-
BAN Vs ZIM: బంగ్లాదేశ్ను చిత్తు చేసిన జింబాబ్వే.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు పసికూన జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. ఢాకా వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో జింబాబ్వే ఘన విజయం సాధించింది. దీంతో క్లీన్స్వీప్ నుంచి జింబాబ్వే తప్పించుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా(54) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ షాంటో(36) పరుగులతో రాణించాడు.జింబాబ్వే బౌలర్లలో ముజాబ్రానీ, బెన్నెట్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జాంగ్వే, మసకజ్డా చెరో వికెట్ సాధించారు. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బెన్నెట్(70 ), సికిందర్ రజా(72 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ ఆల్హసన్, సైఫుద్దీన్ తలా వికెట్ పడగొట్టారు. ఇక తొలి నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ సిరీస్ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. -
IPL 2024- WI: అలా అయితే.. సన్రైజర్స్, రాజస్తాన్కు షాక్!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ సమరానికి సమయం ఆసన్నమవుతున్న వేళ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది.మే 23, 25, 26 తేదీల్లో ప్రొటిస్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ ఆడనున్నట్లు వెల్లడించింది. జమైకాలోని సబీనా పార్కు వేదికగా ఈ మూడు మ్యాచ్లు జరుగనున్నట్లు వెల్లడించింది. కాగా విండీస్- సౌతాఫ్రికా సిరీస్ సమయంలోనే ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ నాకౌట్, క్వాలిఫయర్, ఫైనల్ మ్యాచ్లు కూడా జరుగనున్నాయి.సన్రైజర్స్, రాజస్తాన్కు షాక్!ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్ చేరిన జట్లలో భాగమైన ఆటగాళ్లను గనుక విండీస్- ప్రొటిస్ బోర్డులు వెనక్కి పిలిపిస్తే ఆయా ఫ్రాంఛైజీలకు తలనొప్పి తప్పదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్లోనే ఈ రెండు జట్ల ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు.ప్లే ఆఫ్స్ రేసులో దూసుకుపోతున్న ఈ రెండు జట్లు గనుక కీలక సమయంలో ఆటగాళ్లను కోల్పోతే కష్టాలు తప్పవు. కాగా మే 21న ఐపీఎల్-2024 తొలి క్వాలిఫయర్, మే 22న ఎలిమినేటర్ మ్యాచ్, మే 24న రెండో క్వాలిఫయర్, మే 26న ఫైనల్ జరుగనున్నాయి.మెగా ఈవెంట్కు ముందుకాగా గత టీ20 ప్రపంచకప్నకు అర్హత సాధించలేక చతికిలపడ్డ వెస్టిండీస్.. ఆ తర్వాత స్వదేశంలో టీమిండియా, ఇంగ్లండ్లపై సిరీస్లు గెలిచి ఫామ్లోకి వచ్చింది. తాజాగా సౌతాఫ్రికాతో సిరీస్లోనూ అదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది.ఇక జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్కు ముందు సొంతగడ్డపై సౌతాఫ్రికాతో సిరీస్తో విండీస్కు కావాల్సినంత ప్రాక్టీస్ దొరకనుంది.ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ టోర్నీ నేపథ్యంలో పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఐపీఎల్ నుంచి తమ ఆటగాళ్లను వెనక్కి పిలిపించేందుకు సమాయత్తమైన విషయం తెలిసిందే.ఐపీఎల్-2024లో భాగమైన వెస్టిండీస్, సౌతాఫ్రికా ఆటగాళ్లు వీరేవిండీస్ ప్లేయర్లురోవ్మన్ పావెల్ (రాజస్తాన్ రాయల్స్), షిమ్రాన్ హెట్మెయిర్ (రాజస్తాన్ రాయల్స్), అల్జారీ జోసెఫ్ (ఆర్సీబీ), షాయ్ హోప్ (ఢిల్లీ క్యాపిటల్స్), షమర్ జోసెఫ్ (లక్నో సూపర్ జెయింట్స్), నికోలస్ పూరన్ (లక్నో సూపర్ జెయింట్స్), ఆండ్రీ రస్సెల్ (కోల్కతా నైట్ రైడర్స్), రొమారియో షెఫర్డ్ (ముంబై ఇండియన్స్).సౌతాఫ్రికా ఆటగాళ్లుఐడెన్ మార్క్రమ్ (సన్రైజర్స్ హైదరాబాద్), హెన్రిచ్ క్లాసెన్ (సన్రైజర్స్ హైదరాబాద్), మార్కో జాన్సన్ (సన్రైజర్స్ హైదరాబాద్), గెరాల్డ్ కోట్జీ (ముంబై ఇండియన్స్), క్వింటన్ డికాక్ (లక్నో సూపర్ జెయింట్స్), కేశవ్ మహరాజ్ (రాజస్తాన్ రాయల్స్), డేవిడ్ మిల్లర్ (గుజరాత్ టైటాన్స్), అన్రిచ్ నోర్జే (దక్షిణాఫ్రికా), కగిసో రబడ (పంజాబ్ కింగ్స్), ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్).చదవండి: గుజరాత్ టైటాన్స్ జట్టు మొత్తానికి భారీ జరిమానా.. గిల్కు ఏకంగా! -
టీ20లలో సరికొత్త చరిత్ర.. బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో ఇంత వరకు ఏ క్రికెటర్కూ సాధ్యం కాని ఘనత సాధించాడు. కాగా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ ఐర్లాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య శుక్రవారం తొలి మ్యాచ్ జరిగింది. డబ్లిన్లో జరిగిన ఈ టీ20లో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. ఓపెనర్ సయీం ఆయుబ్(29 బంతుల్లో 45)తో పాటు బాబర్ ఆజం(43 బంతుల్లో 57), ఇఫ్తికర్ అహ్మద్(15 బంతుల్లో 37*) రాణించారు.ఒక బంతి మిగిలి ఉండగానేఅయితే, పాక్ విధించిన లక్ష్యాన్ని ఐర్లాండ్ అనూహ్య రీతిలో ఛేదించింది. ఓపెనర్ ఆండ్రు బల్బిర్నీ(55 బంతుల్లో 77), హ్యారీ టెక్టర్(27 బంతుల్లో 36), జార్జ్ డాక్రెల్(12 బంతుల్లో 24) దుమ్ములేపడంతో ఒక బంతి మిగిలి ఉండగానే విజయ ఢంకా మోగించింది.ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసి సొంతగడ్డపై జయభేరి మోగించింది. సిరీస్లో 1-0తో ఆధిక్యం సాధించింది ఐర్లాండ్. దీంతో పాకిస్తాన్కు పరాభవం ఎదురైనా.. బాబర్ ఆజం మాత్రం వ్యక్తిగతంగా ఓ అరుదైన రికార్డు సాధించాడు.పిన్న వయస్కుడిగా బాబర్ ప్రపంచ రికార్డుపొట్టి ఫార్మాల్లో అత్యంత వేగంగా వందకు పైగా 50 ప్లస్ స్కోర్లు సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా 29 ఏళ్ల బాబర్ ఆజం నిలిచాడు. ఓవరాల్గా ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉండగా.. క్రిస్ గేల్, విరాట్ కోహ్లి బాబర్ కంటే ముందున్నారు.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లలో బాబర్ ఆజం 50కి పైగా పరుగులు సాధించడం ఇది 38వసారి. తద్వారా విరాట్ కోహ్లి రికార్డును అతడు సమం చేశాడు.టీ20లలో వందకు పైగా 50 ప్లస్ స్కోర్లు సాధించిన టాప్-5 ఆటగాళ్లు👉1. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 377 మ్యాచ్లలో- 12,232 పరుగులు- 110(8 సెంచరీలు, 102 అర్ధ శతకాలు)👉2. క్రిస్ గేల్(వెస్టిండీస్)- 463 మ్యాచ్లలో- 14,562 పరుగులు- 110(22 సెంచరీలు, 88 అర్ధ శతకాలు)👉3.విరాట్ కోహ్లి(ఇండియా)- 388 మ్యాచ్లలో- 12,628 పరుగులు- 105(9 సెంచరీలు, 96 అర్ధ శతకాలు)👉4. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 296 మ్యాచ్లు- 10,677 పరుగులు- 100(11 సెంచరీలు, 89 అర్ధ శతకాలు)👉5. జోస్ బట్లర్(ఇంగ్లండ్)- 413 మ్యాచ్లు- 11,484 పరుగులు- 88(8 సెంచరీలు, 80 అర్ధ శతకాలు).చదవండి: Rohit Sharma: అది నా ఇల్లు.. కానీ ఇదే లాస్ట్: రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్IRELAND BEAT PAKISTAN!!! What an incredible series opener we've just witnessed! A historic victory for @cricketireland 🇮🇪👏👏👏..#IREvPAKonFanCode #IREvPAK #FanCode pic.twitter.com/prvSBt37L5— FanCode (@FanCode) May 10, 2024 -
ఐదో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన ఐదో టీ20లో 21 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 5-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఆఖరి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టీమిండియా బ్యాటర్లలో హేమలత(37) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మంధాన(33),హర్ప్రీత్ కౌర్(30) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రబేయా ఖాన్, నహిదా అక్తర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సుల్తానా ఒక్క వికెట్ సాధించింది. అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. నిర్ఱీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో రాధా యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆశా రెండు వికట్లు సాధించింది. బంగ్లా బ్యాటర్లలో రితూ మోనీ(37) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది.చదవండి: టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..? -
బంగ్లాదేశ్దే టి20 సిరీస్
జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ను రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ జట్టు 3–0తో సొంతం చేసుకుంది. చట్టోగ్రామ్లో మంగళవారం జరిగిన మూడో మ్యాచ్లో బంగ్లాదేశ్ తొమ్మిది పరుగుల తేడాతో నెగ్గింది. మొదట బంగ్లాదేశ్ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తౌహిద్ హృదయ్ (38 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్స్లు), జాకిర్ అలీ (34 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసి ఓడిపోయింది. -
Pak vs NZ: చావో రేవో.. గట్టెక్కిన పాకిస్తాన్! ఆఖరికి..
న్యూజిలాండ్తో ఆఖరి టీ20లో పాకిస్తాన్ గట్టెక్కింది. తొమ్మిది పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది సిరీస్ను సమం చేసుకుంది. కాగా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం కివీస్ జట్టు పాక్ పర్యటనకు వెళ్లింది.బాబర్ ఆజం కెప్టెన్గా తిరిగి పగ్గాలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్కు ఇదే తొలి సిరీస్. అది కూడా సొంతగడ్డపై జరుగుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ క్రమంలో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్లో ఆతిథ్య పాక్ విజయం సాధించింది. ఆ మరుసటి మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసిన కివీస్.. నాలుగో టీ20లో 4 పరుగుల తేడాతో గెలిచి షాకిచ్చింది. ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టు 1-2తో వెనుకబడింది. కివీస్ ద్వితీయ శ్రేణి జట్టు చేతిలో వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోవడంతో బాబర్ ఆజం బృందంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో చావోరేవో తేల్చుకోవాల్సిన ఆఖరి టీ20లో పాక్ గెలుపొందింది. తద్వారా సిరీస్ను 2-2తో సమం చేయగలిగింది.లాహోర్లో టాస్ ఓడిన పాక్.. న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. బాబర్ ఆజం(44 బంతుల్లో 69), ఉస్మాన్ ఖాన్(24 బంతుల్లో 31), ఫఖర్ జమాన్(33 బంతుల్లో 43), షాబాద్ ఖాన్(5 బంతుల్లో 15 నాటౌట్) రాణించారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కివీస్ తడబడింది. ఓపెనర్ టిమ్ సెఫార్ట్ (33 బంతుల్లో 52), జోష్ క్లార్క్సన్(26 బంతుల్లో 38 నాటౌట్) మాత్రమే మెరుగ్గా ఆడారు.మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో 19.2 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొమ్మిది పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. నాలుగు వికెట్లతో రాణించిన షాహిన్ ఆఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. Scenes in Lahore following the fifth T20I as the series is squared 🏆🤝#PAKvNZ | #AaTenuMatchDikhawan pic.twitter.com/pBm4SmQi7j— Pakistan Cricket (@TheRealPCB) April 27, 2024 -
Pak Vs NZ: ఉత్కంఠ పోరులో పాక్ చిత్తు.. ఏడ్చేసిన ఫ్యాన్స్!
సొంతగడ్డపై పాకిస్తాన్కు మరో చేదు అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్తో నాలుగో టీ20లో స్వల్ప తేడాతో బాబర్ ఆజం బృందం ఓడిపోయింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో కివీస్ 2-1తో పాక్పై పైచేయి సాధించింది.కాగా బాబర్ ఆజం కెప్టెన్గా తిరిగి పగ్గాలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్ తొలుత స్వదేశంలో న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. ఇందులో తొలి టీ20 వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్లో పాక్ గెలిచింది.అయితే, మరుసటి మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసిన కివీస్.. తాజాగా గురువారం నాటి మ్యాచ్లో 4 పరుగుల తేడాతో గెలిచి షాకిచ్చింది. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు టిమ్ రాబిన్సన్(36 బంతుల్లో 51), టామ్ బ్లండెల్ (15 బంతుల్లో 28), వన్డౌన్ బ్యాటర్ ఫాక్స్క్రాఫ్ట్(26 బంతుల్లో 34), కెప్టెన్ మిచెల్ బ్రాస్వెల్(20 బంతుల్లో 27) రాణించారు.పాక్ బౌలర్లలో అబ్బాస్ ఆఫ్రిది అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. ఆమిర్, ఉసామా మిర్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ ఆమిర్, జమాన్ ఖాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభంలోనే సయీమ్ ఆయుబ్(20), బాబర్ ఆజం(5), ఉస్మాన్ ఖాన్(16) వికెట్లు కోల్పోయింది. అయితే, ఫఖర్ జమాన్ పట్టుదలగా నిలబడి 45 బంతుల్లో 61 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.ఇఫ్తికర్ అహ్మద్(20 బంతుల్లో 23), ఇమాద్ వసీం(11 బంతుల్లో 22 నాటౌట్) పోరాడాడు. కానీ ఆఖరి బంతికి పాక్ విజయానికి ఆరు పరుగులు అవసరం కాగా.. క్రీజులో ఉన్న ఇమాద్ వసీం జెమ్మీ నీషం బౌలింగ్లో ఒక్క పరుగు మాత్రమే తీయగలిగాడు. ఫలితంగా నాలుగు పరుగుల తేడాతో పాక్ ఓటమిపాలైంది. దీంతో లాహోర్ ప్రేక్షకుల హృదయాలు ముక్కలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ మ్యాచ్లో మూడు కీలక వికెట్లు తీసి కివీస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన 22 ఏళ్ల పేసర్ విలియం రూర్కీకి ప్లేయర్ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
‘బాబర్ ఆజం పెళ్లి చేసుకోవాలనుకుంటే?.. ఒప్పుకోను!’
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజంకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వన్డేల్లో సుదీర్ఘకాలం పాటు నంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇటీవలే తిరిగి పరిమిత ఓవర్ల కెప్టెన్గా పునర్నియమితుడయ్యాడు.ఇక బాబర్ ఆజంకు తరచూ ఎదురయ్యే ప్రశ్నల్లో పెళ్లి గురించి తప్పక ప్రస్తావన ఉంటుంది. వరల్డ్క్లాస్ క్రికెటర్గా ఎదిగిన 29 ఏళ్ల ఈ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరిని పెళ్లాడబోతున్నాడన్న అంశంపై గాసిప్రాయుళ్లు కథనాలు అల్లేస్తుంటారు కూడా! ఈ విషయమై పాకిస్తాన్కు చెందిన ఓ నటికి చేదు అనుభవం ఎదురైంది. బాబర్ ఫ్యాన్స్ దెబ్బకు ఆమె అకౌంట్ను కాసేపు ప్రైవేట్ అకౌంట్గా మార్చుకోవాల్సి వచ్చింది. నజీష్ జహంగీర్ అనే బుల్లితెర నటికి ఇన్స్టాగ్రామ్లో 12 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.ఈ క్రమంలో ఓ అభిమాని ఆమెను.. ‘‘బాబర్ ఆజం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాన’’ని అడిగితే ఏం చెప్తారు? అని అడిగాడు. ఇందుకు బదులుగా.. ‘‘సారీ చెప్తాను’’ అంటూ సున్నితంగా తిరస్కరిస్తాననే అర్థంలో సమాధానమిచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్ను ఆమె తన ఇన్స్టాస్టోరీలో పోస్ట్ చేసిందన్న వార్త వైరల్ అయింది.అంతేకాదు.. ‘‘బాబర్ మాకు సోదరుడి వంటి వాడు. కానీ అతడి అభిమానులు ఇలా నెగిటివిటీ ప్రచారం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు’’ అని నజీష్ ఆగ్రహం వ్యక్తం చేసిందన్నట్లు మరో ఇన్స్టా స్టోరీ కూడా తెరమీదకు వచ్చింది.ఈ క్రమంలో బాబర్ ఫ్యాన్స్ ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేయగా.. వేధింపులను తట్టుకోలేక నజీష్ తన అకౌంట్ను సోమవారం కాసేపు ప్రైవేట్గా పెట్టినట్లు సామా టీవీ వెల్లడించింది. అయితే, మరుసటి రోజే ఆమె మళ్లీ తన అకౌంట్ను పబ్లిక్ చేసేసింది. కాగా వన్డే వరల్డ్కప్-2023 వైఫల్యం తర్వాత బాబర్ ఆజం పాక్ కెప్టెన్గా వైదొలిగాడు.దీంతో అతడి స్థానంలో టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ ఆఫ్రిది కెప్టెన్గా ఎంపికయ్యారు. అయితే, వీరి సారథ్యంలో జట్టు ఘోర వైఫల్యాలు చవిచూసింది. ఈ నేపథ్యంలో షాహిన్పై వేటు వేసిన పాక్ బోర్డు.. పగ్గాలను తిరిగి బాబర్ ఆజంకు అప్పగించింది. షాన్ మసూద్ను మాత్రం టెస్టుల సారథిగా కొనసాగిస్తోంది. ఇక మళ్లీ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాబర్ సొంతగడ్డపై న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్తో బిజీ అయ్యాడు. వర్షం కారణంగా తొలి టీ20 రద్దు కాగా.. రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచింది. ఇరుజట్ల మధ్య గురువారం నాలుగో టీ20 జరుగనుంది. -
PAK Vs NZ: పాక్, న్యూజిలాండ్ తొలి టీ20 వర్షార్పణం
పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య రావల్పిండి వేదికగా నిన్న (ఏప్రిల్ 18) జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దైంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తుండగా.. భారీ వర్షం మొదలైంది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వర్షం ప్రారంభమయ్యే సమయానికి న్యూజిలాండ్ స్కోర్ 0.2 ఓవర్లలో 2/1గా ఉండింది. ఓపెనర్ టిమ్ రాబిన్సన్ (0) షాహీన్ అఫ్రిది బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టిమ్ సీఫర్ట్, మార్క్ చాప్మన్ 0 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. కాగా, ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో కోసం న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పాక్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనకు న్యూజిలాండ్ ద్వితియ శ్రేణి జట్టుతో బయల్దేరింది. కివీస్ స్టార్లంతా ఐపీఎల్తో బిజీగా ఉండగా.. కొందరు గాయాల కారణంగా ఈ సిరీస్కు అందుబాటులో లేకుండా పోయారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇదే వేదికగా ఏప్రిల్ 20న జరుగనుంది. పాక్ కెప్టెన్సీ తిరిగి చేపట్టాక ఈ సిరీస్ బాబర్కు మొదటిది. -
పాకిస్తాన్కు బిగ్ షాక్.. విధ్వంసకర ఆటగాడికి గాయం!?
న్యూజిలాండ్తో తొలి టీ20కు ముందు పాకిస్తాన్ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర కీపర్-బ్యాటర్ ఆజం ఖాన్ గాయం కారణంగా తొలి టీ20కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. గురువారం రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టీ20లో పాకిస్తాన్-కివీస్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో బుధవారం నెట్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గోన్న ఆజం మోకాలికి గాయమైంది. మెకాలికి బంతి బలంగా తాకడంతో ఆజం తీవ్రమైన నోప్పితో విలవిల్లాడినట్లు సమాచారం. ఈ క్రమంలో అతడిని తొలి టీ20కు పక్కన పెట్టాలని పాక్ మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు వినికిడి. కాగా ఆజం ఖాన్ ప్రస్తుతం పీసీబీ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. కాగా తన ఫిట్నెస్ను మెరుగుపరుచుకునేందుకు కాకుల్ ఆర్మీ క్యాంపులో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా శిబిరంలో ఆజం ఖాన్ తీవ్రంగా శ్రమించాడు. అతడితో పాటు జట్టు మొత్తం 11-రోజుల ఫిట్నెస్ క్యాంప్లో పాల్గోంది. కాగా ఈ సిరీస్ టీ20 వరల్డ్కప్-2024 సన్నహాకాల్లో భాగంగా జరగనుంది. ఈ సిరీస్లో భాగంగా ఇరు జట్లు ఐదు టీ20లు ఆడనున్నాయి. అయితే పాక్ పర్యటనకు కివీస్ క్రికెట్ బోర్డు తమ ద్వితీయ శ్రేణి జట్టును పంపించింది. స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్-2024 సీజన్లో బీజీబీజీగా ఉండడంతో న్యూజిలాండ్ క్రికెట్ ఈ నిర్ణయం తీసుకుంది. -
బంగ్లాదేశ్ పర్యటనకు భారత టీ20 జట్టు ప్రకటన
ఏప్రిల్ 28 నుంచి ప్రారంభమయ్యే బంగ్లాదేశ్ పర్యటన కోసం భారత మహిళా క్రికెట్ జట్టును నిన్న (ఏప్రిల్ 15) ప్రకటించారు. ఈ పర్యటనలో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యుల జట్టును భారత సెలెక్టర్లు నిన్న వెల్లడించారు. ఈ జట్టుకు కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్గా స్మృతి మంధన వ్యవహరించనున్నారు. ఈ సిరీస్కు స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగెజ్ దూరంగా ఉండనుండగా.. కేరళ అమ్మాయిలు ఆశా శోభన, సజనా సజీవన్ తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యారు. శోభన 2024 డబ్ల్యూపీఎల్లో ఛాంపియన్ ఆర్సీబీ తరఫున సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలువగా.. సజనా గత సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటింది. బంగ్లా సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో మిన్ను మణి, మన్నత్ కశ్యప్కు చోటు దక్కకపోగా.. డి హేమలత, రాధా యాదవ్ చాలాకాలం తర్వాత జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగే టీ20 వరల్డ్కప్కు ముందు టీమిండియా ఆడబోయే అతి పెద్ద టీ20 సిరీస్ ఇదే కావడంతో ఈ సిరీస్కు ప్రాధాన్యత సంతరించుకుంది. భారత మహిళా క్రికెట్ జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, దయాళన్ హేమలత, సజన సజీవన్, రిచా ఘోష్ (వికెట్కీపర్), యాస్తికా భాటియా (వికెట్కీపర్), రాధా యాదవ్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్ , ఆశా శోభనా, రేణుకా సింగ్ ఠాకూర్, టిటాస్ సాధు భారత్-బంగ్లాదేశ్ టీ20 సిరీస్ వివరాలు.. ఏప్రిల్ 28- తొలి టీ20 (సిల్హెట్) ఏప్రిల్ 30- రెండో టీ20 (సిల్హెట్) మే 2- మూడో టీ20 (సిల్హెట్) మే 6- నాలుగో టీ20 (సిల్హెట్) మే 9- ఐదో టీ20 (సిల్హెట్) -
బంగ్లాదేశ్లో భారత మహిళల జట్టు పర్యటన
ఢాకా: ఐదు టి20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు ఈనెలలో భారత మహిళల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటించనుంది. బంగ్లాదేశ్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం భారత జట్టు ఈనెల 23న బంగ్లాదేశ్కు చేరుకుంటుంది. మే 10వ తేదీన పర్యటన ముగించుకొని తిరిగి వెళుతుంది. సిల్హెట్లో జరిగే ఈ సిరీస్లో రెండు జట్లు ఏప్రిల్ 28, 30, మే 2, 6, 9వ తేదీల్లో ఐదు టి20 మ్యాచ్లు ఆడతాయి. -
పాకిస్తాన్తో టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు ప్రకటన
ఏప్రిల్ 18-27 మధ్యలో పాకిస్తాన్తో జరుగబోయే ఐదు మ్యాచ్ టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ఇవాళ (ఏప్రిల్ 3) ప్రకటించారు. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ 15 మంది సభ్యుల బృందాన్ని పాకిస్తాన్కు పంపనుంది. ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచ్ సాంట్నర్,కేన్ విలియమ్సన్ లాంటి సీనియర్లు ఐపీఎల్తో బిజీగా ఉండటంతో న్యూజిలాండ్ సెలెక్టర్లు ద్వితియ శ్రేణి జట్టును పాక్కు పంపనున్నారు. ఈ జట్టుకు మైఖేల్ బ్రేస్వెల్ సారధ్యం వహించనున్నాడు. ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, ఐష్ సోధి లాంటి గుర్తింపు పొందిన ఆటగాళ్లు మినహా మిగతావన్నీ కొత్త ముఖాలే. టీ20 వరల్డ్కప్కు ముందు న్యూజిలాండ్ ఆటగాళ్లకు ఇది చాలా ముఖ్యమైన సిరీస్. ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కని వారికి ఈ సిరీస్ కీలకంగా పరిగణించబడుతుంది. ఈ సిరీస్లో రాణిస్తే వరల్డ్కప్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంటుంది. ఈ సిరీస్లోని తొలి మూడు మ్యాచ్లు రావల్పిండిలో జరుగనుండగా.. ఆఖరి రెండు లాహోర్లో జరుగనున్నాయి. పాకిస్తాన్తో ఐదు మ్యాచ్ల సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు.. మైఖేల్ బ్రేస్వెల్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, జోష్ క్లార్క్సన్, జాకబ్ డఫీ, డీన్ ఫాక్స్క్రాఫ్ట్, బెన్ లిస్టర్, కోల్ మెక్కాన్చీ, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, విల్ ఓ'రూర్క్, టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్ (వికెట్కీపర్), ఐష్ సోధి షెడ్యూల్.. తొలి టీ20: ఏప్రిల్ 18 (రావల్పిండి) రెండో టీ20: ఏప్రిల్ 20 (రావల్పిండి) మూడో టీ20: ఏప్రిల్ 21 (రావల్పిండి) నాలుగో టీ20: ఏప్రిల్ 25 (లాహోర్) ఐదో టీ20: ఏప్రిల్ 27 (లాహోర్) -
T20I: అఫ్గనిస్తాన్కు షాకిచ్చిన ఆస్ట్రేలియా.. అధికారిక ప్రకటన
ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్ మధ్య జరగాల్సిన టీ20 సిరీస్ నిరవధికంగా వాయిదా పడింది. ఇందుకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్లో భాగంగా ఈ ఏడాది ఆగష్టులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసీస్- అఫ్గన్ మధ్య సిరీస్ జరగాల్సి ఉంది. అఫ్గనిస్తాన్లో పరిస్థితుల దృష్ట్యా యూఏఈలో అఫ్గన్ ఈ సిరీస్కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దమైంది. కారణం ఇదే ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్గన్ ప్రభుత్వం మహిళలు, బాలికల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందన్న కారణంతో ద్వైపాక్షిక టీ20 సిరీస్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా 2021లోనూ సీఏ ఇదే కారణంతో ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టును రద్దు చేసింది. అఫ్గనిస్తాన్లో రోజురోజుకూ బాలికలు, మహిళల పరిస్థితి దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా అఫ్గన్లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాలికలు హైస్కూల్కు వెళ్లకుండా, మహిళలు ఉన్నత విద్యనభ్యసించకుండా, ఉద్యోగాలు చేయకుండా కఠిన నిబంధనలు విధించిందనే వార్తల నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల సౌతాఫ్రికాలో జరిగిన అండర్-19 వుమెన్ టీ20 వరల్డ్కప్ ఈవెంట్కు ఫుల్ మెంబర్ జట్లలో అఫ్గనిస్తాన్(మహిళలు క్రికెట్ ఆడకూడదనే నిబంధన) ఒక్కటే హాజరు కాలేదు. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించామన్న క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చివరగా అప్పుడే కాగా చివరగా వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా ముంబైలో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్ తలపడ్డాయి. ఇందులో గ్లెన్ మాక్స్వెల్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో మూడు వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచింది. ఇదిలా ఉంటే.. అఫ్గన్ క్రికెట్ బోర్డు పరిస్థితిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి సీఈఓ గాఫ్ అలార్డిస్ స్పందిస్తూ.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేసే ఫుల్ మెంబర్కు తాము మద్దతుగా నిలవకతప్పదని పేర్కొన్నారు. చదవండి: Rohit Sharma: రోహిత్ క్రీజులో ఉన్నంతవరకే ముంబైకి మా మద్దతు! వీడియో An update to our Aussie men's team schedule ⬇️ CA will continue its commitment to the participation of women and girls cricket around the world and will work closely with the ICC and the Afghanistan Cricket Board to resume bilateral matches in the future. pic.twitter.com/OIO5PLjle5 — Cricket Australia (@CricketAus) March 19, 2024 -
రీ ఎంట్రీలో అదరగొట్టిన రషీద్ ఖాన్.. 14 ఏళ్ల రికార్డు బద్దలు
అఫ్గానిస్తాన్ టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్ తన రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. గాయం కారణంగా గత కొంత కాలంగా ఆటకు దూరంగా ఉన్న రషీద్.. శుక్రవారం ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20తో తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో తన రీ ఎంట్రీ మ్యాచ్లో రషీద్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో 3 వికెట్లతో రషీద్ సత్తాచాటాడు. తన 4 ఓవర్ల కోటా స్పెల్లో 19 పరుగులిచ్చి రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. పాల్ స్టిర్లింంగ్, క్యాంప్హెర్ వంటి కీలక వికెట్లను ఖాన్ పడగొట్టాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన అఫ్గానిస్తాన్ కెప్టెన్గా రషీద్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆ జట్టు మాజీ కెప్టెన్ నవ్రోజ్ మంగల్ పేరిట ఉండేది. 2014 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో ఐర్లాండ్పై మంగల్ 4 ఓవర్లలో 23 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. తాజా మ్యాచ్తో మంగల్ ఆల్టైమ్ రికార్డును రషీద్ ఖాన్ బ్రేక్ చేశాడు. కాగా ఈ మ్యాచ్లో అఫ్గానిస్తాన్ అనుహ్యంగా 38 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా ఐపీఎల్-2024 సీజన్కు ముందు రషీద్ ఫుల్ ఫిట్నెస్ సాధించడం గుజరాత్ టైటాన్స్కు కలిసొచ్చే అంశం. The Magician King @rashidkhan_19 is Back https://t.co/FkSsk7O91b — Baaz Khan (@Im_BaazKhan) March 15, 2024 -
అఫ్గానిస్తాన్ను చిత్తు చేసిన ఐర్లాండ్..
అఫ్గానిస్తాన్ జట్టుకు పసికూన ఐర్లాండ్ ఊహించని షాకిచ్చింది. షార్జా వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన తొలి టీ20లో 38 పరుగుల తేడాతో ఐర్లాండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో హ్యారీ టెక్టర్(56) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు బల్బర్నీ(22), స్టిర్లింగ్(25) పరుగులతో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో కెప్టెన్ రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. నంగేయాలియా ఖరోటే 2వికెట్లు, ఓమర్జాయ్ చెరో వికెట్ సాధించారు. చెలరేగిన బెంజిమిన్ వైట్.. అనంతరం 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 111 పరుగులకే కుప్పకూలింది. దీంతో 38 పరుగుల తేడాతో అఫ్గాన్ ఓటమి పాలైంది. ఐర్లాండ్ స్పిన్నర్ బెంజిమిన్ వైట్ 4 వికెట్లతో అఫ్గాన్ను దెబ్బతీశాడు. అతడితో పాటు లిటిల్ 3 వికెట్లు, మెక్గ్రాతీ రెండు, అడైర్ వికెట్ సాధించారు. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో మహ్మద్ ఇషాఖ్(32) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 17న జరగనుంది. చదవండి: CSK: సీఎస్కేకు బిగ్ షాక్! డెత్ ఓవర్ల స్పెషలిస్టు అవుట్! -
గుజరాత్ టైటాన్స్కు గుడ్న్యూస్.. స్టార్ వచ్చేస్తున్నాడు!
IPL 2024- Gujarat Titans: అఫ్గనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని రషీద్ ఖాన్ ధ్రువీకరించాడు. కాగా అఫ్గన్ లెగ్ స్పిన్నర్ భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023 తర్వాత వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుంచి అంతర్జాతీయ, లీగ్ క్రికెట్కు దూరమయ్యాడు. ఈ క్రమంలో మార్చి 15 నుంచి మొదలుకానున్న అఫ్గనిస్తాన్- ఐర్లాండ్ టీ20 సిరీస్తో తాను రీఎంట్రీ ఇస్తున్నట్లు రషీద్ ఖాన్ వెల్లడించాడు. ‘‘రానున్న సిరీస్లో జాతీయ జట్టు తరఫున మళ్లీ బరిలోకి దిగాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ఇందుకు సంబంధించిన శిక్షణ కూడా మొదలుపెట్టాను. అన్నీ సజావుగా సాగుతున్నాయి. నిజానికి సర్జరీ కారణంగా గడిచిన మూడు నెలల కాలం కష్టంగా తోచింది. ఏడెనిమిది నెలలుగా వెన్నునొప్పి బాధపెడుతోంది. వరల్డ్కప్ టోర్నీకి ముందుగానే సర్జరీకి వెళ్తే బాగుంటుందని డాక్టర్లు సూచించారు. అయితే, ఐసీసీ మెగా ఈవెంట్లో దేశం తరఫున ఆడాలనే నేను నిర్ణయించుకున్నాను. దేవుడి దయ వల్ల ఇప్పుడంతా బాగుంది. రానున్న రోజులు మరింత గొప్పగా ఉంటాయని భావిస్తున్నాను’’ అని రషీద్ ఖాన్ అఫ్గన్ క్రికెట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అదే విధంగా.. టీ20 వరల్డ్కప్-2024కు ముందు ఐపీఎల్ ఆడటం కూడా తమకు కలిసి వస్తుందని రషీద్ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశాడు. ఐపీఎల్కాగా రషీద్ ఖాన్ రీఎంట్రీ ఐపీఎల్ ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్కు కూడా శుభవార్తగా పరిణమించింది. ఇప్పటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును వీడి ముంబై ఇండియన్స్ సారథి కాగా.. మహ్మద్ షమీ తాజా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో రషీద్ ఆగమనం టైటాన్స్కు ఊరట కలిగించనుంది. ఇక గత సీజన్లో రషీద్ ఖాన్ 17 మ్యాచ్లు ఆడి 27 వికెట్లు తీశాడు. తద్వారా అత్యధిక వికెట్ టేకర్ల మూడో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే.. మార్చి 15- 18 వరకు అఫ్గన్- ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. ఇక ఐపీఎల్-2024లో గుజరాత్ మార్చి 24న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: ధోని, యువీ కాదు..! టీమిండియాలో గ్రేటెస్ట్ సిక్స్ హిట్టర్ అతడే: ద్రవిడ్ -
బంగ్లాదేశ్ను చిత్తు చేసిన శ్రీలంక.. సిరీస్ సొంతం
సెల్హాట్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మూడో టీ20లో 28 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-1 తేడాతో శ్రీలంక సొంతం చేసుకుంది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. లంక పేసర్ నువాన్ తుషారా 5 వికెట్లతో బంగ్లాదేశ్ను దెబ్బతీశాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అందులో ఓ హ్యాట్రిక్ కూడా ఉంది. అతడితో పాటు కెప్టెన్ హసరంగా రెండు, షనక, తీక్షణ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో రిసాద్ హొస్సేన్(53) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ కుశాల్ మెండీస్(86) పరుగులతో అదరగొట్టాడు. అతడి ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 6 సిక్స్లు ఉన్నాయి. బంగ్లా బౌలర్లలో రిసాద్ హొస్సేన్, టాస్కిన్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు. -
నరాలు తెగే ఉత్కంఠ.. 3 పరుగుల తేడాతో విజయం
బంగ్లాదేశ్తో మూడు టీ20ల సిరీస్ను శ్రీలంక విజయంతో ఆరంభించింది. సెల్హాట్ వేదికగా బంగ్లాతో జరిగిన తొలి టీ20లో 3 పరుగుల తేడాతో లంక విజయం సాధించింది. 207 పరగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆఖరి వరకు పోరాడింది. చివరి ఓవర్లో బంగ్లా విజయానికి 12 పరుగుల అవసరమవ్వగా.. 8 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. బంగ్లా బ్యాటర్లలో జాకీర్ అలీ(68) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మహ్మదుల్లా(54) పరుగులతో రాణించాడు. లంక బౌలర్లలో మాథ్యూస్, శనక, ఫెర్నాండో తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో సమరవిక్రమ(61), కుశాల్ మెండిస్(59) అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. ఆఖరిలో కెప్టెన్ అసలంక(21 బంతుల్లో 44 పరుగులు, 6 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లలో షోర్ఫుల్ ఇస్లాం, టాస్కిన్ ఆహ్మద్, రిషాద్ హుస్సేన్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 6న జరగనుంది. చదవండి: IPL 2024: సన్రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెగా కమిన్స్ -
సిక్సర్ల వర్షం.. యువ బ్యాటర్ విధ్వంసకర సెంచరీ
నమీబియాతో టీ20 మ్యాచ్లో నెదర్లాండ్స్ యువ క్రికెటర్ మైకేల్ లెవిట్ దుమ్ములేపాడు. ఇరవై ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అద్భుత శతకంతో సత్తా చాటాడు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎనిమిది సిక్సర్లు, ఏడు బౌండరీల సాయంతో వంద పరుగుల మార్కును అందుకున్నాడు లెవిట్. అంతర్జాతీయ క్రికెట్లో అతడికి ఇదే తొలి శతకం. కాగా నేపాల్ వేదికగా నమీబియా- నెదర్లాండ్స్- నేపాల్ మధ్య త్రైపాక్షిక టీ20 సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా తొలి టీ20లో నేపాల్పై నమీబియా 20 పరుగుల తేడాతో గెలవగా.. రెండో మ్యాచ్లో నెదర్లాండ్స్ ఆతిథ్య నేపాల్ను 2 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఓపెనింగ్ బ్యాటర్ మైకేల్ లెవిట్.. నేపాల్పై అర్ధ శతకం(54) బాదాడు. తాజాగా నెదర్లాండ్స్తో గురువారం నాటి మ్యాచ్లోనూ బ్యాట్ ఝులిపించిన లెవిట్.. 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 62 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. లెవిట్కు తోడు వన్డౌన్ బ్యాటర్ సైబ్రండ్ ఎంగెల్బ్రెట్ అద్భుత అర్థ శతకం(40 బంతుల్లో 75)తో రాణించాడు. ఇద్దరూ కలిసి ఏకంగా రెండో వికెట్కు ఏకంగా 178 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ నేపథ్యంలో లెవిట్, సైబ్రండ్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 247 పరుగులు సాధించింది. కాగా కీర్తిపూర్లో నమీబియాతో జరుగుతున్న ఈ టీ20 మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. ఈ మేరకు భారీ స్కోరు సాధించింది. ఇదిలా ఉంటే.. నెదర్లాండ్స్ తరఫున టీ20లలో సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా మైకేల్ లెవిట్ చరిత్రకెక్కాడు. మాక్స్ ఒడౌడ్ లెవిట్ కంటే ముందు పొట్టి ఫార్మాట్లో సెంచరీ సాధించాడు. -
న్యూజిలాండ్కు ఘోర పరాభవం.. మళ్లీ ఆస్ట్రేలియానే
స్వదేశంలో న్యూజిలాండ్కు ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. ఆక్లాండ్ వేదికగా ఆసీస్తో జరిగిన మూడో టీ20లోనూ కివీస్ ఓటమి పాలైంది. దీంతో మూడు టీ20ల సిరీస్లో 0-3 తేడాతో న్యూజిలాండ్ వైట్వాష్కు గురైంది. ఆఖరి టీ20 విషయానికి వస్తే.. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో 27 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తొలుత ఆసీస్ను బ్యాటింగ్కు అహ్హనించాడు. ఈ క్రమంలో ఆసీస్ ఇన్నింగ్స్ 67-2(6.2 ఓవర్లు) వద్ద ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. అయితే కొద్దిసేపుటికే వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ మళ్లీ ఆరంభమైంది. కానీ 8.3 ఓవర్ల వద్ద మళ్లీ వర్షం తిరుగుముఖం పట్టింది. అనంతరం వర్షం మళ్లీ తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ను 15 ఓవర్లకు కుదించారు. అయితే ఆసీస్ ఇన్నింగ్స్ 118(10.4 ఓవర్లు) వద్ద వర్షం మళ్లీ ఆటకు బ్రేక్లు వేసింది. తర్వాత వర్షం తగ్గినప్పటికీ ఆసీస్ ఇన్నింగ్స్ మాత్రం 10. 4 ఓవర్లకే ముగిసిపోయింది. ఈ క్రమంలో డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం కివీస్ టార్గెట్ను 10 ఓవర్లలో 126 పరుగులగా నిర్ణయించారు. 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 98 పరుగులకే పరిమితమైంది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(40) ఆఖరివరకు పోరాడాడు. ఇక ఆసీస్ బౌలర్లలో జంపా, షార్ట్, జానెసన్ తలా ఒక్క వికెట్ సాధించారు. కాగా అంతకముందు ఆసీస్ ఇన్నింగ్స్లో ట్రావిస్ హెడ్(33) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. షార్ట్(27), మాక్స్వెల్(20) పరుగులతో రాణించారు. చదవండి: Babar Azam: ఏయ్ దమ్ముంటే ఇక్కడకు రా.. కట్టలు తెంచుకున్న బాబర్ ఆగ్రహం -
చితక్కొట్టేశాడు.. బౌల్ట్కు చుక్కలు చూపించాడు!
న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్కు పునరాగమనంలో చేదు అనుభవం ఎదురైంది. దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత కివీస్ తరఫున పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్టార్మ్ పేసర్ బౌలింగ్లో.. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రవిస్ హెడ్ చితక్కొట్టాడు. కాగా కివీస్ పర్యటనలో భాగంగా ఆసీస్ ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య శుక్రవారం నాటి రెండో టీ20కి అక్లాండ్ వేదికైంది. ఈడెన్ పార్క్ మైదానంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో కివీస్ బౌలింగ్ అటాక్ మొదలుపెట్టిన ట్రెంట్ బౌల్ట్కు దిమ్మతిరిగే షాకిచ్చాడు ఆసీస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్. మొదటి ఓవర్ తొలి బంతినే ఫోర్గా మలిచిన హెడ్.. ఆ తర్వాత పరుగు తీయలేకపోయినా.. మరుసటి బంతికి సిక్సర్ బాదాడు. అదే జోరును కొనసాగిస్తూ వరుసగా మరో సిక్స్, ఫోర్ కొట్టాడు. ఇలా బౌల్ట్ బౌలింగ్లో ఒక్క ఓవర్లోనే 20 పరుగులు పిండుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో మొత్తంగా 4 ఓవర్ల బౌలింగ్లో బౌల్ట్ ఏకంగా 49 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కాగా న్యూజిలాండ్తో రెండో టీ20లో ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 174 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ (22 బంతుల్లో 45), కెప్టెన్ మిచెల్ మార్ష్(26), ప్యాట్ కమిన్స్(28) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ అత్యధికంగా 4 వికెట్లు తీయగా.. ఆడం మిల్నే, బెన్ సియర్స్, మిచెల్ సాంట్నర్ తలా రెండు వికెట్లు తీశారు. ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్ ఆడే క్రమంలో సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్న బౌల్ట్ కొన్నాళ్లుగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. 2022 నవంబరులో కివీస్ తరఫున ఆఖరి టీ20 ఆడిన బౌల్ట్.. 2023లో వన్డే ఆడాడు. ఈ క్రమంలో ఆసీస్తో రెండో టీ20 సందర్భంగా టిమ్ సౌతీ స్థానంలో జట్టులోకి వచ్చాడు. -
NZ vs Aus: రచిన్ సుడిగాలి ఇన్నింగ్స్.. 19 బంతుల్లోనే!
New Zealand vs Australia, 1st T20I - Rachin Ravindra Maiden T20I fifty: ఆస్ట్రేలియాతో తొలి టీ20లో న్యూజిలాండ్ జట్టు అదరగొట్టింది. ఓపెనర్ డెవాన్ కాన్వే, ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర సుడిగాలి అర్ధ శతకాల కారణంగా భారీ స్కోరు నమోదు చేసింది. కాగా మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడేందుకు ఆసీస్.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా తొలి టీ20 బుధవారం మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే శుభారంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫిన్ అలెన్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 32 రన్స్తో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. కాన్వే(46 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 63) సూపర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇక స్పిన్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర 35 బంతులు ఎదుర్కొని 68 పరుగులు సాధించాడు. 19 బంతుల్లోనే 54 రన్స్ రచిన్ ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు, ఆరు సిక్స్లు ఉన్నాయి. కాగా రచిన్కు టీ20లలో ఇదే తొలి అర్థ శతకం కావడం విశేషం. 29 బంతుల్లో 50 పరుగుల మార్కు అందుకున్నాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్. ఇక తాను ఎదుర్కొన్న తొలి 16 బంతుల్లో కేవలం 14 పరుగులే చేసిన రచిన్.. మిగిలిన 19 బంతుల్లో 54 పరుగులతో సత్తా చాటాడు. రచిన్ సంగతి ఇలా ఉంటే.. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ 10 బంతుల్లో 19, ఐదో నంబర్ బ్యాటర్ మార్క్ చాప్మన్ 13 బంతుల్లో 18 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ కేవలం మూడు వికెట్లు నష్టపోయి 215 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు 216 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది. ఇక ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ మిచెల్ మార్ష్, పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. Rachin Ravindra 🔥#nzvsaus pic.twitter.com/VgISIw95Ji — piyush (@piyushson17) February 21, 2024 చదవండి: IPL 2024: టెస్టులో ధనాధన్ ఇన్నింగ్స్.. సర్ఫరాజ్ రీఎంట్రీ! A chat with Wellington local Rachin Ravindra after his maiden T20I fifty 🏏 #NZvAUS pic.twitter.com/ON0wxbgQGA — BLACKCAPS (@BLACKCAPS) February 21, 2024 -
WI Vs AUS 3rd T20I : రసెల్ బ్యాటింగ్ విధ్వంసం.. 29 బంతుల్లోనే!
Australia vs West Indies, 3rd T20I: ఆస్ట్రేలియాతో మూడో టీ20లో వెస్టిండీస్ వెటరన్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ బ్యాట్తో విధ్వంసం సృష్టించాడు. పెర్త్ మ్యాచ్లో కంగారూ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల వరద పారించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 29 బంతుల్లోనే ఏకంగా 244కు పైగా స్ట్రైక్రేటుతో 71 రన్స్ సాధించాడు. ఆసీస్ బౌలింగ్ను చితక్కొడుతూ నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో ఈ మేరకు ఆండ్రీ రసెల్ పరుగుల సునామీ సృష్టించాడు. హిట్టర్ అన్న బిరుదును మరోసారి సార్థకం చేసుకున్నాడు. Bang! Andre Russell is seeing them nicely at Perth Stadium. Tune in on Fox Cricket or Kayo #AUSvWI pic.twitter.com/DoUaQghJiZ — cricket.com.au (@cricketcomau) February 13, 2024 కాగా మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి రెండు టీ20లలో ఓడిన విండీస్.. ఆఖరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పెర్త్ స్టేడియంలో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రూథర్ఫర్డ్, రసెల్ దంచికొట్టారు టాపార్డర్ మొత్తం కలిపి కనీసం 20 పరుగులు కూడా చేయకుండానే నిష్క్రమించడంతో భారమంతా మిడిలార్డర్పై పడింది. ఈ క్రమంలో నాలుగు.. వరుసగా ఆ తర్వాతి స్థానాలో దిగిన రోస్టన్ చేజ్(20 బంతుల్లో 37), కెప్టెన్ రోవ్మన్ పావెల్(14 బంతుల్లో 21) రాణించగా.. షెర్ఫానే రూథర్ఫర్డ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 40 బంతులు ఎదుర్కొన్న రూథర్ఫర్డ్ 67 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఇక రూథర్ఫర్డ్కు జతైన 35 ఏళ్ల ఆండ్రీ రసెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్లో రసెల్.. స్పెన్సర్ జాన్సెన్ బౌలింగ్లో మాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్ను 1-1తో డ్రా చేసుకున్న కరేబియన్ జట్టు.. వన్డే సిరీస్లో 3-0తో వైట్వాష్కు గురైంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో మాత్రం ఆ ఫలితం పునరావృతం కాకూడదని ప్రయత్నం చేస్తోంది. చదవండి: IPL 2024- SRH: సన్రైజర్స్ కెప్టెన్గా అతడే! -
WC 2024: ఈసారి ప్రపంచకప్ వెస్టిండీస్దే: డారెన్ సామీ
టీ20 ప్రపంచకప్-2024 టైటిల్ గెలిచేది తమ జట్టేనని వెస్టిండీస్ మాజీ కెప్టెన్, పరిమిత ఓవర్ల ప్రస్తుత కోచ్ డారెన్ సామీ అన్నాడు. సొంతగడ్డపై పొట్టి ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. గతేడాది తాము టీ20 ఫార్మాట్లో అద్భుత విజయాలు సాధించామని.. ఆ జోరును అలాగే కొనసాగించి విశ్వవిజేతలుగా నిలుస్తామని పేర్కొన్నాడు. కాగా అత్యధికంగా రెండుసార్లు టీ20 వరల్డ్కప్(2012,2016) గెలిచిన ఘనత వెస్టిండీస్ సొంతం. కానీ.. గత ఐసీసీ ఈవెంట్లలో దారుణ ప్రదర్శనతో విమర్శల పాలైంది . టీ20 ప్రపంచకప్-2022, వన్డే వరల్డ్కప్-2023లో గ్రూప్ స్టేజ్ కూడా దాటకుండానే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన విండీస్ బోర్డు డారెన్ సామీకి కోచ్గా బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో అనూహ్య రీతిలో పుంజుకున్న వెస్టిండీస్ గతేడాది వరుస టీ20 సిరీస్లు గెలిచింది. సౌతాఫ్రికా(2-1), టీమిండియా(3-2), ఇంగ్లండ్ (3-2)లను చిత్తు చేసింది. తాజాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో తలపడుతోంది. డారెన్ సామీ (PC: WC) ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్కు ముందుకు డారెన్ సామీ మాట్లాడుతూ.. ‘‘గతేడాది మా జట్టు అద్భుతమైన పురోగతి సాధించింది. 2023లో మేము ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. జైత్రయాత్రను కొనసాగించాలని భావిస్తున్నాం. సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచే తొలి జట్టు మాదే అవుతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. తమ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇతర లీగ్లలో సత్తా చాటుతున్న విషయాన్ని డారెన్ సామీ ఈ సందర్భంగా గుర్తుచేశాడు. కాగా ఈ ఏడాది జూన్లో జరుగనున్న ప్రపంచకప్-2024 ఈవెంట్కు యూఎస్ఏతో కలిసి వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆస్ట్రేలియాతో సిరీస్కు వెస్టిండీస్ టీ20 జట్టు: రోవ్మన్ పావెల్ (కెప్టెన్), షాయీ హోప్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, అకీల్ హొసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేష్ మోటి, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్ఫర్డ్, రొమారియో షెపర్డ్, ఒషానే థామస్. చదవండి: విభేదాలు ఉంటేనేం.. తను నా రక్తం.. మిస్సవుతున్నా: షమీ భావోద్వేగం
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement