tamilnadu chief secretary
-
సీఎస్కు ఉద్వాసన.. కొత్త అధికారి నియామకం
-
సీఎస్కు ఉద్వాసన.. కొత్త అధికారి నియామకం
తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహనరావును ఆ పదవి నుంచి తొలగించారు. కొత్త ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రామ్మోహనరావు ఇంటిపై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో ఆయనను ఆ పదవి నుంచి తప్పించారు. జయలలిత హయాంలో సీఎస్గా నియమితులైన రామ్మోహనరావు, ఆయన బంధువులు, స్నేహితులకు చెందిన ఇళ్లపై 13 ప్రాంతాల్లో దాదాపు 25 గంటల పాటు ఆదాయపన్ను శాఖ దాడులు జరిగిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 5.30 నుంచి గురువారం ఉదయం 6.30 వరకు ఐటీ దాడులు జరగడంతో ఆయన ఇళ్లు, బంధువుల ఇళ్లలో భారీగా నగలు, నగదు, ఆస్తుల దస్తావేజులు స్వాధీనమయ్యాయి. రాష్ట్రప్రభుత్వానికి ఇది మాయనిమచ్చగా మారిందని అన్ని పక్షాల నుంచి విమర్శలు రావడంతో సీఎం పన్నీర్ సెల్వం హుటాహుటిన కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. అందులోనే సీఎస్ను తప్పించాలని గిరిజా వైద్యనాథన్ను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గిరిజా వైద్యనాథన్.. ముందునుంచి తమిళనాడులోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తొలగించిన రామ్మోహనరావు 1985 బ్యాచ్కి చెందినవారు. ఆయన కంటే గిరిజా వైద్యనాథన్ సీనియర్. -
సీఎస్ ఇంట్లో ముగిసిన ఐటీ దాడులు!
చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావు ఇంట్లో ఐటీ దాడులు బుధవారం రాత్రి ముగిశాయి. అన్నానగర్లోని అయ్యప్పన్ కోయిల్ సమీపంలో 17/184 డోర్ నంబరులో ఉన్న ఆయన ఇంటికి బుధవారం ఉదయం సెక్షన్ 133 కింద విచారణ కోసం వెళ్లిన అధికారులు.. ఆ తర్వాత సమన్లు జారీచేసి, దాన్ని దాడులుగా మార్చిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం నుంచి జరిపిన దాడుల్లో భారీగా నగదు, బంగారంతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. రామ్మోహనరావు, ఆయన కొడుకు, బంధువులు, సన్నిహితులకు చెన్నై, బెంగళూరు, చిత్తూరులలో ఉన్న 13 ఇళ్లలో సోదాలు జరిగాయి. బుధవారం దాడుల్లో సేకరించిన ఆధారాలను బట్టి ఐటీ దాడులు మరిన్ని జరిగే అవకాశమున్నట్లు సమాచారం. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్రెడ్డితో రామ్మోహనరావుకు సంబంధాలు ఉన్నాయనే కోణంలోనే ఈ దాడులు జరిగినట్లు భావిస్తున్నారు. శేఖర్ రెడ్డి, ఆయన ఆడిటర్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. (చదవండి: సీఎస్ ఇంటిపై ఐటీ దాడులు!) -
సీఎస్ కుమారుడి ఇంట్లో బంగారం, డబ్బు స్వాధీనం
చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావుకు ఆస్తులకు సంబంధించి ఐటీ దాడులు కొనసాగుతునే ఉన్నాయి. ఉదయం నుంచి ఆయన, బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సీఎస్ రామ్మోహన్ రావు కార్యాలయంలో కూడా సోదాలు చేస్తున్నారు. ఇక రామ్మోహనరావు కుమారుడి ఇంట్లో నుంచి రూ.18లక్షల కొత్త కరెన్సీతోపాటు రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డితో సంబంధాలపై కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల శేఖర్ రెడ్డి ఇంట్లో రూ.100కోట్లకు పైగా కరెన్సీని ఐటీ అధికారులు సీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న రామ్మోహనరావు ఇంటిపై ఐటీ అధికారులు సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంతో పాటు ఇటీవల నగదు మార్పిడి విషయాల్లో పలుమార్లు ఆయనపై ఐటీ అధికారులు కన్నేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పాటు శశికళ, ప్రస్తుత సీఎం పన్నీర్ సెల్వంకు కూడా ఆయన సన్నిహితుడని, వీళ్ల ఆర్థిక వ్యవహారాల్లో కూడా రామ్మోహనరావు సలహాలు ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శేఖరరెడ్డి ఇంటిపై దాడి తర్వాత పలువురిపై దాడులు జరగొచ్చని సమాచారం ఉంది. కానీ ఏకంగా సీఎస్ ఇంటిపైనే దాడులు జరుగుతాయని ఎవరూ ఊహించలేకపోయారు. -
తమిళనాడు సీఎస్ ఇంటిపై ఐటీ దాడులు!
-
సీఎస్ ఇంటిపై ఐటీ దాడులు!
తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావు ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు మొదలైన దాడులు.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అన్నానగర్లోని ఆయన నివాసంతో పాటు మరో ఆరుచోట్ల కూడా ఈ దాడులు జరుగుతున్నాయి. టీటీడీ సభ్యుడు శేఖరరెడ్డి కార్యాలయాలు, ఇళ్లపై ఐటీ దాడులు జరిగిన తర్వాత ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న సీఎస్ ఇంటిపై దాడులు జరగడం విశేషం. సమన్లు జారీ చేసి మరీ ఈ దాడులు చేస్తున్నారు. గత ఎన్నికల సమయంతో పాటు ఇటీవల నగదు మార్పిడి విషయాల్లో పలుమార్లు ఆయనపై ఐటీ అధికారులు కన్నేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పాటు శశికళ, ప్రస్తుత సీఎం పన్నీర్ సెల్వంకు కూడా ఆయన సన్నిహితుడని, వీళ్ల ఆర్థిక వ్యవహారాల్లో కూడా రామ్మోహనరావు సలహాలు ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శేఖరరెడ్డి ఇంటిపై దాడి తర్వాత పలువురిపై దాడులు జరగొచ్చని సమాచారం ఉంది. కానీ ఏకంగా సీఎస్ ఇంటిపైనే దాడులు జరుగుతాయని ఎవరూ ఊహించలేకపోయారు. ప్రస్తుతం రామ్మోహనరావు ఇంట్లో రెండు బృందాలు, మిగిలినచోట్ల మరిన్ని బృందాలు ఉన్నాయి. అన్నానగర్లోని అయ్యప్పన్ కోయిల్ సమీపంలో 17/184 డోర్ నంబరులో ఉన్న ఆయన ఇంటికి తొలుత సెక్షన్ 133 కింద విచారణ కోసం వెళ్లిన అధికారులు.. ఆ తర్వాత సమన్లు జారీచేసి, దాన్ని దాడులుగా మార్చారు. రామ్మోహనరావు, ఆయన కొడుకు, బంధువులు, సన్నిహితులకు చెన్నై, బెంగళూరు, చిత్తూరులలో ఉన్న 13 ఇళ్లలో సోదాలు జరిగాయి. టీటీడీ సభ్యుడు శేఖర్రెడ్డితో రామ్మోహనరావుకు సంబంధాలు ఉన్నాయనే సమాచారం అందిన తర్వాతే ఐటీ విభాగం అధికారులు చురుగ్గా స్పందించినట్లు తెలుస్తోంది. ఆదాయపన్ను శాఖతో పాటు ఇతర శాఖలు అందించిన సమాచారం ఆధారంగానే సీఎస్ ఇంటి మీద ఆదాయపన్ను దాడులు జరిగినట్లు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్రానికే అవమానం: స్టాలిన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఐటీ దాడులు జరగడం అంటే అది తమిళనాడు రాష్ట్రానికే అవమానమని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ అన్నారు. తమిళనాడు చరిత్రలోనే ఇలా జరగడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు.