్హుజిన్ పెవిలియన్ చేరిన తర్వాత ఇన్నింగ్స్ చివర్లో జాసన్ స్మిత్, డియాన్ ఫెరస్టర్లు బ్యాట్ ఝలిపించడంతో సౌతాఫ్రికా గౌరప్రదమైన స్కోరు సాధించింది. అనంతరం ఛేదనలో ఆది నుంచే తడబడిన న్యూజిలాండ్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక చివరి టీ20 బుధవారం జరగనుంది. -
నాలుగో టీ20లో సౌతాఫ్రికా చిత్తు.. సిరీస్ న్యూజిలాండ్ సొంతం
వెల్లింగ్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో మహిళలతో జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-1తో న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.ప్రోటీస్ ఆల్రౌండర్ అనేరీ డెర్క్సెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 32 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్తో 55 పరుగులు చేసింది. ఆమెతో పాటు లాస్ 30 పరుగులతో రాణించింది. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్ 3 వికెట్లతో అదరగొట్టింది. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని కివీస్ జట్టు 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కివీస్ స్టార్ ఆల్రౌండర్ సోఫీ డివైన్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేసింది. ఆమెతో పాటు అమీలియా కేర్ 31 పరుగులతో రాణించింది. సౌతాఫ్రికా బౌలర్లలో క్లో ట్రయాన్ 2 వికెట్లు తీసింది. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు ఐదో టీ20 క్రైస్ట్చర్చ్ వేదికగా మార్చి 25న జరగనుంది.చదవండి: IPL 2026: '250 స్కోర్ కొట్టినా.. సన్రైజర్స్ ఓడిపోతుంది' -
ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ ఖరారు చేసిన బీసీసీఐ
భారత పురుషల క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ రెండు మ్యాచ్లు జూన్ 26,28వ తేదిల్లో బెల్ఫాస్ట్ వేదికగా జరగనున్నాయి. ఈ మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. పొట్టి ప్రపంచకప్ ఛాంపియన్స్గా నిలిచిన తర్వాత భారత్కు ఇదే తొలి టీ20 సిరీస్ కావడం గమనార్హం. వాస్తవానికి ఈ సిరీస్ టీమిండియా ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్లో లేదు.ఐపీఎల్-2026 సీజన్ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో అఫ్గానిస్తాన్ ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. జూన్ 6-20 మధ్య టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య సిరీస్ జరుగుతుంది. ఆ తర్వాత జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేలా ముందుగా షెడ్యూల్ ఖరారైంది.జూలై 1- 19 వరకు ఇరు జట్ల మధ్య ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఐర్లాండ్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బీసీసీఐ ఈ పర్యటనను ఖరారు చేసింది. ఆ తర్వాత భారత జట్టు అక్కడ నుంచి నేరుగా ఇంగ్లండ్కు వెళ్లనుంది. భారత్, ఐర్లాండ్ జట్లు చివరిసారిగా టీ20 ప్రపంచకప్లో తలపడ్డాయి.చదవండి: IPl 2026: 'వైభవ్ అతిగా ఆలోచించకు.. జైస్వాల్ చూసుకుంటాడు' -
టీమిండియా అభిమానులకు పండుగే పండుగ!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీని విజయవంతంగా ముగించుకున్న భారత ఆటగాళ్లు తదుపరి ఐపీఎల్ పందొమ్మిదో ఎడిషన్తో బిజీ కానున్నారు. మార్చి 28న ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుంది. ఇక ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత జూన్ 6-20 మధ్య టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య సిరీస్ జరుగుతుంది.ముందుగా ఐర్లాండ్ టూర్కు!ఇందులో భాగంగా భారత్- అఫ్గన్ జట్లు ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడతాయి. అనంతరం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే, అంతకంటే ముందు భారత జట్టు ఐర్లాండ్ టూర్కు వెళ్లనున్నట్లు సమాచారం.ఐర్లాండ్ హై పర్ఫామెన్స్ డైరెక్టర్ గ్రాహమ్ వెస్ట్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ జరుగనుందని సంకేతాలు ఇచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఐర్లాండ్ కనీసం సూపర్-8 దశకు కూడా చేరుకుండానే నిష్క్రమించింది.మంచి బూస్ట్ఇందుకు బాధ్యత వహిస్తూ పాల్ స్టెర్లింగ్ కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో.. ‘‘టీ20 ప్రపంచకప్-2028 సన్నాహకాల్లో భాగంగా పాల్ స్టెర్లింగ్ రాజీనామా చేయగా.. అతడి స్థానంలో వచ్చే కొత్త కెప్టెన్కు జూన్లో టీమిండియాతో జరిగే సిరీస్తో మంచి బూస్ట్ లభిస్తుంది’’ అని గ్రాహమ్ వెస్ట్ ప్రకటన విడుదల చేశాడు. తద్వారా భారత్- ఐర్లాండ్ సిరీస్ విషయాన్ని ఖరారు చేశాడు.కాగా గత ఏడేళ్లలో ఇప్పటి వరకు టీమిండియా ఐర్లాండ్లో మూడుసార్లు (2018, 2022, 2023)లో పర్యటించింది. ఇదిలా ఉంటే.. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్ ముగించుకున్న తర్వాత టీమిండియా జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేలా ముందుగా షెడ్యూల్ ఖరారైంది. జూలై 1- 19 వరకు ఇరుజట్ల మధ్య ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు నిర్వహించాలని నిర్ణయించారు.మరింత బిజీగాఅయితే, తాజాగా ఐర్లాండ్ టూర్తో భారత జట్టు షెడ్యూల్ మరింత బిజీగా మారింది. దీంతో తమకు ఈ ఏడాదంతా పండుగేనని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. తద్వారా స్వదేశంలో మొట్టమొదటిసారి, వరుసగా రెండోసారి, ఓవరాల్గా మూడోసారి టీ20 వరల్డ్కప్ ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.చదవండి: ODI WC: ఇప్పటికే ఇరవై మందిని షార్ట్లిస్ట్ చేసిన బీసీసీఐ? -
ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్
తొలి టీ20లో సౌతాఫ్రికా చేతిలో ఎదురైన పరాభవానికి న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది. రెండో టీ20 మ్యాచ్లో సఫారీ జట్టును మట్టికరిపించి జయభేరి మోగించింది. టీ20 ప్రపంచకప్-2026లో రన్నరప్గా నిలిచిన కివీస్.. ప్రస్తుతం స్వదేశంలో ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్తో బిజీగా ఉంది.ఇందులో భాగంగా ఆదివారం మౌంట్ మౌంగనీ వేదికగా ప్రొటిస్తో తొలి టీ20లో తలపడ్డ న్యూజిలాండ్.. ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తాజాగా హామిల్టన్లో మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన కివీస్.. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది.డెవాన్ కాన్వే అర్ధ శతకంటాపార్డర్లో ఓపెనర్ టామ్ లాథమ్ (11), వన్డౌన్ బ్యాటర్ టిమ్ రాబిన్సన్ (1) నిరాశపరచగా.. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే అర్ధ శతకం (60)తో ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో నిక్ కెలీ (12 బంతుల్లో 21), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (14 బంతుల్లో 21) ఫర్వాలేదనిపించగా.. కోల్ మెకాంచి (12 బంతుల్లో 18), జోష్ క్లార్క్సన్ (9 బంతుల్లో 26) మెరుపు ఇన్నింగ్స్తో అజేయంగా నిలిచారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది. సఫారీ బౌలర్లలో వియాన్ ముల్డర్ రెండు వికెట్లు తీయగా.. గెరాల్డ్ కోయెట్జి, ఒట్నీల్ బార్ట్మాన్, కెప్టెన్ కేశవ్ మహరాజ్, జార్జ్ లిండే తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.ఆదిలోనే ఎదురుదెబ్బలులక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లలో కొన్నోర్ ఎస్తరూజెన్ (8)ను బెన్ సియర్స్ వెనక్కి పంపగా.. వియాన్ ముల్డర్ (16)ను సాంట్నర్ అవుట్ చేశాడు. వన్డౌన్లో వచ్చిన టోనీ జార్జి (1) మెకాంచీ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు.107 పరుగులకే ఆలౌట్ మిగిలిన వారిలో రూబిన్ హెర్మాన్ (19) ఫర్వాలేదనిపించగా.. జార్జ్ లిండే 12 బంతుల్లో 33 పరుగులు చేశాడు. మిగిలిన వారంతా చేతులెత్తేయడంతో 15.3 ఓవర్లలో 107 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. ఫలితంగా న్యూజిలాండ్ 68 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను ప్రస్తుతానికి 1-1తో సమం చేసింది.కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, బెన్ సియర్స్ చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. సాంట్నర్ రెండు, మెకాంచి, జేమ్స్ నీషమ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్- సౌతాఫ్రికా మధ్య శుక్రవారం నాటి మూడో టీ20కి ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదిక.చదవండి: టీమిండియా టీ20 కెప్టెన్గా ఊహించని పేరు! -
సౌతాఫ్రికా అమ్మాయిలదే పైచేయి
న్యూజిలాండ్ పర్యటనలో సౌతాఫ్రికా మహిళల జట్టు శుభారంభం చేసింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మంగళవారం హామిల్టన్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో సౌతాఫ్రికా 18 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్ తజ్మిన్బ్రిట్స్ (43 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా, లారా వోల్వర్ట్ (33 బంతుల్లో 41) పర్వాలేదనిపించింది. ఆఖర్లో కయ్లా రెనెకె (9 బంతుల్లో 28 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో అమెలియా కెర్, జెస్ కెర్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ మహిళల జట్టు సఫారీ బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. అమెలియా కెర్ (18 బంతుల్లో 32) టాప్ స్కోరర్గా నిలవగా ఇజీ షార్ప్ (29) పరుగులు చేసింది. అయితే సౌతాఫ్రికా బౌలర్లలో అయోబంగా ఖాకా 4 వికెట్లతో చెలరేగితే, లాబా 3 వికెట్లు తీసింది. కయ్లా రెనెకెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. చదవండి: కోహ్లి కాదు!.. అత్యుత్తమ టీ20 క్రికెటర్ అతడే: డివిలియర్స్ -
NZ vs SA: న్యూజిలాండ్కు మరో షాక్!
సౌతాఫ్రికాతో తొలి టీ20లో ఓడిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్పిన్నర్ ఇష్ సోధికి గాయమైంది. సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్కు ముందు నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సోధి బొటనవేలుకు గాయం కాగా.. స్కానింగ్లో భాగంగా వేలు విరిగిపోయినట్లు తేలింది.నాలుగు వారాల విశ్రాంతి ఫలితంగా ఇష్ సోధికి నాలుగు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో తొలి టీ20కి దూరమైన ఈ రైటార్మ్ స్పిన్నర్.. మిగిలిన రెండు టీ20 మ్యాచ్లకూ దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. సఫారీలతో రెండో టీ20 సందర్భంగా కివీస్ స్పీడ్స్టర్ లాకీ ఫెర్గూసన్ జట్టుతో చేరనున్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో టీమిండియా చేతిలో ఓడి రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్.. స్వదేశంలో సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా మౌంట్ మాంగనీ వేదికగా ఆదివారం తొలి టీ20లో సఫారీ జట్టుతో తలపడింది.91 పరుగులకే ఆలౌట్ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... 14.3 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌటైంది. నీషమ్ (21 బంతుల్లో 26 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. కాన్వే (1), లాథమ్ (7), రాబిన్సన్ (6), అరంగేట్ర ఆటగాడు నిక్ కెల్లీ (2), జాకబ్స్ (10), సాంట్నర్ (15) విఫలమయ్యారు.ఎన్కబని మొకొనాకు 3 వికెట్లుఇక ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టి20 అరంగేట్రం చేసిన నలుగురు సఫారీ ప్లేయర్లు విజయంలో కీలక పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎన్కబని మొకొనా (Nqobani Mokoena) 3 వికెట్లు పడగొట్టగా... కోట్జీ, బార్ట్మన్, కెప్టెన్ కేశవ్ మహరాజ్ తలా రెండు వికెట్లు తీశారు.సాంట్నర్ 4 ఓవర్లలో 8 పరుగులే ఇచ్చిఅనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో సఫారీ జట్టు 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. వికెట్ కీపర్ కానర్ ఎస్తెర్హుజెన్ (48 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ కెప్టెన్ సాంట్నర్ 4 ఓవర్లలో 8 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ ద్వారా నలుగురు (కానర్ ఎస్లుర్హుజెన్, డియాన్ ఫారెస్టర్, జోర్డాన్ హెర్మన్, ఎన్కబరి మొకొనా) సౌతాఫ్రికా ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. ఇరు జట్ల మధ్య హామిల్టన్లో మంగళవారం రెండో టీ20 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: అతడి ఆట అసాధారణం.. గంభీర్పై ద్రవిడ్ ప్రశంసలు -
కుప్పకూలిన న్యూజిలాండ్.. 91 పరుగులకే ఆలౌట్
మౌంట్ మౌంగానుయ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కివీస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. సఫారీ బౌలర్ల దాటికి బ్లాక్ క్యాప్స్ బ్యాటర్లు విల్లవిల్లాడారు.దీంతో న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. స్టార్ బ్యాటర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, రచిన్ రవీంద్ర, మిచెల్ లేని లోటు స్పష్టంగా కన్పించింది. అయితే డెవాన్ కాన్వే(1), టామ్ లాథమ్ వంటి సీనియర్లు ఉన్నప్పటికి తమ మార్క్ చూపించలేకపోయారు.ప్రోటీస్ బౌలర్లలో న్కోబాని మోకోనా మూడు వికెట్లు పడగొట్టగా.. కోయిట్జీ, బార్ట్మన్, కేశవ్ మహారాజ్ తలా రెండు వికెట్లు సాధించారు. మౌంట్ మౌంగానుయ్ వేదికలో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఇంతకుముందు ఈ వేదికలో న్యూజిలాండ్పై పాకిస్తాన్ 105 పరుగులకు ఆలౌటైంది.తుది జట్లుదక్షిణాఫ్రికా: కానర్ ఎస్టర్హుయిజెన్(వికెట్ కీపర్), జోర్డాన్ హెర్మాన్, టోనీ డి జోర్జీ, రూబిన్ హెర్మాన్, జాసన్ స్మిత్, డయాన్ ఫారెస్టర్, జార్జ్ లిండే, జెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహారాజ్(కెప్టెన్), న్కోబాని మోకోనా, ఓట్నీల్ బార్ట్మన్న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టామ్ లాథమ్(వికెట్కీపర్), టిమ్ రాబిన్సన్, నిక్ కెల్లీ, బెవాన్ జాకబ్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, కోల్ మెక్కాంచీ, కైల్ జామిసన్, బెన్ సియర్స్చదవండి: తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్ -
డిఫెన్స్ ఆఫీసర్ కాబోయి.. క్రికెటర్గా: టీమిండియా స్టార్
టీమిండియా స్టార్ జితేశ్ శర్మ ఆసక్తికర విషయం వెల్లడించాడు. అసలు తాను క్రికెటర్ కావాలని ఎప్పుడూ అనుకోలేదన్నాడు. ఊహించని రీతిలో తన ప్రయాణం అంతర్జాతీయ స్థాయి వరకు చేరిందన్నాడు.భారత టీ20 జట్టులోమహారాష్ట్రకు చెందిన జితేశ్ శర్మ (Jitesh Sharma) దేశీ క్రికెట్, ఐపీఎల్లో సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు. నేపాల్తో మ్యాచ్ సందర్భంగా 2023లో అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 16 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 162 పరుగులు చేశాడు.చివరగా సౌతాఫ్రికా (IND vs SA)తో గతేడాది జరిగిన టీ20 సిరీస్లో టీమిండియాకు ఆడిన 32 ఏళ్ల జితేశ్ శర్మ.. టీ20 ప్రపంచకప్-2026 జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఆర్సీబీ స్టార్ఇక ఐపీఎల్లో గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన జితేశ్.. తొలిసారి ట్రోఫీ ముద్దాడిన జట్టులో సభ్యుడు. రెగ్యులర్ కెప్టెన్ రజత్ పాటిదార్ గైర్హాజరీలో పలు మ్యాచ్లకు సారథిగానూ జితేశ్ వ్యవహరించడం విశేషం.డిఫెన్స్ ఆఫీసర్ కావాలని కలలు కనేవాడినిఇదిలా ఉంటే.. ఆర్సీబీ మాజీ స్టార్, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ పాడ్కాస్ట్లో జితేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘నా కెరీర్లో క్రికెట్ అనే ప్రణాళికే అస్సలు లేదు. నేను ఎల్లప్పుడూ డిఫెన్స్ ఆఫీసర్ కావాలని కలలు కనేవాడిని. రక్షణ రంగంలో సేవలు అందించాలని కోరుకునేవాడిని.మార్కుల కోసమే క్రికెట్లోకిఅది కుదరకపోతే ఆర్మీ లేదంటే ఎయిర్ ఫోర్స్లో చేరాలనుకున్నాను. ఇందుకోసం నిర్వహించే పరీక్షలో రాష్ట్రం తరఫున ఏదేని క్రీడలో రాణిస్తే అదనంగా 25 మార్కులు వేస్తారనే నిబంధన ఉండేది. అందుకే నేను పాఠశాల స్థాయిలో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను.అప్పుడు వికెట్ కీపర్ కోటాలో నాకు అవకాశం వచ్చింది. అప్పుడే తొలిసారి గ్లోవ్స్ తొడుక్కున్నా. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. మా చిన్నప్పటి కోచ్ ప్రీతం గాంధీ నాలోని ప్రతిభను గుర్తించారు. ఆయనే నన్ను ప్రోత్సహించారు.ఆ ఇద్దరిది కీలక పాత్రఆ తర్వాత ఓసారి నేను దినేశ్ కార్తిక్ను కలిశాను. వీరిద్దరే నా క్రికెట్ ప్రయాణంలో కీలక పాత్ర పోషించారు. నేను మొండివాడిని. ఏదైనా సాధించాలని అనుకుంటే అందుకోసం ఎంత కష్టమైనా భరిస్తాను. అయితే, ఆ మొండితనమే ఒక్కోసారి నా బలహీనతగానూ మారుతుంది.ఏదేమైనా ఆర్సీబీలో చేరకముందు నా ప్రతిభను అంతగా ఎవరూ నమ్మేవారు కాదు. అయితే, ఆర్సీబీ యాజమాన్యం మాత్రం నాపై నమ్మకం ఉంచి వరస అవకాశాలు ఇచ్చింది. అదే నా కెరీర్లో గొప్ప టర్నింగ్ పాయింట్ అని చెప్పగలను’’ అని జితేశ్ శర్మ ఆర్సీబీ పట్ల ప్రేమను చాటుకున్నాడు. చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్ -
మన మహిళలదే సిరీస్
అడిలైడ్: ఆస్ట్రేలియా గడ్డపై దశాబ్దం తర్వాత భారత మహిళల జట్టు టి20 సిరీస్ గెలిచింది. శనివారం జరిగిన ఆఖరి మూడో టి20లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ 17 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై గెలిచింది. తద్వారా ఓవరాల్ చాంపియన్షిప్లో పైచేయి సాధించింది. టాస్ నెగ్గిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (55 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్స్లు) ధనాధన్ ఆటతో ఆసీస్ బౌలర్లపై చెలరేగింది. జెమీమా రోడ్రిగ్స్ (46 బంతుల్లో 59; 4 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించింది. ఆతిథ్య బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆ్రస్టేలియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఓడింది. ఒక్క యాష్లే గార్డ్నర్ (45 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే పోరాడింది. స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్ (3/22), శ్రీచరణి (3/32) ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పేశారు. చివరిసారిగా భారత అమ్మాయిల జట్టు 2016లో కంగారూ గడ్డపై టి20 సిరీస్ నెగ్గింది. ఇప్పుడు మూడు ఫార్మాట్ల (టి20, వన్డే, టెస్టు)లకు కలిపి ఓవరాల్ చాంపియన్షిప్ నిర్వహిస్తున్నారు. మ్యాచ్ గెలిస్తే రెండు పాయింట్లు, ఏకైక టెస్టు నెగ్గితే 4 పాయింట్ల ఆధారంగా ఓవరాల్ విజేతను ఖరారు చేస్తారు. దీంతో ఈ టి20ల్లో భారత్ 4–2 పాయింట్లతో పైచేయి సాధించింది. చెలరేగిన మంధాన ఆట మొదలైన మూడో ఓవర్లోనే షఫాలీ వర్మ (7) అవుటైంది. క్రీజులోకి వచి్చన జెమీమాతో కలిసి స్మృతి మంధాన కంగారూ బౌలర్ల భరతం పట్టింది. దీంతో పవర్ ప్లేలో భారత్ 54/1 స్కోరు చేసింది. స్మృతి జోరు కొనసాగడంతో 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ టి20 క్రికెట్లో ఆమెకిది 33వ అర్ధసెంచరీ కావడం విశేషం.మరోవైపు జెమీమా సైతం ధాటిగా పరుగులు సాధించడంతో ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు ఆతిథ్య బౌలర్లు ఎంతోసేపు శ్రమించాల్సివచ్చింది. ఎట్టకేలకు 17వ ఓవర్లో స్టార్ ఓపెనర్ మంధాన దూకుడుకు అనాబెల్ బ్రేకులేసింది. దీంతో రెండో వికెట్కు 121 పరుగుల భారీభాగస్వామ్యం ముగిసింది. చివర్లో హిట్టర్ రిచా ఘోష్ (7 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా పరుగులు రాబట్టింది. గార్డ్నర్ పోరాటం వృథా భారత బౌలర్ల పవర్కు ఆసీస్ బ్యాటింగ్ ‘పవర్ ప్లే’ టాపార్డర్ కుదేలైంది. రెండో ఓవర్లోనే బౌలింగ్కు దిగిన శ్రేయాంక తన వరుస ఓవర్లలో జార్జియా వోల్ (10), ఎలైస్ పెరి (1)లను అవుట్ చేసింది. రేణుక... బెత్ మూని (6) పనిపట్టడంతో ఆస్ట్రేలియా ఒక దశలో టాపార్డర్ వికెట్లను కోల్పోయి 32/3 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. ఫోబ్ లిచ్ఫీల్డ్ (17 బంతుల్లో 26; 4 ఫోర్లు), యాష్లే గార్డ్నర్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే ఆంధ్ర లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీ చరణి రెడ్డి (3/32), హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి (2/35)లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఆసీస్ లక్ష్యానికి దూరమైంది. జట్టును గెలిపించేందుకు గార్డ్నర్ చేసిన పోరాటానికి అరుంధతి చెక్ పెట్టడంతోనే మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది.


