TDP
-
‘చంద్రబాబు కుట్రలో భాగమే రాధాకృష్ణ చెత్త పలుకులు’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ నాయకులను, మహిళలను కించపరిచేలా జుగుప్సాకరంగా మాట్లాడిన ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలకు క్షమాపణలు చెప్పాలని, మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి ఆయన్ను తక్షణం అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాధాకృష్ణ దిగజారుడు వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు సమర్థించడం చూస్తుంటే ఇది యాధృచ్చికంగా చేసిన వ్యాఖ్యలు కావని, వైఎస్సార్సీపీ నాయకుల వ్యక్తిత్వ హననం చేసే కుట్రలో భాగంగా జరిగిన పన్నాగంగానే చూడాలని చెప్పారు.రాజధాని ముసుగులో చంద్రబాబు చేస్తున్న వేల కోట్ల దోపిడీని ప్రజలు అర్థం చేసుకున్నారని, ఆచరణ సాధ్యంకాని అమరావతికి ప్రత్యామ్నాయంగా వైఎస్ జగన్ సూచించిన మావిగన్పై ప్రజల్లో చర్చ మొదలైంది. దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే రాధాకృష్ణతో కుట్రలు చేయించారని వరుదు కళ్యాణి మండిపడ్డారు. మహిళలకు రాధాకృష్ణ క్షమాపణలు చెప్పేవరకు వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..అమరావతి వ్యతిరేకుల ముద్ర వేసే కుట్రవీకెండ్ కామెంట్స్, కొత్త పలుకు పేరుతో ఏబీఎన్ రాధాకృష్ణ తన ఛానెల్లో వైఎస్సార్సీపీ నాయకుల భార్యల గురించి నీచంగా మాట్లాడాడు. ఆ తప్పుడు వ్యాఖ్యలను రాధాకృష్ణ తక్షణమే వెనక్కి తీసుకుని మహిళలకు క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ శాంతియుతంగా నిరసన తెలియజేసింది. రాధాకృష్ణ వ్యాఖ్యలను ఖండించి ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాల్సిందిపోయి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనితలు ఆయన్ను సమర్థిస్తున్నారు.ఆచరణ సాధ్యంకాని అమరావతికి ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కారిడార్ని మావిగన్ పేరుతో డెవలప్ చేసుకోవచ్చని వైఎస్ జగన్ సూచించిన క్షణం నుంచి ప్రజల్లో ఆలోచన మొదలైంది. అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీ గురించి ప్రజలు చర్చిస్తున్నారు. రాజధాని ముసుగులో చంద్రబాబు చేస్తున్న వేల కోట్ల దోపిడీని ప్రజలు అర్థం చేసుకున్నారని కూటమి నాయకులకు అర్థమైపోయింది. దాన్నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికే ప్లాన్ ప్రకారం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయించారు. రాధాకృష్ణ వ్యాఖ్యలతో ఎవరైనా వైఎస్సార్సీపీ నాయకులు రియాక్ట్ అయితే వారిపై అమరావతి వ్యతిరేకుల ముద్ర వేసి మావిగన్ అనే పేరెత్తకుండా చేయాలనే పథకం ప్రకారం కుట్ర చేశారు.అవే మాటలను మీకు అన్వయించుకోండిప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్సార్సీపీ శ్రేణులు చేసిన నిరసనను దాడిగా చిత్రీకరించడం దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రజలకు లేదా? వైఎస్ జగన్ చెబితే వైఎస్సార్సీపీ నాయకులు వారి భార్యలను చెల్లెళ్లుగా భావించి పెళ్లిళ్లు చేస్తారని చెప్పడం సంపాదకీయంలో భాగమని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తే దాడి అని ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీకి సంబంధం లేని వ్యక్తి డిబేట్లో మాట్లాడితే సాక్షి కార్యాలయాలను ధ్వంసం చేశారు. మీ నాయకుల ఇళ్లలో ఉన్న తల్లి చెల్లెళ్ల గురించి మాట్లాడితే ఇలాగే సమర్థిస్తారా? మీ హెరిటేజ్ షేర్లలో, మీకున్న కోట్ల ఆస్తుల్లో మీ అక్కచెల్లెమ్మలకు ఎంత ఆస్తి రాసిచ్చారో ఒక్కసారైనా చెప్పారా?ఏరోజైనా మీ తోబుట్టువులను పండక్కి పిలిచి చీరసారె పెట్టి పంపించారా? ఏ హక్కుతో జగనన్న కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారు? పత్రికా స్వేచ్ఛ ముసుగులో వ్యక్తిత్వ హననం చేస్తున్న చంద్రబాబుని ఏరకంగా సమర్థిస్తారు? జగనన్న కళ్లలో ఆనందం కోసం వైయస్సార్సీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేశారని చెబుతున్న నారా లోకేష్, ఎవరి ఆనందం కోసం ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలను కించపరిచేలా మాట్లాడాడు? విశాఖలో ఆంధ్రజ్యోతి పత్రికకు స్థలం కేటాయించినందుకా? విజయవాడలో రాధాకృష్ణ పవర్ ప్లాంట్కి అనుమతులు ఇచ్చినందుకా?ఇదేనా భువనేశ్వరి.. లోకేష్కి నేర్పించిన సంస్కారం? మంత్రి స్థానంలో ఉండి బాధ్యత మరిచి ఆంధ్రజ్యోతి నుంచి సాక్షికి ఎంత దూరమో, సాక్షి నుంచి ఆంధ్రజ్యోతికి అంతే దూరం అని మాట్లాడుతున్నాడు. మీ పార్టీలో మీ ఇంట్లో ఆడవాళ్లను ఇలాగే అంటే ఊరుకుంటారా? ఏబీఎన్ రాధాకృష్ణ మాటలు విశ్లేషణలు అని చెబుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవుల కోసం మనసు చంపుకుని మాట్లాడటం అవసరమా అని ఆలోచించాలి. ఇదే ఏబీఎన్ పేపర్, టీవీలో తన తల్లిని దూషించినందుకు వాటిని బహిష్కరించిన విషయం అప్పుడే మరిచిపోయారేమో కానీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు.హోంమంత్రి అనిత మహిళ అయ్యుండి రాధాకృష్ణ వ్యాఖ్యలను ఖండించకపోవడం సిగ్గుచేటు. ఆమెకు పదవి ఇచ్చింది జగన్ని తిట్టడం కోసమా? టీడీపీ నాయకులు కూడా చంద్రబాబు కూర్చోమంటే కూర్చుని, నిల్చోమంటే నిల్చుంటున్నారు. మోదీని తిట్టినప్పుడు సై అన్నారు. మోదీని పొగిడినప్పుడూ జై అన్నారు. రాధాకృష్ణ మాట్లాడిన ఇవే మాటలు మీకు అన్వయించుకుంటారా చెప్పండి? ఆయన యూటర్న్లకు వంతపాడిన టీడీపీ నాయకులను కూడా ఇలాగే అనొచ్చా? అనిత హోంమంత్రిగా ఉండటం మహిళల దౌర్భాగ్యం. రాధాకృష్ణ వ్యాఖ్యలను సమర్థించడం ద్వారా మహిళా లోకానికే కళంకం తెచ్చారు.పత్రికా రంగానికి ఆంధ్రజ్యోతి చీడ, రాధాకృష్ణ పీడఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఏబీఎన్ రాధాకృష్ణ మీద మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలి. ఇంతదారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తే ఎందుకు ఉపేక్షిస్తున్నారు? మహిళలకు రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలి. ఆయన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే వరకు వైఎస్సార్సీపీ నిరసన తెలుపుతూనే ఉంటుంది. ఇవి యాధృచ్చికంగా వచ్చి న వ్యాఖ్యలు కావు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ల సమర్థింపుతో కావాలని చేసిన కుట్రేనని తేలిపోయింది.వైఎస్సార్సీపీ నాయకుల వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్రలో భాగంగానే పథకం ప్రకారం ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో చేస్తున్న వేల కోట్ల దోపిడీని వైఎస్ జగన్ ఆధారాలతో సహా వెలికితీయడంతో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. వైఎస్ జగన్ ప్రస్తావించిన మావిగన్ మోడల్తో చంద్రబాబు వేల కోట్ల అవినీతి ఆశలు కుప్పకూలిపోయాయి. వాటి నుంచి ప్రజల ఆలోచనలు డైవర్ట్ చేయడం కోసం వ్యక్తిత్వ హననం చేసే కుట్రలు చేస్తున్నారు. పత్రికా రంగానికి ఆంధ్రజ్యోతి చీడ లాంటిది. జర్నలిస్టుల సమాజంలో రాధాకృష్ణ పీడలాంటి వాడు. చంద్రబాబుకి రాజకీయ లబ్ధి చేకూర్చడానికి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు -
చేసిందంతా వైఎస్సారే.. హంద్రీ-నీవాపై 'చంద్ర' నాటకం
-
సీఎం రిలీఫ్ ఫండ్లో తమ్ముళ్ల పర్సెంటేజీల గోల
సాక్షి, అన్నమయ్య: రాబందువులుగా మారిన కూటమి పార్టీల నేతలు.. ప్రజలను పీక్కుతిన్నంత పని చేస్తున్నారు. తాజాగా సీఎం రిలీఫ్ ఫండ్లోనూ తెలుగుదేశం తమ్ముళ్లు ప్రదర్శించిన చేతివాటం బాధితుడి ఫిర్యాదుతో బయటకు వచ్చింది. ఓ బాధితుడికి మంజూరైన సొమ్ములో సగానికి పైగా తమ అకౌంట్లో జమ చేసుకున్నాడు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్. రాజంపేటకు చెందిన తుంటి ఎల్లయ్య అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్ను పోగొట్టుకున్నాడు. బాధితునికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 14 లక్షలు మంజూరు అయ్యింది. అయితే ఆ డబ్బులు ఇప్పిస్తామని తెలుగు దేశం పార్టీ నేతలు ఎల్లయ్యను బ్యాంకుకు తీసుకెళ్లారు. అటుపై అతనితో సంతకాలు పెట్టించుకుని.. డబ్బులు అకౌంట్లో పడ్డాయని చెప్పి పంపించారు. అయితే.. ఇంటికొచ్చి ఫోన్ చూసిన ఎల్లయ్యకు మతిపోయింది. ఎల్లయ్య అకౌంట్కు తొలుత రూ. 14 లక్షలు జమ కాగా.. ఆ వెంటనే 20 నిమిషాల వ్యవదిలో రూ.8 లక్షలు బదిలీ అయ్యాయి. ఆ బదిలీ అయ్యింది టీడీపీ నేత వేణుగోపాల్ అకౌంట్కేనని తెలిసి నిలదీశాడు ఎల్లయ్య. అయితే.. తమకూ ఖర్చులు ఉంటాయని, అందరికి పర్సెంటేజీలు ఇవ్వాలని టీడీపీ నేతలు చెప్పడంతో ఎల్లయ్య తీవ్ర ఆవేదనకు గుయ్యాడు. -
వాడొక నీతిమాలిన.. తాటిపర్తి చంద్రశేఖర్ ఉగ్రరూపం
-
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై TDP నేత సంచలన వ్యాఖ్యలు
-
అరవ శ్రీధర్ నన్ను చంపేస్తాడు. పోలీసుల వద్దకు TDP కార్యకర్త
-
శభాష్ జగన్ అంటున్న కూటమి నేతలు..
-
RK అక్షర వ్యభిచారం..! శవాలపై చిల్లర ఏరుకోడానికి కూడా సిద్ధం
-
చంద్రబాబు నోటికి ప్లాస్టర్ రెచ్చిపోతున్న దగ్గుబాటి ప్రసాద్..
-
పచ్చ నేతల రౌడీయిజం 3 కోట్ల NRI భూమి కబ్జా
-
ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తాం!
సాక్షి టాస్క్ ఫోర్స్: తాము చెప్పినట్లు పని చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని, పార్లమెంటు ముఖ్య నేతను కాదని ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తామంటూ గంపలగూడెం తహసీల్దారు రాజకుమారిని టీడీపీ నాయకులు సోమవారం తీవ్రంగా బెదిరించారు. కార్యాలయం లోపలకు వెళ్లనివ్వకుండా బయటే అడ్డుకుని వీరంగం సృష్టించారు. తమ మాట విననప్పుడు ఇక్కడ పని చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. లోపలున్న సిబ్బంది బయటకు రాకుండా తలుపులు వేసి మరీ దౌర్జన్య కాండ కొనసాగించారు. ఉద్యోగ వర్గాలను తీవ్ర భయాందోళనకు గురి చేసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండల తహసీల్దార్ కార్యాలయానికి ఉదయం 10.30 గంటల సమయంలో తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, గంపలగూడెం మండల టీడీపీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ, తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగళ్ల లక్ష్మీ అనిత భర్త వీరారెడ్డి ఆధ్వర్యంలో పది మందికి పైగా కార్యకర్తలు వచ్చారు. గట్టిగా కేకలు వేస్తూ.. తహసీల్దారు రాజకుమారి వచ్చారా అంటూ హంగామా సృష్టించారు. ఆమె ఇంకా విధులకు రాలేదని సిబ్బంది చెప్పడంతో కార్యాలయంలోంచి వారెవరూ బయటకు రాకుండా తలుపులు వేసి బంధించారు.ఇంతలో కార్యాలయం వద్దకు చేరుకున్న తహసీల్దారు రాజకుమారి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తీవ్ర పదజాలంతో దూషిస్తూ తాము చెప్పిన పనులు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. లోపలకు వెళ్లి కూర్చుని మాట్లాడుదామని తహసీల్దారు కోరినా వినిపించుకోకుండా రెచి్చపోయారు. గంపలగూడెంలో ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తామంటూ బహిరంగంగా హెచ్చరించారు. మీరు మాకు అక్కర్లేదు.. ‘మాకు అనుకూలంగా పనిచేయని అధికారి మాకొద్దు. చెప్పినట్లు వినండి.. లేదంటే వెళ్లిపోండి.. భూముల రీసర్వేలో మేము చెప్పినట్లు నడుచుకోనప్పుడు ఇక్కడ మీరు ఉద్యోగం చేయనక్కర్లేదు. మీరు లోపలకు వెళ్లడానికి వీలు లేదు. మేం ఏం పని చెప్పినా మీరు చేయడం లేదు. మేము చెప్పినట్లు సర్వే చేయడానికి మీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? మిమ్మల్ని కార్యాలయంలోకి వెళ్ళనీయబోం’ అంటూ టీడీపీ నేతలు తహసీల్దార్పై విరుచుకుపడ్డారు. కార్యాలయం లోపలికి వెళ్లి కూర్చొని, మీ సమస్య గురించి వివరంగా మాట్లాడుకుందామని తహసీల్దారు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా ఇష్టానుసారం మాట్లాడారు. సుమారు గంట సేపు అంటే 11.30 గంటల వరకు ఆమెను కార్యాలయం బయటే నిలబెట్టి.. బెదిరించారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. మొన్ననే వెలుగు అధికారిని కొట్టాను.. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి భూములకు సంబంధించి తాము చెప్పినట్లు వినాలని, రీసర్వేలో తమకు అనుకూలంగా పని చేయాలని అనేకసార్లు టీడీపీ నేతలు తహసీల్దార్పై ఒత్తిడి తెచ్చారు. చేయగలిగే పనులు చేస్తూనే.. నిబంధనలకు పూర్తి విరుద్దంగా, మరొకరికి అన్యాయం జరిగేలా ఉన్న వాటిని చేయలేమని తహసీల్దార్ చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు రెండు రోజుల క్రితం విజయవాడలో పార్లమెంటు ముఖ్య నేతను కలిసినట్లు సమాచారం. ఆయన ప్రోద్బలంతోనే సోమవారం వారు నేరుగా తహశీల్దారు కార్యాలయం వద్దకే వెళ్లి ఆమెను బెదిరించారు. ఈ క్రమంలో గంపలగూడెం మండల టీడీపీ అధ్యక్షుడు మానికొండ రామకృష్ణ.. ‘కొద్ది రోజుల క్రితమే వెలుగు అధికారిని కొట్టాను.. నిన్ను కొట్టడం పెద్ద పని కాదు’ అని తహశీల్దారుపై రెచ్చిపోయారు. కార్యాలయంలో బందీలుగా ఉన్న సిబ్బంది, సందర్శకుల ద్వారా విషయం తెలుసుకుని జనం గుమికూడటంతో టీడీపీ నేతలు ఆమెను హెచ్చరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వాస్తవానికి ప్రధానంగా గంపలగూడెం మండలం సొబ్బాలలో ఇద్దరు రైతుల నడుమ భూ సమస్య నెలకొంది. ఒకరికి అనుకూలంగా సర్వే చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సర్వే నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా యథాతథ స్థితి కొనసాగేలా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సర్వే ఆగిపోయింది. ఇదే విషయాన్ని తహసీల్దార్ చెప్పినా, టీడీపీ నేతలు పట్టించుకోక పోవడం గమనార్హం. బయటకు మాట్లాడకండి.. ఈ ఘటనపై తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది కలెక్టర్కు తెలియజేసే ప్రయత్నం చేశారు. కలెక్టర్ సెలవులో ఉన్నారని తెలిసి విషయాన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో జేసీ.. బాధిత తహసీల్దార్తో ఫోన్లో మాట్లాడారని తెలిసింది. ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు రావడంతో ఈ ఘటన గురించి బయటకు మాట్లాడొద్దని తహసీల్దార్కు జేసీ సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.అందువల్లే ఆమె ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై బాధిత తహశీల్దార్ను సంప్రదించగా సర్వేకు సంబంధించి టీడీపీ నేతలు వివరాలు అడిగారని చెప్పారు. ఇదిలా ఉండగా గతంలో ఇక్కడ తహసీల్దారుగా పనిచేసిన భాస్కరరావుపై కూడా టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. మరో తహసీల్దారు ఆశియ్యను కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టి ఆయన కుటుంబ సభ్యులను దుర్భాషలాడారు. ఇప్పుడు తహసీల్దారు రాజకుమారి పట్ల కూడా అలానే వ్యవహరించారు. ఇలాగైతే ఏ అధికారి అయినా ఎలా పని చేస్తారని ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. -
జీతంలో కోత పంచాయతీ కార్యదర్శులకు బిగ్ షాక్
-
‘ఇది రాష్ట్రంలోని ప్రతి మహిళకు జరిగిన అవమానం’
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ‘మావిగన్’ ప్రతిపాదనను ప్రజలు హర్షిస్తున్నారని అర్థం కావడంతో సీఎం చంద్రబాబుకు వణుకు పుడుతోందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఇవాళ వైఎస్సార్ జిల్లాలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.‘మావిగన్ ప్రతిపాదనను ప్రజల నుంచి తప్పించడం చేతకాక ఇక పచ్చ మీడియాను రంగంలోకి దించారు. చంద్రబాబుకు శిఖండి మాదిరిగా ఉపయోగపడే ఆంధ్రజ్యోతి పత్రిక రంగంలోకి దిగింది. రాధాకృష్ణ చేస్తుంది జర్నలిజం కాదు... బ్రోకరిజం. వీకెండ్ కామెంట్స్ పేరుతో రాధాకృష్ణ తీరు అత్యంత దారుణంగా మారింది. మేము వెన్నెముక లేని మనుషులమని విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళల పట్ల నీచంగా, అనుచితంగా మాట్లాడారు. ఇది ఒక పార్టీకి సంబంధించిన అవమానం కాదు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళకు జరిగిన అవమానమే. రాధాకృష్ణ... నీకూ భార్యాబిడ్డలు ఉన్నారు కదా.. నీలా మేం మాట్లాడితే? కానీ, మేం అంత అసహ్యంగా, జుగుప్సాకరంగా మాట్లాడలేం. చివరికి భార్యాభర్తల బంధాన్ని కూడా అపహాస్యం చేస్తూ జర్నలిజం అంటావా? ప్రజలు చంద్రబాబు ఎంతటి నీతి బాహ్యమైన చర్యలకు దిగుతున్నాడో గమనించాలి. కేవలం జగన్ మావిగన్ ప్రతిపాదనను పక్కదోవ పట్టించడానికి ఇంతటి నీచానికి దిగజారాలా?మా పార్టీ అధినేత వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన చేశారు. రూ.2 లక్షల కోట్లు పెట్టి, ఆచరణలో సాధ్యంకాని భ్రమరావతిని ఊహించుకోవడం కంటే ఇది చాలా ముఖ్యం. కేవలం రూ.20 వేల కోట్లతో ఇది గ్రోత్ ఇంజిన్గా తయారవుతోందని ఆచరణ సాధ్యమైన ప్రతిపాదన చేశారు. దానికే కోట్లు ఖర్చు చేసి సోషల్ మీడియాలో టీడీపీ నేతలు విపరీతంగా ట్రోలింగ్ చేయిస్తున్నారు. నీచాతినీచంగా టీడీపీ మూకలు ట్రోలింగ్ చేయిస్తూ వికృతానందం పొందుతున్నాయి. మంత్రులు, చోటా మోటా నాయకులు అయిపోయిన తర్వాత పచ్చ మీడియాను రంగంలోకి దించారు. కండకావరంతో, కొవ్వెక్కి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఎంతటి అవమానకరంగా మాట్లాడినా శాంతియుతంగా నిరసన తెలపండని వైఎస్ జగన్ మాకు చెప్పారు’ అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. -
2024 పోలింగ్ వద్ద టీడీపీ ఫ్రాడ్, POINT TO POINT నాగార్జున యాదవ్ షాకింగ్ నిజాలు
-
అంత ఒళ్ళు బలిసిందా.. దళితుడిని కొట్టిన అయ్యన్నపాత్రుడు ఏకిపారేసిన మేరుగు
-
ఎమ్మెల్యే మాధవి రెడ్డికి బిగ్ షాక్..
సాక్షి, కడప: కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డికి ఊహించని అనుభవం ఎదురైంది. ఆకస్మిక తనిఖీలు చేసి హడావుడి చేద్దామనుకున్న పచ్చ పార్టీకి ఎమ్మెల్యే.. అక్కడున్న పరిస్థితి చూసి అవాక్కయ్యారు. చేసేదేమీ లేక ముక్కుమూసుకుని బయటకు వచ్చేశారు. దీంతో, కూటమి సర్కార్ పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో ఓ ప్రజా ప్రతినిధి చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి తన నియోజకవర్గంలోని పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసి అధికారులకు షాక్ ఇవ్వాలనుకున్నారు. ఇందులో భాగంగా కడప నగరం ముతరాసుపల్లి జడ్పీ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు వెళ్లిన వెంటనే అక్కడి పరిస్థితులను చూసి మాధవి రెడ్డి జడుసుకున్నారు. స్కూల్లోని బాత్రూమ్లను చూసి ఒక్కసారిగా ముక్కు మూసుకుని బయటకు వచ్చారు. దీంతో, కూటమి ప్రభుత్వ పాలనలో పాఠశాలల పరిస్థితి ఎంత దారుణంగా అర్థం చేసుకోవచ్చు. అనంతరం, మండుటెండలో మట్టిలో పిల్లలకు భోజన ఏర్పాట్లు చూసి ఎమ్మెల్యే మాధవి రెడ్డి అవాక్కయ్యారు. నాణ్యత లేని భోజనం పెట్టడాన్ని చేసి ఎమ్మెల్యే ఖంగుతున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు.. ప్రతి రోజూ భోజనం బాగాలేదు అని మాధవికి చెప్పడం మరో విశేషం. ఇలా ఒక్కో సమస్యను విద్యార్థులు.. మాధవి రెడ్డి దృష్టికి తీసుకురావడంతో రివర్స్లో ఆమెకే షాక్ తగిలినట్టు అయ్యింది. దీంతో, చెప్పేది, చేసేదీ ఏమీ లేక మాధవి రెడ్డి అక్కడి నుంచి వచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్పై నెటిజన్లు మండితున్నారు. రాష్ట్రంలో స్కూల్స్ నిర్వహణపై దృష్టి సారించాలని హితవు పలుకుతున్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాల దాడి
గుంటూరు: వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా టీడీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరులో టీడీపీ గూండాలు బరితెగించి మరీ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు దిగారు. పొన్నూరు 13వ వార్డుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు మనోహర్, వెంకటరత్నంలపై కర్రలు, రాడ్లతో దాడులకు దిగారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వెంకటరత్నం, మనోహర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోజు వ్యవధిలో వారిపై టీడీపీ గూండాలు దాడులు చేయడం రెండోసారి. -
‘అందుకే వైఎస్ జగన్ మావిగన్ పేరు సూచించారు’
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. గ్రీన్ జోన్ పేరు చెప్పి చంద్రబాబు.. రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. టీడీపీ ఏడేళ్ల పాలనలో విజయవాడకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి’’ అంటూ వెల్లంపల్లి డిమాండ్ చేశారు.‘‘వైఎస్సార్సీపీ హయాంలో విజయవాడలో అభివృద్ది పరుగులు పెట్టింది. కేవలం రూ.20 వేల కోట్లతో అద్భుతమైన రాజధాని నిర్మించుకోవచ్చు. వెస్ట్ బైపాస్లో 10 శాతం పనులను ఎందుకు ఆపుతున్నారు. పోర్టు, రైల్వేస్టేషన్ కలిస్తే అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. ప్రతి ఒక్కరూ మావిగన్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు’’ అని వెల్లంపల్లి పేర్కొన్నారు.‘‘వైఎస్ జగన్ సూచించిన మావిగన్ ప్రతిపాదనను చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు. విజయవాడ అంటే చంద్రబాబుకు కక్ష. కూటమి అధికారంలోకి వచ్చాక విజయవాడలో ఒక్క అభివృద్ధి పనికూడా జరగలేదు. విజయవాడ అభివృద్ధిని చంద్రబాబు విస్మరించారు. అమరావతి బిల్లు పెట్టాక చంద్రబాబు మాట మార్చారు. అంతకుముందు 2028 కల్లా అమరావతి పూర్తవుతుందని చంద్రబాబు మొదట చెప్పారు. బిల్లు పెట్టాక అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో తెలియదంటున్నారు.రూ.2 లక్షల కోట్లు అప్పులు తెచ్చి అమరావతిని గుదిబండగా మార్చారు. విజయవాడకు చంద్రబాబు ఏ ఒక్క మేలైనా చేశారా?. మచిలీపట్నం, గుంటూరులను కూడా పట్టించుకోవటం లేదు. ఎంతసేపూ అమరావతి పేరుతో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తారా?. లక్షల కోట్లు అమరావతిలో ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి?. అందుకే జగన్ మావిగన్ పేరు సూచించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంత ప్రజాప్రతినిధులు మావిగన్ కు వ్యతిరేమా? అనుకూలమా?’’ అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు.మావిగన్కు ప్రజల మద్దతు లభిస్తోంది: దేవినేని అవినాష్వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్నది షో రాజకీయాలే. ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. అలాంటి అమరావతికి లక్షల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ సూచించిన మావిగన్కు ప్రజల మద్దతు లభిస్తోంది. అమరావతి కోసం చంద్రబాబు విజయవాడను చంపేశారు. నగరంలో ఎలాంటి అభివృద్ధి చేయటం లేదు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కట్టలేని చంద్రబాబు అమరావతి కట్టగలరా?. రిటైనింగ్ వాల్ కట్టలేని చంద్రబాబు అమరావతి కడతారా?.’’ అంటూ ఆయన నిలదీశారు.‘‘విజయవాడలో అభివృద్ధి జగన్ మాత్రమే చేశారు. వెస్ట్ బైపాస్ నిర్మాణం కూడా కేవలం వైఎస్ జగనే చేశారు. విజయవాడలోని రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్టును అభివృద్ధి చేయకుండా చంద్రబాబే అడ్డుకున్నారు. కమ్మ సామాజిక వర్గం వారికి జగన్ ఎంతో మేలు చేశారు. వైఎస్ జగన్ దగ్గరకు వచ్చి పనులు చేయించుకున్నారు. వసంత కృష్ణప్రసాద్ ఐదేళ్లు మా పార్టీలో ఉండి డబ్బు సంపాదించుకున్నారు. ఇప్పుడు టీడీపీలోకి వెళ్లి జగన్పై విమర్శలు చేయటం సిగ్గుచేటు. మావిగన్కు టీడీపీ నేతలు సైతం మద్దతు ఇస్తున్నారు. అమరావతి బిల్లు సందర్భంగా కేకులు కట్ చేయమని చంద్రబాబు పిలుపిస్తే టీడీపీ క్యాడరే పట్టించుకోలేదు. వైఎస్ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనకు అందరి మద్దతూ లభించింది’’ అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు.అమరావతికి రూ.2 లక్షల కోట్లు అవసరమా?: మల్లాది విష్ణుఅమరావతికి రూ.2 లక్షల కోట్లు అవసరమా?. గ్రోత్ ఇంజన్ లాంటి మావిగన్పై ఎందుకు విమర్శలు చేస్తున్నారు?. రాష్ట్రం భరించలేని అప్పులు అవసరమా?. అమరావతిని ఎవరి కోసం నిర్మిస్తున్నారు?. గుంటూరు, విజయవాడలను చంద్రబాబు అన్యాయం చేశారు. మావిగన్ ప్రతిపాదనను జగన్ చెప్పగానే టీడీపీ నేతలు భయపడుతున్నారు. మచిలీపట్నం పోర్టు బేస్డుగా జరిగే మావిగన్ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారు?. తెలంగాణానే మచిలీపట్నం పోర్టుకు రోడ్లు వేసుకోబోతోంది. మరి చంద్రబాబు ఆ కోణంలో ఎందుకు ఆలోచించటం లేదు?అమరావతి పేరుతో భూములు తీసుకుని రైతులను ఎంతకాలం వేధిస్తారు?. మందడంలో రైతు రామారావు గుండె పగిలి చనిపోయాడు. దీన్ని కూడా ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది. భావితరాలకు చంద్రబాబు లక్షల కోట్ల అప్పును గిఫ్టుగా ఇస్తున్నారు. బుడమేరు వరదలకు లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. కనీసం ముందస్తు హెచ్చరికలు కూడా చేయలేదు. విజయవాడ వాసులపై చంద్రబాబుకు ఎంత కోపమో దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చుకృష్ణా, బుడమేరులకు వరదలు వస్తే ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లకు కూడా సెలవులు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. అమరావతి పేరుతో జరిగే దోపిడీలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. జపాన్కు చెందిన మాకీ అనే సంస్థ చంద్రబాబు అవినీతిని బయటపెట్టింది. చంద్రబాబు ఫ్రెండ్ సింగపూర్ ఈశ్వరన్ను కూడా జైల్లో పెట్టారు. అంటే వీరంతా కలిసి ఏ స్థాయిలో అవినీతి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మావిగన్పై నిర్ణయం తీసుకోకపోతే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో టీడీపీ కనుమరుగు ఖాయం. -
ACB పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డ టీడీపీ నేత
-
శనగకు ‘ధరా’ఘాతం.. రైతును ఆదు‘కొనే’వారేరి!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు నిర్వాకం శనగ రైతుల పాలిట శాపంగా మారింది. కేంద్రం అనుమతులతో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాలు మూణ్ణాళ్ల ముచ్చటగా మారాయి. గతేడాది నిల్వలతో పాటు ఈ ఏడాది పంట దిగుబడిలో కనీసం 15 శాతం కూడా కొనకుండానే కూటమి సర్కారు కొనుగోలు కేంద్రాలను మూసివేసింది. మార్కెట్లో ధర లేక.. కొనేవారు కానరాక రైతులు గగ్గోలు పెడుతున్న తరుణంలో ధరల స్థిరీకరణ నిధి ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన టీడీపీ కూటమి ప్రభుత్వం అదనపు అనుమతుల పేరిట కేంద్రానికి లేఖలు రాస్తూ నాటకాలాడుతోంది.దక్కే ధర రూ.4,900లోపే..ఈ ఏడాది రబీలో 10.30 లక్షల ఎకరాల్లో శనగ పంటను రైతులు సాగు చేశారు. 4.57 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా. క్వింటాల్కు కనీస మద్దతు ధర రూ.5,650 కాగా.. మార్కెట్లో రూ.4,600 నుంచి రూ.4,900 మధ్య మాత్రమే చెల్లిస్తున్నారు. గతేడాది ధర లేకపోవడంతో దాదాపు 2 లక్షల టన్నులకు పైగా శనగలు కోల్డ్ స్టోరేజీల్లో మూలుగుతుండగా, ఈ ఏడాది పంట మార్కెట్కు రావడం మొదలైంది. కనీసం ఈ ఏడాదైనా ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్లో జోక్యం చేసుకుని మద్దతు ధరకు శనగ పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులంతా ఆశగా ఎదురు చూశారు. కానీ.. కేంద్రంపై భారం నెట్టేసి.. చంద్రబాబు ప్రభుత్వం చేతులు దులుపుకునే పనిలో నిమగ్నమైంది. అర్థంతరంగా కొనుగోలు కేంద్రాలు మూసివేత ఫిబ్రవరి నెలాఖరులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పంట పూర్తిగా మార్కెట్కు రాకుండానే మూసివేశారు. కేంద్రం 94,500 టన్నుల సేకరణకు అనుమతివ్వగా, కేవలం 84 వేల టన్నులు మాత్రమే సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను అర్ధంతరంగా మూసివేసింది. మరోవైపు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు టీడీపీ సానుభూతిపరుల నుంచి మాత్రమే సేకరించారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు 30–40 శాతం పంట మాత్రమే మార్కెట్కు వచ్చింది. గతేడాది నిల్వలతో కలిపితే దాదాపు 4.50 లక్షల టన్నులకు పైగా నిల్వలు రైతుల వద్ద పేరుకుపోయాయి. ఎప్పుడు కొనుగోలు చేస్తారని రైతులు అడుగుతుంటే.. ప్రభుత్వం నుంచి కనీస స్పందన రావడం లేదు. పైగా ఈ బాధ్యత తనది కాదన్నట్టుగా అదనపు సేకరణకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపేసుకుంటోంది. అదనపు కొనుగోళ్లకు అనుమతి కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాసినట్టు వ్యవసాయ శాఖమంత్రి కె.అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇలా లేఖలతోనే రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందే తప్ప రైతులను ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.కొనుగోలు కేంద్రాల్ని మూసేశారుఐదెకరాల్లో శనగ వేశాను. ఎకరాకు రూ.10 వేలు పెట్టుబడి పెట్టాను. ఈ సీజన్లో మొక్కుబడి తంతుగా కేంద్రాలు తెరిచి.. సీజన్ ముగియకుండానే మూసేశారు. మద్దతు ధర దక్కక,.. బహిరంగ మార్కెట్లో కొనేవారు లేక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఏం చేయాలో పాలుపోక కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసుకోవాల్సి వస్తోంది. పెట్టుబడులు, ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. – బి.దస్తగిరి, మాలేపాడు, ఎర్రగుంట్ల మండలం, వైఎస్సార్ కడప జిల్లారెండేళ్లుగా ఇదే పరిస్థితిమద్దతు ధర దక్కక.. పంటను కొనుగోలు చేసేవారు లేక శనగ రైతులు రెండేళ్లుగా తీవ్రంగా నష్టపోతున్నారు. పంట పూర్తిగా మార్కెట్కు రాకుండానే కొనుగోలు కేంద్రాలను మూసేశారు. ఈ ఏడాది దిగుబడిలో కనీసం 15 శాతానికి మించి కొనుగోలు చేయలేదు. కోతకొచ్చిన పంటను ఏం చేయాలో పాలుపోక రైతులు గగ్గోలు పెడుతున్నారు. గతేడాది పంట అమ్ముడుకాక కోల్డ్ స్టోరేజీల్లో రైతులు నిల్వ చేసుకున్నారు. ఈ ఏడాది పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. తక్షణమే కొనుగోలు కేంద్రాలను పునఃప్రారంభించి రైతుల వద్ద ఉన్న పంట మొత్తాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. – వి.కృష్ణయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం -
కుప్పంలో దళిత కుటుంబంపై దాడి
సాక్షి టాస్క్ ఫోర్స్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో బడుగు, బలహీన, అణగారిన వర్గాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతుండడంతో దళితులనే టార్గెట్గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు డప్పు కొడుతున్న ఓ దళితున్ని కొట్టిన ఘటన మరువక ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మరో దళిత కుటుంబంపై టీడీపీ మూకలు దాడి చేసిన దారుణ ఘటన బయటపడింది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా.. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నంజంపేట గ్రామంలో కోదండరామస్వామి ఆలయ ఉత్సవాల్లో గత శుక్రవారం ఐదుగురు చిన్న పిల్లలు గొడవపడ్డారు. దీన్ని ఆసరాగా తీసుకున్న అధికార టీడీపీ వర్గీయులు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గ్రామానికి చెందిన దళితుడు మంజునాథ్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. భార్య అమృత, పిల్లలపై విచక్షణ లేకుండా దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. కులం పేరుతో దూషించి, ఊరు వదలి వెళ్లిపోవాలని హుకుం జారీచేశారు. గాయపడిన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంజునాథ్ భార్య అమృత టీడీపీ నేతల దాడిపై రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ టీడీపీ నాయకుల ఒత్తిళ్ల మేరకు పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తమ ఇంటిపై దాడి చేసి కొట్టి, కులం పేరుతో దూషించిన వారిపై కేసు నమోదు చేయకుండా తమపైనే కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు, దళిత సంఘాలు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
వెంకన్న స్వామిపై భక్తి కంటే BR నాయుడుపై చంద్రబాబుకు ప్రేమ ఎక్కువ
-
ఇంకెప్పుడు రాజీనామా! BR నాయుడుపై కట్టలు తెగిన ఆగ్రహం
-
ఆశ్రమ భూమి కబ్జాకు టీడీపీ నేతలు యత్నం!
అనకాపల్లి: జిల్లాలోని ఎస్ రాయవరం మండలం గెడ్డపాలెంలో టిడిపి నేతల దౌర్జన్యం చేశారు. ఆశ్రమానికి చెందిన 3.48 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు యత్నించారు. ఈ భూ వివాదం కోర్టులో ఉండగా భూమిలోకి దౌర్జన్యంగా వెళ్లారు టీడీపీ నేతలు ఎరకయ్య సతీష్, వారి అనుచరులు. ఈ భూ కబ్జాను స్థానిక మహిళలు అడ్డుకునే యత్నం చేశారు. అయితే మహిళలు అని చూడకుండా టీడీపీ నేతలు బూతులతో రెచ్చిపోయారు. దీనిపై ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోలేదు. అదే సమయంలో టీడీపీ నేతలకు వత్తాసు పలికారు పోలీసులు. -
BR నాయుడు అంటే ఎందుకు అంత భయం చంద్రబాబు
-
20 ఏళ్ల క్రితం ఛత్తీస్ గఢ్ రాజధాని అమరావతికీ ఇదే పరిస్థితి..
-
చిత్తూరు జిల్లాలో టీడీపీ బరితెగింపు కానిస్టేబుల్ యుగంధర్ పై దాడి
-
కార్వేటినగరంలో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు
సాక్షి, చిత్తూరు జిల్లా: కార్వేటినగరం మండలంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. ఏఆర్ కానిస్టేబుల్ యుగంధర్పై దాడి చేసి.. హత్య చేసేందుకు టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ ఆదాము, ప్రవీణ్, భాగ్య రాజ్ కుట్ర చేశారు. టీడీపీ నాయకుల అక్రమ గ్రావెల్ దందాను ప్రశ్నించినందుకు దాడికి పాల్పడ్డారు.కార్వేటినగరం మండలం అల్లాగుంట గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ యుగంధర్ తన భార్య చంద్రకళను కృష్ణ సముద్రంలో దించి వస్తుండగా మార్గ మధ్యలో అమ్మపల్లి క్రాస్ వద్ద కాపుకాసి టీడీపీ నేత, అన్నూరు మాజీ సర్పంచ్ ఆదాము(సుందర్ రాజ్), మెట్ట హరిజనవాడకు చెందిన ప్రవీణ్ కుమార్, భాగ్య రాజ్ దాడి చేశారు.ద్విచక్ర వాహనంపై వస్తుండగా అడ్డుకున్న టీడీపీ నేతలు.. కానిస్టేబుల్పై పిడుగు గుద్దులతో తీవ్రంగా గాయపరిచారు. దీంతో కానిస్టేబుల్ యుగంధర్.. కోమాలోకి వెళ్లారు. ఆయన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. యుగంధర్ భార్య చంద్రకళ.. కార్వేటి నగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఉద్రిక్తత.. అబ్బయ్య చౌదరిని అడ్డుకున్న టీడీపీ నేతలు
సాక్షి, ఏలూరు జిల్లా: కలపర్రు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీటీడీ ఛైర్మన్ను పదవి నుంచి బీఆర్ నాయుడిని తొలగించాలని డిమాండ్ చేస్తూ.. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నిరసన చేపట్టింది. వేణుగోపాలస్వామి ఆలయం వద్ద అబ్బయ్య చౌదరిని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. కలపర్రు గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. -
నారా లోకేష్ కు టీడీపీ క్యాడర్ బిగ్ షాక్
-
ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, తాడేపల్లి: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలు చేపట్టింది. వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్సార్సీపీ నేతలు.. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ నిరసనలు చేపట్టారు. బీఆర్ నాయుడు రాసలీలలు వెలుగులోకి వచ్చినా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోకపోవటంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికీ బీఆర్ నాయుడిని వెనకేసుకువస్తున్న చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ప్రపంచవ్యాప్త హిందూ భక్తులు, నెటిజన్ల విమర్శలను కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ మండిపడుతోంది.వైఎస్సార్ జిల్లా: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై పులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో 101 టెంకాయలు కొట్టి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నాడని ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు.బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి టీటీడీ పవిత్రతను కాపాడాలని వైఎస్సార్సీపీ నాయకుల డిమాండ్ చేశారు. ఈ నిరసన మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, పట్టణ అధ్యక్షుడు హల్ గంగాధర్ రెడ్డి, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నాయి.అనంతపురం జిల్లా: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలని కోరుతూ అనంతపురంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు ఆందోళన నిర్వహించారు. అనంతపురం నగరంలోని శ్రీకంఠం సర్కిల్లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్లకార్డులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ మండిపడ్డారు.విశాఖపట్నం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని వెంటేశ్వరస్వామి వారి ఆలయంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు పూజలు నిర్వహించాయి. వైఎస్సార్సీపీ సమన్వయకర్త మొల్లి అప్పారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు రమణకుమారి, మాజీ మేయర్ హరి వెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు.విజయవాడ: సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. బీఆర్ నాయుడిని టీటీడీ ఛైర్మన్ పదవి నుండి తొలగించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. పూజల్లో మాజీ ఎమ్మెల్యే, మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ నాయుడిని టీడీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. టీటీడీ పవిత్రతను కాపాడాలంటూ నినాదాలు చేశారు.చంద్రబాబు సమాధానం చెప్పాలి: మల్లాది విష్ణుబీఆర్ నాయుడు ఛైర్మన్ అయిన రోజు నుంచి తిరుమలపై అపచారాలు జరుగుతున్నాయి. టీడీడీ ఛైర్మన్ పదవికి బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి. ఏమొహం పెట్టుకుని చంద్రబాబు బీఆర్ నాయుడిని తన పక్కన కూర్చోబెట్టుకుని తిరుపతిలో పూజలు చేస్తారు. కళంకితమైన వ్యక్తితో కలిసి ఎలా ఒంటిమిట్ట రాముల వారి కళ్యాణంలో పాల్గొంటారు. అసలు చంద్రబాబుకు నైతికత ఉందా?. బీఆర్ నాయుడిని టీటీడీ ఛైర్మన్గా తీసుకోవద్దని ఓ మహిళ లేఖ రాసింది. కానీ అవేమీ చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదు. హిందూ ధర్మానికి, హిందూ సమాజానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి.పటమట వెంకటేశ్వరస్వామి ఆలయంలో..టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పటమట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కల్పలత, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పూజలు చేశారు.తిరుపతి: టీటీడీ చైర్మన్ వైఖరి పట్ల హిందూ సమాజం సిగ్గు పడుతోందని తిరుపతి వైఎస్సార్సీపీ ఇంఛార్జి భూమన అభినయ్రెడ్డి అన్నారు. శ్రీవారి ప్రథమ సేవకుడిగా ఉంటూ.. ఆయన చరిత్ర ఇంత పరమ నికృష్ట మైందా అని ముక్కున వేలేసుకుంటున్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే పదవికి రాజీనామా చేయాలి. లైంగిక ఆరోపణలు వచ్చిన తర్వాత తిరుమల సీఎం చంద్రబాబు మనవడు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం, శ్రీరామ నవమి వేడుకల్లో సీఎం తో పాటు టీటీడీ చైర్మన్ పాల్గొనడం సిగ్గుచేటు.చిత్తూరు జిల్లా: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే పదవికి రాజీనామా చేయాలని జీడి నెల్లూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంచార్జ్ కృపాలక్ష్మీ డిమాండ్ చేశారు. కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ‘ బీఆర్ నాయుడు రాసలీలలు బయట పడిన తర్వాత కూడా టీటీడీ చైర్మన్ గా కొనసాగించడం సిగ్గు చేటు. సీఎం చంద్రబాబు వెంటనే బీఆర్ నాయుడిని తొలగించాలి. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు.. హోంశాఖామంత్రి అనిత మహిళలకు అండగా ఉన్నామని అంటున్నారే కానీ నడిరోడ్డుపై మహిళను పదవిలో ఉన్న ఎమ్మెల్యే కొడుతుంటే ఎలాంటి స్పందన లేదు. హోం శాఖ మంత్రి విమర్శలకే పరిమితమైంది. పల్నాడు జిల్లా, మాచర్లలో ఇంట్లో వున్న మహిళను కాళ్లు చేతులు కట్టేసి బలవంతంగా అఘాత్యానికి పాల్పడిన ఘటనపై బాధ్యత మహిళలకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దిశ యాప్ ద్వారా మహిళలకు అండగా నిలిచాము’ అని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా: బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శాసనమండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, శాసనమండలి సభ్యురాలు వరుదు కళ్యాణితో కలిసి వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత.స్త్రీలోలుడు బి.ఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలిబీఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయకుండా కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారుచంద్రబాబు కు భక్తుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, బీఆర్ నాయుడిని తొలగించాలి- కాకాణి పూజిత నెల్లూరు జిల్లా, బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం కేంద్రంలోని శ్రీలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్థన్రెడ్డి.ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ శ్రేణులు, భక్తులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కాకాణికి వేదమంత్రాల నడుమ, మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికిన, ఆలయ అర్చకులు, స్థానికులుకాకాణి కామెంట్స్నైతిక విలువలు లేని బీఆర్ నాయుడికి పవిత్ర పదవి ఇవ్వడం సరికాదుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవినీతి, అనైతిక కార్యక్రమాలు పెచ్చరిల్లిపోయాయిచంద్రబాబు మహిళల పై ఎవరైనా చెయ్యి వేస్తే, అదే ఆఖరి రోజు అవుతుందని చెబుతూనే ఉన్నాడు-మా ప్రభుత్వం వస్తే మహిళల వైపు చూడడానికే భయపడతారని పవన్ కళ్యాణ్ ప్రగల్బాలు పలికాడుఇప్పుడు ఇన్నీ అరాచకాలు జరుగుతున్నా నోరు మెదపరేమి వైఎస్ జగన్ పాలనలోనే మహిళలు రక్షణ పొందారు పార్వతీపురం, మన్యం జిల్లా: టీటీడీ చైర్మన్ పదవిని బీఆర్ నాయుడు అపవిత్రం చేశారంటూ మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి ధ్వజం. బీఆర్ నాయుడు వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి దిగిపోవాల్సిందేనంటూ డిమాండ్గుంటూరు: బీఆర్ నాయుడు పదవి నుంచి దిగిపోవాల్సిందే: అంబటి రాంబాబువెంకటేశ్వరస్వామి ఆలయంలో అంబటి ప్రత్యేక పూజలు -
జగన్ MAVIGUNపై TDP ట్రోల్స్.. ఇచ్చిపడేసిన KS ప్రసాద్
-
మెడికల్ కాలేజీపై ‘ముఖ్య’ నేత కన్ను!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘ముఖ్య’నేత కుటుంబ దోపిడీ పరంపర యథేచ్ఛగా కొనసాగుతోంది! అమరావతిని కామధేనువులా మార్చుకుని కేవలం రోడ్లు, మౌలిక సదుపాయాల కోసమే రూ.2 లక్షల కోట్లు ధారపోసి మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో తిరిగి వసూలు చేసుకుంటున్నా ఆశ తీరడం లేదు..! ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక, సిలికా, క్వార్ట్జ్, లేటరైట్ లాంటి ప్రకృతి వనరులను కొల్లగొడుతూ మైనింగ్ దోపిడీకి తెర తీశారు. మొన్న.. విశాఖ నడిబొడ్డున ముఖ్య నేత బంధువులకు రూ.5 వేల కోట్ల విలువైన భూముల పందేరం..! నిన్న.. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ముసుగులో కుటుంబ సంస్థకు రాయితీల రూపంలో దాదాపు రూ.వంద కోట్లు సంతర్పణ..! నేడు.. రాజధాని ప్రాంతంలో రూ.వేల కోట్ల విలువైన మెడికల్ కాలేజీపై కన్ను..! అధికారం అండతో కుటుంబం కోసం ముఖ్యనేత సాగిస్తున్న దోపిడీ పర్వం ఇలా ఉంది..!రంగంలోకి ఆ ముగ్గురు..పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉదాత్త ఆశయంతో మూడు దశాబ్దాల క్రితం మంగళగిరిలో ఏర్పాటైన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీపై ముఖ్య నేత కన్ను పడింది. రాజధాని ప్రాంతంలో ఉన్న అత్యంత విలువైన ఆ కాలేజీని ఎలాగైనా సరే సొంతం చేసుకునేందుకు తెర వెనుక విస్తుగొలిపే రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన బినామీలను రంగంలోకి దించి అధికార బలంతో వ్యవహారాలను చక్కబెట్టేందుకు చక్రం తిప్పుతున్నారు. మెడికల్ కాలేజీని ముఖ్య నేత పరం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. రాజధాని ప్రాంతంలోని మంగళగిరిలో జాతీయ రహదారికి ఆనుకుని 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ కాలేజీకి చుట్టుపక్కల కూడా మరికొన్ని విలువైన భూములున్నాయి. అవన్నీ కలిపితే దాని ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లకుపైగా ఉంటుందని అంచనా. అధికారాన్ని అడ్డుపెట్టుకుని విలువైన కాలేజీ ఆస్తులను చేజిక్కించుకునేందుకు ముఖ్య నేత స్కెచ్ వేశారు. ఎన్ఆర్ఐ కాలేజీ యాజమాన్యంలోని రెండు గ్రూపుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించే నెపంతో రంగంలోకి దిగిన ముఖ్య నేత బినామీలు ఏకంగా కాలేజీనే బిగ్బాస్ పరం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గుడిని, గుడిలో ‘లింగా’న్ని కూడా మింగేసే ఓ పారిశ్రామికవేత్తతోపాటు ఎన్ఆర్ఐ కాలేజీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ ఒకరు దీని వెనుక ఉన్నట్లు తెలిసింది. రాజధాని వ్యవహారాల్లో అన్నీ తానై వ్యవహరించే మంత్రి కూడా వారికి తోడైనట్లు సమాచారం. ఇటీవల ముఖ్య నేతతో సంబంధాలు సన్నగిల్లడంతో ఈ డీల్ కుదర్చడం ద్వారా ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ఈ మంత్రి తాపత్రయపడుతున్నారు. ముఖ్య నేతకు రాజధానిలో అత్యంత విలువైన ఆస్తిని సమకూర్చిపెట్టడం ద్వారా తాము మరింత లబ్ధి పొందేందుకు ఈ ముగ్గురూ ఈ డీల్ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం యాజమాన్యంపై సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు.త్వరలో ముఖ్య నేత ట్రస్టు చేతుల్లోకి.. త్వరలో దీనిపై ఒప్పందం చేసుకుని కోర్టు వ్యవహారాలను క్లియర్ చేసేందుకు మంతనాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను అధికారికంగా ముఖ్య నేత పార్టీ ట్రస్టు పేరు మీదకు బదలాయించాలని యత్నిస్తున్నారు. లాంఛనాలు పూర్తయి సంస్థ మొత్తం పూర్తిగా తమ చేతుల్లోకి వచ్చాక హైదరాబాద్లోని ట్రస్టు ద్వారా నడిపిస్తున్న కార్పొరేట్ ఆస్పత్రి తరహాలో ఎన్ఆర్ఐ కాలేజీ, ఆస్పత్రిని నిర్వహించేందుకు ముఖ్య నేత పథకం సిద్ధం చేసినట్లు సమాచారం.న్యాయ వివాదాలు..2003లో కృష్ణా, గుంటూరుకు చెందిన పలువురు ఎన్ఆర్ఐ వైద్యులు తమ ప్రాంతంలో పేదలకు మంచి వైద్యం, వైద్య విద్య అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మంగళగిరి ప్రాంతంలో 50 ఎకరాలు కొనుగోలు చేసి ఎన్ఆర్ఐ మెడికల్ సైన్సెస్ను స్థాపించారు. మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసి ఛైర్మన్ ముక్కామల అప్పారావుకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అయితే అప్పారావుకు వ్యతిరేకంగా ఉన్న నిమ్మగడ్డ ఉపేంద్ర వర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న టీడీపీ నేత ఒకరు మద్దతు పలికి కాలేజీ వ్యవహారాలను తన చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో 2021లో ముక్కామల అప్పారావు కాలేజీని మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి విక్రయించారు. దీనిపై రెండు గ్రూపులు పరస్పరం కేసులు పెట్టి కోర్టు మెట్లు ఎక్కాయి. దీంతో మేనేజ్మెంట్ కమిటీ స్థానంలో ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారికి కోర్టు తాత్కాలికంగా కాలేజీ నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఆర్బిట్రేషన్కు పంపగా నిజమైన సభ్యులు ఎవరో ఏప్రిల్ 30వ తేదీలోగా తేల్చాలని ఆర్బిట్రేషన్ జడ్జి తీర్పు ఇచ్చారు.5న జనరల్బాడీ సమావేశం.. రూ.250 కోట్ల కార్పస్ ఫండ్పై ముఖ్యనేత కన్నుఈ నెల 5వ తేదీన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మేనేజ్మెంట్ జనరల్బాడీ సమావేశం జరగనుంది. అందులో 30 మంది ఉండగా సగం మంది ముఖ్య నేత బినామీలకు అనుకూలంగా మారిపోయినట్లు తెలిసింది. మిగిలిన 15 మంది వ్యతిరేకంగా ఉండడంతో వారిపై తీవ్ర స్థాయిలో అధికార బలం ప్రయోగిస్తున్నట్లు తెలిసింది. ఎలాగైనా వారిని లొంగదీసుకునేందుకు భారీ లాబీయింగ్, ప్రలోభాలు, బెదిరింపుల పర్వం సాగుతోంది. రాజధాని వ్యవహారాలు పర్యవేక్షించే ఒక మంత్రి శుక్రవారం ముక్కామల అప్పారావు ఇంటికెళ్లి ఆయనతో మంతనాలు జరిపారు. ఎలాగైనా సరే వ్యతిరేకంగా ఉన్న వారిని బుజ్జగించి ముఖ్య నేతకు కాలేజీని బహుమానంగా ఇవ్వాలని బినామీ పారిశ్రామికవేత్త తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 5వ తేదీన జరిగే జనరల్ బాడీ సమావేశంలో డైరెక్టర్లను ఎన్నుకునేందుకు సభ్యులుగా ఉన్న 30 మందికి నోటీసులు ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఈనెల 30వ తేదీలోపు డైరెక్టర్లను ఎన్నుకోనున్నారు. నెలాఖరులోపు బోర్డు ఏర్పాటు కానుండడంతో డైరెక్టర్లుగా తమకు అనుకూలమైన వారు ఉండేలా చూడడం, ఆ తర్వాత వెంటనే కాలేజీని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాలేజీ స్థలం విలువైనది కావడంతోపాటు దాని పేరు మీద రూ.250 కోట్ల వరకూ కార్పస్ ఉండడంతో వెంటనే ఆ సొమ్మును నొక్కేయవచ్చని ముఖ్య నేత భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని అత్యంత విలువైన వేలాది ఎకరాల భూములను ముఖ్య నేత తన బినామీల ద్వారా గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఎన్ఆర్ఐ మెడికల్ సైన్సెస్పై కన్నేసినట్లు స్పష్టమవుతోంది. -
దళితుడిపై చేయి చేసుకున్న అయ్యన్నపాత్రుడు
-
ఉద్యోగుల జీతాల్లో కమీషన్లు దండుకుంటున్న టీడీపీ నేతలు
సాక్షి, నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లాలో టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. ప్రైవేట్ కంపెనీ ఉద్యోగుల జీతాల్లో టీడీపీ నేతలు కమీషన్లు దండుకుంటున్నారు. ఇదేమని ప్రశ్నించిన ఉద్యోగులపై టీడీపీ నేత రాజగోపాల్ దాడికి పాల్పడ్డారు. కొలిమిగుండ్లలోని ఇండో ఫ్యూచర్ ఎనర్జీస్ కంపెనీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుల జీతాలు ఏజెన్సీ నిర్వాహకులు తగ్గించి ఇస్తున్నారు. కంపెనీ చెల్లిస్తున్న పూర్తి జీతాన్ని ఉద్యోగులకు ఇవ్వకుండా టీడీపీ నాయకులు కమీషన్లు తీసుకుంటున్నారు.సెక్యూరిటీ సూపర్వైజర్గా విధులు నిర్వహించిన శ్రీనివాస్ యాదవ్ను గతంలో ప్రశ్నించినందుకు టీడీపీ నాయకుడు రాజగోపాల్.. ఆయన్ని ఉద్యోగం నుంచి తీయించివేయించాడు. నిరసన తెలుపుతున్న సెక్యూరిటీ సిబ్బందికి మద్దతు తెలిపిన శ్రీనివాస్ యాదవ్, సెక్యూరిటీ గార్డులపై టీడీపీ నేత రాజగోపాల్ దాడి చేశారు.26,330 ఏజెన్సీ వారు సెక్యూరిటీ గార్డులకు జీతాలు చెల్లిస్తుంటే.. టీడీపీ నాయకులు మాత్రం 13,270 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు అంటూ ఉద్యోగులు వాపోతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం వారిని ఉద్యోగంలో నుంచి తొలగిస్తామంటూ టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు. -
‘అమరావతి రాజధాని బేతాళ కథలతో సమానం’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాజధాని పేరుతో లక్షల కోట్లు దోచుకొంటున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. దేవతల రాజధాని నిర్మిస్తున్నానంటూ 2014లో మొదలు పెట్టారు. చంద్రబాబు భూ దోపీడీకి పాల్పడుతున్నారు. 50 వేల ఎకరాలు భూమి కావాలని బంగారు పండించే భూములను రైతుల వద్దనుండి దుర్మార్గంగా లాక్కున్నారని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘లక్ష ఎకరాలు భూమిలో దేవతల రాజధానిని నిర్మిస్తానని రైతుల వద్దనుండి లాక్కునేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. రెండు లక్షల కోట్లతో లక్ష ఎకరాల భూమిలో రాజధాని నిర్మిస్తానని అంటున్నారు. 7 సంవత్సరాలలో రెండు లక్షల కోట్ల ఖర్చు పెట్టాల్సిన బాబు.. ఇప్పటికి 80 కోట్లు ఖర్చు చేశారు. రాజధాని పూర్తి కావాలంటే 200 సంవత్సరాలు అయినా పడుతుంది. రాజధాని నిర్మాణం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని చెప్పిన చంద్రబాబు.. 47 వేల కోట్లు రాజధానికి అప్పు చేశారు.. ఇప్పటికి 13 వేల కోట్లు అప్పుచేశారు.భవన నిర్మాణం చదరపు అడుగు 4 వేలు ఉంటే 14 వేలు ఖర్చు చేస్తూన్నారు.. 22 నెలల్లో 3 లక్షల 41 వేల కోట్లు ఇప్పటివరకు ప్రజల పేరుతో అప్పు చేశారు. అమరావతి రాజధాని బేతాళ కథలతో సమానం. చంద్రబాబు ఉన్నన్నిరోజులు రాజధాని నిర్మాణం పూర్తి చేయలేరు’’ అని రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. -
పేర్ని నాని కుటుంబంపై కూటమి సర్కార్ కక్ష సాధింపు
సాక్షి, కృష్ణా జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కొబ్బరితోటలో అక్రమంగా కూల్చేసిన ఇంటిని పరిశీలించేందుకు మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు వెళ్లారు.అయితే, పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బందోబస్తు విధుల్లో ఉన్న సీఐను దూషించారంటూ పేర్ని కిట్టుపై కేసు నమోదు చేశారు. కిట్టుతో పాటు పేర్ని నానిపై కూడా కేసు నమోదు చేశారు. ఇనకుదురు సీఐ పరమేశ్వర్ ఫిర్యాదు మేరకు పేర్ని కిట్టుపై చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా, నగరంలోని 6వ వార్డు కొబ్బరి తోటలో నిర్మాణంలో ఉన్న శ్రీపతి వెంకటాచలం ఇంటిని అకారణంగా కూల్చివేసిన నేపథ్యంలో గురువారం ఆయన ఆ ఇంటిని పేర్ని నాని, పేర్ని కిట్టు పరిశీలించి, బాధితుడిని పరామర్శించారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా చనిపోయేలోపు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలనే ఆశతో ఎంతో శ్రమకోర్చి రూపాయి, రూపాయి కూడబెట్టుకొని ఇల్లు నిర్మించుకుంటారన్నారు. అటువంటి ఇంటిని ఎటువంటి నోటీసులు లేకుండా అర్ధాంతరంగా కూల్చివేయటం దారుణమన్నారు. -
ఆరోగ్యశ్రీ క్షో‘బిల్లు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు రెండో రోజూ స్తంభించాయి. చంద్రబాబు సర్కారు రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆస్పత్రులు సేవలు నిలిపేసి నిరసన తెలిపాయి. ఉచిత వైద్య సేవలు అందించడం లేదని రోగులను ఆస్పత్రుల నుంచి వెనక్కు పంపేశాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నామని, ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తే గానీ ఉచిత సేవలు పునరుద్ధరించలేమని ఆస్పత్రుల ముందు యజమానులు పోస్టర్లు ప్రదర్శించారు. ఆస్పత్రుల మూకుమ్మడి సమ్మె నేపథ్యంలో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల రోగ పీడితులు తీవ్ర అవస్థలు పడ్డారు. మొక్కుబడి చర్చలతో సరినెట్వర్క్ ఆస్పత్రులు బుధవారం నుంచి సమ్మెకు పిలవడంతో తొలి రోజు హడావుడిగా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్(ఆశ) ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు కేవలం మొక్కుబడిగా నిర్వహించినవేనని రుజువైంది. సమ్మెను వెంటనే విరమింపజేసి, ప్రజలు అవస్థలు పడకుండా సేవలు పునరుద్ధరించేలా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు. ‘రూ. మూడు వేల కోట్ల బకాయిల్లో రూ.వెయ్యి కోట్లు రెండు వారాల్లో విడుదల చేస్తాం. ఈ అరకొర నిధుల విడుదలపైనా వచ్చే సోమవారం స్పష్టత ఇస్తాం.’ అంటూ ప్రభుత్వం బీద అరుపులు పలికింది. అయితే ఇప్పటికే ప్రభుత్వం చేతిలో పలు సందర్భాల్లో మోసపోయిన నెట్వర్క్ ఆస్పత్రుల యజమానులు నిధుల విడుదలపై స్పష్టత వచ్చాకే సమ్మె విరమిస్తామని తెగేసి చెప్పారు. యథావిధిగా రెండో రోజు సమ్మె కొనసాగించారు. ఈ క్రమంలో ఆస్పత్రుల మొర ఆలకించి పెండింగ్ నిధులు విడుదల చేసి, సేవలు పునరుద్ధరించేలా కనీసం చంద్రబాబు సర్కార్ చొరవ చూపలేదు. మురిగిపోయిన దాదాపు రూ.వెయ్యి కోట్ల నిధులు2025–26 ఆర్థిక సంవత్సరం మంగళవారంతో ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చెల్లింపుల కోసం దాదాపు రూ. వెయ్యి కోట్ల బిల్లులను గతంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆర్థిక శాఖకు పంపింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి వారం ముందు ప్రభుత్వానికి ఆశ సమ్మె నోటీసు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో సీఎఫ్ఎంఎస్లో పెండింగ్లో ఉన్న రూ.వెయ్యి కోట్ల బిల్లులను చెల్లించి ఉంటే ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్లే పరిస్థితులు ఉండేవి కావు. సమ్మె నోటీసు ఇచ్చి సేవలు ఆపేస్తామని హెచ్చరించినా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. ఆర్థిక సంవత్సరం ముగియడంతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.వెయ్యి కోట్ల నిధులు ముగిపోయినట్టేనని వెల్లడవుతోంది. -
మచిలీపట్నంలో హైటెన్షన్.. జనసేన నేత ఇంటిని కూల్చేసిన టీడీపీ నేతలు
-
నువ్వు పేదల గుండెల్లో దింపిన గునపం నొప్పి ఎలా ఉంటుందో చూపిస్తా
-
అరవ శ్రీధర్ బాధితురాలు లేటెస్ట్ విజువల్స్
-
లైట్.. కెమెరా.. యాక్షన్.. ఆస్కార్ లెవెల్ లో కూటమి యాక్టింగ్
-
బిగ్ బాస్ నైనికాకు టీడీపీ ఎమ్మెల్యే బావమర్ది అసభ్యకర మెసేజ్ లు
-
అయ్యన్నపాత్రుడి సృష్టి క్షేత్రంపై స్టే
సాక్షి, అమరావతి/నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని పెద చెరువును ఆక్రమించి ‘సృష్టి క్షేత్రం’ పేరుతో చేస్తున్న నిర్మాణాలపై హైకోర్టు స్టే విధించింది. పెద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని ఆదేశించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నిర్దేశించింది. అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడి ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణాలను సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర గణేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెద చెరువు కట్ట బలోపేతం, సుందరీకరణ పనులు నిర్వహించవచ్చని హైకోర్టు తెలిపింది. అయితే సుందరీకరణ పనులు చేపట్టే ముందు అందుకు సంబంధించిన కార్యాచరణను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్లతో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉన్న అయ్యన్న పాత్రుడికి సైతం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. చెరువు ఆక్రమణ దారుణం: పొన్నవోలు వాదనలుస్పీకర్గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అయ్యన్నపాత్రుడు రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న పెద చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం దారుణమని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఉమా శంకర గణేష్ హైకోర్టులో ఇటీవల పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘పెద చెరువు కింద 345.25 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. అయితే అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడి నేతృత్వంలోని ఈ చెరువు మధ్యలో నిర్మాణాలు చేపడుతున్నారు. చెరువును కొంత మేర పూడ్చి ఇక్కడ భారీ శివపార్వతుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. శివ పార్వతుల విగ్రహాల ఏర్పాటునకు పిటిషనర్ వ్యతిరేకం కాదు. చెరువు సమీపంలో ఉన్న చారిత్రక దేవస్థానంలో విగ్రహాలను ఏర్పాటు చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. పంటలకు ప్రాణాధారంగా ఉన్న చెరువును పూడ్చేసి విగ్రహాలను ఏర్పాటు చేయడంపైనే అభ్యంతరం. గతంలో ఇదే చెరువు సమీపంలో ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేస్తుంటే అధికారులకు లేఖ రాసి మరీ అడ్డుకున్న అయ్యన్నపాత్రుడు, ఇప్పుడు తానే తన కుమారుడితో కలిసి చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేస్తుండటం దారుణం. ఈ నేపథ్యంలో అయ్యన్న నేతృత్వంలో జరుగుతున్న చెరువు ఆక్రమణను అడ్డుకోవాలి’ అని అభ్యర్థించారు. నీటి వనరులను పరిరక్షించాలని సుప్రీంకోర్టుతో సహా పలు హైకోర్టులు చాలా తీర్పులు వెలువరించాయని తెలియజేశారు. ప్రభుత్వ వాదనలు తప్పని ఆధారాలతో నిరూపణఅనంతరం ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి స్పందిస్తూ, చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడం లేదన్నారు. కేవలం చెరువు కట్టల బలోపేతం, పూడికతీత, సుందరీకరణ పనులను మాత్రమే చేపడుతున్నామన్నారు. ఎలాంటి స్టే ఇవ్వొద్దని కోరారు. ఈ సమయంలో సుధాకర్రెడ్డి స్పందిస్తూ, చెరువు మధ్యలో నిర్మిస్తున్న నిర్మాణాలకు సంబంధించి అయ్యన్నపాత్రుడు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్న భూమి పూజ ఫొటోలను ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం, పెద చెరువులో చేస్తున్న నిర్మాణాలపై స్టే విధించింది. రైతుల హర్షం: ఉమా శంకర గణేష్ స్పీకర్ తలపెట్టిన అక్రమ నిర్మాణాలపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో మమ్మల్ని çకలిశారు. దీంతో వారికి అండగా నిలిచాం. హైకోర్టు తాజా ఆదేశాలతో రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. -
టీడీపీ ఎమ్మెల్యే వేధింపులు.. టీడీపీ మహిళా నేత ఆవేదన
ఉదయగిరి: రాజకీయంగా తనకు అవకాశాలు కల్పిస్తానని ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వంచించాడని, ఈ వ్యవహారంపై గతంలో రచ్చ జరగడంతో తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా దుత్తలూరు మండలం వడ్డీపాళెంకు చెందిన టీడీపీ మహిళ నేత చల్లా వెంగమాంబ ఆరోపించారు. బుధవారం సీఎం చంద్రబాబు వింజమూరు పర్యటన నేపథ్యంలో టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలోకి తనను వెళ్లకుండా పోలీసులతో ఎమ్మెల్యే కిడ్నాప్ చేయించారని తీవ్ర ఆరోపణలు చేశారు.దుత్తలూరు మండలం నర్రవాడ వెంగమాంబ ఆలయ ప్రాంగణంలో బుధవారం రాత్రి ఆమె మీడియాతో మాట్లాడారు. వింజమూరుకు సీఎం వస్తున్నారని తెలిసి, సమాజానికి సేవ చేయాలనే తపనతో తన ఆలోచనలను పంచుకోవాలని బెంగళూరులో ఉన్న తాను వచ్చానన్నారు. అయితే.. పోలీసులు కారు చెక్ చేయాలని తనను కిందకు దించి బలవంతంగా మరో కారులో తన కారు డ్రైవర్ను, తన సోదరుడిని మరో కారులో బలవంతంగా ఎక్కించారని చెప్పారు. ఆ తర్వాత తమ సెల్ఫోన్లు తీసుకుని సీఎం సభ అయి ఆయన వెళ్లేంత వరకు తమను నిర్బంధించి సాయంత్రం వదిలి పెట్టారని ఆరోపించారు.ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో సయోధ్య చేసుకోవాలని ఓ మహిళ ఎస్సై తనతో చెప్పడాన్ని చూస్తే.. ఇదంతా ఎమ్మెల్యే కుట్ర అనే విషయం స్పష్టమవుతోందన్నారు. ఎమ్మెల్యే తనతో వ్యçవహరించిన వైఖరిని చంద్రబాబుకు చెబుతాననే భయంతోనే తనను కిడ్నాప్ చేయించాడని మండిపడ్డారు. తమను ఇక్కడ కాకుండా విజయవాడలో వదిలిపెట్టే ప్రయత్నం జరిగిందన్నారు. ఎమ్మెల్యే తనను ఇంకా వదలకుండా ఇబ్బందులు పెడుతున్నాడని వాపోయారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృíష్టికి తీసుకెళతానని చెప్పారు. -
ఈడుపుగల్లులో అధికారుల చర్యలపై వివాదం
సాక్షి, కృష్ణాజిల్లా: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో జాతీయ రహదారి విస్తరణ పనుల పేరుతో అధికారులు చేపట్టిన చర్యలు వివాదాస్పదంగా మారాయి. ఘటన వివరాలు.. NHAI అధికారులు, పంచాయతీ సిబ్బంది కలిసి వైసీపీ సానుభూతిపరుల షాపుల ముందు JCB తో గండ్లు పెట్టారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా ధ్వంసం చేయడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. రహదారి పక్కన ఉన్న ఇతర షాపులను మాత్రం తొలగించకపోవడం వివక్షత ఆరోపణలకు దారితీసింది. దాంతో పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ దేవభక్తుని చక్రవర్తి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా పడేస్తారు? అని ప్రశ్నించారు. మచిలీపట్నం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఇలాగే పడేస్తారా? అంటూ నిలదీశారు. రహదారి అటువైపు ఉన్న షాపులు ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలకు చెందిన షాపులపై అధికారులు జంకుతున్నారా అని కూడా ప్రశ్నించారు. వైసీపీ నేత చక్రవర్తి అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. -
‘ప్రతిదీ మీకు చెప్పి చేయాలంటే కుదరదు’
సాక్షి, కష్ణా: జిల్లా డీఆర్సీ మీటింగ్లో కలెక్టర్ వర్సెస్ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మధ్య మాటల యుద్ధం చర్చాంశనీయంగా మారింది. మాకు చెప్పకుండా మా నియోజకవర్గాల్లో ఎలా పర్యటిస్తామంటూ కలెక్టర్పై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫైరయ్యారు. ఆకస్మిక తనిఖీలు మీకు చెప్పి రాలేమంటూ కలెక్టర్ బాలాజీ సమాధానం ఇచ్చారు. ప్రతిదీ మీకు చెప్పి రావడం కుదరదని తేల్చి చెప్పారు. ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో డైలాగ్ వార్ జరగడంతో.. ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ డీఆర్ఎస్ మీటింగ్లో పాల్గొన్న అధికారులు గుసగుసలాడుకున్నారు. -
జగన్ కట్టిన ఇళ్లపై బాబు వీడియో చూపించి మరి ఇచ్చిపడేసిన నాగమల్లేశ్వరి
-
నాపై కుట్ర జరుగుతోంది భయం గుప్పిట్లో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి
-
అమరావతి కుంభకోణం పై POINT to POINT సంచలన నిజాలతో జగన్
-
అమరావతికి YSRCP వ్యతిరేకం కాదు
-
అందుకే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేశాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అమరావతికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు.. సాధ్యమవుతుందా.. కాదా అనేది ప్రతీ ఒక్కరూ ఆలోచించాలన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం పెట్టాలనుకున్నాం. ఇందులో స్వార్థం లేదు, ఆచరణాత్మక ధోరణే ఉందన్నారు. ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పులు భారం మోపకుండా ఆలోచన చేశామని వైఎస్ జగన్ తెలిపారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘అమరావతి పేరుతో దోపిడీ చేయడమే చంద్రబాబు ప్లాన్. దోపిడీ నుంచి డైవర్షన్ కోసమే అసెంబ్లీలో తీర్మానం చేశారు. అంతఖర్చును తట్టుకోగలమా?. ప్రజలను పెడదోవ పట్టించడం ఎందుకు?. ఇలా చేస్తే రాష్ట్రానికి రాజధాని ఎప్పుడు అవుతుంది?. రాజధానే లేని పరిస్థితి ఉంటుంది: రూ.2 లక్షల కోట్ల ఖర్చును తట్టుకునే స్తోమత రాష్ట్రానికి ఉందా?. అందుకే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను రోడ్డున పడేయకూడదని మేము అనుకున్నాం.అందుకే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. రాష్ట్రంపై భారం పడకూడదని అభివృద్ధి, సంక్షేమం కుంటుపడకూడదని మనం కూడా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం పెట్టాలనుకున్నాం. ఇందులో స్వార్థం లేదు, ఆచరణాత్మక ధోరణే ఉంది. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా పెట్టాలనుకున్నాం. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలని నిర్ణయించాం. కానీ, ఆ ప్రణాళిక ముందుకు సాగలేదు. మా ఆలోచనల్లో ఎక్కడా కూడా మేం అమరావతిని నిర్లక్ష్యం చేయలేదు. రైతులకు మరో ఐదేళ్ల పాటు కౌలును పెంచాం, రాజధానిలో పెన్షన్లను రూ.5వేలకు పెంచాం.ఆచరణాత్మక ఆలోచన. ప్రాక్టికల్గా సాధ్యమయ్యే ఆలోచనలు మేం చేశాం. మరోవైపు ప్రభుత్వం తన బాధ్యతగా ప్రజలకు చేయాల్సిన ప్రతి మేలుకూ అడ్డంకులు లేని ఆలోచన చేశాం. ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పులు భారం మోపకుండా ఆలోచన చేశాం. కేవలం రూ.10వేల కోట్లు పెడితే చాలని విశాఖనగరం ఈరోజు ఉన్న ఈ స్థాయి నుంచి గొప్పస్థాయికి ఎదుగుతుందని చెప్పాం. రాష్ట్రానికి ఆదాయాన్ని, మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలను, ఇచ్చే వనరుగా మారుతుందని మేం చెప్పాం. దీని మీద చంద్రబాబు, ఎల్లో ముఠా చేసిన ప్రచారం, చెప్పిన అబద్ధాలు అన్నీ ఇన్నీ కావు. నాకు సంకుచితమైన ఆలోచన ఉండి ఉంటే, రాయలసీమలో రాజధాని ఆలోచన చేసేవాడిని. కానీ, నేను అలా చేయలేదు. రాష్ట్రానికి మంచి చేయాలన్న ఆలోచన చేశాను. ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని నేను అనుకున్నాను. అందుకే ఇలా చేశాను’ అని చెప్పుకొచ్చారు.MAVIGUN ప్లాన్ ఇదే.. పోనీ మేం ప్రాక్టికల్గా చేసిన ఆలోచన చంద్రబాబుకు నచ్చలేదు సరే. ప్లాన్-బీ కింద అయినా మేం చెప్పిన ప్లాన్ గురించి చంద్రబాబు ఆలోచించలేదు. మచిలీపట్నం to విజయవాడ, విజయాడ to గుంటూరు 40 కి.మీ. ఈ మొత్తం 110 కి.మీ హైవే ఇప్పటికే ఉంది. ఈ హైవేకు అటు, ఇటు క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేస్తే గ్రోత్ ఇంజిన్ తయారవుతుందని చెప్పాం. మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరు నుంచి GUN తీసుకోండి. MAVIGUN అని పేరుపెట్టి క్యాపిటల్ ఏరియాగా డిక్లేర్ చేయండి. స్కాంలు చేసే బదులు, కట్టే ఆ బిల్డింగులు ఇక్కడ కట్టండని సలహా ఇచ్చాం. అది చేస్తే రూ.1,90,000 కోట్లు మిగులుతాయి కదా?. అమరావతిలో పెట్టాలనుకుంటున్న డబ్బులో 10% ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అని సూచించాం:మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరులో GUN ఈ మూడు కలిస్తే, MAVIGUN ఆనే గ్రోత్ కారిడర్ ఏర్పడుతుంది. ఈ సలహా కూడా ఇస్తే దాన్ని కూడా పట్టించుకోలేదు. విజయవాడ- దాని చుట్టుపక్కల ఇప్పటికే 20 లక్షల జనాభా ఉంది. గుంటూరులో మరో 10 లక్షల జనాభా ఉంది, మచిలీపట్నంలో మరో 3-4 లక్షల జనాభా ఉంది. అదొక మహానగరంగా, గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది కదా? అని చెప్తే అది కూడా చంద్రబాబుకు నచ్చలేదు. దీనికన్నా లక్ష ఎకరాల్లో రాజధాని, దాంట్లో బేసిక్ ఇన్ఫ్రా కోసమే రూ.2 లక్షల కోట్లు పెట్టడానికి వెళతానంటున్నాడు. అసాధ్యమని తెలిసి కూడా, తన స్కామ్ల కోసం, తన బినామీల భూముల రేట్లు కోసం పోతానంటున్నాడు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి, రాష్ట్రాన్ని అంధకారంలోకి, అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. -
ఫస్ట్ 50వేల ఎకరాలకే దిక్కు లేదు.. 3 మరో 50 వేల ఎకరాలు బాబు టార్గెట్ 2 లక్షల కోట్లు..
-
అడ్వాన్సుల పేరుతో 8 వేల కోట్లు సర్వనాశం చేశాడు..
-
మీ కుటుంబాలు అన్నీ ఎక్కడున్నాయో నన్ను చెప్పమంటావా చంద్రబాబు వైఎస్ జగన్ షాకింగ్ నిజాలు
-
రాజధాని మీద అసెంబ్లీలో తీర్మానమే అవసరం లేదని మీ మంత్రులే చెప్పారు.. ఇప్పుడేమో డ్రామాలు
-
LIVE: YS జగన్ కీలక ప్రెస్ మీట్
-
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల కోట్ల రూపాయల బకాయిలు రాకపోవడంతో...
-
ఇల్లు కట్టాలంటే రూ.50 లక్షలు లంచం ఆదోని ఎమ్మెల్యే అవినీతి బాగోతం
-
‘ఎమ్మెల్యేకు రూ.10 లక్షలు లంచం ఇచ్చా’
ఆదోని అర్బన్: ‘ఓపెన్గా చెబుతున్నా.. నేను బిల్డింగ్ కట్టేందుకు ఆదోని కూటమి ఎమ్మెల్యే పార్థసారథి రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. రూ.10 లక్షలు ఇచ్చాను. అది కూడా భగవద్గీత, ఖురాన్, బైబిల్ సాక్షిగా ప్రమాణం చేసి పచ్చి బట్టలతో నెత్తిన పెట్టుకుని ఆయా సన్నిధిల్లో, ఎక్కడ చెప్పమంటే అక్కడ చెబుతా’ అని టీడీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకుడు సౌదీ రవూఫ్ సంచలన ఆరోపణలు చేశారు.కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఎమ్మిగనూరు రోడ్డులోని ట్రెండ్స్ సమీపంలో సౌదీ రవూఫ్ భవన నిర్మాణం చేపడుతున్నారు. మున్సిపల్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారని నిర్మాణాన్ని అడ్డుకోవడంతో సౌదీ రవూఫ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే తన భవన నిర్మాణానికి అడ్డంకులు లేకుండా చూసేందుకు రూ.50 లక్షలు డిమాండ్ చేశారని, తన వద్ద అంత డబ్బు లేదని చెప్పి రెండు దఫాలుగా రూ.10 లక్షలు, మధ్యవర్తికి రూ.లక్ష ఇచ్చానని పేర్కొన్నారు. -
నైట్కి ఎంత తీసుకుంటావు!
సాక్షి టాస్క్ఫోర్స్: టీడీపీ నేతలు రోజురోజుకూ మరింత బరితెగిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓ టీడీపీ ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దానిని మరువకముందే తాజాగా బిగ్బాస్–8 మహిళా కంటెస్టెంట్ను ఉద్దేశించి ఇన్స్టాగ్రామ్లో ఐటీడీపీ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జ్ బిజ్జవరపు ప్రవీణ్కుమార్ ఓ అసభ్యకర పోస్టు పెట్టారు. గత ఆదివారం రాత్రి 11.21 గంటల సమయంలో ‘నైట్కి ఎంత తీసుకుంటావు? సుఖంతోపాటు డబ్బులు కూడా ఇస్తా’ అంటూ బిజ్జవరపు ప్రవీణ్కుమార్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎమ్మెల్యే బావమరిదినని చెప్పుకొంటున్న ఐటీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రవీణ్కుమార్ తీరుపట్ల ప్రజలు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల అఘాయిత్యాలు వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వ పెద్దలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే కింది స్థాయి నాయకులు కూడా మరింత బరితెగించి రెచ్చిపోతున్నారని మండిపడుతున్నారు. -
టిడ్కో ఇళ్లల్లోనూ కీర్తి చోరుడు.. బాబు ‘హోం’కరింపులు
సాక్షి, అమరావతి: ప్రపంచంలో ఎక్కడ మంచి జరిగినా తన ఖాతాలో వేసుకోవడంలో సిద్ధహస్తుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. సోమవారం తిరుపతి జిల్లా నాయుడుపేటలో పంపిణీ చేసిన టిడ్కో ఇళ్ల పట్టాలపై ‘2019–20 సంవత్సరంలో నిర్మించిన ఇళ్లు’ అని స్పష్టంగా కనిపించడం చూసి సభలోని వారే ముక్కున వేలేసుకున్నారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 21 నెలల్లో రాష్ట్రంలో 5.50 లక్షల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసిందని, గతేడాది నవంబర్లో 3 లక్షల ఇళ్లను పేదలకు అప్పగించిందని బాబు చెప్పడం విని విస్తుపోయారు.రెండో విడతలో భాగంగా నాయుడుపేట మండలం, పుదూరు నుంచి లక్ష టిడ్కో ఇళ్లతోపాటు మరో 1.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్టు గొప్పలుపోవడంపై నివ్వెరబోయారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వంలో పూర్తి చేసిన టిడ్కో ఇళ్లకు రంగులు వేసి తానే కట్టించినట్టు చెప్పుకోవడం చూస్తుంటే బాబు క్రెడిట్ చోరీలో తనకు తానే సాటి అనేలా ఉందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబు ‘కట్టు’కథల కనికట్టు 2015–16 మధ్య చేపట్టిన టిడ్కో ఇళ్ల కాంట్రాక్టులను నాటి టీడీపీ ప్రభుత్వం దోపిడీకి పరాకాష్టగా మార్చేసింది. ఆ సంవత్సరం కేంద్రం 1,37,533 ఇళ్లను మంజూరు చేస్తే కేవలం 81 మాత్రమే పూర్తి చేశారు. 2017–18లో 2,39,062 ఇళ్లు మంజూరు చేస్తే 25,818 పూర్తిచేశారు. నాడు చంద్రబాబు రాష్ట్రంలో ఏ నగరంలో లేనంతగా నిర్మాణ ధరలు పెంచి అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు.అయినప్పటికీ మంజూరైన ఇళ్లల్లో ఐదు శాతం కూడా నిర్మాణం పూర్తిచేయనేలేదు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాలో అరకొరగా నిర్మించిన ఇళ్లను హడావుడిగా లబ్ధిదారులకు అప్పగించి ఏదో చేసేసినట్టు బిల్డప్ ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో 2019 మే నాటికి కేంద్ర ప్రభుత్వం 4.91 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే కేవలం 77,350 ఇళ్ల నిర్మాణం కోసం పునాదులు వేసి వాటిలో 20 వేల ఇళ్లు మాత్రమే అందులోనూ 60 శాతం పనులే చేశారు. జగన్ ప్రభుత్వంలోనే 1,77,546 ఇళ్లు పూర్తి 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ హయాంలోనే టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం జరిగింది. ప్రతిచోటా ఇళ్ల నిర్మాణంతో పాటు నూరు శాతం మౌలిక సదుపాయాలు కల్పించాకే లబ్ధిదారులకు అందించారు. మొత్తం 2,62,212 ఇళ్లు అవసరమని గుర్తించి వాటిలో 1,77,546 ఇళ్లు పూర్తి చేయడంతో పాటు దాదాపు లక్ష ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ విషయం మున్సిపల్శాఖ మంత్రి నారాయణ శాసనసభ సాక్షిగా అంగీకరించారు కూడా. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనుల్లో దాదాపు 80 శాతం పూర్తి చేశారు. టీడీపీ కూటమి అధికారం చేపట్టిన 21 నెలల పాలనలో టిడ్కో ఇళ్లకు ఎక్కడా స్లాబులు వేసిన దాఖలా లేదు. కానీ క్రెడిట్ మాత్రం తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం.ఆ 1.5 లక్షల ఇళ్లు గత ప్రభుత్వంలో నిర్మించినవే రాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా గత వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం అమలు చేసింది. ఈ పథకం ద్వారా 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల స్థలాలను మహిళల పేరిట ఉచితంగా పంచింది. ఆ ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ రూ.1.15 లక్షల కోట్ల పైమాటే. పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం ద్వారా ఏకంగా 17 వేలకుపైగా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు.అంతేకాకుండా జగనన్న కాలనీల్లో 19 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. వీటికి టిడ్కో ఇళ్లు 2.62 లక్షలు అదనం. కాగా, ఎన్నికలు ముగిసే నాటికి 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి వైఎస్ జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది. ఇక సాధారణ ఇళ్లలో 8 లక్షలకు పైగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 1.28 లక్షలు స్లాబ్ పూర్తయిన, 99 వేల ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయి. ఇందులో చాలా వరకు తుది దశ నిర్మాణాలూ పూర్తయినప్పటికీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్టేజ్ అప్డేట్ చేయని పరిస్థితి నెలకొంది. జగన్ హయాంలో పూర్తయితే బాబు షో వైఎస్ జగన్ హయాంలో పూర్తయిన ఇళ్లకు స్టేజ్ అప్డేట్ చేసి తామే నిర్మించినట్టు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. గతేడాది నవంబర్లో పేదలకు 3 లక్షల ఇళ్ల పంపిణీ పేరిట షో చేశారు. అప్పట్లో అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఇళ్లు జగన్ ప్రభుత్వం 2021–22లో కట్టినవే కావడంతో అప్పట్లో బాబు ప్రభుత్వం అభాసుపాలైంది.అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గని బాబు సర్కార్ సోమవారం మరో 2.5 లక్షల ఇళ్లను పేదలకు పంపిణీ పేరిట మరోమారు దు్రష్పచారానికి తెరలేపింది. ఈ 2.5 లక్షల ఇళ్లలో లక్ష గత ప్రభుత్వంలోనే పూర్తి చేసిన టిడ్కో ఇళ్లు కాగా, మిగిలిన 1.5 లక్షల ఇళ్లు కూడా గత ప్రభుత్వంలో నిర్మించిన సాధారణ ఇళ్లు కావడం గమనార్హం. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పున పేదలకు స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చిన బాబు నేటికీ ఒక్క గజం స్థలం పేదలకు ఇవ్వలేదు. -
లంచాలు కాదు.. ఇంటికెళ్లి అన్నం తినండి..పేర్ని నాని ఉగ్రరూపం
-
బాబు ఆలోచన విధానమే దోపిడీ మేం వస్తే మీకేంటి ఇబ్బంది..
-
నీకెందుకు ఈ బ్రతుకు ..!
-
కోట్ల స్కాం..? TTD భూములపై లోకేష్ కన్ను
-
మైక్ లాక్కొని హంగామా.. టీడీపీలో పెరిగిన విభేదాలు!
నెల్లూరు జిల్లా: టీడీపీలో నివురుగప్పిన నిప్పులా దాగి ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీనే నమ్ముకొని ఉన్న తమకు అన్యాయం జరుగుతోందంటూ ఒక్కసారిగా వ్యాఖ్యానించడంతో పరిస్థితులు హీటెక్కాయి. బుచ్చిరెడ్డిపాళెంలో ఆదివారం నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవమే దీనికి వేదికైంది. సముదాయించకుండా.. అడ్డుకొని..! పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నేత బొమ్మ సుబ్బారెడ్డి మైక్ పట్టుకొని తన మనస్సులోని బాధను వెళ్లగక్కారు. రెండేళ్లుగా తనను అవమానిస్తున్నారనీ.. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి వరకు పార్టీ కోసం రక్తాన్ని ధారపోస్తే, ఇప్పుడు కనీస మర్యాద కరువైందంటూ కంటతడి పెట్టారు. ఈ తరుణంలో అక్కడే ఉన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆయన్ను సముదాయించాల్సింది పోయి, అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో పలువురు విస్తుపోయారు. స్టేజీపై అలా మాట్లాడొద్దంటూ నోరు నొక్కేందుకు యతి్నంచారు. మైక్ లాక్కొని.. సీనియర్లను తోసేసి అసమ్మతి గళాన్ని వినిపిస్తే తట్టుకోలేని తమ్ముళ్లు హద్దు మీరి ప్రవర్తించారు. సుబ్బారెడ్డి తన బాధ చెప్పుకొంటుండగానే, నేత కోడూరు కమలాకర్రెడ్డి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి పెద్దాయన చేతిలోని మైక్ను బలవంతంగా లాక్కున్నారు. అనామకుడినా నేను..? ఇంత అవమానిస్తారా అంటూ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ వేదిక దిగి వెళ్లిపోవడం అక్కడున్న వారిని కలిచివేసింది. మరో సీనియర్ నేత బషీర్ సైతం వేదికపైనే అసంతృప్తిని వెళ్లగక్కారు. రెండేళ్లుగా తనను ఏ కార్యక్రమానికీ పిలవడం లేదని, పార్టీలో సీనియర్లను ఏ మాత్రం లెక్కచేయడంలేదంటూ బాహాటంగానే విమర్శించారు. ఎంతో కాలంగా పార్టీని నమ్ముకొని ఉంటే బయట నుంచి వచ్చిన నేతలు తమపై పెత్తనం చేయడమేమిటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి బుచ్చిరెడ్డిపాళెం సాక్షిగా జరిగిన ఈ రచ్చ, టీడీపీలో ఐక్యత లేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. -
ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కొత్త భయం పట్టుకుందా..?
సాక్షి ప్రతినిధి, కడప: కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కొత్త భయం పట్టుకుందా..? తన కోటరీలోనే కోవర్టులున్నారనే దిగులు మనసును తొలిచేస్తోందా? .. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ‘నా చుట్టూ కోవర్టులున్నారు...వాళ్ల పగలు పార్టీలో పని చేసి రాత్రి వైఎస్సార్సీపీ వాళ్లతో టచ్లో ఉన్నార’ంటూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున స్వయనా ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు టీడీపీలో కాక పుట్టిస్తున్నాయి. తన కోటరీలోనే ఉన్న ఆ కోవర్టులు ఎవరు? అనే అంశంపై పార్టీలో తీవ్ర చర్చనడుస్తోంది. కాగా తొలినాళ్ల నుంచి టీడీపీ జెండాను మోసిన వారిని పక్కన పెట్టారని ఆపార్టీ నేతలు కొందరు బాహాటంగా చెప్పుకొస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఫిరా యించిన వారికి పెద్ద పీట వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తన చుట్టూ ఉన్న వారిలో కోవర్టులు ఉన్నారంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ⇒ కడప టీడీపీలో జోష్ తగ్గిపోయింది. నేతల మధ్య అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. పార్టీ పరిస్థితి అట్టుడుగు స్థానానికి వచ్చిందని గతంలో సీనియర్ నాయకులంతా ప్రెస్మీట్లు పెట్టి మరీ విమర్శలు చేశారు. ఎమ్మెల్యే తీరుపై అనేక మంది నాయకులు అభ్యంతరాలు కూడా తెలిపారు. నలభై ఏళ్లుగా పార్టీ జెండాను మోస్తున్న టీడీపీ సీనియర్ నాయకులను ఎమ్మెల్యే పక్కన పెట్టేసిందని ఆరోపించారు. దాదాపు పాతతరం టీడీపీ నేతలంతా ఎమ్మెల్యేకు దూరంగానే ఉంటున్నారు. ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గెలిచిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని తన వెనుక తిప్పుకుంటూ ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకున్నారు. ఇది మొదటి నుంచీ టీడీపీలో ఉన్నవారికి రుచించడం లేదు. కనుమరుగవుతున్న పాతతరం నేతలు... సాక్షాత్తు టీడీపీ నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్న శివకొండారెడ్డిపై ప్రత్యక్ష దాడి చోటుచేసుకుంది. తాజాగా వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిన వారు ఓ డివిజన్ టీడీపీ ఇంఛార్జి వెంకటేషపై మూకుమ్మడి దాడి చేశారు. కీలక నేతల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇప్పుడంతా వేరే పార్టీ నుంచి వచ్చిన వారిదే కడప టీడీపీలో పెత్తనం అంటూ పాత తరం నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో ఎమ్మెల్యే కోవర్టులంటూ వ్యాఖ్యలు చేయడం పార్టీలో పెద్ద దుమారాన్ని లేపింది. కొత్తగా వచ్చిన నేతలేమో..పాత తరం వారే కోవర్టులని సర్దిచెప్పుకుంటుంటే...పాత తరం వారు మాత్రం వేరే పార్టీ నుంచి వచ్చిన వారే కోవర్టులంటూ చెప్పుకొస్తున్నారు. ఎన్టీఆర్ను విస్మరించిన తమ్ముళ్లు... తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున దివంగత ఎన్టీఆర్ను తెలుగుతమ్ముళ్లు విస్మరించారు. కడప నగరంలోని కొండాయపల్లె (చిన్నచౌక్ పోలీసుస్టేషన్ ఎదురుగా) వద్ద ఉన్న ఎనీ్టఆర్ విగ్రహం కనీసం ఒక పూలదండకు కూడా నోచుకోలేదంటే పార్టీ నేతల చిత్తశుద్ధి ఏంటో ఇట్టే అర్థమవుతోంది. కాగా, కడప నగరంలో 15 డివిజన్లు మినహా తక్కిన డివిజన్లలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా చేపట్టలేదని సమాచారం. -
ఉగాదులు వెళ్లినా.. ఉషస్సులేవీ?
సాక్షి, విశాఖపట్నం: పీ–4 విధానంతో సమాజంలో అట్టడుగున ఉన్న పేద కుటుంబాలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చి.. బంగారు కుటుంబాలుగా మారుస్తామంటూ బీరాలు పలుకుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. వారి జీవితాల్లో వెలుగులు నింపకుండానే సంబరాలు చేసుకుంటోంది. ఇప్పటికే పలు దఫాలుగా సర్వేలు నిర్వహించి 2 లక్షలకు పైగా కుటుంబాలను గుర్తించిన ప్రభుత్వం.. మళ్లీ అందులో వడపోత కోసం రీ–సర్వే పేరుతో పేదోడి ఇంటిపై బంగారు కత్తి వేలాడదీసింది. ఫలితంగా ఆ సంఖ్యను లక్షకు కుదించేసింది. 2024 అక్టోబర్లో పీ–4 ప్రారంభించినప్పుడు.. ‘వచ్చే ఉగాది నాటికి పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతాం’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు గుప్పించారు. ఇప్పటికి రెండు ఉగాదులు గడిచిపోయినా ఆ కుటుంబాల్లో నేటికీ మార్పు కనిపించడం లేదు. పేదలను ఆదుకునేందుకు మార్గదర్శులు ముందుకు రావాలని ప్రభుత్వం పిలుపునిస్తున్నా.. సర్కారుపై నమ్మకం లేని సంపన్న వర్గాలు మొహం చాటేస్తున్నాయి. దీంతో కనీసం అధికారులు, ప్రజాప్రతినిధులైనా మార్గదర్శులుగా మారి పేదలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం హుకుం జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు పడుతూ మార్గదర్శులను ఎంపిక చేసినా.. ఈ పథకం క్షేత్రస్థాయిలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవ సంబరాల పేరిట హడావుడి చేస్తుండటం కొసమెరుపు. పేదలను ఆదుకునేందుకే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్(పీ–4) విధానాన్ని తీసుకొచ్చామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం.. అమల్లో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం కుటుంబాలకు, మొదటి 20 శాతం ఉన్న సంపన్న కుటుంబాల ద్వారా సాయమందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రకటించారు. దీనిపై మంత్రులు, అధికారులు సమీక్షల పేరిట మొదట్లో చేసిన హడావుడి అంతా ఇంత కాదు. ఇప్పటికే సచివాలయాల వారీగా సర్వేలు నిర్వహించి, జిల్లాలో లక్షకు పైగా బంగారు కుటుంబాలను గుర్తించారు. వీరికి సంపన్నుల నుంచి ఆర్థిక తోడ్పాటు అందిస్తామంటూ 2024 ఆగస్టులోనే మంత్రులు, అధికారులు ప్రకటనలు చేశారు. అయితే, నెలలు గడుస్తున్నా నేటికీ ఏ ఒక్క పేద కుటుంబానికి కూడా భరోసా దక్కలేదు. ప్రచార ఆర్భాటం తప్ప క్షేత్రస్థాయిలో లబ్ధి చేకూరకపోవడంతో పేద వర్గాల్లో నిరాశ వ్యక్తమవుతోంది. స్క్రిప్ట్డ్ సక్సెస్ స్టోరీలు విఫలమైన పథకాన్ని విజయవంతమైనట్లు చూపడానికి ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ విజయోత్సవాలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో జిల్లా అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చివరికి దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన కొన్ని కుటుంబాలకు.. వేదికపై ఎలా మాట్లాడాలి? ఏం చెప్పాలి? అనే అంశాలపై ముందుగానే శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 7 వేల మంది మార్గదర్శులు ఉంటే, కేవలం 20 మందికి మాత్రమే అవార్డులు ఇస్తుండటం చూస్తుంటే.. అసలు ఆ కుటుంబాలకు ఎంతమేర సాయం అందుతుందో అర్థమవుతోంది. ఏ కోణంలో చూసినా పీ–4 విఫలమైందని స్పష్టమవుతున్నా, సంబరాలు చేసుకోవడంపై జిల్లా అధికారులే విస్తుపోతున్నారు. ప్రభుత్వం ఏదో మేలు చేస్తుందని భావించిన నిరుపేదలకు నిరాశే మిగులుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో వేడుకలు నిర్వహిస్తే ప్రజల ముందు అభాసుపాలవుతామని కొందరు అధికారులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వడపోతలతో పేదల సంఖ్య తగ్గింపు2024 అక్టోబర్ 2న పీ–4ను ప్రారంభిస్తూ, 2025 ఉగాది నాటికి బంగారు కుటుంబాలకు సాయం అందిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అయితే, క్షేత్రస్థాయిలో ఆశించిన స్పందన రాకపోవడంతో.. ప్రభుత్వం పునఃసర్వే పేరుతో పదే పదే వడపోతలు చేస్తూ లబి్ధదారుల సంఖ్యను క్రమంగా తగ్గించింది. ఫలితంగా మొదట గుర్తించిన భారీ సంఖ్య కాస్త ప్రస్తుతం 1,05,126 కుటుంబాలకు పడిపోయింది. ఈ కుటుంబాలను ఆదుకునేందుకు మార్గదర్శులుగా సంపన్నులను గుర్తించే బాధ్యతను ప్రభుత్వం జిల్లా అధికారులపై నెట్టింది. అయితే, ఇప్పటివరకు జిల్లాలో కేవలం 7 వేల మంది మార్గదర్శులను మాత్రమే గుర్తించగలిగారు. వీరిలో పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు ఉన్నప్పటికీ, సాయం చేసే విషయంలో వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి సంపన్నుల నుంచి స్పందన లేకపోవడంతో.. కనీసం ప్రజాప్రతినిధులైనా కుటుంబాలను దత్తత తీసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. విఫల పథకానికి విజయోత్సవాలా? పీ–4 పథకం ప్రారంభించి ఏడాదిన్నర గడిచినా, కాగితాలపై కనిపిస్తున్న హడావుడి క్షేత్రస్థాయిలో ఎక్కడా సక్సెస్ కాలేదు. అధికారులే ఇది అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్టు అని చేతులెత్తేసినా, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఏదో విధంగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది. జిల్లాలో గుర్తించిన 1,05,126 కుటుంబాల్లో కేవలం 66 వేల కుటుంబాలనే దత్తత తీసుకోవడం పథకం డొల్లతనాన్ని చాటుతోంది. పోనీ వారి జీవితాల్లో అయినా.. మార్పులు తీసుకొచ్చారా అంటే అదీ లేదు. లక్షకు పైగా కుటుంబాలకు కేవలం 7 వేల మంది మార్గదర్శులు మాత్రమే ముందుకు రావడం గమనార్హం. ఇందులోనూ కొందరు వ్యాపారవేత్తలను బలవంతంగా మార్గదర్శులుగా చేర్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పగలంతా TDP.. రాత్రయితే మాత్రం.. టీడీపీ నేతలపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
నేను చనిపోయాక నా పిల్లలకైనా న్యాయం చేయండి చింతమనేని అరాచకం
-
మూలపేట పోర్టు ఘనత జగన్దే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా తన పాలన ప్రారంభమైన నాటినుంచే శ్రీకారం చుట్టారు. సంతబొమ్మాళి మండలం మూలపేట సముద్రతీర ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం తలపెట్టారు. అంతకుముందు ప్రతి ఎన్నికలోనూ పోర్టు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో సుమారు రూ.4,361.91 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు. మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. రెండుదశల్లో నిర్మించాలని తలపెట్టిన ఈ పోర్టు పనుల్లో ఏడాదిలోనే.. ఎన్నికల సమయానికే 70 శాతం పనులు పూర్తిచేశారు. అనంతరం వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా మిగిలిన 30 శాతం పోర్టు పనులను కూడా పూర్తిచేయలేకపోయింది. పనులు నిలిపేయడం కమీషన్ల కోసమేనన్న ఆరోపణలున్నాయి. అయినా పోర్టు క్రెడిట్ చోరీ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోర్టుకు అవసరమైన భూములను వైఎస్సార్సీపీ హయాంలోనే సేకరించినా మళ్లీ భూములు కావాలంటూ కూటమి నేతల డైరెక్షన్లో అధికారులు చెబుతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ మూలపేట పోర్టు ఘనతను చోరీచేయడానికి టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సోమవారం ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సంతబొమ్మాళి మండలం నౌపడ మూడురోడ్ల జంక్షన్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
ఆవిర్భావ సభలో... అంతులేని అబద్ధాలు
సాక్షి, అమరావతి : కళ్లార్పకుండా అలవోకగా అబద్ధాలు, అభూత కల్పనలతో ప్రజలను నిరంతరం వంచించడంలో నిష్ణాతుడైన చంద్రబాబు టీడీపీ ఆవిర్భావ సభలోనూ అదే ఒరవడిని కొనసాగించారు. చెప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెబుతూ, వాటినే నిజాలనుకునేలా ప్రజలను భ్రమలో ఉంచేందుకు ఆదివారం నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి వేదికగా చేసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలుచేయకుండానే వాటిని సూపర్హిట్ చేసేశామని ప్రజల కళ్లకు గంతలు కట్టేందుకు ప్రయత్నించారు. ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలుచేయకుండానే అమలుచేసి చూపించామని గొప్పలు చెప్పుకోవడం ఆయన అసత్యాలకు పరాకాష్ట. అలాగే.. » మహాశక్తి పథకం కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500.. యువగళం పేరుతో 20 లక్షల ఉద్యోగాల కల్పన లేకపోతే రూ.3 వేల నిరుద్యోగ భృతి ఊసేలేకుండానే 21 నెలల పాలన పూర్తిచేశారు. అయినా నిస్సిగ్గుగా వాటి ఊసేలేకుండా వాటిని అమలుచేసేసినట్లు ప్రకటించుకున్నారు. » అన్నదాత పథకం కింద ఏడాదికి ప్రతి రైతులకు రూ.20 వేలు ఇస్తామని చెప్పి అరకొరగా కొంత విదిల్చి దాన్ని అమలుచేసినట్లు డబ్బా కొట్టుకున్నారు. » దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాలను కంటితుడుపుగా ఏదో చేశామన్నట్లు చేసి వాటిని కూడా చేసేసినట్లు బిల్డప్ ఇచ్చారు. » సూపర్సిక్స్తో కలిపి 143 హామీలిచ్చిన చంద్రబాబు అందులో ఏ ఒక్క హామీని సరిగ్గా అమలుచేయకుండానే సూపర్హిట్ చేశామని చెప్పుకున్నారు.» జాబులు లేకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, 6.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించుకోవడాన్ని బట్టి తాను ఏది చెప్పినా ప్రజలు అమాయకంగా నమ్మడం తప్ప మరో మార్గంలేదని చాటుకున్నారు.రాజధాని రైతులపై కపట ప్రేమ.. మరోవైపు.. రాజధాని రైతులను అన్ని విధాలా దెబ్బతీసి ఇప్పుడు వారి త్యాగాలు వృ«థా కావని చెబుతూ.. ఇంకా వారిని మోసంచేస్తూ.. ఇకపై కూడా మోసంచేస్తూనే ఉంటానని చెప్పకనే చెప్పడం గమనార్హం. పుష్కరకాలం క్రితం భూసమీకరణకు 34 వేల ఎకరాల భూములిచ్చిన రైతులకు ఇంతవరకూ ప్లాట్లు ఇవ్వకపోవడంతో వారి ఆందోళన వర్ణనాతీతం. వారికింకా ప్లాట్లు ఇవ్వకుండా, ఆ ప్లాట్లకు సంబంధించిన లేఅవుట్ల గురించి పట్టించుకోకుండా మళ్లీ రెండు, మూడు విడతల్లో భూములు తీసుకుంటామని ప్రకటించి రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. భూములిచ్చిన రైతులను పట్టించుకోకుండా కార్పొరేట్ కంపెనీలకు మాత్రం వందల ఎకరాల భూములను కట్టబెడుతుండడంతో వారు లబోదిబోమంటున్నారు. ఒకవైపు ఇప్పటికీ వారి భూములను బలవంతంగా లాక్కుంటూ.. పైకి వారు స్వచ్ఛందంగా ఇస్తున్నారనే మాయమాటలతో రైతులను వంచించేందుకు యత్నించడంపై రైతులు రగిలిపోతున్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి...పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి.. ఆయన్నుంచి సీఎం పదవిని, తెలుగుదేశం పార్టీని లాక్కున్న విషయాన్ని మరచిపోయి 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలోనూ ఎప్పటిలానే ఆయన్ను అవతార పురుషుడిగా కీర్తించారు. తాను చేసిన దారుణమైన మోసాన్ని భరించలేక ఎన్టీఆర్ మానసిక క్షోభతో చనిపోయిన విషయాన్ని కూడా మరిపిస్తూ పార్టీ మొత్తాన్ని తన కబంధ హస్తాల్లోకి తీసుకుని ఇప్పుడాయన గొప్పవాడంటూ చేస్తున్న ప్రసంగాలు, ఆడుతున్న డ్రామాలు ఎన్టీఆర్ అభిమానులను తీవ్రంగా కలచివేస్తున్నాయి. చనిపోయిన ఎన్టీఆర్ ఆత్మను కూడా వదలకుండా చంద్రబాబు ఆయన్ను వేధిస్తున్నారని ఎన్టీఆర్ నిజమైన అభిమానులు బాధపడుతున్నారు. వైఎస్ జగన్పై మళ్లీ విషం.. మరోవైపు.. వైఎస్ జగన్పై ఎప్పటిమాదిరిగానే ఈ సభలోనూ చంద్రబాబు విషం కక్కారు. 2019–24లో ఇష్టం వచి్చనట్లు చెప్పిన అబద్ధాలు, విష ప్రచారాలు, దొంగ వ్యవహారాలనే వీడియో చేసి ప్రదర్శించారు. అలాగే, సొంత కుటుంబసభ్యుల వేధింపులతో టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుంటే జగన్వల్లే ఆయన చనిపోయాడని చూపించి ప్రజలను అదేపనిగా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు. ఇలా ఆవిర్భావ సభ ఆసాంతం ప్రజలను వంచించే అబద్ధాలు, ఎన్టీఆర్కు దొంగ నమస్కారాలు, తనకు సంబంధంలేని వాటిని తన గొప్పలుగా చెప్పుకుని సొంత డబ్బా కొట్టుకున్నారు. -
పునర్విభజనలో 50 శాతం సీట్లుపెరుగుతాయి
సాక్షి, అమరావతి : ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలుచేసినట్లు చంద్రబాబు చెప్పారు. ఈ హామీలను అమలుచేయలేరని అనుకున్నారని.. కానీ, తాను చేసి చూపించానని తెలిపారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించామని, ఇప్పటికే 6.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. 21 నెలల్లో కొత్తగా ఐదు లక్షల మంది పారిశ్రామికవేత్తలను తయారుచేశామన్నారు. ఒకే రాష్ట్రం–ఒకే రాజధాని తమ విధానమని.. త్వరలో అమరావతి రాజధానిపై కేంద్రం చట్టం చేస్తుందన్నారు. అమరావతి దేవతల రాజధాని కావడంవల్లే కొందరికి నచ్చలేదని విమర్శించారు. 2028 ఆగస్టు నాటికి అమరావతిలో ప్రధాన నిర్మాణ పనులు పూర్తవుతాయని, అప్పుడు ప్రధాని మోదీని తీసుకొచ్చి ప్రారంబోత్సవం చేస్తామన్నారు. నేతలు కార్యకర్తలను పట్టించుకోవాలి పార్టీ నేతలు కార్యకర్తలను పట్టించుకోవాలని, లేకపోతే వారికి పార్టీలో స్థానం ఉండదని.. భవిష్యత్తులో బాగా చేసిన వారు ప్రజాప్రతినిధులు అవుతారని ఆయన చెప్పారు. త్వరలో నియోజకవర్గాల పునరి్వభజనతో 50 శాతం సీట్లు పెరుగుతున్నాయన్నారు. సీట్లు పెరిగితే కొత్తవారికి పదవులు లభిస్తాయన్నారు. పదవుల్లో మహిళల సంఖ్య పెరుగుతుందన్నారు. -
చంద్రబాబుది రాజకీయం కాదు.. బ్రోకరిజం
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించి, ఇప్పుడు ఆవిర్భావ వేడుకల పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. హైదరాబాద్లో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీని ఎన్టీఆర్ నుంచి లాక్కున్న చంద్రబాబు క్రెడిట్ చోర్ అని దుయ్యబట్టారు. టీడీపీ, ఎన్టీఆర్ పేరెత్తే అర్హత ఆ పార్టీ నేతలకు లేదన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను పూర్తిగా తుంగలోకి తొక్కి, ఆయన పెట్టిన పార్టీని లాక్కున్న చంద్రబాబుకు ఏమాత్రం రాజకీయ విలువలు లేవన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని క్రమశిక్షణ లేని పార్టీగా, నైతిక విలువలు లేని పార్టీగా మార్చింది చంద్రబాబేనని లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. విద్యుత్ ఛార్జీలు పెంచిన సందర్భంలో ఆందోళనకారులపై కాల్పులు జరిపించిన దుర్మార్గ చరిత్ర చంద్రబాబుది అని గుర్తు చేశారు. టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించవద్దని లక్ష్మీపార్వతి తేల్చి చెప్పారు. జగన్ సంక్షేమ, అభివృద్ధి పాలనతో చంద్రబాబు ఎక్కడా, ఏ విషయంలోనూ సరితూగరని స్పష్టం చేశారు. చంద్రబాబుకు వేడుకలు చేసే అర్హత లేదు.. కామపిశాచుల్లా మహిళల జీవితాలతో ఆడుకుంటున్న టీడీపీ నేతలను ఒక్కరినైనా సస్పెండ్ చేశారా అని లక్ష్మీపార్వతి నిలదీశారు. పొత్తుల కోసం అంటకాగిన పార్టీగా టీడీపీని మార్చేసిన చంద్రబాబుకు ఆవిర్భావ వేడుకలు నిర్వహించే అర్హత లేదన్నారు. అధికారం కోసం చంద్రబాబు చేయని నీచపు పనులు లేవని, బాబు జీవితమంతా అబద్ధాలతోనే బతుకీడుస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు చేసేది రాజకీయం కాదని, బ్రోకరిజం అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, ఎల్లో మీడియా వల్ల రాష్ట్రంలో ఎవరికీ ప్రయోజనం లేదన్నారు. రెడ్బుక్ రాజ్యాంగంతో పిచ్చోడి చేతిలో రాయిలా ప్రభుత్వ పనితీరు మారిందని దుయ్యబట్టారు. చంద్రబాబును తాను మనిషిగా కూడా గుర్తించటం లేదని, జీవిత చరమాంకంలో ఉన్న బాబు ఇకనైనా మారాలని హితవు పలికారు. -
చంద్రబాబు సొంత జిల్లాలో TDP కి అవమానం
-
‘అప్పుల్లో చంద్రబాబు రికార్డు సాధించారు’
సాక్షి, కాకినాడ జిల్లా: ‘‘2014-19 కాలంలో చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం అని చెప్పేవారు.. 2024 తరువాత ప్రతి మంగళవారం అప్పుల వారం అంటున్నారు’’ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేస్తూ.. అప్పు చేసి పప్పుకూడు అనే కార్యక్రమం చేస్తున్నారంటూ ఆయన దుయ్యబట్టారు.‘‘అప్పుల్లో చంద్రబాబు రికార్డ్ సాధించారు. ఈ 22 నెలల కాలంలో రూ.3 లక్షల 40,621 కోట్లు అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన భారం పెట్టారు. కోవిడ్ వంటి కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను వైఎస్ జగన్ అమలు చేశారు. అవసరమైన చోట అప్పులు చేసి సంక్షేమం.. అభివృద్ధిని సమానం తీసుకువెళ్ళి పాలన చేశారు. వైఎస్ జగన్ అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేశారు. ఐదేళ్లలో జగన్ చేసిన అప్పులతో సమానంగా ఈ 22 నెలల్లోనే చంద్రబాబు చేశారు. చంద్రబాబు చేస్తున్న అప్పులతో రాష్ట్రం ఇవాళ శ్రీలంక అవ్వడం లేదా?’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు.‘‘చంద్రబాబు అప్పులు చేస్తే సంపద సృష్టి.. నిధులు సమీకరణ అని కొన్ని పత్రికలు రాస్తున్నాయి. జగన్ అప్పులు చేస్తే రుణ భారం.. అప్పుల మోత అని ఆవే పత్రికలు రాశాయి. ఇప్పుడా పత్రికలకు సమ్మగా ఉంది. ఆ పత్రికలకు సామాజిక బాధ్యత లేదు?. తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నావ్ అని చంద్రబాబు ను అడిగేవాడు లేడు. చంద్రబాబు చేసిన అప్పులు చూసి కాగ్ ముక్కున వేలు వేసుకుంటుంది. కేంద్రం మా సపోర్ట్తో ప్రభుత్వాన్ని నడుపుతుంది కనుక మేము ఏం చేసిన చెల్లుబాటు అవుతుందన్న ధోరణీ కనిపిస్తుంది. అదే ప్రభుత్వంతో భాగస్వామ్యంగా ఉన్న మీరు కేంద్రం నుండి సాధించిన గ్రాంట్లు ఏమైనా ఉన్నాయా?. మీ సంపద సృష్టి ఎంత వరకు వచ్చింది?. ఏ రూపంలో రాష్ట్రాన్ని అప్పుల భారం పడకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు?..ఏపీ బేవరేజస్ నుండి వైఎస్ జగన్ అప్పులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే మీరు అడ్డుకున్నారు. ఇప్పుడు అదే సంస్థ నుండి మీరు రూ.17,600 కోట్లు అప్పులు చేశారు. అమరావతి నిర్మాణం కోసం మీరు కేంద్రం నుండి ఎంత గ్రాంట్ తీసుకువచ్చారు?. అమరావతిని మీరు అమితంగా ప్రేమిస్తున్నారు కదా?. ఆ ప్రేమకు కేంద్రం ఇచ్చిన కానుక ఎంత?. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేని మీరు.. సూపర్ సిక్స్ను అమలు చేయలేని మీరు రాష్ట్రాన్ని అప్పులతో అధోగతిపాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్్గా మారుస్తున్నారని ప్రజలు అనుకునే పరిస్థితికి తీసుకువచ్చారు’’ అని కురసాల కన్నబాబు మండిపడ్డారు. -
ప్రభుత్వ భూమిపై పచ్చ రాబందులు
పుల్లంపేట: టీడీపీ నేతల భూ దాహానికి అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. అధికారం అండతో తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేటలో కోట్ల రూపాయల విలువైన 133 ఎకరాల ప్రభుత్వ భూమిపై రాబందుల్లా వాలిపోయారు. పేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించేసుకున్నారు. చుట్టూ కంచె కూడా ఏర్పాటు చేసేశారు. వారి ఆక్రమణలను అడ్డుకున్నందుకు దళితులపై అక్రమంగా కేసులు నమోదు చేయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పుల్లంపేట మండలంలోని దళవాయిపల్లి సర్వే నంబర్ 225లో వంద ఎకరాలు, వత్తలూరు సర్వే నంబర్ 1042, 1055లో 24 ఎకరాలు, తిప్పాయిపల్లి సర్వే నంబర్ 1094/6లో 9 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. చెట్టు, పుట్టలతో ఉన్న ఈ భూమిని స్థానిక నిరుపేదలైన దళితులు చదును చేసుకుని సాగు చేసుకునేవారు. విలువైన భూములు దళితుల సాగు చేసుకోవటం జీర్ణించుకోలేని టీడీపీలోని పెత్తందారులు వారిపై దౌర్జన్యాలకు తెగబడేవారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ భూములను ఆక్రమించుకున్నారని 15 మంది దళితులపై కేసులు నమోదు చేయించారు. అప్పటి నుంచి టీడీపీ నేతలు, దళితుల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకునేవి.వైఎస్సార్సీపీ హయాంలో దళితులకు భూ పంపిణీకి ఏర్పాట్లు2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన కొన్నాళ్లకు 2022లో ఆ పార్టీ నాయకులు ఇరు వర్గాల మధ్య రాజీ చర్చలు జరిపి కేసులు వెనక్కు తీయించుకునేలా కృషి చేశారు. నిరుపేద దళితుల జీవనాధారం కోసం సాగు చేసుకున్న ప్రభుత్వ భూములను వారికే పంపిణీ చేయాలని 2023లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్ని సాంకేతిక కారణాల కారణంగా ఆ ప్రక్రియ ఆలస్యమైంది. 2024లో ప్రభుత్వం వచ్చిన వెంటనే పంపిణీ చేయాలని వైఎస్సార్సీపీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ ఎన్నికల తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దళితుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ప్రభుత్వం మనదే కదా అని టీడీపీ నేతలు మళ్లీ రంగంలోకి దిగారు. ముగ్గురు టీడీపీ నాయకులు ప్రభుత్వ భూముల్లోకి చొరబడి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. ఆపై రాత్రికి రాత్రే భూముల చుట్టూ కంచె కూడా ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీ నేతల భూ ఆక్రమణ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు కంచె తొలగించారు. అయినప్పటికీ దళితులపై దౌర్జన్యానికి దిగి... వారిపైనే టీడీపీ నాయకులు కేసులు పెట్టినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడంతోపాటు తమపై దౌర్జన్యానికి దిగారని దళితులంతా కలిసి శనివారం పుల్లంపేట పోలీస్ స్టేషన్కు చేరుకుని న్యాయం చేయమని వేడుకున్నారు. అదేవిధంగా టీడీపీ నేతల దౌర్జన్యాలపై ఫిర్యాదు చేశారు.ప్రభుత్వ భూమి అమ్మకానికి పెట్టేసిన పోలీసులుపుల్లంపేట మండలం తిప్పాయిపల్లిలోని 9 ఎకరాలను ఓ పోలీసు అధికారి ఏకంగా అమ్మకానికి పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. తొమ్మిది ఎకరాలు రూ.40 లక్షలకు బేరం కుదిరినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై స్థానికులు రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం?మాది వత్తలూరు హరిజనవాడ. భూమి లేని పేదవాళ్లం. 2012 నుంచి ఆ భూమిలో పంటలు సాగు చేస్తున్నాం. టీడీపీ ప్రభుత్వంలో మాపై కేసులు పెట్టారు. కోర్టుల చుట్టూ తిరిగాము. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక కోర్టులో రాజీపడ్డాం. పంటలు సాగు చేసుకుంటూ వచ్చాం. 2024లో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దౌర్జన్యంగా రాత్రికి రాత్రే టీడీపీ నాయకులు భూములను ఆక్రమించి తిరిగి మాపైనే కేసులు నమోదు చేయించారు. ఇదెక్కడి న్యాయం?– నల్ల బ్రహ్మయ్య, పుల్లంపేట మండలంజీవితమంతా పోరాటమే గత 20 ఏళ్లుగా భూమి కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. మేము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వమని వేడుకుంటున్నాం. చుట్టుపక్కల గ్రామాల్లో వందలాది ఎకరాల భూములు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు. పేదవాళ్లు భూమి కావాలంటే ఇన్ని కష్టాలా?– ఎస్.జయమ్మ, వత్తలూరుమాపైనే అక్రమ కేసులుమా నాన్న గారు ఉన్నప్పటి నుంచి భూమి కోసం పోరాడుతున్నాం. ఈ భూమి కోసం పోరాడి పోరాడి మా నాన్న కూడా మరణించాడు. భూమి మాత్రం ఇవ్వలేదు. అక్రమ కేసులు మాత్రం నమోదు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – ఎస్.మహేష్, వత్తలూరు గ్రామం -
2029లో జగన్ వస్తాడనే భయంతోనే అమరావతిపై చట్టబద్ధత బిల్లు..
-
విశాఖలో దారుణం రిటైర్ అయిన భర్త బెనిఫిట్స్ కోసం వెళ్తే..
-
కష్టాల్లో కుటుంబ పోషణ.. విశాఖలో చిన్న వ్యాపారుల ఆవేదన
-
ఎవరు ఆఫ్ నాలెడ్జ్ పీపులో చెప్పమంటారా.. టిడిపీ MLA అశోక్ వ్యాఖ్యలకు అదిరిపోయే కౌంటర్
-
TDP నేతల రాసలీలలు.. రగులుతోంది పచ్చ పొద
-
నయవంచకుడిని పట్టుకోండి!
హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లోబరుచుకుని తన వద్ద రూ.30 లక్షలకు పైగా నగదును వాడుకుని మోసంచేసిన విజయనగరం పట్టణానికి చెందిన బొబ్బిలి సాయికిరణ్ను తక్షణమే అరెస్టుచేసి శిక్షించాలని బాధితురాలు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. హైదరాబాద్ ప్రెస్క్లబ్లో శుక్రవా రం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం తాను ఉద్యోగం నిమిత్తం చెన్నై వెళ్లగా అక్కడ సాయికిరణ్ పరిచయమయ్యాడని చెప్పింది. తనకు పెళ్లయి ఒక కూతురు ఉందని, భర్తతో వేరుగా ఉంటున్నానని చెప్పినా తనతో సన్నిహితంగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా తనను లోబరుచుకున్నాడని ఆరోపించింది. రెండేళ్లు మణికొండలో లివింగ్ రిలేషన్షిప్లో ఉండి తన నుంచి రూ.30 లక్షలకు పైగా తీసుకున్నాడని బాధితురాలు తెలిపింది. ఆరు నెలల క్రితం మరో మహిళ పరిచయం కావడంతో తనను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడని, దీంతో తాను ప్రశ్నించగా తనపై దాడులు చేస్తూ చంపేస్తానని బెదిరించాడని ఆమె వాపోయింది. ఈ విషయమై తాను నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. అనంతరం.. విజయనగరం వెళ్లి సాయి కుటుంబ సభ్యులతో విష యం చెప్పేందుకు ప్రయత్నించగా అక్కడ సాయి తండ్రి బొబ్బిలి ముత్యాలనాయుడు టీడీపీ ఎంపీపీకి ప్రధాన అనుచరుడని తెలిసిందని, అక్కడి టీడీపీ కార్యకర్తలు తానున్న హోటల్కు వచ్చి సాయికిరణ్పై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించారని బాధి తురాలి వాపోయింది. నార్సింగ్ సీఐ హరికిషన్ నిందితుడికి వత్తాసు పలుకుతూ తనను అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. -
పెద్దల 'కుట్ర'..!
గంగపుత్రులకు అధికార టీడీపీ పెద్దలు వెన్నుపోటు పొడిచారు. తమిళనాడు జాలర్లతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందం స్థానిక మత్స్యకారుల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఐదు నెలల కింద స్వాదీనం చేసుకున్న పాండిచ్చేరి (కరైకల్) బోట్లను పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ వద్ద ఉంచారు. ఇటీవల టీడీపీ కీలక మంత్రులు వచ్చి వెళ్లాక వాటిని గుట్టుచప్పుడు కాకుండా వదిలేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనిపై మత్స్యకార గ్రామాలు రగిలిపోతున్నాయి. ఈ కుట్ర వెనుక సూత్రధారులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు అండగా నిలవకుండా తెరవెనుక లాలూచీకి పాల్పడ్డారంటూ కూటమి నేతల కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవిష్యత్ కార్యాచరణకు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. సింగరాయకొండ: తమిళ జాలర్లు మెకనైజ్డ్ బోట్లతో మన తీర ప్రాంతంలో చొరబడి మత్స్య సంపదను దోచుకెళ్లడంతోపాటు వలలను, నాటు బోట్లను ధ్వంసం చేస్తున్నారు. భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఇదంతా కొన్నేళ్లుగా జరుగుతోంది. దీనిపై గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొంత వరకు సోనాబోట్లను అడ్డుకునే ప్రయత్నం చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకుకెళ్లినా ప్రయోజనం లేదు. సోనాబోట్ల ఆగడాలతో విసిగిపోయిన మత్స్యకారులు వాటిని అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాంత మత్స్యకారులు ఏకమై ఒక సైన్యంలా ఏర్పడ్డారు. ప్రాణాలకు తెగించి తీరానికి వచ్చిన సోనాబోట్లను వెంబడించారు. తమిళనాడు జాలర్లను తరమికొట్టారు. నాలుగు సోనాబోట్లను స్వాదీనం చేసుకున్నారు. వాటిని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్లో భద్రపరిచారు. ఎనిమిది నెలల కిందట జరిగిన ఈ సంఘటన అప్పట్లో సంచలనం కలిగించింది. మెరైన్ పోలీసులు సైతం ఆ బోట్లను తమ భద్రతలో ఉంచుకున్నారు. ఎన్ని రాజకీయ ఒత్తిడిలు వచ్చినా వదిలేందుకు మత్స్యకారులు ససేమిరా అన్నారు. మీ అంతుచూస్తామంటూ బెదిరింపులు ‘‘మా బోట్లను నిర్బంధించి, 8 నెలల పాటు ఇబ్బందులకు గురిచేస్తారా మీ అంతుచూస్తాం’’ అంటూ కరైకల్ మత్స్యకారులు బెదిరింపులకు దిగుతున్నారని స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా తీరానికి దగ్గరగా చేపల వేట సాగిస్తూ లక్షలాది రూపాయల విలువైన వలలు తెంచేస్తూ స్థానికులు కనబడితే దాడులకు ప్రయత్నిస్తున్నారని వాపోతున్నారు. చివరకు వారు సముద్రంలో చేపల వేటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన దుస్థితి ఏర్పడింది.జువ్వలదిన్నెలో ఆ రాత్రి ఏం జరిగింది.. ఇటీవల జువ్వలదిన్నెకు మంత్రులు, టీడీపీ రాజ్యసభ సభ్యుడు వచ్చి వెళ్లాక హార్బర్ నుంచి మత్స్యకారులు స్వాదీనం చేసుకున్న సోనాబోట్లు మాయమయ్యాయి. టీడీపీ పెద్దలు తమిళ జాలర్లతో భారీ డీల్ కుదుర్చుకున్న తర్వాతనే మంత్రులు వచ్చి ఈ మంత్రాంగం అంతా నడిపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు వచ్చిన కార్యక్రమానికి టీడీపీకి అనుకూలంగా ఉన్న మత్స్యకారులను మాత్రమే అనుమతించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో కరైకల్ ప్రాంతంలోని సోనాబోట్లకు చెందిన మత్స్యకారులు కూడా హార్బర్లోకి ప్రవేశించి అక్కడ నిర్బంధంలో ఉన్న నాలుగు బోట్లకు డీజిల్ నింపారు. ఒక్కో సోనాబోటుకు సుమారు 10 వేల లీటర్ల సామర్ధ్యమున్న డీజిల్ ట్యాంకు ఉంటుంది. ఈ ప్రకారం నాలుగు సోనాబోట్లకు సుమారు ఒకటిన్నర డీజిల్ ట్యాంకర్ సుమారు 15 వేల లీటర్లు నింపారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. తరువాత అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా బోట్లను తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేశారు. మూడు బోట్లకు చెందిన ఇంజన్లు పనిచేయగా, ఒక బోటు ఇంజన్ మాత్రం మొరాయించింది. దీంతో ఆ బోటును మిగతా వాటికి కట్టుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం బయటకు పొక్కడంతో స్థానిక మత్స్యకారులు అప్రమత్తమై వెంటనే తమిళనాడు రాష్ట్రం కడలూరుకు చెందిన సోనాబోట్లలో పనిచేస్తున్న తమ ప్రాంతానికి చెందిన వారిని అప్రమత్తం చేశారు. వారు ఆ బోట్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మరమ్మతులకు గురైన బోటును వదిలేసి మిగతావాటితో పరారయ్యారు. వారు వదిలేసిన బోటును స్థానిక మత్స్యకారులు వెనక్కి తీసుకొస్తుండగా కరైకల్కు చెందిన మత్స్యకారులు సుమారు 12 బోట్లలో చుట్టుముట్టారు. దాడికి యత్నించారు. బోటును ఢీకొట్టారు. దౌర్జన్యానికి దిగి మరమ్మతులకు గురైన బోటును తీసుకెళ్లిపోయారు. బోటును ఢీకొట్టడంతో లోపలిభాగం ధ్వంసమైంది. దానిని మరమ్మతులు చేయాలంటే సుమారు రూ.2 లక్షలు ఖర్చవుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తెర వెనకున్నదెవరు..? జువ్వలదిన్నె హార్బర్లో మెరైన్ పోలీసుల పర్యవేక్షణలో ఉన్న నాలుగు బోట్లను కరైకల్ మత్స్యకారులు తరలించుకుపోవటంపై భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా ఈ పని జరిగే అవకాశం ఉందా అని స్థానిక మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెరవెనుక కుట్రలు చేసి బోట్లను వదిలేసి నేడు దానిని కప్పిపుచ్చుకునేందుకు మంత్రులు వరుసగా సమావేశాలు ఏర్పాటు చేసి మాకు అండగా ఉంటామంటూ ప్రకటనలు చేయడం సరికాదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కుట్రదారులెవరో తేల్చాలని వారు డిమాండ్ చేస్తుŠాన్నరు. 15 వేల లీటర్ల డీజిల్ ఎక్కడ నుంచి వచ్చిందో బహిర్గతం చేయాలని నిలదీస్తున్నారు.మెరైన్ పోలీసుల రక్షణలో ఉన్న నాలుగు బోట్లు ఎలా వెళ్లాయో ప్రకటించాలని వారు ప్రభుత్వ పెద్దలను ప్రశ్నిస్తున్నారు. త్వరలో 164 గ్రామాల మత్స్యకారుల సమావేశం కరైకల్ బోట్ల వ్యవహారంపై శ్రీకాకుళం నుంచి తడ వరకు ఉన్న 164 మత్స్యకార గ్రామాల ప్రజలు సమావేశమై తదుపరి కార్యాచరణకు సమాయత్తమవుతున్నారు. వీరు త్వరలో సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తారని స్థానిక మత్స్యకారుడు వివరించారు.ఐదు నెలలుగా ఎటువంటి భయం లేకుండా చేపల వేట సాగించామని, ఇప్పుడు సముద్రంలో చేపల వేటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు సమస్య పరిష్కరించకుండా మరింత సమస్యను సృష్టించారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వంటింట్లో 'వార్'!
సాక్షి, అమరావతి: ధరల నియంత్రణలో చంద్రబాబు సర్కార్ వైఫల్యం సామాన్యుడి వంటింట్లో సెగలు పుట్టిస్తోంది. నిత్యావసరాల ధరలు అంతకంతకూ భగ్గుమంటూ జనం నడ్డి విరుస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ముఖ్యంగా వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే దిక్కులు చూస్తోంది. గత 22 నెలలుగా నూనె రేట్లు కాక రేపుతున్నాయి. ప్రతి నెలా భారీగా పెరగడమేగానీ స్వల్పంగా కూడా దిగొచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటికే ధరల బాదుడుతో అల్లాడుతుండగా గ్యాస్ సంక్షోభం పేదల జీవనాన్ని మరింత దిగజార్చింది. చంద్రబాబు సర్కారు పీఠం ఎక్కిన తర్వాత గ్యాస్ రేట్లు రెండు సార్లు పెరగడంతో జనంపై ఏకంగా రూ.110 భారం పడింది. గ్యాస్ కోసం 10–15 రోజులు ఎదురు చూసినా రాకపోవడంతో మండుటెండల్లో వినియోగదారులు ఏజెన్సీలకు క్యూ కట్టాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు వరదలు, అకాల వర్షాలు, కరువు దెబ్బకు పంటలు దెబ్బ తిన్నాయి. రైతులకు ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు. మార్కెట్లో చూస్తే నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. రోజువారీ పనులు లేక.. చేతిలో చిల్లి గవ్వలేక.. భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలతో పేదలు విలవిల్లాడుతుంటే చంద్రబాబు సర్కారు వేడుక చూస్తోంది. 60 శాతానికిపైగా పెరిగిన నూనెల ధరలు.. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ఏపీలో వంట నూనెల ధరలు సెగ పుట్టిస్తున్నాయి. గత 22 నెలలుగా పామాయిల్, సన్ఫ్లవర్, వేరుశనగ నూనె రేట్లు పైకి ఎగబాకుతూనే ఉన్నాయి. పది రోజుల క్రితం సన్ఫ్లవర్, పామాయిల్ రేట్లు లీటరుకు రూ.15–25 వరకు పెరిగాయి. గతంలో ఉక్రెయిన్ యుద్ధ సమయంలో పెరిగిన నూనె రేట్లు.. చంద్రబాబు హయాంలో సాధారణ పరిస్థితుల్లోనూ ఆకాశాన్ని తాకుతుండటం గృహిణులను కన్నీళ్లు పెట్టిస్తోంది. 2024 ఏప్రిల్లో లీటర్ వేరుశనగ నూనె రూ.167.87 కాగా ఇప్పుడు రూ.210–22 ఉంది. గతంలో పామాయిల్ రూ.89–91 ఉంటే ఇప్పుడు రూ.131–140 ఉంది. సన్ఫ్లవర్ గతంలో రూ.112 ఉంటే ఇప్పుడు రూ.180–190కి కొనుగోలు చేయాల్సిన దుస్థితి. పామాయిల్ ఏకంగా 60 శాతం, సన్ఫ్లవర్ 63–70 శాతం, వేరుశనగ నూనెపై 70 శాతం రేట్లు పెరిగాయి. వీటితోపాటు ఆవనూనె, సోయా, వనస్పతి రేట్లు కూడా దిగి రావట్లేదు. ఫలితంగా మధ్య తరగతి కుటుంబాలు వంటలను కుదించుకుంటున్న పరిస్థితి. గ్యాస్ కొరతకు తోడు నూనె రేట్లకు భయపడి ఒంటి పూట వంటలు వండుకోవడం గమనార్హం. ఉడకని పప్పులు.. తగ్గని రేట్లు.. వంట నూనెలకు తోడు పప్పు దినుసుల రేట్లు పేదింటి కుటుంబాలకు పెను భారంగా మారుతున్నాయి. జాతీయ సగటుతో పోల్చినా, తెలంగాణతో చూసినా ఏపీలోనే రేట్లు అధికంగా ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కిలో కందిపప్పు రూ.120–150, గోధుమ పిండి రూ.71–100, మినçప్పప్పు రూ.146–150 పైగా పలుకుతోంది. పెసలు సైతం కిలో రూ.160, వేరుశనగ గుళ్లు రూ.188–200, శనగపప్పు రూ.128కి తగ్గట్లేదు. నిత్యం కూరలు, తాలింపుల్లో తప్పనిసరిగా వినియోగించే దినుసుల్లో ఎండు మిర్చి రూ.200–390, పసుపు రూ.380, వెల్లుల్లి రూ.219–250, అల్లం రూ.109–150, కారం రూ.500(ప్రీమియం), సాధారణం రూ.200కిపైగా, ఇంగువ 100 గ్రాములు రూ.200 వరకు ఉంది. పండించిన రైతులకు గిట్టుబాటు ధర లేదు గానీ మార్కెట్లో కొనుగోలుదారులు కూరగాయలను ముట్టుకుంటే మండుతున్నాయి. టమాటా రైతుకి కిలో రూ.3 మాత్రమే దక్కుతుంటే మార్కెట్లో రూ.20–25 చొప్పున వినియోగదారులు కొనాల్సి వస్తోంది. అరటి సైతం రైతుకు కిలో రూ.5 మాత్రమే దక్కుతుంటే బయట డజను రూ.100 పలుకుతోంది. వేసవిలో పండ్లలో అధికంగా తీసుకునే కర్బూజా రైతుల నుంచి కిలో రూ.3–4 చొప్పున కొంటుంటే బయట కాయ ఏకంగా రూ.20–30 ఉంటోంది.చివరికి కరివేపాకు సైతం కిలో రూ.180 పలుకుతోంది. పచ్చి మిర్చి రూ.79, క్యాప్సికం రూ.75, కూరమామిడి రూ.100కు తక్కువ లేదు. ఇవన్నీ పండించిన రైతులకు పదో పరకో దక్కుతుంటే పచ్చ సిండికేట్ మార్కెట్లో వినియోగదారుల జేబులను గుల్ల చేస్తోంది. బియ్యం.. బాబోయ్! అన్నపూర్ణగా పిలుచుకునే ఆంధ్రప్రదేశ్లో బియ్యం రేట్ల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. వరి పండించే రైతులకు 75 కిలోల బస్తాకు రూ.1,100–1,500 మాత్రమే దక్కుతుంటే మార్కెట్లో వినియోగదారుడు 26 కిలోల బస్తా రూ.1,600 పెట్టి కొనాల్సి వస్తోంది. పది రోజుల క్రితంతో పోలిస్తే బస్తాకు రూ.300 దాకా రేట్లు పెంచారు. బాస్మతి బియ్యం సైతం కిలో రూ.80 నుంచి రూ.110–150కి పెరిగాయి. దావత్ బియ్యం అయితే కిలో రూ.230కిపైగా ఉంది. వాస్తవానికి గత నెలలోనే మిల్లర్లు, బియ్యం సిండికేట్ సన్నరకాల బియ్యంపై రేట్లు పెంచారు. క్వింటాకు ఏకంగా రూ.400పైనే బాదారు. హోల్సేల్ నుంచి మార్కెట్లోకి వచ్చే సరికి కర్నూలు సోనా 26 కిలోల బస్తా రకాన్ని బట్టి రూ.1,599, రూ.1699కిపైగా ఉంటోంది. ఇష్టానుసారం బియ్యం రేట్లను పెంచేస్తుంటే చంద్రబాబు సర్కార్ కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు. కోడి మాంసం కిలో రూ.420 రాష్ట్రంలో పౌల్ట్రీ రంగంలో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పుణ్యమా అంటూ గుడ్డు రేటు భారీగా పతనమై పౌల్ట్రీ రైతులను ముంచేసింది. మరోవైపు కోడి మాంసం రేటు రూ.400–420కి ఎగబాకి వినియోగదారులకు షాకిచ్చింది. చివరికి కోడి మాంసాన్ని ప్యాకింగ్ చేసే ప్లాస్టిక్ కవర్లు, పెళ్లిళ్లలో వేసే విస్తరులు, గ్లాసుల రేట్లకు కూడా రెక్కలు రావడం చంద్రబాబు సర్కార్ అసమర్థతకు నిదర్శనంగా నిలుస్తోంది. కర్రీ పాయింట్లో కూరల ధరలు రూ.5–10 వరకు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో వంట చేసుకోలేక.. బయట కొనుక్కొని తినలేక సగటు జీవి నిత్యం నరకం అనుభవించాల్సి వస్తోంది.రేషన్లో కందిపప్పు కట్.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసరాల రేట్లు అమాంతం పెరుగుతుంటే.. పేదలకు ఇచ్చే రేషన్ మాత్రం కుంచించుకుపోతోంది. జాతీయ ఆహార భద్రత చట్టానికి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడుస్తూ రేషన్ వ్యవస్థను దిగజార్చింది. గత ప్రభుత్వంలో నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని ఎండీయూ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సమర్థంగా అందిస్తే చంద్రబాబు సర్కార్ కక్షపూరితంగా ఆ వ్యవస్థనే రద్దు చేసింది. బియ్యం నాణ్యతకు తిలోదకాలిచ్చి అక్రమ రవాణాకు గేట్లు తెరిచింది. ఫలితంగా పేదలు తినాల్సిన బియ్యం వారి ఇళ్లకు చేరకుండా దొడ్డిదారిన పోర్టుల ద్వారా విదేశాలకు తరలిపోతోంది. ఇక మార్కెట్లో కందిపప్పు రేటు అందనంత ఎత్తులో ఉంటే చౌక దుకాణాల ద్వారా ఇవ్వకుండా మంగళం పాడేసింది. గోధుమ పిండిని సైతం అర్ధంతరంగా నిలిపివేసింది. కిలో రూ.20 చొప్పున జిల్లా కేంద్రాల్లో పంపిణీ చేస్తామని ప్రకటించి చేతులు ఎత్తేసింది.పౌష్టికాహారంలో భాగంగా ఇవ్వాల్సిన రాగులు, జొన్నల పంపిణీని సైతం గాడి తప్పించింది. సబ్సిడీపై ఇచ్చే నూనెలను సైతం ఎత్తేసింది. ఎన్నికల ప్రచారంలో రేషన్ దుకాణాల ద్వారా ఏకంగా 18 రకాల నిత్యావసరాలను ఇస్తామని నమ్మబలికి దారుణంగా మోసం చేసింది. రేషన్లో కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం, అరకొర పంచదార మినహా చంద్రబాబు సర్కారు పేదలకు ఒరగబెట్టిందేమీ లేదు. గ్యాస్ కోసం క్యూ కట్టి..ప్రజలకు బూటకపు కబుర్లు చెప్పి మోసం చేయడంలో తాను దిట్ట అని చంద్రబాబు రుజువు చేసుకున్నారు. ఒకవైపు గ్యాస్ సంక్షోభం ముంచుకొస్తుంటే ఏపీలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని ప్రకటనలు గుప్పించి చేతులు దులుపుకొన్నారు. కూటమి సర్కారు వచ్చాక వంట గ్యాస్ రూ.110 పెరిగింది. కమర్షియల్ గ్యాస్పై తాజాగా రూ.115 చొప్పున పెంచడంతో పాటు ఆంక్షలు విధించడంతో హోటల్ రంగం కుదేలైంది. వాస్తవానికి గృహ వినియోగ గ్యాస్ విషయంలో పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల పాటు గ్యాస్ బుకింగ్ వ్యవధిగా నిర్ణయించారు. అయితే పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులు బుకింగ్ కోసం ప్రయత్నిస్తే 35 రోజుల తర్వాతే బుకింగ్లు చేసుకోవాలని మెసేజ్లు వస్తున్నాయి. గ్యాస్ బుక్ చేసుకున్న 10–15 రోజుల తర్వాత కూడా ఏజెన్సీలు డెలివరీ చేయలేకపోతున్నాయి. సాధారణ రోజుల్లో వచ్చే స్టాకు కంటే ఇప్పుడు 20 శాతం తగ్గించి ఇస్తుండటం, పెండింగ్ డెలివరీలు పెరిగిపోవడంతో ఏజెన్సీలు చేతులు ఎత్తేస్తున్నాయి. ఇదే అదనుగా చంద్రబాబు అనుకూల ఏజెన్సీలు దొడ్డిదారిన గ్యాస్ను బ్లాక్మార్కెట్కు తరలిస్తూ దండుకుంటున్నాయి. సామాన్య ప్రజలు మాత్రం సిలిండర్లతో మండుటెండలో క్యూలలో నిల్చోవాల్సిన దుస్థితి దాపురించింది. -
అమరావతి కాదు.. ATM ప్రతీ పైసా లెక్క చెప్పకపోతే.. బాబుపై MLC కల్పలతా రెడ్డి ఫైర్
-
టీడీపీ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటు
-
TDP నేతల రాసలీలలు.. బట్టలు విప్పి నాగిని డ్యాన్స్.. బయటపడ్డ సంచలన వీడియో
-
నెల్లూరు: టీడీపీ నాయకుల రాసలీలల వీడియో వైరల్
సాక్షి, నెల్లూరు జిల్లా: చిల్లకూరు మండలం టీడీపీ నాయకుల రాసలీలల వీడియో వైరల్గా మారింది. తమ్మినపట్టణం కోదండ రామస్వామి ఛైర్మన్ సతీష్ యాదవ్ కామలీలలు వెలుగులోకి వచ్చాయి. ఓ మహిళతో గెస్ట్ హౌస్లో ముగ్గురు టీడీపీ నేతలు కలిసి గానా బజానా దృశ్యాలు కలకలం రేపుతున్నాయి.బొల్లవోలు టీడీపీ నాయకుడు దువ్వూరు వినయ్ బట్టలు విప్పి నాగినీ డ్యాన్స్ వైరల్గా మారింది. టీడీపీ నేతలు రోజురోజుకు దిగజారిపోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర ఆలయ ఛైర్మన్లు అసభ్యకరమైన నృత్యాలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.కాగా, అధికార టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నేతలు కామకేళీలో ఒకరిని మించి మరొకరు అన్నట్లు రాసలీలల్లో మునిగి తేలుతున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం మరచిపోయి వివాహేతర సంబంధాల్లో బిజీగా గడుపుతున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు డ్రగ్స్ పార్టీలు, రాసలీలల్లో మునిగి తేలుతుండడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ పార్టీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ హైదరాబాద్లో జరిగిన ఒక డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే.ఇటీవలే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలల వీడియోలు బయటకు రావడంతో దానిపై రాజకీయ దుమారం రేగింది. జనసేనకు చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధించినట్లు ఒక మహిళ వీడియోలు విడుదల చేయడం ఇటీవల కలకలం రేపాయి. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. కూటమిలో ప్రధానంగా టీడీపీ, జనసేన నేతలకు సంబంధించి తరచూ రాసలీలలు, లైంగిక వేధింపులు, డ్రగ్స్ వ్యవహారాలు బయట పడుతున్నాయి.నెల్లూరు చిన్నబజార్ పోలీస్స్టేషన్ పరిధిలోని నాలుగు లాడ్జీల్లో నగర ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెంకటాచలం మండలం నిడుగుంటపాళేనికి చెందిన టీడీపీ నేత రావూరు రాధాకృష్ణ ఓ మహిళతో గడుపుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈయన టీడీపీ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి అత్యంత ఆప్తుడు. చౌటపాళెం ప్రాథమిక వ్యవసాయ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కూడా. -
చంద్రబాబు ప్రభుత్వానికి పతనం తప్పదు
పులివెందుల/రూరల్: ప్రజా వ్యతిరేక విధానాలను వీడకపోతే టీడీపీ కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని వివిధ పార్టీలతో కూడిన అఖిలపక్షం హెచ్చరించింది. పులివెందుల సహా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలను త్వరలో పూర్తిచేసి ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ రంగంలో ప్రారంభించాలని డిమాండ్ చేసింది. పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలను అఖిలపక్ష బృందం గురువారం సందర్శించింది. కళాశాలలో అత్యాధునికంగా నిర్మించిన అవుట్ పేషెంట్ (ఓపీ), ఇన్పేషెంట్(ఐపీ) విభాగాలను పరిశీలించింది. పులివెందుల మెడికల్ కాలేజీకి వచ్చిన 50 సీట్లను టీడీపీ కూటమి ప్రభుత్వం వెనక్కి పంపడంపై అఖిలపక్షం మండిపడింది. కాలేజీలోని అత్యాధునిక పరికరాలు వేరే ప్రాంతాలకు తరలించడంతోపాటు గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నియమించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతోపాటు భారీగా సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడమేంటని ప్రశ్నించింది.అన్ని వసతులు ఉన్నా నేడు సాధారణ ఆస్పత్రిలా పులివెందుల మెడికల్ కాలేజీని మార్చేయడమేంటని నిలదీసింది. రోగులు, ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్న అఖిలపక్ష బృందం రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసన వ్యక్తం చేసింది. పీపీపీ విధానాన్ని రద్దుచేసి వైద్య కళాశాలల్ని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేసింది. అఖిలపక్ష బృందంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి, సీపీఎం నేత కె.ప్రభాకర్రెడ్డి, సామాజిక ఉద్యమనేత ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక అధ్యక్షుడు కె.నారాయణ, బీసీ చైతన్య సమితి అధ్యక్షుడు బీసీ రమణ, విద్యార్థి, యువజన, పౌరసంస్థల కన్వినర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్రెడ్డి, సామాజికవేత్త డాక్టర్ వసుంధరతదితరులు ఉన్నారు. ప్రభుత్వ మొండివైఖరి తగదు ఈ సందర్భంగా అఖిలపక్ష బృందంలోని ప్రతినిధులు మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు తెచ్చి.. అందులో 7 కళాశాలలను ప్రారంభించిందన్నారు. మిగిలిన 10 కళాశాలలు నిర్మాణంలో ఉండగా కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు, పౌర సంస్థలు ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదన్నారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను ప్రైవేటుకు అప్పజెబితే రిజర్వేషన్లు అమలు కావని, పేద విద్యార్థులు, ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోతారని చెప్పారు. పేద రోగులకు ఉచిత వైద్యం అందదన్నారు. ప్రభుత్వం వైద్య రంగంలో పీపీపీ విధానానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. దాదాపు రూ.150 కోట్ల విలువ చేసే 50 ఎకరాల భూమిని, రూ.412 కోట్లతో నిర్మించిన భవనాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే ధోరణిని విడనాడాలన్నారు. 2024–25 సంవత్సరంలోనే కేటాయించిన 50 ఎంబీబీఎస్ సీట్లను చంద్రబాబు ప్రభుత్వం వద్దనడం దుర్మార్గమని మండిపడ్డారు. ఫీజులు కట్టలేక వందలాది సీట్లు ఖాళీ ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ కన్వినర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రైవేటు వైద్య కళాశాలల్లో అధిక ఫీజులు కట్టలేక వందలాది సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ కారణంగానే పీపీపీ టెండర్లలో ఎవరూ పాల్గొనడం లేదనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలన్నారు. జన చైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఈవెంట్ల పేరిట వేలాది కోట్ల రూపాయలను మంచినీళ్లప్రాయంగా దుబారా చేస్తున్నారన్నారు. అందులో ఏ కొంచెం ఖర్చుపెట్టినా నిర్మాణంలో ఉన్న 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు పూర్తవుతాయని, లక్షలాదిమంది పేద రోగులకు ఉచిత వైద్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలనే లక్ష్యంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతులు తెచ్చారు. వాటిలో 7 కళాశాలలను ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న 10 కళాశాలలను టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించాలనుకోవడం దురదృష్టకరం. ప్రభుత్వం మొండిగా ముందుకెళితే వైఎస్సార్సీపీ తరఫున పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తాం. – ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్సార్ కడప జిల్లాపై టీడీపీకి కక్ష వైఎస్సార్ కడప జిల్లా అన్నా, పులివెందుల నియోజకవర్గమన్నా తెలుగుదేశం పార్టీకి కక్ష ఉంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక భవన నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. పులివెందులలోనూ కళాశాల అభివృద్ధి జరగలేదు. పిడుగురాళ్ల, పులివెందుల మెడికల్ కళాశాలలను వెంటనే ప్రారంభించాలి. – తులసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు 50 సీట్లు వెనక్కిచ్చిన బాబువైఎస్సార్సీపీ హయాంలో పులివెందులలో సుమారు 50 ఎకరాలలో రూ.500 కోట్లతో ప్రభుత్వ మెడి కల్ కళాశాల నిర్మించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 50 మెడికల్ సీట్లు కేటాయిస్తే వాటిని రద్దుచేసి వెనక్కి పంపిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,500 సీట్లు ప్రైవేటీకరణైతే విద్యార్థులు భవిష్యతేం కావాలి. – గుజ్జుల ఈశ్వరయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కార్పొరేట్కు ఇస్తే ఒప్పుకోం రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలను కార్పొరేట్కు ఇస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. – డాక్టర్ వసుంధర, సామాజికవేత్త -
బ్లడీ బాస్టర్డ్.. సామాన్యుడిపై TDP ఎమ్మెల్యే బూతు పురాణం
-
“ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ నా దగ్గరకు ఎందుకు వచ్చారు?’
శ్రీకాకుళం: గిరిజనులపై టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ దూషణలకు దిగారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే అశోక్ను కలిశారు గిరిజన సంఘం నేతలు. అసెంబ్లీలో ఆదివాసీల సమస్యలపై మాట్లాడాలని ఎమ్మెల్యేను కోరారు గిరిజనులు. అయితే వారిపై ఎమ్మెల్యే అశోక్ దూషణలకు దిగారు. “బ్లడీ బాస్టర్డ్… మీరు నన్ను ప్రశ్నించడం ఏంటి?”, బుర్ర ఉండి మాట్లాడుతున్నారా? లేక బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా?, “ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ నా దగ్గరకు ఎందుకు వచ్చారు?’, నేను ఏం చేయాలో కూడా మీరు చెప్పాలా?, వాడెవడు నాకు చెప్పడానికి?, ఏం చేయాలో నేను చేస్తా’ అంటూ అవమానకర రీతిలో మాట్లాడారు.టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ గిరిజనులపై బూతు పురాణం మాట్లాడిన ఘటనపై స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో ఇచ్చాపురం నియోజకవర్గంలో ఆయనపై మరింత అసంతృప్తి పెరిగింది. -
శవాన్ని తీసుకెళ్తుంటే 100 మంది దాడి చేశారు.. డిప్యూటీ సీఎంకి ఒకటే ప్రశ్న.
-
అమరావతిలో బాబు అవినీతి యజ్ఞం
-
కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు... మాకు ఆకలేస్తే అడగాల్సింది మిమ్మల్నే కదా..
-
ఎవరికీ ‘చెప్పు’కోలేక..!
సాక్షి, ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చంద్రబాబు సర్కారు గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో గడిచిన రెండేళ్లుగా చోటుచేసుకుంటున్న ఘటనల తీవ్రత తగ్గించేందుకు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో బడిబాట పట్టి తిమ్మిని బమ్మి చేసేందుకు యత్నించారు. వాస్తవానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పాఠశాలలను నాడు–నేడు కింద అభివృద్ధి చేయడంతోపాటు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద నాణ్యమైన కిట్లు పంపిణీ చేశారు. వాటిని విద్యా మిత్ర కిట్లుగా పేరు మార్చిన చంద్రబాబు సర్కారు నాణ్యతను గాలికొదిలేసింది. పంపిణీ చేసిన రోజుల వ్యవధిలోనే బ్యాగులు చినిగిపోయి, బూట్లు దెబ్బతిన్నాయి. విద్యార్థులు డబ్బు వెచ్చించి బ్యాగులు కొనుగోలు చేయడంతోపాటు బూట్లకు బదులు చెప్పులు వేసుకుని పాఠశాలలకు వెళ్తున్న పరిస్థితి. సమస్యలు ఎవరికీ చెప్పుకోలేక సర్దుకుపోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్యా మిత్ర కిట్లో ఇచ్చిన బ్యాగులు చినిగిపోవడంతో సొంత బ్యాగులతో ఇలా.. -
Andhra Pradesh: 28న శాసనసభ ప్రత్యేక సమావేశం
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ ఈ నెల 28న ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేరుతో బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. 28వ తేదీ ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశమవుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. దానిని కేంద్రానికి పంపించి.. పార్లమెంట్ సమావేశాల్లో అమరావతిని రాజధానిగా గుర్తించాలని కోరనున్నట్లు తెలిసింది. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే.. దానిపై తప్పనిసరిగా కేంద్రం స్పందిస్తుందనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. శాసనసభలో మాత్రమే తీర్మానం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. మండలిలో వైఎస్సార్సీపీకి మెజారిటీ ఉండడం.. ఆ పార్టీ సభ్యులు రాజధాని రైతుల సమస్యలపై ప్రశ్నిస్తుండడంతో కేవలం శాసనసభను మాత్రమే సమావేశపరచి.. తీర్మానం చేయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. నేడు కేబినెట్ సమావేశంసీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి. -
‘పచ్చ పత్రికల కథనాలే బదిలీలకు ప్రామాణికమా?’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలన అంటే పచ్చపత్రికల కట్టుకథలే అన్నట్టు వ్యవహరిస్తూ... ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వేధిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. గురువారం.. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టారు.రాష్ట్రంలో నిఘా వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. ఒక మాజీ సీఎస్ జవహర్ రెడ్డి నెల్లూరు వెళ్లకపోయినా, ఆయన ఐఏఎస్ అధికారులతో సమావేశం అయ్యారని ఎల్లో మీడియాలో వచ్చిన అబద్ధపు వార్తను పట్టుకుని నీలకంఠారెడ్డి లాంటి అధికారులను బదిలీ చేయడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ నివేదికల కంటే ఇంటి చాడీలకే ఈ ప్రభుత్వం విలువనిస్తోందని ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...బాబు హయాంలో ప్రతి గడపకీ కక్ష రాజకీయమే..వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలోని ప్రతి గడపకీ రేషన్ డోర్ డెలివరీ చేస్తే.. కూటమి నేతలు మాత్రం ప్రతి గడపకీ కక్షా రాజకీయాలు పరిచయం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబులో తడబాటు కనిపిస్తోంది. 151 పైగా ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉన్నా.. కుమారుడు లోకేష్, భాగస్వామి పవన్ కళ్యాణ్, లేదా అధికారులు వెన్నుపోటు పొడుస్తారని భయపడున్నట్టున్నారు. మీ పాలన దినదినగండం నూరేళ్లు ఆయుష్షు అన్నట్టు సాగుతోంది.జరగని మీటింగ్పై బాబు ఉలికిపాటు..రాష్ట్రంలో నేను నిప్పులాంటి నాయకుడ్ని అని చెప్పుకునే చంద్రబాబు... ఇవాళ నిఘా వ్యవస్థలను కూడా నమ్మకుండా తడబాటు పడుతూ తప్పుడు అడుగులు వేస్తున్నారు. నెల్లూరులో ఓ మాజీ అధికారి కుటుంబంలో వివాహం జరుగుతుంటే అక్కడికి మాజీ సీఎస్ జవహర్ రెడ్డి వస్తే... ఆయన్ను నీలకంఠారెడ్డి కలిసారని, కొంతమంది ఐఏఎస్ లతో జవహర్ రెడ్డి మీటింగ్ పెట్టారని ఓ ఎల్లో మీడియా పత్రికలో కట్టుకథను వండి వార్చితే.. దాన్ని ఆధారంగా చేసుకుని నీలకంఠా రెడ్డి ని ఎలా బదిలీ చేస్తారు? ఇంత దుర్మార్గంగా ఎలా వ్యవహరిస్తారు?అసలు జవహర్ రెడ్డి నెల్లూరే వెళ్లనప్పుడు ఐఏఎస్ లతో ఎలా సమావేశం నిర్వహిస్తారు? ప్రభుత్వం ఎందుకు అంతలా ఉలిక్కిపడుతోంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థకు విలువ లేకుండా ఇంటి చాడీలకు ఎందుకు విలువనిస్తున్నారు? పీఎస్ ఆర్ ఆంజనేయలు, పీవీ సునీల్ కుమార్, జాషువా, విశాల్ గున్నీ, కాంతిరాణా టాటా, సంజయ్, నాయక్ వంటి అధికారులు చేసిన పాపం ఏంటి?గత ప్రభుత్వంలో పనిచేస్తే వారి మీద ఈ విధంగా దాడి చేస్తారా? మీ ఇంటి దగ్గర చదువుకుని ఉద్యోగాలు చేయడం లేదు కదా? వాళ్ల తల్లిదండ్రుల రక్తం కష్టంతో ఉన్నత చదువులు చదువుకుని దేశంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగిన వాళ్లను మీ రాజకీయ వేధింపులకి బలి చేయడం ఎంత వరకు సమంజసం? వైఎస్ జగన్ హయాంలో హుందాతనం..వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ హయాంలో పనిచేసిన వ్యక్తులను పదవుల్లో కొనసాగించామే తప్ప కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడలేదు. ప్రవీణ్ ప్రకాష్, గిరిధర్, కృష్ణబాబు, ప్రద్యుమ్న, సతీష్ చంద్ర వంటి మీ దగ్గరపనిచేసిన అధికార్లకు కూడా మా ప్రభుత్వ హయాంలో అత్యున్నత మైన బాధ్యతలు అప్పజెప్పి కంటిన్యూ చేశాం. మంచి శాఖల్లో పోస్టింగులిచ్చి.. వారి సేవలను దేశానికి ఉపయోగపడేలా మేం చర్యలు తీసుకుంటే.. మీరు ఒట్టి మాటలు, టిష్యూ పేపర్లలాంటి మీ కరపత్రికల్లో వండి వార్చిన కథనాలను ఆధారాలుగా చేసుకుని జీవోలు మార్చుతున్న వైనం చూస్తుంటే చంద్రబాబు చేస్తున్నది పాలనే కాదన్న విషయం సుష్పష్టంగా అర్థం అవుతోంది.గతంలో తన పాలనలో అవినీతి చక్రవర్తి అని ముద్రవేసుకున్న చంద్రబాబు ఈ దఫా పాలనలో అడుగడుగునా అభద్రతాభావం కనిపిస్తోంది. హోదాలతో సంబంధం లేకుండా కానిస్టేబుల్ నుంచి ఎస్సై, ఎస్బీ నుంచి డీఐజీ వరకూ అదే విధంగా ఐఏఎస్ ల నుంచి ఐపీఎస్ ల వరకు గత ప్రభుత్వంలో పనిచేసిన ప్రతివారినీ కేసులతో వేధిస్తున్నారు. ఇదేనా పరిపాలన? ఇవన్నీ చంద్రబాబు పాలనా వైఫల్యానికి, చేతగానితనానికి అద్దం పడుతున్నాయి.అనుభవం ఉన్న అధికారులను అణగద్రొక్కుతూ, అడుగులుకు మడుగులు ఒత్తుతున్న అధికారులను మాత్రం అందలం ఎక్కిస్తున్నారు. అవినీతి అధికారులకా గత చంద్రబాబు ప్రభుత్వంలో విచారణ ఎదుర్కొన్న అధికారులు మరలా ఇవాళ పెత్తనం చలాయిస్తున్నారు. గతంలో బాబు పాలనలో జరిగిన స్కాముల్లో ఆ అవినీతి అధికారులంతా పాత్రధారులు, సూత్రధారులుగా ఉన్నవాళ్లే.బాబు పాలనలో కక్ష సాధింపులు..ఇవాళ చంద్రబాబు తనమీదున్న కేసులను ఎలాగూ కొట్టేయించుకుంటున్నాడు. తాను చేస్తున్న అవినీతి అంతా అధికారులతో చేయిస్తున్నాడు. పాలన పూర్తిగా గాలికొదిలేశాడు. బ్యూరోక్రసీని బలిపశువును చేసి... అందులో అధికారులను సమిధిలుగా మార్చుతున్నాడు. చివరకు పక్కరాష్ట్రానికి వెళ్లి పనిచేస్తున్న అధికారుల మీద కూడా కక్షకా ద్వేషాలు చూపిస్తున్నాడు. రాముడు లేని రాజ్యంలో కోతులే రాజ్యంలా.. అధికార ప్రభుత్వంలో తమ కులంలో ఉన్న కొంతమంది అధికారులే పెత్తందారులగా చలామణీ అవుతున్నారు. నీలకంఠారెడ్డిని బదిలీ చేయడానికి ప్రభుత్వం చూపిస్తున్న కారణం, జరిగిన సంఘటన రెండూ సంబంధం లేని ఘటనలే.పుడ్ సేఫ్టీ అధికారి ముసుగులో పూర్ణచంద్రరావు అనే వ్యక్తి తాను చేసిన అతి ప్రవర్తనను నీలకంఠారెడ్డి ఖండించాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ నేపథ్యంలో.. పూర్ణచంద్ర రావు వెనుకున్న లోకేష్, తన సామాజికవర్గం చెందిన వాడు కావడంతోనే... నీలకంఠా రెడ్డిపై జులుం ప్రదర్శించారని చంద్రశేఖర్ తేల్చి చెప్పారు. మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ, సీఎం చంద్రబాబులు సకల విఫల శాఖా మంత్రులగా రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తూ.. అధోగతి పాల్జేస్తున్నారని తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఏమే, ఒసేయ్ నా.. దళితులంటే అంత చులకన.. మహిళతో ఆదిరెడ్డి ఆడియో.. జడ శ్రవణ్ మాస్ వార్నింగ్
-
యుద్ధం పేరుతో బాబు మోసం జగన్ కీలక వ్యాఖ్యలు
-
మా ప్రభుత్వం దోచేస్తుంది.. ఆధారాలు బయటపెట్టిన కొలికపూడి
-
కూటమికి ఝలక్.. కొలికపూడి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కూటమి సర్కార్ టార్గెట్గా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తిరువూరు నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. దీంతో, కొలికపూడి పోస్టు చర్చనీయాంశంగా మారింది.తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తాజాగా బెల్ట్ షాపుల నిర్వహణపై స్పందించారు. వైన్ షాపుల ఓనర్లు సిండికేట్గా ఏర్పడి బెల్టు షాపులు నడుపుతున్నారని ఆరోపించారు. బెల్ట్ షాపులకు ఎమ్మార్పీపై 20 నుంచి 30 రూపాయలు పెంచి అమ్ముతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్ట్ షాపుల్లో క్వార్టర్ బాటిల్పై అదనంగా 50 వసూలు చేస్తున్నారంటూ పోస్టులో తెలిపారు. లిక్కర్ సిండికేట్తో ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలను ఎక్సైజ్ అధికారులు పాటించడం లేదు. గ్రామాల్లో బెల్టు షాపులను తొలగించాలని మహిళలు ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ బెల్ట్ షాపుల దందా కొనసాగుతోందన్నారు. దీంతో, కొలికపూడి పోస్ట్ మరోమారు చర్చనీయాంశంగా మారింది. -
జనసేన అంటే అంత చిన్న చూపా.. టీడీపీపై బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు
-
బోట్ల చోరీలో టీడీపీ నేతల హస్తం: కాకాణి
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో పోలీసుల ఆధీనంలో ఉన్న బోట్లు దొంగలించుకుపోతే ఇంత వరకు చర్యలు ఎందుకు లేవని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బోట్ల చోరీ వెనుక ఉన్న టీడీపీ నేతలను ఎందుకు వదిలేశారని అడిగారు. చోరీ వెనుక పోలీసులు, టీడీపీ నేతల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి కాకాణి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘స్థానిక మత్స్యకారులు తమ ప్రాణాలకు తెగించి తమిళనాడు బోట్లు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై బిట్రగుంట, కావలి రూరల్లో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, పోలీసుల ఆధీనంలో ఉన్న బోట్లు ఎలా మాయం అయ్యాయి.. ఇంతవరకు ఎందుకు చర్యలు లేవు?. సంబంధిత అధికారుల మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. బోట్ల చోరీ వెనుక ఉన్న టీడీపీ నేతలను ఎందుకు వదిలేశారు?.మంత్రులు ఎందుకొచ్చారో.. అధికారులకు ఏం ఆదేశాలు ఇచ్చారో అర్థం కావడం లేదు. బోట్ల చోరీ విషయంలో మత్స్యకారులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. చోరీ వెనుక పోలీసులు, టీడీపీ నేతల హస్తం ఉంది. తమిళనాడులో ఉండే బోట్లను వెనక్కి తీసుకొచ్చి.. జువ్వలదిన్నెలో పెట్టాలి. ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణతో పాటు బోట్ల చోరీ మీద వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. మత్స్యకారులకు మేము అండగా ఉంటాం. అవసరమైతే వైఎస్ జగన్ కూడా మత్సకారులతో మాట్లాడేందుకు నెల్లూరుకు రావచ్చు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
టాటా.. బైబై.. ఉస్తాద్ రొట్టె కొట్టుడు డైలాగ్స్
-
కూటమిలో కామ పిశాచులు
-
సేవ్ ఏపీ ఫైబర్ నినాదాలతో దద్దరిల్లిన బాబు కరకట్ట
-
చంద్రబాబు మరోసారి నిసిగ్గుగా క్రెడిట్ చోరీ: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: తాము చేయని పనుల్ని కూడా చేశామంటూ అబద్ధాల ప్రచారాలు చేసుకోవడం కూటమి సర్కార్కు అలవాటుగా మారిపోయిందని.. నిన్న అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన చేసిన ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంటే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ నేత, పరిశ్రమలశాఖ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. గతంలో ఆర్సెలార్ మిట్టల్ వంటి పరిశ్రమల్ని రాష్ట్రానికి తీసుకు రావడానికి వైఎస్ జగన్ కృషి చేస్తే.. పరిశ్రమల్ని తరిమేస్తున్నారంటూ దుష్ప్రచారాలు చేసిన కూటమి పార్టీలు.. ఇప్పుడు 24 నెలల్లో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలపై శ్వేతపత్రం ప్రకటించగలరా? అంటూ గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏమన్నారంటే..:కూటమి ప్రభుత్వం మరో క్రెడిట్ చోరీ:మనం సాధించలేని ఘనత గురించి మనమే సాధించినట్లు చెప్పుకోవచ్చనే దానికి నిన్న అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ శంఖుస్ధాపనే ఉదాహరణ. చంద్రబాబు, లోకేష్, మంత్రులు పరస్పరం భజన చేసుకున్నారు. ఆర్సెలార్ మిట్టల్ ఈ రాష్ట్రానికి రావడానికి పునాదులు వేసింది 2022లో నాటి సీఎం శ్రీ వైయస్ జగన్ అనేది ఒకసారి వీళ్లంతా గుర్తుచేసుకోవాలి. విశాఖలో ఆర్సెలార్ మిట్టల్ టేకోవర్ చేసుకున్న ఎస్ఆర్ ప్లాంట్ విస్తరణ కోసం దావోస్లో జగన్గారితో లక్ష్మీ మిట్టల్ కుమారుడు ఆదిత్యమిట్టల్ ఒప్పందం చేసుకున్నారు.దీంతో పాటు కర్నూలులో గ్రీన్ కో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకూ అదే సమయంలో ఒప్పందం జరిగింది. ఆ విద్యుత్ ప్రాజెక్టులో ఆర్సెలార్ భాగస్వామి అయింది. ఈ పెట్టుబడులతో పాటు కొత్త స్టీల్ ప్లాంట్ ఏపీలో ఏర్పాటు చేయాలని జగన్గారు కోరడంతో మిట్టల్ సముద్ర తీరం వెంట భూములు కేటాయిస్తే తప్పకుండా ప్లాంట్ పెడతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎస్, నేను కూడా ఉన్నాం. మిట్టల్ సంస్థకు భూమి కేటాయించాలని జగన్ చెబితే.. మేం కాకినాడ, మూలపేట పోర్టు, నక్కపల్లి రూపంలో మూడు ఆప్షన్లు వారికి ఇచ్చాం. ఇందులో కంపెనీ ప్రతినిధులు 2024 ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల మధ్య నక్కపల్లిలో భూమి తమకు అనువుగా ఉంటుందని ఎంచుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారినా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. దీన్ని మేం స్వాగతిస్తున్నాం.నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ సంగతేంటో చెప్పండి?:అదే సమయంలో నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని మేం నిర్ణయం తీసుకున్నాం. దీనికి దేశంలోని అన్ని రాష్ట్రాలు పోటీ పడినా.. హిమాచల్ప్రదేశ్, గుజరాత్, ఏపీకి మాత్రమే ఈ అవకాశం దక్కింది. దాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం విస్మరిస్తోంది. వారు భూములు కావాలంటే అందుబాటులో ఉన్న భూములు ఇవ్వొచ్చు. కానీ, అలా కాకుండా భూసేకరణ అంటూ వివాదాలు సృష్టించారు. దానివల్లే బల్క్డ్రగ్ ముందుకు సాగలేదు.ఇంకా బల్డ్ డ్రగ్ పార్క్ వల్ల జబ్బులు వస్తాయని కూటమి పార్టీల నాయకులు ఎన్నికల సమయంలో చేసిన దుష్ప్రచారం వల్ల కూడా అది ముందుకు సాగడం లేదు. కేంద్రం, రాష్ట్రాలతో పోరాడి తెచ్చిన ఈ బల్క్ డ్రగ్ పార్క్ రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ముందుకెళ్లకపోవడానికి కూటమి పార్టీలే కారణం. ఇప్పుడు ఆర్సెలార్ మిట్టల్ స్లీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కానీ దీనికి శ్రీకారం చుట్టింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అన్న విషయం గుర్తుంచుకోవాలి.విశాఖ స్టీల్ ప్లాంట్పై ఎందుకు శ్రద్ధ లేదు?:అధికారంలోకి రావడానికి మీరు ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు. ఉపాధి కల్పించలేకపోతే నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి ఇప్పటి వరకు వచ్చిన కంపెనీలు ఎన్ని? అవి కల్పించిన ఉద్యోగాలు ఎన్ని? అన్నదానిపై శ్వేతపత్రం విడుదల చేయండి. మీ పచ్చ మీడియాలో 20 లక్షల కోట్ల పెట్టుబడులంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు.ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్లో మీరు అధికారంలోకి వచ్చాక 20 నెలల్లోనే 10 వేల మంది ఉపాధి పోయింది. దీనికి సమాధానం చెప్పండి. ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మీకు ఎందుకు శ్రద్ధ లేదు? స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్లు, కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపులు ఎందుకు చేస్తున్నారు? ఎన్నికలకు ముందు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలని చెప్పి, ఇప్పుడు మాత్రం వచ్చే ఐదేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. అప్పటివరకూ మీరు అధికారంలో ఉండాలి కదా..రాష్ట్రం వదిలి పారిపోతున్న పరిశ్రమలు:గతంలో రాష్ట్రం నుంచి కంపెనీలు వెళ్లిపోయాయని, అవి ఇప్పుడు తిరిగి వస్తాయని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. అచ్యుతాపురంలో కోకా కోలా కంపెనీ ఈ రాష్ట్రానికి, ప్రజా ప్రతినిధులకు ఓ దండం అని చెప్పి భూమి వెనక్కి ఇచ్చి వెళ్లిపోయింది. ఇలా ఈ 20 నెలల్లో రూ.5,600 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. దీనికి కారణం ఈ ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు పెడుతున్న ఇబ్బందులే. అల్ట్రాటెక్, ఎల్ అండ్ టీ, భారతీ సిమెంట్స్.. ఇలా రాయలసీమలో ఏ సిమెంట్ ఫ్యాక్టరీతో సక్రమంగా పని చేయించుకునే పరిస్ధితి లేదు.పక్కనే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో యూబీ బీర్ ఫ్యాక్టరీని స్కిట్లు వేసుకునే ఎమ్మెల్యే తనకు కప్పం కడితే తప్ప పని చేయకుండా అడ్డుకుంటున్నారు. జిందాల్ సంస్ధ కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని వస్తే, ఊరూపేరు లేని ఓ సినీ నటిని తీసుకుని వాళ్లను వెళ్లగొట్టారు. మీ పాలనలో మీ భూములు వద్దని వెనక్కి వెళ్లిపోయిన కంపెనీల లిస్ట్ నేను బయటపెడతా, దానిపై సమాధానం చెప్పండి. జగన్గారి హయాంలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తే, అది వదిలేసి పారిపోయిన కంపెనీల గురించి చెప్తున్నారు. ఇప్పుడు మీ హయాంలో పారిపోయిన కంపెనీల సంగతేంటో చెప్పండి.పరిశ్రమలు తెచ్చిన జగన్పై దుష్ప్రచారాలు:విశాఖలో రహేజాతో కలిసి ఇనార్బిట్ మాల్కు నాడు జగన్ శంకుస్థాపన చేశారు. దాన్నే నిన్న (సోమవారం) ప్రారంభించారు. అదీ మా కమిట్మెంట్. విశాఖకు ఇనార్పిట్ మాల్ ఓ ల్యాండ్ మార్క్. విశాఖలో ఎన్నో పరిశ్రమలు ఉన్నా ఇనార్పిట్ మాల్ ప్రత్యేకత వేరు. దానికి శంకుస్థాపన చేసింది జగన్. ఈ ప్రభుత్వం తరుచూ మా చిన్నప్పటి నుంచి వింటున్న లులూ మాల్ను ప్రస్తావిస్తుంది. ఈ లులూ మాల్ ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిపోయిందో ఎవరికీ తెలియదు. మేం చేసిన పనులు చెప్పుకోవడం లేదు అంటే, అదే వారికీ మాకూ తేడా. అందుకే ఇప్పటికైనా నిరుద్యోగ యువతపై ఫోకస్ పెట్టి వారికి ఉద్యోగాలు కల్పించడం, లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వడమో చేయాలని ప్రభుత్వాన్ని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. -
‘ఇనార్బిట్’ చుట్టూ ఇగో పాలిటిక్స్
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రానికి పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉద్యోగాలే లక్ష్యమని ప్రగల్భాలు పలికే చంద్రబాబు ప్రభుత్వ అసలు రంగు విశాఖ ఇనార్బిట్ మాల్ ప్రారంభోత్సవం వేళ బయటపడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టుపై ఆయన ముద్ర చెరిగిపోలేదన్న కక్షతోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి దూరంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాదిలోనే అతిపెద్దదైన ఈ మాల్ పనులు గత ప్రభుత్వ హయాంలోనే 70 శాతం పూర్తయ్యాయి. సుమారు రూ. 600 కోట్లతో 8 వేల మందికి ఉపాధి కల్పించే ఈ మెగా ప్రాజెక్టు క్రెడిట్ ఎక్కడ జగన్కు దక్కుతుందోనన్న భయంతోనే విశాఖలోనే ఉన్న లోకేష్ సహా టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదని చర్చ జరుగుతోంది. నగరాభివృద్ధి కంటే రాజకీయ వైషమ్యాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ ఘటన నిరూపిస్తోంది. అభివృద్ధిపై ‘చిన్నచూపు’.. లోకేష్ అక్కసు! రాష్ట్ర ఐటీ, పెట్టుబడుల శాఖ మంత్రిగా ఉండి ఇంత పెద్ద ఎత్తున ఉపాధి కలి్పంచే వేదికను ప్రోత్సహించాల్సింది పోయి, దాన్ని చిన్నచూపు చూడటం దారుణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖను గ్లోబల్ సిటీగా మారుస్తామని ప్రగల్భాలు పలికే లోకేష్ .. కేవలం రాజకీయ వైరంతోనే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. కనీసం స్థానిక ఎమ్మెల్యేలను కూడా వెళ్లనివ్వకుండా కట్టడి చేయడం చూస్తుంటే, అభివద్ధి కంటే రాజకీయ స్వలాభం కోసమే ఈ ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తోందన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలు ఎవరూ హాజరుకాకపోవడంతో సోమవారం విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు చేతుల మీదుగా ఇనార్బిట్ మాల్ను ప్రారంభించారు. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రజలకు పూర్తిస్థాయిలో మాల్ అందుబాటులోకి రానుంది. కార్యక్రమానికి రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా, ఇనార్బిట్ మాల్ సీఈవో రజనీష్ మహాజన్, ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, పోర్టు డిప్యూటీ చైర్పర్సన్ రోషిణి అపరాంజి కోరాటి మాత్రమే హాజరయ్యారు. మాల్ను ప్రారంభించిన రహేజా గ్రూప్ ప్రతినిధులు, ఇనార్బిట్మాల్ సీఈవో రజనీష్ మహాజన్ , పోర్టు చైర్మన్ అంగముత్తు గత ప్రాజెక్టులపై వివక్ష ఈ మాల్ ద్వారా సుమారు 8 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఎన్నికల ముందు ‘జాబ్ క్యాలెండర్’ అంటూ ఊదరగొట్టిన లోకేష్ ఇప్పుడు ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థల పట్ల ఇలాంటి వివక్ష చూపడం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది నిరుద్యోగులను వంచించడమే అంటూ నిరుద్యోగులు పెదవి విరస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభమైన ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ తీరు పట్ల పారిశ్రామిక, వ్యాపార వర్గాలు తప్పుబడుతున్నాయి. ఇదే ధోరణితో ప్రభుత్వం ఉంటే.. పెట్టుబడిదారుల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరిస్తున్నాయి. -
‘రాధాకృష్ణను పథకం ప్రకారం కేసు నుంచి తప్పించారు’
సాక్షి, నెల్లూరు జిల్లా: ఎన్టీ రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబు, లోకేష్ల చేతికి వచ్చాక తెలుగు దొంగల పార్టీగా మారిపోయిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలను తారుమారు చేస్తున్నారని ధ్వజమెత్తారు.‘‘రాధాకృష్ణ నాయుడు అలవాట్లకు సోమిరెడ్డి ప్రేరణ అయి ఉంటుంది. రాధాకృష్ణమ నాయుడు చేతి వేలుకు ఉన్న ఉంగరంతో సహా జనం గుర్తు పెట్టారు. రాధాకృష్ణ దొరికినట్లు కనిపించినా.. టీడీపీ నేత లేడని చెప్పడం హాస్యాస్పదం. ఏ హోమియో వైద్యానికి రాధాకృష్ణ వచ్చాడో పోలీసులు చెప్పగలరా?. పోలీస్ వ్యవస్థకు ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా?’’ అంటూ కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘టీడీపీ పేరు తెలుగు దొంగలు, తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిపోయింది. కూటమి ప్రభుత్వం వ్యవస్థలని తారుమారు చేస్తోంది. కూటమి నేతలు అవినీతి, అక్రమాలు చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ చట్టల్ని ఉల్లంఘిస్తున్నారు. టీడీపీ నేత రాధాకృష్ణమ నాయుడు వ్యభిచార కేసులో పట్టుబడ్డాడు. రాధాకృష్ణమ నాయుడిని పథకం ప్రకారం ఆ కేసులోంచి పోలీసులు తప్పించారు. రాధాకృష్ణ హాస్పిటల్కి వచ్చాడంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు. పోలీసులు దారుణమైన అబద్దాలు చెబుతూ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు?..రాధాకృష్ణతో ఉన్న మహిళని ఏమో ఇబ్బంది పెట్టారు. అమాయకులని, విద్యార్థులని ఇరికించి అసలైన దోషుల్ని విడిచిపెట్టారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలలు చేస్తుంటే అతన్ని వదిలేశారు. నందికొట్కూరు ఎమ్మెల్యే లాడ్జిలో ఉంటే పోలీసులు ఆయన్ని చీకట్లో పంపించేసి సీసీ పుటేజీలు తీసుకెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు కోనేటి ఆదిమూలం, ఆరవ శ్రీధర్, నషీర్ అహ్మద్, కోన రవికుమార్లు రాసలీలలు చేస్తుంటే వదిలేశారు. పోలీసుల సహకారంతో కూటమి నేతలు కొవ్వెక్కి ప్రవర్తిస్తున్నారు. నెల్లూరు లాడ్జిల్లో దాడి చేసిన సమయంలో సీసీ ఫుటేజ్ బయటపెట్టండి. అసలైన దోషుల్ని వదిలేసి నిర్ధోధులని పోలీసులు కేసుల్లో ఇరికిస్తున్నారు...సోమిరెడ్డి పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి దోషుల్ని వదిలేస్తున్నారు.. సోమిరెడ్డి ఎన్నోసార్లు మహిళల చేతుల్లో తన్నులు తిన్నాడు.. సోమిరెడ్డి కార్యాలయానికి వివిధ పనులపై వచ్చే మహిళల్ని సోమిరెడ్డి సిబ్బంది లోబరుచుకుంటున్నారు. రాధాకృష్ణ నాయుడిని అర్ధరాత్రి లైట్లు ఆపేసి డిఎస్పీ ఆఫీస్ నుంచి ప్రైవేట్ వాహనాల్లో తప్పించారు. ఈ ఘటనపై ఎస్పీ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి. నేను చెప్పేది అబద్ధం అయితే ఏ శిక్షకి అయినా నేను సిద్ధమే. మా ప్రభుత్వం వచ్చాక ఈ ఘటనపై విచారణ చేపడతాం’’ అని కాకాణి గోవర్థన్రెడ్డి చెప్పారు. -
ఆదిరెడ్డి అప్పారావు మరో ఆడియో వైరల్
-
చంద్రబాబు దిగిపో.. కూటమికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన ప్రజలు
-
ఎమ్మెల్యేలపై బుసకొడుతున్న ‘కాల్’నాగు!
సాక్షి, అమరావతి: టీడీపీలో ‘కాల్ లిస్టు’ రాజకీయం కలకలం రేపుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేల కదలికలపై టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నిఘా పెట్టిన విషయం బహిర్గతం కావడం హాట్టాపిక్గా మారింది. ఈ వ్యవహారం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ, కూటమి ఎమ్మెల్యేల మధ్చ చిచ్చురేపింది. విజయవాడ నగరంలోని బీజేపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి కాల్ లిస్టును కొద్దిరోజుల క్రితం ఎంపీ సేకరించిన విషయం బయటపడింది. టీడీపీలో కీలక నేతగా ఉండి.. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లిన ఆ ఎమ్మెల్యే తరఫున నియోజకవర్గ వ్యవహారాలను ఆ ప్రధాన అనుచరుడే పర్యవేక్షిస్తున్నారు.ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అందుబాటులో ఉండేది తక్కువ కావడంతో ఆయన ప్రధాన అనుచరుడే నియోజకవర్గ వ్యవహారాలు చూస్తున్నాడు. ఆయన కీలకంగా మారడంతో ఆయన కాల్ లిస్టును చూసి ఎవరెవరితో టచ్లో ఉన్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నారనే విషయాలను ఎంపీ కేశినేని చిన్ని తెలుసుకుంటున్న విషయం బయటపడింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడు, ఆయన వర్గీయులు ఇప్పటికే ఎంపీని నిలదీసినట్టు సమాచారం. ఎంపీ కోసం ఈ లిస్టును సేకరించిన వ్యక్తులతోనూ గొడవకు దిగడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఇదే విషయంపై బీజేపీ ఎమ్మెల్యే సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. చంద్రబాబు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో ఆ బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. తిరువూరు వివాదం నేపథ్యంలోనే.. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్తో ఎంపీకి ఉన్న వివాదమే దీనికి కారణమనే ప్రచారం జరుగుతోంది. కొలికపూడికి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో కొందరు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నట్టు ఎంపీ కేశినేని అనుమానిస్తున్నట్టు చెబుతున్నారు. అందులో టీడీపీతో కలిసి ఉండే బీజేపీ ఎమ్మెల్యే ప్రధానమనే అనుమానం ఉన్నట్టు సమాచారం. అందుకే ఆయన తరఫున నియోజకవర్గ వ్యవహారాలు నడిపే వ్యక్తి కాల్ లిస్టును సేకరించినట్టు తెలుస్తోంది. తిరువూరు ఎమ్మెల్యే కాల్ లిస్టును కూడా ఎంపీకి సంబంధించిన వ్యక్తులు సేకరించినట్టు తెలుస్తోంది. నందిగామ, విజయవాడలోని మరో ఎమ్మెల్యే కాల్ లిస్టులు కూడా సేకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. లోకేశ్ చెబితేనే చేశామంటున్న ఎంపీ వర్గీయులు ఇదిలావుండగా ఎంపీ వర్గీయులు మాత్రం లోకేశ్ చెప్పడం వల్లే తాము ఎమ్మెల్యేల కాల్ లిస్టులు సేకరించి వారు ఎవరితో టచ్లో ఉన్నారో తెలుసుకుంటున్నామని ప్రచారం చేస్తున్నారు. కానీ.. ఎమ్మెల్యేలు మాత్రం ఇంటెలిజెన్స్ సహా అన్ని వ్యవస్థలను వదిలేసి ఎంపీకి ఇలాంటి పనిని లోకేశ్ ఎందుకు అప్పగిస్తారని ప్రశి్నస్తున్నారు.అంతా ఎంపీ పెత్తనమే.. రగులుతున్న ఎమ్మెల్యేలువిజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని మంత్రి లోకేశ్ ఎంపీ కేశినేనికి అప్పగించి ఆయన ద్వారానే అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్న విషయం బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలోనే పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల వ్యవహారాల్లో ఎంపీ కేశినేని చిన్ని తలదూరుస్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో అధికారుల బదిలీలు, కాంట్రాక్టులు, పదవులు సహా ఏ పనైనా తన కనుసన్నల్లోనే జరగాలని పట్టుబడుతున్నారు. తిరువూరులో అయితే ఎమ్మెల్యే అధికారాలను కత్తిరించేసి మొత్తం తానే ఎమ్మెల్యే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.నందిగామ నియోజకవర్గంలోనూ ఎంపీ జోక్యం ఎక్కువగా ఉంది. దీంతో ఆ ఎమ్మెల్యేలు తనకు వ్యతిరేకంగా ఉండటంతోపాటు తనకు అనుమానం ఉన్న మరికొందరి కదలికలు, ఎవరితో టచ్లో ఉన్నారో తెలుçÜుకునేందుకు వారి కాల్ లిస్టులు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయం బయటపడటంతో టీడీపీలో కలకలం రేగింది. ఇంత జరిగినా పార్టీ పెద్దలు ఎంపీకి వత్తాసు పలుకుతుండటాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. -
నెల్లూరులో టీడీపీ అరాచకం
నెల్లూరు(బారకాసు): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. టీడీపీలో చేరని కారణంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్పై కక్షసాధింపు చర్యలకు దిగింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 46వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ వేలూరు ఉమామహేష్ నిర్వహిస్తున్న వాటర్ప్లాంట్ను కారణం చూపకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా ఉన్నపళంగా సోమవారం జేసీబీతో కూల్చేశారు.కార్పొరేటర్ ఉమామహేష్ 2019లో నాడు మంత్రిగా ఉన్న అనిల్కుమార్, అప్పటి 46వ డివిజన్ కార్పొరేటర్ వి.సుధారాణి సొంత నిధులతో అదే డివిజన్లోని చిన్నబజార్ ప్రాంతంలో ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఖాళీ స్థలంలో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్యనేతలు వేలూరు ఉమామహేష్ను కొన్నిరోజులుగా టీడీపీలో చేరాలంటూ అనేక విధాలుగా ప్రలోభాలు పెడుతూ వచ్చారు. ఇందుకు ఉమామహేష్ ఒప్పుకోకపోవడంతో కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలోనే వాటర్ ప్లాంట్ను ఎలాంటి సమాచారం లేకుండానే కార్పొరేషన్ అధికారులు ధ్వంసం చేశారు.ఈ విషయం తెలుసుకున్న ఉమామహేష్ స్థానికులతో కలిసి హుటాహుటిన వాటర్ప్లాంట్ వద్దకు చేరుకుని ఎందుకీ దౌర్జన్యమంటూ కార్పొరేషన్ కింది స్థాయి అధికారులను అడిగారు. తమకు ఏమీ తెలియదని పైఅధికారుల ఆదేశాల మేరకు వాటర్ ప్లాంట్ను తొలగిస్తున్నామని దురుసుగా సమాధానం చెప్పారు. దీనిపై కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఇలా చేయడమేమిటని ఉమామహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటనపై కార్పొరేటర్ ఉమామహేష్ చిన్నబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు 2024 నుంచి తమ పార్టీలో చేరాలంటూ అందుకు రూ.కోట్లు ఇస్తామని ప్రలోభాలు పెట్టడం, తనను అనేక దఫాలుగా అడగడం జరిగిందన్నారు. అందుకు తాను ఒప్పుకోకపోవడంతోనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జిమ్ ఏర్పాటు కోసమే తొలగించాం నగరంలోని చిన్నబజార్ ప్రాంతంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలంలో జిమ్ ఏర్పాటు చేయనున్నట్లు కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. అందులో భాగంగానే కార్పొరేషన్కు చెందిన ఖాళీ స్థలం కాబట్టి అక్కడున్న వాటర్ ప్లాంట్ను తొలగించాల్సి వచ్చిందన్నారు. -
వ్యభిచారం కేసులో దొరికిన టీడీపీ నేత.. తప్పించబోయి పరువు తీసుకున్న పోలీసులు
-
టీడీపీ నేతల రాసలీలలు
సాక్షి టాస్క్ ఫోర్స్: అధికార టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నేతలు కామకేళీలో ఒకరిని మించి మరొకరు అన్నట్లు రాసలీలల్లో మునిగి తేలుతున్నా రు. ప్రజల సమస్యలను పరిష్కరించడం మరచిపో యి వివాహేతర సంబంధాల్లో బిజీగా గడుపుతున్నా రు. ఈ క్రమంలో అధికార పారీ్టకి చెందిన ఓ శాసనసభ్యుడి రాసలీలలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి. తన పేరులోనే వెలిగిపోయే సదరు టీడీపీ ఎమ్మెల్యే ఓ మహిళతో పక్క నియోజకవర్గంలోని హోటల్లో ఏకాంతంగా గడిపి వివాదంలో ఇరుక్కున్నట్లు ప్రసార మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎవరా ఎమ్మెల్యే.. అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆ ఎమ్యెల్యే తరచూ ఆమెతో నల్లమల ఫారెస్ట్కు సమీపంలో ఉండే ఆ ఊళ్లోని హోటల్కు వచి్చవెళ్తున్నట్లు ప్రత్యర్థులు పసిగట్టి నిఘా పెట్టారు.ఇటీవల ఓ రోజు రాత్రి ఆ హోటల్లో ఆ ఎమ్మెల్యే ఆ మహిళతో ఉన్న సమయంలో ప్రత్యర్థులు అక్కడికి వెళ్లారనే విషయాన్ని తెలుసుకున్న ఓ పోలీసు అధికారి ఆగమేఘాలపై అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యేను కాపాడాలనే ఉద్దేశంతో హోటల్లో విద్యుత్ సరఫరాను నిలిపి వేయించారు. చీకట్లో ఎమ్మెల్యేతో పాటు ఆ మహిళను కూడా అక్కడి నుంచి తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతటితో ఆగక.. ఆ ఎమ్మెల్యే, ఆ మహిళకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా హోటల్లోని సీసీ ఫుటేజీ తొలగించినట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే ఆ హోటల్కు ఎదురుగా ఉన్న వ్యాపార సముదాయంలోని సీసీ ఫుటేజీను కూడా మాయం చేయించినట్లు పోలీస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆ హోటల్లో ఏమీ జరగకపోతే అంత హడావుడిగా సీసీ ఫుటేజీని ఎందుకు మాయం చేశారని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. కాగా, సదరు ఎమ్మెల్యే రాసలీలలకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పటికే ప్రభుత్వ పెద్దలకు చేరిందని స్థానిక టీడీపీ నేతలు చెబుతున్నారు. నెల్లూరులో కీలక టీడీపీ నేత బాగోతమిది నెల్లూరు చిన్నబజార్ పోలీస్స్టేషన్ పరిధిలోని నాలుగు లాడ్జీల్లో ఆదివారం నగర ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెంకటాచలం మండలం నిడుగుంటపాళేనికి చెందిన టీడీపీ నేత రావూరు రాధాకృష్ణ ఓ మహిళతో గడుపుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈయన టీడీపీ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి అత్యంత ఆప్తుడు. చౌటపాళెం ప్రాథమిక వ్యవసాయ కో ఆపరేటివ్ సొసైటీ అ««ధ్యక్షుడు కూడా. పోలీసుల దాడుల్లో 17 మంది విటులు, 14 మంది మహిళలు పట్టుబడ్డారు.వీరిలో రాధాకృష్ణ సైతం ఉండడంతో వారందరినీ తీసుకొచ్చి పోలీస్స్టేషన్లో కూర్చోబెట్టారు. విషయం తెలుసుకున్న టీడీపీ కీలక నేతలు ఆయన పేరును తొలగించాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. అప్పటికే ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. పైనుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో సదరు టీడీపీ నేత ఆస్పత్రిలో చూపించుకోవడానికి వచి్చ, సాయి గ్రాండ్ లాడ్జి వద్ద ఉండగా తాము తీసుకొచ్చామని.. విషయం తెలుసుకుని వదిలేశామని పోలీసులు చెప్పుకొచ్చారు. -
టీడీపీ మంత్రి అనుచరుల రాక్షసకాండ
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి రూరల్ మండలం మాధవరం గురికానివాండ్లపల్లెలో టీడీపీ మంత్రి రాంప్రసాద్ అనుచరులు మరో రాక్షస కాండ సాగించారు. మారణాయుధాలతో చెలరేగిపోయారు. కట్టెలు, రాడ్లు, రాళ్లు, మందుబాటిళ్లతో దాడులు చేశారు. నివాస గృహాల్లో పిల్లలు, పెద్దలు, మహిళలు అన్న తేడా లేకుండా దొరికినవారిని దొరికినట్టు చితక్కొట్టి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో 20 మందికిపైగా గ్రామస్తులు గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన గ్రామంలో యుద్ధవాతావరణాన్ని తలపించింది. సేకరించిన వివరాల ప్రకారం.. గురికానివాండ్లపల్లెకు 2023లో అంగన్వాడీ కేంద్రం మంజూరైంది. అయితే స్థానికంగా ఉన్న ఒకరు కోర్టుకు వెళ్లి స్టే తేవడంతో అప్పట్లో నిర్మాణ పనులు ఆగిపోయాయి. తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మించిన పునాదులను పెకలించేందుకు మంత్రి అనుచరులు యత్నిస్తున్నారు. దీనిలోభాగంగానే మంత్రి అనుచరులు జేసీబీతో ఆదివారం ఆ గ్రామానికి వచ్చారు. పునాదులు పెకలించేందుకు యత్నించడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో మంత్రి అనుచరుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే రాయచోటి నుంచి 20 వాహనాల్లో పచ్చ గూండాలు భారీగా గ్రామానికి చేరుకుని గ్రామస్తులపై దాడులకు తెగబడ్డారు. మారణాయుధాలతో స్వైరవిహారం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు చేష్టలుడిగి చోద్యం చూస్తుండిపోయారు. కనీసం నిలువరించకుండా ప్రేక్షకపాత్ర పోషించారు. దాడుల్లో బాలినేని మనోజ్ తలకు బలమైన గాయాలయ్యాయి. కసినేని రామానుజులమ్మ స్పృహతప్పి పడిపోయారు. చంటిబిడ్డ తల్లి రెడ్డిరాణి తీవ్రంగా గాయపడ్డారు. పెయింటర్ మల్లికార్జున, అనారోగ్యంతో మంచాన ఉన్న వృద్ధుడు రామదాసుతోపాటు మరో 15మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మంత్రి అనుచరుల దురాగతమేమంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు వంద మందికిపైగా వచ్చి మా గ్రామస్తులపై దాడి చేశారు. సిద్దార్థగౌడ్ అనే వ్యక్తి తనవెంట వచ్చిన వారితో కలిసి ఈ దాడికి తెగబడ్డారు. ఇలాంటి దాడులను అరికట్టాల్సిన పోలీసులు చోద్యం చూశారే తప్ప నిలువరించలేదు. – విశ్వనాథ నాయుడు, ఎంపీటీసీ, మాధవరం -
వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ టీడీపీ నేత
-
‘వ్యభిచార’ లాడ్జీలో పట్టుబడ్డ టీడీపీ నేత రావూరి రాధాకృష్ణమ నాయుడు
నెల్లూరు: వ్యభిచార నిర్వహణ లాడ్జీపై పోలీసుల దాడిలో సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ కీలక నేత, పీఏసీఎస్ అధ్యక్షుడు రావూరి రాధాకృష్ణమ నాయుడు పట్టుబడ్డారు. నెల్లూరు ఏఎస్పీ పలు లాడ్జీలపై ఆకస్మిక తనిఖీలు చేశారు. మొత్తం 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డికి ముఖ్య అనుచరుడిగా రాధాకృష్ణమ నాయుడు చలామణి అవుతున్నారు. ఇటు వ్యభిచార గృహాలు నడుపుతూ ఆయన అధిష్ఠానంలో చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్తో రాధాకృష్ణమ నాయుడుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అధిష్ఠానంలో పలుకుబడితో సర్వేపల్లిలో అక్రమాలకు పాల్పడుతున్నారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయింపులో సదరు ప్రస్తుత విటుడు రాధాకృష్ణమ నాయుడిది కీలక భూమిక. -
ఇలాంటి వాళ్లు టీటీడీ ఛైర్మన్గా ఉండకూడదు: సీపీఐ నారాయణ
సాక్షి, విజయవాడ: టీటీడీ ఛైర్మన్ వ్యవహరంపై సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. పవిత్ర ఆలయాన్ని చంద్రబాబు శుద్ధి చేస్తాడని ఆశించామని.. ఛైర్మన్ను రాజీనామా చేయమని బాబు ఎందుకు చెప్పడం లేదంటూ నారాయణ ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లు టీటీడీ ఛైర్మన్గా ఉండకూడదంటూ మండిపడ్డారు.పశ్చిమాసియా ఉద్రిక్తతలపై నారాయణ స్పందిస్తూ.. ‘‘యుద్ధం ప్రపంచ మానవాళి మీద పడిందన్నారు. అమెరికాలోని కార్పోరేట్ కంపెనీల కోసం యుద్ధం జరుగుతున్నారు. ఆయిల్ కంపెనీను కార్పోరేట్లకు అప్పగించడానికే ఈ యుద్ధం.. వెనెజులను అమెరికా స్వాధీనం చేసుకోవడంతో రూ. 50వేల కోట్లు భారం మనపై పడింది. ఇరాక్లో అణుబాంబుల పేర్లతో ఆయిల్ కోసం దాడులు చేస్తున్నారు...కోటి మంది భారతీయులు గల్ప్ దేశాల్లో చిక్కున్నారు. ఐక్యరాజ్య సమితిలో ఐక్యత లేకుండా పోయింది. యుద్ధం కారణంగా టూరిజం దెబ్బతింది. డాలర్ 100 రూపాయల దగ్గరకు చేరింది. ఆయిల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఆయిల్ రేట్లు పెరిగితే అన్ని రేట్లు పెరుగుతాయి. యుద్ధం వల్ల దేశం ప్రత్యక్షంగా అతలాకుతలం అవుతుంది. మోదీ ట్రంప్కి సలహా ఇచ్చి యుద్ధం ఆపమని చెప్పాలి’’ అని నారాయణ సూచించారు -
మహిళతో టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు సంచలన ఆడియో లీక్
-
అనపర్తిలో ఆగని అధికార పార్టీ ఆగడాలు
అనపర్తి: తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాలు ఆగడం లేదు. నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తపై అధికార పార్టీ శ్రేణులు విచక్షణారహితంగా దాడులు చేశాయి. ఈ ఘటనలో స్పృహ కోల్పోయిన బాధితుడిని ఆస్పత్రికి తరలించాయి వైఎస్సార్సీపీ శ్రేణులు. ఈ దాడిపై బాధిత కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడికి కారణమైన నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు పోలీసులు. దాడులకు పాల్పడిన వారికి ఇలా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం విమర్శలకు దారి తీసింది. నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ నిందితుల్ని ఇలా స్టేషన్ బెయిల్పై పంపించడం ఏంటని వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది. పల్నాడులో టీడీపీ గూండాలు దాడులుల్నాడు జిల్లాలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడులకు దిగారు. ఈ దాడిలో ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఆ పేరు ఎత్తలంటేనే సిగ్గుగా ఉంది BR నాయుడుపై శ్యామల ఫైర్
-
పేర్ని కిట్టు ప్లెక్సీలపై కూటమి నేతల కడుపు మంట
-
జగన్ ప్రభుత్వమే బాగుండేది కొంపముంచిన అకాల వర్షాలు కూటమిపై రైతుల ఆగ్రహం
-
BR నాయుడుకు షాక్ ఇచ్చిన చంద్రబాబు?
-
చంద్రబాబు పరిస్థితి మన్మధుడు సినిమాలో బ్రహ్మనాదంలా... బాబుపై జడ శ్రవణ్ సెటైర్లు
-
తిరుమలలోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ.. భక్తుల ఆశ్చర్యం
సాక్షి, తిరుపతి: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. తాజాగా చంద్రబాబు.. టీటీడీలోనూ క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన ల్యాబ్ని బాబు తన ఖాతాలో వేసుకుంటూ ప్రచారం చేసుకోవడం గమనార్హం.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI) ల్యాబ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో 2023లో ల్యాబ్ ఏర్పాటుకు సీఈఓ కమలవర్థన్ చర్చలు జరిపారు. అనంతరం, 20 కోట్లతో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఏర్పాటుకు వైఎస్ జగన్ అంగీకారం తెలిపారు. నాటి నిర్ణయం మేరకు తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ తిరుమలలో అందుబాటులోకి వచ్చింది. వైఎస్ జగన్ హయాంలోనే ల్యాబ్ బలోపేతమైంది.ఇంత జరిగినా బిల్డప్ బాబు చంద్రబాబు మాత్రం ప్రసాదం నాణ్యతకు తానే దృష్టిపెట్టినట్టు కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. అయితే, వైఎస్ జగన్ గతంలోనే తిరుమలలో ప్రసాదం, అన్నప్రసాదాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాగా, తాజాగా చంద్రబాబు క్రెడిట్ చోరీని చూసిన శ్రీవారి భక్తులు నివ్వెరపోతున్నరు. -
గుప్పిట్లో ‘ఫ్రీహోల్డ్’
సాక్షి, అమరావతి: పేద రైతులకు గత ప్రభుత్వంలో హక్కులు దక్కిన ఫ్రీహోల్డ్ భూముల్లో 7.50 లక్షల ఎకరాలను 22 ఏ జాబితా నుంచి తొలగించాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసినా ఇప్పటివరకూ ఉత్తర్వులు వెలువడకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. రెవెన్యూ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం దీనిపై ఏడాదిన్నర పాటు నాన్చి ఇటీవలే ఒక నిర్ణయం తీసుకుంది. ఫ్రీహోల్డ్ అయిన (యాజమాన్య హక్కులు వచ్చిన) మొత్తం 13.59 లక్షల ఎకరాల భూముల్లో 7.50 లక్షల ఎకరాలను 22 ఏ జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే రెండు వారాలు దాటిపోయినా ఇంతవరకూ దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయకపోవడం గమనార్హం. దీంతో దీని వెనుక ఏదో గూడుపుఠాణీ జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులు వెంటనే అమలు జరిగిపోతాయి. రాజధాని పనులు, ఇతర వ్యవహారాలపై ఏర్పాటు చేసిన ఉపసంఘాలు చేసిన సిఫారసులను ప్రభుత్వం వెనువెంటనే అమల్లోకి తెస్తూ జీవోలు ఇస్తోంది. కానీ పేద అసైన్డ్ రైతులకు సంబంధించిన భూములను రెండేళ్లు గాల్లో పెట్టి చివరికి వారి ఒత్తిడితో నిర్ణయం తీసుకున్నా అమలుకు వెనుకాడుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఉప సంఘం సిఫారసులు అందిన తర్వాత 2, 3 రోజుల్లోనే అందుకు సంబంధించిన జీవోలు వెలువడాలి. రెవెన్యూ శాఖ మంత్రి అదే విషయాన్ని బహిరంగంగా వెల్లడించారు. ఉన్నతాధికారులు కూడా వెంటనే జీవో వస్తుందని చెబుతున్నా ఇప్పటివరకూ రాకపోవడంపై అధికారవర్గాల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ముసుగులో టీడీపీ నేతలు సర్దేస్తున్నారా..! ఎలాగూ సగం ఫ్రీహోల్డ్ భూములపై నిషేధం ఎత్తివేయాలని నిర్ణయించారు కనుక సందట్లో సడేమియా మాదిరిగా అసైన్డ్ భూములను నొక్కేయడానికి టీడీపీ నేతలు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఎన్నికలు రావడంతో గత ప్రభుత్వంలో ఫ్రీహోల్డ్ అవకుండా మిగిలిపోయిన కొన్ని భూములను తాజాగా ఫ్రీహోల్డ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించిన అసైనీలు ఉంటే వారి ద్వారా.. లేదంటే ఆదీనంలో ఉన్న రైతులతో మాట్లాడి నయానో భయానో లొంగదీసుకుంటున్నట్లు చెబుతున్నారు. తృణమో పణమో ముట్టజెప్పి వారి భూముల్ని స్వాదీనం చేసుకుంటున్నారని సమాచారం. గతంలోనే ఫ్రీహోల్డ్ అయిన భూములతో కలిపి వాటిని ఇప్పుడు ఫ్రీహోల్డ్ చేయించుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే ఫ్రీహోల్డ్ భూములపై నిషేధం ఎత్తివేస్తూ వెంటనే ఇవ్వాల్సిన జీవో ఇంతవరకూ వెలువడలేదని తెలుస్తోంది. టీడీపీ నేతలు అనుకున్న భూములన్నీ వారి చేతుల్లోకి వచ్చాక జీవో జారీ చేస్తారని చెబుతున్నారు. తద్వారా గత ప్రభుత్వం ఫ్రీహోల్డ్ చేసిన భూముల్లో కొన్నింటిని ఇప్పుడు 22ఏ జాబితా నుంచి తీసివేశామని పైకి చెప్పుకుంటూ తాజాగా వేలాది ఎకరాలను టీడీపీ నేతలు కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ హక్కులిస్తే.. బాబు ఆంక్షలు పెట్టి వేధించారు అనేక దశాబ్దాలపాటు తమ భూములపై ఎలాంటి హక్కులు లేకుండా ఉన్న పేద అసైన్డ్ రైతులకు ఊరటనిస్తూ వారి భూములపై వైఎస్ జగన్ హయాంలో హక్కులు కల్పించారు. ఇందుకోసం అసైన్డ్ భూముల చట్టానికి సవరణ చేసి 20 సంవత్సరాలు దాటిన అసైన్డ్ భూములపై పేద రైతులకు యాజమాన్య హక్కులు (ఫ్రీహోల్డ్) ఇచ్చారు. దీంతో 27.40 లక్షల ఎకరాలకు చెందిన అసైన్డ్ రైతులకు సంపూర్ణంగా హక్కులు కల్పించడంతో వారు ప్రైవేటు భూముల తరహాలో తమ భూములకు హక్కుదారులయ్యారు. 2024లో ఎన్నికలు జరిగే సమయానికి 13.59 లక్షల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములను గత ప్రభుత్వం ఫ్రీహోల్డ్ చేయగా, దాదాపు 20 లక్షల మంది రైతులను యజమానులను చేసింది. అయితే వైఎస్ జగన్ హయాంలోనే హక్కులు రావడంతో.. ఆ భూములపై కత్తి కట్టిన చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రాగానే వాటిని 22 ఏ జాబితాలో పెట్టింది. రెండేళ్ల నుంచి ఆ భూములపై నిషేధాన్ని కొనసాగిస్తూ ఆ రైతులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది. అసైన్డ్ రైతుల ఒత్తిడితో ఫ్రీహోల్డ్ అయిన భూముల్లో సగం భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించాలని రెండేళ్ల తర్వాత నిర్ణయించింది. అయినప్పటికీ దాన్ని అమలు చేయకుండా తెర వెనుక భూములు కొట్టేయడానికి సన్నాహాలు చేస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
నారా కాస్త నీరో లోకేష్ అయ్యాడు..లోకేష్ పై నిప్పులు చెరిగిన తాటిపర్తి
-
‘జాబ్ క్యాలెండర్ను లోకేష్ జోక్ క్యాలెండర్గా మార్చేశారు’
సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్ జాబ్ కేలండర్ని జోక్ కేలండర్గా మార్చారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆ కేలండర్లో డేట్లు ఉన్నాయి.. గానీ ఉద్యోగాల డేటా లేదు. తూతూమంత్రంగా 10 వేల ఉద్యోగాలు ప్రకటించి చేతులు దులుపున్నారు. లోకేష్, చంద్రబాబే కొన్ని వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గతంలో చాలాసార్లు చెప్పారు. మాటల్లో మాత్రం గ్లోబల్ లెవల్లో మాట్లాడతారు. చేతల్లో మాత్రం ఏమీ ఉండదు’’ అంటూ తాటిపర్తి ధ్వజమెత్తారు.‘‘నారా వారు కాదు.. నీరో వారని నిరూపించుకున్నారు. నిరుద్యోగ భృతి రెండేళ్లుగా ఇవ్వలేదు. లోకేష్ చదువుకున్న వ్యక్తి కాదు.. చదువుకొన్న వ్యక్తి. అందుకే నిరుద్యోగుల కష్టాలు ఆయనకు తెలియవు. అరచేతిలో వైకుంఠం చూపించటం తప్ప లోకేష్ చేస్తున్నది లేదు. అర్హత లేని లోకేష్, పవన్ కళ్యాణ్ మంత్రులు అయ్యారుగానీ నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవ్..వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను చంద్రబాబు తీసేశారు. ఔట్ సోర్సింగ్లోనే 9 వేల ఉద్యోగాలు తొలగించారు. ఏపీ ఫైబర్లో 2 వేల మంది ఉద్యోగులను తొలగించారు. రేషన్ వాహనాల్లో పని చేసే 2,900 ఉద్యోగులను తొలగించారు. బేవరేజ్ కార్పొరేషన్లోని 18 వేల మందిని తొలగించారు. తొలగించటమే తప్ప చంద్రబాబు ఇచ్చేదేమీ ఉండదు. గ్రూప్-2 కోసం ఏళ్లుగా ఎదురు చూస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. నిరుద్యోగుల జీవితాలతో లోకేష్ బంతాట ఆడుకుంటున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి పేరుతోనూ మోసం చేశారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతికి కేటాయింపుల్లేవ్. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఊసే లేదు. వారి సమస్యలను పట్టించుకునే పరిస్థితే లేదు’’ అంటూ తాటిపర్తి చంద్రశేఖర్ దుయ్యబట్టారు. -
సొంతూరికి వచ్చేదెలా!?
రాజంపేట: పశ్చిమాసియాలో ఇరాన్–అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు గల్ఫ్ దేశాల్లోని తెలుగువారి పాలిట శాపంగా మారాయి. ముఖ్యంగా కువైట్లోని ‘ఖసీమా’ విమానాశ్రయం మూసివేయడంతో ఉమ్మడి కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు చెందిన వేలాది మంది ప్రవాసాంధ్రులు అక్కడ చిక్కుకుపోయారు. యుద్ధం కారణంగా విమాన సర్వీసులు రద్దుకావడంతో, ప్రత్యామ్నాయ మార్గాల్లో స్వదేశానికి రావాలంటే సామాన్యులకు టికెట్ ధరలు అందనంత ఎత్తుకు చేరాయి. గతంలో రూ.10 వేలకు లభించే టికెట్ ప్రస్తుతం రూ.1.30 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పలుకుతుండడంతో పేద కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీసాల వెతలు.. కువైట్ నుంచి నేరుగా విమానాలు లేకపోవడంతో సౌదీ అరేబియా మీదుగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారికి అక్కడి రాయబార కార్యాలయం చేతులెత్తేసింది. విజిట్ వీసా హోల్డర్లు, అత్యవసర ప్రయాణికులు సొంత ఖర్చులతోనే టికెట్లు బుక్ చేసుకోవాలని, వీసా జారీపై ఎలాంటి హామీలేదని తేల్చిచెప్పింది. వీసా జారీ అనేది సౌదీ ప్రభుత్వ ప్రత్యేక హక్కు అని తెలపడంతో ప్రవాసాంధ్రులు అద్దె గదులకు పరిమితమై బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గుండె కోత మిగిల్చిన యుద్ధం.. యుద్ధ వాతావరణం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. రాజంపేటకు చెందిన మర్రి కళ్యాణ్ తన తల్లి మరణిస్తే కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోయారు. ఇప్పుడు రావాలన్నా శ్రీలంక మీదుగా లక్షల రూపాయలు ఖర్చుచేయాల్సి వస్తోంది. అలాగే, భార్య ప్రసవానికి వెళ్లాలనుకున్న రాజంపేట రమణ, ఏటా రంజాన్కు ఊరికి వచ్చే నందలూరు మస్తాన్ వంటి వేలాది మంది ఈసారి పండుగలకు దూరమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం..రాష్ట్రానికి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ, గల్ఫ్లో చిక్కుకున్న తెలుగు వారిని ఆదుకోవడంలో విఫలమయ్యారని బాధితులు మండిపడుతున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనే ప్రత్యేక విమానాలు ఏర్పాటుచేశారని.. ఇప్పుడు యుద్ధ వాతావరణంలో కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని ప్రవాసాంధ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితి ఎప్పుడూ చూడలేదు.. నేను చాలా కాలంగా కువైట్లో ఉన్నాను. గతంలో ఎప్పుడూ ఇలాంటి దుర్భర పరిస్థితిని చూడలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఎలాంటి ఆంక్షలు, ఆర్థిక భారం లేకుండా ప్రవాసాంధ్రులను భారత్కు తీసుకురావాలి. ప్రత్యేక విమాన సర్వీసులను వెంటనే ప్రారంభించాలి. – మేడా మనోహర్రెడ్డి, గుండ్లూరు, రాజంపేట మంత్రి ఉన్నా ప్రయోజనం లేదు.. మా తమ్ముడు తన తల్లి అంత్యక్రియలకు కూడా రాలేకపోవడం బాధాకరం. రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నా ప్రత్యేక విమానాలు ఏర్పాటుచేయలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని రాయితీ ధరకు విమాన ప్రయాణం కల్పించాలి. – మర్రి రవికుమార్, వైస్చైర్మన్, రాజంపేట మున్సిపాలిటీ -
షర్మిల మాటలు హద్దులు దాటుతున్నాయి: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: గత మూడు, నాలుగేళ్లుగా షర్మిల, సునీత.. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్న షర్మిలమ్మ మాట్లాడిన మాటలు హద్దులు దాటాయన్నారు. కనీస ఆలోచన లేకుండా హద్దులు దాటి సొంత అన్నపై వ్యక్తిత్వ దాడి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్సార్ కుమార్తె, జగన్కు చెల్లెలు కదా అని మేం చాలా వరకూ మిన్నకుండిపోయాం. ఆమె నిన్న మాట్లాడుతూ అన్న అనే పదానికే నువ్వు కలంకం అన్నారు. ఈ మాట మమ్మల్ని చాలా బాధించింది. బట్ట కాల్చి మసి మీ అన్న ముఖాన వేసి తుడుచుకో అంటే ఒప్పుకోరు తల్లీ. అన్న అనే పదానికే ఆయన అనర్హుడు అన్న తర్వాత మీ అన్న మీకు చేసిన అన్యాయం ఏంటో మీరు చెప్పాలి. నువ్వు ఏదేదో మాట్లాడి బురద జల్లి పోతానంటే కుదరదు. నీ పట్ల మీ అన్న చేసిన అన్యాయం ఏంటో స్పష్టంగా తెలుగు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.’’ అని రాచమల్లు పేర్కొన్నారు.‘‘మీ అన్నపై ఇంతటి విషాన్ని చిమ్మడానికి ఏం కారణం..? ఏమి నీకు అన్యాయం జరిగింది..?. నాలుగు గోడల మధ్య ఏదైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాల్సింది. పోయి పులివెందుల పూల అంగళ్ల సర్కిల్లో పరిచినారు. మీ ఇంట్లో ఏదైనా చర్చించుకుంటే మరుసటి రోజే ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్గా వస్తుంది. ఇవన్నీ వారికి ఎవరు చెప్తున్నారు. షర్మిల, సునీతల ఫోన్లు పరిశీలిస్తే ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబుతో టచ్లో ఉన్న విషయం ఇట్లే బయటపడుతుంది. మీ తండ్రి చనిపోతే సంతోషించిన చంద్రబాబు లాంటి వ్యక్తితో మీరు చెలిమి చేస్తారా?. అన్న అనే పదానికే కళంకం తెచ్చాడంటున్న నీవు నీకు ఏ విషయంలో అన్యాయం చేశాడు..?’’ అంటూ రాచమల్లు ప్రశ్నించారు.‘‘ఆస్తి విషయంలో చేశాడా..? అధికారం విషయంలో అన్యాయం చేశాడా..?. వైఎస్సార్ 2004లో అఫిడవిట్లో చూపించిన ఆస్తులు 2009లో లేవు. ఈ మధ్య కాలంలో రాజశేఖరరెడ్డి తన ఆస్తులను నీకు, జగన్కు పంచేశారు. మీ తండ్రి చట్ట ప్రకారం మీ అన్నకు, నీకు సమానంగా ఆస్తులు పంచారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇళ్లు షర్మిలమ్మకే ఇచ్చారు. ఇడుపులపాయలో 51 ఎకరా వ్యవసాయ భూమిని షర్మిల పేరుతో రిజిస్టర్ చేయించారు. 15 మెగావాట్ల ఎస్సారెస్ స్మాల్ హైడ్రో ప్రాజెక్టు ఆమెకే ఇచ్చారు. స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టునూ ఆమెకే ఇచ్చాడు...విజయవాడ యువరాజ్ థియేటర్లో 36 శాతం భాగం షర్మిలమ్మకే రాసిచ్చాడు. పులివెందులలో 7 ఎకరాల 60 సెంట్ల స్థలాన్ని ఆమెకే రాసిచ్చారు. విజయలక్ష్మి ట్రేడ్ అండ్ మినరల్స్ వంద శాతం వాటా ఆమెకే ఇచ్చేశారు. రాజారెడ్డి గారి హయాం నుంచి రైల్వే కోడూరులో ఉన్న ఇంటిని కూడా ఆమెకే రాసిచ్చాడు. రైల్వే కోడూరు మండలం శెట్టిగుంటలో 90 ఎకరాల వ్యవసాయ భూమిని ఆమెకే ఇచ్చారు. ఇలా నీకు సగం వాటాను ఇస్తుంటే అంగీకరించడం అనేది జగన్ గొప్పతనం. మీరిద్దరూ ఒకే కడుపున పుట్టారు కాబట్టి మీ అన్న ఒప్పుకున్నాడు అంటే సరే.. మీ వదిన ఎలా ఒప్పుకుంది..?..సమాజంలో ఏ ఇంటి కోడలూ ఆడబిడ్డకు సమాన ఆస్తి ఇస్తే అంగీకరిస్తుందా..?. అయినా భారతమ్మ ఒప్పుకున్నారు అంటే మీ తండ్రి, మీ అన్న కంటే వెయ్యి రెట్లు ఆమె గొప్పది. ఇన్ని ఆస్తులు తీసుకున్నందుకేనా వైఎస్ జగన్ అన్న అనే పదానికి కళంకం...?. వైఎస్సార్ మరణించినప్పటి నుంచీ నువ్వు జగన్తో విభేదించే వరకూ తాను సంపాదించుకున్న దాంట్లో జగన్ నీకు రూ.236 కోట్లు ఇచ్చారు...అయినా మీరు ఆయన వ్యక్తిత్వంపై దాడి చేస్తూ మా అన్న దుర్మార్గుడు అంటున్నారు. మీ అన్న ముఖ్యమంత్రిగా చేసిన పనులకు దేశమంతా పొగుడుతుంటే నువ్వు విమర్శలు చేశావు. అవన్నీ చాలవన్నట్లు వివేకానందరెడ్డి హత్య రక్తపు మరకలను జగన్ నెత్తిన వేసి ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు ఇంత నిందలు వేస్తావా..?. ఇవన్నీ చాలవన్నట్లు చంద్రబాబుతో చెలిమి చేస్తూ.. ఏబీఎన్ రాధాకృష్ణకు ఉప్పందించి బజారుకీడుస్తావా...?. నీకు ఎక్కడ న్యాయం ఉంది.. ఎక్కడ కృతజ్ఞత ఉందమ్మా నీకు..?. నీ స్థానంలో ఏ చెల్లి ఉన్నా జగన్ లాంటి అన్నను గుండెల్లో పెట్టుకుని ఉండేవారు...నువ్వు కొంగుపట్టుకుని జగన్కి, అవినాష్కి ఓటు వేయవద్దని పులివెందుల పూలఅంగళ్ల సర్కిల్లో అర్థించావు. అవినాష్ రెడ్డి వివేకాను చంపి ఉంటే నాకు ఓటు వేయండి.. లేదంటే అవినాష్కు ఓటు వేయండి అని కొంగుపట్టి మరీ అడిగావు. నువ్వు చెప్పిన మాటలు ప్రజలు నమ్మారా? అవినాష్రెడ్డి గెలిచాడు. నువ్వు చెప్పిన తప్పుడు మాటల వల్ల జిల్లాలో మేం ఐదుమంది ఎమ్మెల్యేలం ఓడిపోయాం. నీ లెక్క ప్రకారం వివేకా హత్యలో అవినాష్రెడ్డికి సంబంధం లేదని ప్రజలు నమ్మారు కాబట్టే ప్రజలు ఆయన్ను గెలిపించారు...అంతటితో ఆగకుండా చంద్రబాబు ఏ కీ ఇస్తే దాన్ని సునీతమ్మ మాట్లాడుతుంది. మూడు నాలుగు రోజుల తర్వాత మీరొచ్చి అవే మాటలు మాట్లాడతారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసి ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనేదే మీ లక్ష్యం. నీకు ఆస్తి పంపకానికి ఒప్పుకుని, సొంతంగా డబ్బిచ్చి.. తన సొంత ఆస్తుల నుంచి కూడా నీకు భాగాలిస్తే.. నీకు సంతృప్తి లేదు. సరస్వతి భూముల విషయంలో ఆమె చేసిన వ్యవహారం వింటే చాలా బాధ కలుగుతుంది...జగన్పై కేసుల కారణంగా ఆ భూములు అటాచ్మెంటులో ఉంటే.. దానిలోని విజయమ్మ పేరుపై ఉన్న భూములను తన పేరుపై రాయించుకోవాలని చూశారు. దాని కోసం ఆ షేర్ కాగితాలు పోయాయని కేసు పెట్టి.. ఆ తర్వాత విజయమ్మ ఆస్తిని తన పేరుపై బదలాయింపు చేసుకుంది. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తిని బదలాయింపు చేయకూడదని అందరికీ తెలుసు. అలా చేస్తే వైఎస్ జగన్ బెయిల్ రద్దు అవుతుందని కూడా అందరికీ తెలుసు. అయినా బదలాయింపు చేశావంటే.. మీ అన్న మళ్లీ జైలుకు పోవాలనేగా..?..పగోడు పదహారు నెలలు జైల్లో పెడితే.. చెల్లెలు 32 నెలలు జైల్లో పెట్టాలనుకుంది. వైఎస్ జగన్ ఆ విషయం తెలుసుకుని ఎన్సీఎల్టీకి వెళ్లి జాగ్రత్త పడ్డాడు. ఆ కేసులో షర్మిలమ్మ ఓడిపోయింది. మళ్లీ విజయమ్మతో చెన్నై కోర్టులో కేసు వేయించింది. ఆ కేసు కాగితాలు చెన్నై కోర్టులో వేయించిన గంటకే చంద్రబాబు చేతిలో ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్క విషయం చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణలకు తెలుసు. షర్మిల, సునీతలు జగన్కు ఒక్క చెల్లెల్లే. కానీ రాష్ట్రంలో కోటి మంది మహిళలు ఆయనకు ఓటేశారు. వారంతా వైఎస్ జగన్ మాకు దేవుడిచ్చిన అన్న అంటున్నారు...వాళ్లంతా దేవుడిచ్చిన అన్న అంటుంటే రక్త సంబంధం కలిగిన నీకు మాత్రం కళంకితుడా..?. ఈ రాష్ట్రంలో షర్మిలమ్మ, సునీతలను చూసిన తర్వాత చెల్లెల్లు అంటే భయపడే పరిస్థితికి వచ్చింది. నీలాంటి చెల్లెలు కావాలని ఏ అన్నా కోరుకోడు. వారి వారి స్థాయిని బట్టి నువ్వొక్కదానివే కాదు. .మేమంతా పార్టీ కోసం కష్టపడ్డాం. షర్మిలమ్మ జగన్తో గొడవ పడకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి పదవినే పంచాలి. అప్పుడే ఆమె శాంతిస్తుంది. ఇప్పుడు జగన్ పెట్టుబడులు, ఆస్తులు మొత్తం ఊడ్చి షర్మిలకు ఇస్తే అప్పుడు శాంతిస్తుందేమో..?. ఎక్కడన్నా జగన్ వ్యాపారాల్లో నువ్వు పెట్టుబడి పెట్టావా..? ఏమీ లేకపోయినా తన సొంత సంపాదనలో నీకు వాటా ఇచ్చాడు...మీరు టీడీపీ కండువా కప్పుకోకపోయినా.. సైకిల్ ఎక్కకపోయినా మీరు మాత్రం టీడీపీనే. వైఎస్సార్ కూతురు ఇలా టీడీపీకి వెళ్తుందని మేము కలలో కూడా ఊహించలేదు. రాష్ట్రంలో చంద్రబాబు ఇన్ని తప్పులు చేస్తున్నా, లక్షల కోట్ల అప్పులు చేస్తున్నా ఆమె ఒక్క మాట కూడా విమర్శించదు. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రశ్నించాల్సిన నువ్వు జగన్ను టార్గెట్ చేస్తున్నావు. ఇక మీదట మీరు జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఎన్ని సార్లైనా మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఇక మా దృష్టిలో మీరు రాజశేఖరరెడ్డి కూతురు అని కానీ, జగన్ చెల్లెలు అని కాని ఉండదు. నాకైతే నువ్వు ఒక చెడ్డ చెల్లెలు అనే అభిప్రాయం మాత్రమే ఉంది. ఇంత మేలు చేసిన అన్నను పట్టుకుని అన్ననే పదానికే కళంకం అంటావా..?..చంద్రబాబుకు ఒక చెల్లెలు ఉందన్న విషయమే ప్రపంచానికి తెలియదు. అలాంటి చంద్రబాబు వద్దకు మాకు న్యాయం చేయండి అని ఈ చెల్లెల్లు వెళ్లారు. ఇదిగో నా చెల్లెలు షర్మిల.. నేను వదిలిన రామబాణం అని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి జగన్. నువ్వు ఇన్ని మాటలు ఆయన్ను మాట్లాడుతున్నా ఒక్క రోజు కూడా జగన్ నీపై నోరెత్తలేదు. అది ఆయన సంస్కారం.. నా చెల్లిపై మాట్లాడితే అది నాకే కదా అవమానం అనుకున్నాడు జగన్. కానీ మీరు ఒకే సారి వంద ఈటెలు తీసుకుని పొడిచినట్లు చేస్తున్నారు...తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబూ అసలు నీ చెల్లెలు ఎవరో ఈ సమాజానికి తెలుసునా..?. చంద్రబాబుకు తమ్ముడున్నాడని తెలుసు.. ఆయన ఎలా చనిపోయాడో కూడా ప్రజలకు తెలుసు. చంద్రబాబుకు కుటుంబ వ్యవస్థపై గౌరవం ఉందా..? అలా ఉంటే హరికృష్ణకు, ఆయన పిల్లలకు అన్యాయం చేస్తాడా?. సొంత వారినే మోసం చేసిన చంద్రబాబు.. షర్మిలమ్మ, సునీతమ్మలకు న్యాయం చేస్తాడా..?. మీ ఇద్దరిని నడి ఏట్లోకి తీసుకెళ్లి ముంచేస్తాడు.. గుర్తుంచుకోండి...5 కోట్ల మంది ప్రజలను, సొంత కుటుంబ సభ్యులను మోసం చేసిన చంద్రబాబుకు షర్మిల, సునీతలను మోసం చేయడం ఒక లెక్కా?. ఆ చంద్రబాబు చేతిలో మోసం పోయి చిట్టచివరకు మళ్లీ ఆ అన్న వద్దకే మీరిద్దరూ చేరతారు. అన్నా.. తప్పయిందని ప్రాయశ్చిత్తం మీ అన్నా, వదిలనల వద్దకే వచ్చే రోజు ముందుంది. షర్మిలమ్మ.. అన్నతో సమానంగా వైఎస్సార్ ఆస్తులు పంచిన విషయంపై సమాధానం చెప్పాలి. నీకు అవసరం అయినప్పుడల్లా రూ.236 కోట్లు ఇచ్చినది నిజమా? కాదా? అనేది షర్మిల చెప్పాలి. జగన్, భారతీలు వివేకాను చంపారని మీరు మీ పిల్లలపై ఒట్టేసి చెప్పగలరా?. చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడల్లా.. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా సునీత, షర్మిల తెరమీదకు వస్తారు...నిజంగా షర్మిలమ్మకు చిత్తశుద్ధి ఉంటే మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మాట్లాడితే నీ సైతాన్ సైన్యం అంటున్నారు.. కానీ నువ్వు జగన్కు రక్తం పంచుకుపుట్టిన చెల్లివి అయినా.. మేం రక్తం పంచుకోకపోయినా చివరికి వరకూ ఆయన కోసం, ఆయన వెంటే ఉంటాం. ఆస్తులకు మీరు భాగస్థులు.. కానీ మేం అభిమానానికి భాగస్థులం.. సైతాన్ సైన్యం కానే కాము. జగన్ కోసం ప్రాణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న మమ్మల్ని పట్టుకుని సైతాన్ అంటారా..?. మన ఇంటి గుట్టును ఏబీఎన్ రాధాకృష్ణకు, చంద్రబాబుకు ఇస్తున్న మీరు తప్పు చేసిన మనుషులు. అన్ననే పదానికి కళంకం అన్నందుకు బాధతో మేం మాట్లాడుతున్నాం. అన్న అనే పదానికి, వదిన అనే పదానికి అర్థం చెప్పిన వాళ్లు జగన్, భారతమ్మలు. షర్మిలమ్మ ప్రెస్మీట్ పెట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి’’ అని రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. -
‘కూటమి నేతలకు రాజపూజ్యం.. ప్రజలకు అవమానం’
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం అబద్ధాల నక్షత్రంలో వెన్నుపోటు రాశిలో ఏర్పడిందని.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. కూటమి నేతల ఆదాయం పెరిగింది.. పేద ప్రజల ఆదాయం పెరగలేదు. కూటమి మంత్రులకు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాజ్యపూజ్యం.. ప్రజలకు అవమానం. నిరుద్యోగులు, రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులను కూటమి మోసం చేసింది’’ అని వరుదు కల్యాణి మండిపడ్డారు.‘‘ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. రైతులకు పెట్టుబడిసాయం లేదు.. గిట్టుబాటు ధర లేదు. మహిళలకు ఎన్నోహామీలు ఇచ్చి ఒక్కటి అమలు చేయలేదు. మహిళల రక్షణ పూర్తిగా గాలికి వదిలేశారు. ఉద్యోగుల పరిస్థితి కక్కలేక.. మింగలేక అన్నట్టు ఉంది. కూటమి పాలన అత్యంత దారుణంగా ఉంది. ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు మోసానికి మరోసారి గురికావద్దని రాష్ట్ర ప్రజలను కోరుతున్నాం’’ అని వరుదు కల్యాణి పేర్కొన్నారు.ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు: కల్పలతారెడ్డివైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏవర్గం ప్రజలు పండగ చేసుకోలేదని.. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగులు బకాయిలు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నారు. ఉగాది కాదు దగాదిగా భావిస్తున్నారు. ఈ ఉగాదికి అయినా మేలు జరుగుతుందని ఉద్యోగులు ఆశించారు. పీఆర్సీ, ఐఆర్, డీఏకి సంబంధించిన జీవోలు విడుదల చేస్తారని ఆశించారు. వెయ్యి రూపాయిలు కూడా ప్రభుత్వం వేతనం పెంచలేదు..అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి చేస్తామని చెప్పారు. మంచి ఐఆర్ అన్నారు, పెండింగ్ బకాయిలు అని ఉద్యోగులను మోసం చేసింది. ఉద్యోగస్తులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతి పండగకి ఉద్యోగస్తులు ఎదురుచూస్తున్నారు. పండగ వచ్చి పొతుంది తప్ప ఒక్క మేలు మాత్రం జరగడం లేదు. గతంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చారు. కరోనా సమయంలో 23శాతం పిట్మెంట్ ఇచ్చారు. ఉద్యోగస్తులు రోడ్డెక్కుతున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పీఆర్సీ కమిషన్ని నియమించాలని కోరుతున్నా కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు. పిఆర్సీ కమిషన్ని త్వరగా నియమించాలి. పిఆర్సీ ఆలస్యం అయితే ఐఆర్ ప్రకటించాలి. 29 శాతం పిఆర్సీని అమలు చేయాలి. ఉద్యోగస్తులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలి’’ అని కల్పలతారెడ్డి డిమాండ్ చేశారు. -
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్
-
బాబు అవినీతికి రాచమార్గం క్యాపిటల్ తో కరప్షన్
-
‘చంద్రబాబు సర్కార్ పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది’
సాక్షి, ఢిల్లీ: ఏపీలో రైతులకు 3,500 కోట్ల రూపాయల పంట బీమా క్లెయిమ్ లను ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని లోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ లోక్సభలో వ్యవసాయ శాఖ పద్దులపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. పీఎం కిసాన్ పథకం కింద సహాయాన్ని పదివేల రూపాయలకు పెంచాలన్నారు.‘‘ఏపీలో వైఎస్సార్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశాం. 54 లక్షల మంది రైతులకు 7,802 కోట్ల రూపాయల బీమాను అందించాం. కానీ, ప్రస్తుత బాబు ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది. 2024 -25 బడ్జెట్లో దీనికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. 2025-26లో 1000 కోట్ల రూపాయలు కేటాయించినా బీమా కంపెనీలకు ఒక రూపాయి కూడా విడుదల చేయలేదు. రైతులకు పంట బీమాను చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది’’ అని వైఎస్ అవినాష్రెడ్డి మండిపడ్డారు.‘‘2,492 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించకపోవడంతో ఏపీని ఇన్సూరెన్స్ కంపెనీలు బ్లాక్ లిస్టులో పెట్టాయి. దాంతో రాష్ట్రంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో.. రైతులు ప్రీమియం చెల్లించడానికి యాప్ ఓపెన్ కావడం లేదు. ప్రీమియం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. 3,500 కోట్ల రూపాయల పంట బీమా క్లెయిమ్లను ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఏపీ రైతులకు బీమాను చెల్లించేలా చర్యలు తీసుకోవాలి..ఇరాన్ యుద్ధం వల్ల అరటి, మామిడి, మస్క్ మెలన్, వాటర్ మెలన్ ధరలు ఘోరంగా పడిపోయాయి. రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. పెండింగ్ ఇన్పుట్ బకాయిలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలి. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలి. హార్టికల్చర్ హబ్గా ఉన్న రాయలసీమలో భారీ ఎత్తున అరటి మామిడి మస్క్ మిలన్ వాటర్ మిలన్ పంటలు పండుతున్నాయి. పప్పులపై దిగుమతి సుంకం తొలగించడం వల్ల విదేశాల నుంచి భారీ ఎత్తున పప్పులు దిగుమతి అయ్యాయి. దాని ఫలితంగా దేశీయ పప్పులు పండించే రైతులు గిట్టుబాటు ధర కంటే తక్కువకి అమ్ముకోవాల్సిన పరిస్థితి పడింది.ఏపీలో 3.7 లక్షల ఎకరాల్లో శనగ పంట పండిస్తున్నారు. పప్పు ధాన్యాలు పండించే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు తీసుకోవడం, పప్పు ధాన్యాలపై దిగుమతి పాలసీని పున:పరిశీలన చేయాలి. ప్రతి గ్రామంలో వ్యవసాయ గిడ్డంగులను ఏర్పాటు చేయాలి. మండల లెవెల్లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. వ్యవసాయంత్రీకరణ కు నిధులు కేటాయించాలి’’ అని వైఎస్ అవినాష్రెడ్డి డిమాండ్ చేశారు. -
‘దివ్యాంగులకు 16 సర్వీసుల్లో ఫ్రీ బస్సు వర్తింపచేయాలి’
సాక్షి, తాడేపల్లి: కేవలం 5 సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ దివ్యాంగుల జీవితాలను మార్చేసినట్టు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు బస్సెక్కి హడావుడి చేశారని వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి ఆక్షేపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే దివ్యాంగులకు ఆర్టీసీ ప్రయాణ ఛార్జీలో 50 శాతం సబ్సిడీ ఉందని గుర్తు చేశారు.చంద్రబాబుకి దివ్యాంగుల సంక్షేమం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొత్తం 16 బస్సు సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, దివ్యాంగుల సహాయకులకు 50 శాతం సబ్సిడీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల బతుకు భారంగా మారిందని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా సదరం సర్టిఫికెట్ల పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇంద్రధనస్సు పేరుతో ఇచ్చిన ఏడు హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రెస్మీట్లో పులిపాటి దుర్గారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..ప్రచార ఆర్భాటంతో సరి:కేవలం 5 ఆర్టీసీ సర్వీసుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ దివ్యాంగుల జీవితాలు మార్చేసినట్టు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దివ్యాంగులకు మేలు చేసినట్టు ఆర్భాటంగా మంగళగిరిలో బస్సెక్కి హడావుడి చేశారు. ఇప్పటికే దివ్యాంగులకు ఆర్టీసీ బస్సు చార్జీలో 50 శాతం సబ్సిడీ పథకం అమల్లో ఉంది. ఇప్పుడు చంద్రబాబు కల్పిస్తున్నది కేవలం 50 శాతం మాత్రమే.అది కూడా 5 సర్వీసులకే వర్తింపజేస్తున్నారు. చంద్రబాబుకి దివ్యాంగుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 11 సర్వీసుల్లోనూ ఉచిత బస్సు ప్రయాణం కల్పించేవాడు. వారితోపాటు వచ్చే సహాయకులకు 50 శాతం రాయితీని అన్ని ఆర్టీసీ సర్వీసుల్లో వర్తింపజేసేవారు. టిడ్కో ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఇళ్లు కేటాయిస్తామని చెప్పినా రెండేళ్లలో ఒక్క ఇల్లు ఇచ్చింది లేదు. అమరావతిలో దివ్యాంగులకు దివ్యాంగ భవన్ కడతామని చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.2016 నాటి చట్టం అమలు చేయాలి:ఇప్పటికే మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం, వాటిలో ఎక్కడా దివ్యాంగుల ఊసే ఎత్తలేదు. 2016 నాటి చట్టం ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో 4 శాతం నిధులు అంటే, రూ.12 వేల కోట్లు దివ్యాంగుల సంక్షేమానికి కేటాయించాలి. కానీ రెండేళ్లలో కనీసం రూ.100 కోట్లు కూడా కేటాయించలేదు. నియోజకవర్గానికి 5 ట్రై మోటార్ సైకిళ్లు ఇస్తామని చెప్పినా అరకొరగా పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఆ ఇచ్చే వాటిని కూడా అర్హులైన వారికి కాకుండా టీడీపీ కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. దివ్యాంగులు ఎక్కడికెళ్లినా ఇబ్బందులు:చంద్రబాబు దివ్యాంగులకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకపోగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నో విధాలుగా వేధిస్తున్నాడు. గతంలో వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 365 రోజులపాటు ఎప్పుడైనా సదరం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటే వలంటీర్ వ్యవస్థ ద్వారా డాక్టర్లు నేరుగా ఇంటికొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేసేవారు.కానీ నేడు కూటమి పాలనలో సోమ, మంగళవారాలు మాత్రమే దరఖాస్తు చేసుకునే నిబంధన పెట్టారు. పైగా వైద్య పరీక్షల కోసం సొంత జిల్లాలకు కాకుండా పక్క జిల్లాలకు వెళ్లే నిబంధన పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. పైగా సదరం సర్టిఫికెట్లలో తప్పులు దొర్లితే వాటిని సరి చేసుకునే అవకాశం కూడా ఉండటం లేదు.డిజెబిలిటీ శాతం తక్కువగా చూపించి పింఛన్లలో కోతలు విధిస్తున్నారు. పింఛన్ల మీద ఆధారపడి బతుకుతున్న దివ్యాంగులకు పింఛన్లు తీసేసి వారి బతుకులను చంద్రబాబు అంధకారంలోకి నెట్టేశాడు. రెండేళ్లలో పింఛన్లు తీసేయడమే కానీ, దివ్యాంగులకు కొత్తగా ఒక్క పింఛన్ ఇచ్చిన పాపాన పోలేదు. గతంలో దివ్యాంగులకు అందజేసే ట్రై మోటార్ సైకిళ్లు, హియరింగ్ యంత్రాలు, బ్లైండ్ పర్సన్స్ కి స్టిక్స్ వంటివి ఇవ్వడం ఆపేశారు. దివ్యాంగుల పిల్లలకు ప్రత్యేకమైన స్కూల్స్, ప్రత్యేక వైద్యసేవలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి మోసగించారు.దివ్యాంగ విద్యార్థులకు వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అందే స్కాలర్షిప్స్ కూడా అందకుండా చేశారు. ప్రభుత్వ కాలేజీలు, స్కూల్స్, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు, వీల్ చైర్లు ఉండటం లేదు. దివ్యాంగులకు హక్కుగా దక్కాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదు. దివ్యాంగులు ఆలయాలకు వెళ్లినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ ఎప్పుడు?:వైఎస్సార్సీపీ తరఫున రోడ్డెక్కి ఉద్యమిస్తే కానీ 2024–25, 2025–26 బ్యాక్ లాగ్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు. తూతూమంత్రంగా కడప, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో నోటిఫికేషన్ ఇప్పించారు. కానీ ఇంతవరకు ఆ ప్రక్రియ మొదలు కాలేదు. 3 జిల్లాల్లో నోటిఫికేషన్ ఇచ్చేస్తే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.వైఎస్సార్సీపీ హయాంలో రుణ సబ్సిడీలు ఇచ్చి స్వయం ఉపాధిని ప్రోత్సహించడంతో పాటు, నైపుణ్యాభివృద్ధికి తోడ్పడడం జరిగింది. కానీ నేడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడంతో దివ్యాంగులకే ఎక్కువ నష్టం జరిగింది టీడీపీ కూటమి ఎన్నికల ముందు దివ్యాంగులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పులిపాటి దుర్గారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
ఇది నా న్యాయపోరాటంలో మొదటి అడుగు
-
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్ మంజూరు
సాక్షి, పల్నాడు జిల్లా: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 98 రోజుల పాటు పిన్నెల్లి.. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా టీడీపీ నేతల హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కూటమి సర్కార్ అక్రమ కేసు బనాయించింది. -
‘కోర్టు తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారు’
సాక్షి, తాడేపల్లి: న్యాయ స్థానాల తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారని.. తనపై పెట్టిన అక్రమ కేసులపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశానని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సత్తెనపల్లి, నల్లపాడు, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు నమోదు చేశారన్నారు.‘‘ఏడేళ్ల లోపు శిక్షలు పడే కేసులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలి. నేను 18 రోజులు సెంట్రల్జైల్లో ఉండాల్సి వచ్చింది. ఏడు సంవత్సరాలకు లోబడి శిక్ష పడే కేసుల్లో ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని గత జడ్జిమెంట్లు చెబుతున్నాయి. చట్టాన్ని పోలీసులు ఉల్లంఘించారు. రాజకీయ ఒత్తిళ్లతో నన్ను ఎక్కువ రోజులు జైల్లో పెట్టేందుకు చిన్న కేసులో కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. చంద్రబాబు, లోకేష్ చెప్తే పోలీసులు నన్ను కోర్టులో ప్రవేశపెట్టారు’’ అని అంబటి మండిపడ్డారు‘‘నా అరెస్టు, రిమాండ్ విధించిన వైనంపై న్యాయ పోరాటం చేస్తున్నా. సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకు కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలు అలాగే ఉంది. నా మీద ఉన్న కేసులన్నీ ఏడేళ్లలోపు శిక్ష పడేవే. అయినాసరే పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురై ఎక్కువ కాలం జైల్లో ఉంచేందుకు ప్రయత్నించారు. దీనిపై నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాను. కోర్టు అయినా రిమాండ్ విధించకుండా ఉండాల్సింది. ఈ విషయంపై కూడా హైకోర్టు రిజిస్టారుకి ఫిర్యాదు చేశాం’’ అని అంబటి పేర్కొన్నారు...మా ఇల్లు, కార్ల మీద దాడి ధ్వంసం చేసిన వారికి స్టేషను బెయిల్ ఇచ్చారు. ఈ వ్యవహారం పై కూడా న్యాయపోరాటం చేయబోతున్నా. నన్ను లాకప్ లో హింసించారు. ఈ కస్టోడియల్ టార్చర్ మీద కూడా న్యాయపోరాటం చేస్తా. ప్రజాస్వామ్యంలో అలా జరగటానికి వీల్లేదు. రాష్ట్రంలో పోలీసులు, దొంగలు కలిసిపోయినట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ఒక్కటే మార్గం. చట్టం మీద గౌరవం పెంచటానికే న్యాయపోరాటం చేస్తున్నా. 7 గంటల 25 నిమిషాల పాటు నా ఇంటి మీద దాడి జరిగింది. మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు?. నాపై దాడిని ఎందుకు అడ్డుకోలేదు?..ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేదని ఆ సంఘటన నిరూపించింది. నా ఇల్లు, కార్లు ధ్వంసం చేయడానికి పోలీసులు సహకరించారు. తమ కళ్ల ముందు జరుగుతున్న దాడులను అడ్డుకోని పోలీసులు కూడా నేరస్థులే. ఇలాగే పోలీసులు వ్యవహరిస్తే వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుందా?. పోలీసు వ్యవస్థ సరైనదారిలో నడవాలంటే న్యాయవ్యవస్థ స్పందించాలి. దీనిపై ఎంతదూరం వెళ్లటానికైనా సిద్ధమే...రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం అయ్యాయన్న సంగతి అందరికీ తెలిసి పోయింది. పోలీసులను మేనేజ్ చేస్తే ఏమైనా చేయొచ్చని జనం అనుకుంటే అరాచకం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగటానికి వీల్లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే. ప్రజలకు మాత్రం దుర్మార్గమైన ప్రభుత్వం. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేదే లేదు. ఉన్నదంతా ఆటవిక సమాజమే. పవన్ కళ్యాణ్ ఇంటిపై కూడా ఇలాంటి దాడి జరిగితే అప్పుడు తెలుస్తుంది’’ అని అంబటి రాంబాబు అన్నారు. -
ఇప్పుడు రండి.. గేటు మీద చేయి వేసి చూడండి
-
‘ముస్లింలను చంద్రబాబు మోసం చేశారు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ముస్లింలను మోసం చేశారని.. పవిత్ర ఇఫ్తార్లో పాల్గొని కూడా అబద్ధాలు చెప్పటం బాధాకరమని వైఎస్సార్సీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇమామ్లకు రూ. 10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు ఇస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ది’’ అని అంజాద్ బాషా గుర్తు చేశారు.‘‘చంద్రబాబు 2019-24 మధ్య పెట్టిన బకాయి రూ.24 కోట్లను కూడా జగనే తీర్చారు. మొన్నటి ఎన్నికలకు ముందు ముస్లింలకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదు. 50 ఏళ్లు దాటిన ముస్లింలకు పెన్షన్ ఇస్తానన్న చంద్రబాబు ఎందుకు ఇవ్వటం లేదు?. ఈద్గాలు, ఖబరస్థాన్లకు భూమి ఇస్తానన్న చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు?’’ అంటూ అంజాద్ బాషా నిలదీశారు.‘‘విజయవాడలో హజ్ హౌస్ నిర్మిస్తానని చెప్పి, ఇప్పటికీ స్థలం కూడా కేటాయించలేదు. నూర్ బాషా కార్పోరేషన్కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. గౌరవ వేతనం కూడా ఆర్నేళ్లుగా ఇవ్వకుండా బకాయి పెట్టారు. గట్టిగా పోరాటం చేస్తే రిలీజ్ చేసి పండుగ చేసుకోమంటున్నారు. అడ్వాన్స్ ఇచ్చి పండగ చేసుకోమన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. హజ్ యాత్రికులకు వైఎస్ జగన్ ఆర్థిక సహాయం అందించారు. 1870 మంది యాత్రికులు వెళ్తే కేవలం 72 మందికే చంద్రబాబు ఆర్థిక సాయం చేశారు. ఇదే మా ముస్లింల మీద చంద్రబాబుకు ఉన్న ప్రేమ?. ఈ ఏడాది వెళ్తున్న 2005 మంది హజ్ యాత్రికులకు అందరికీ లక్ష చొప్పున ఇవ్వాల్సిందే’’ అని అంజాద్ బాషా డిమాండ్ చేశారు.‘‘వైఎస్ జగన్ హయాంలో విజయవాడలోనే ఎంబార్కేషన్ పాయింట్ను ఓపెన్ చేశారు. ఒక్కొక్క ముస్లిం మీద పడిన రూ.83 వేలు అదనపు భారాన్ని కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే భరించింది. వైఎస్ జగన్ ముస్లింల సంక్షేమం కోసం రూ.24,304 కోట్లు ఖర్చు చేశారు. ముస్లింల మీద జగన్ ఎంత ప్రేమ చూపిస్తారో అర్థం చేసుకోవచ్చు. మైనారిటీలకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఐదుగురికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. ఇక్బాల్కి ఎమ్మెల్సీ ఇచ్చారు. జకియాఖానంకి ఎమ్మెల్సీ ఇచ్చి మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. 12 కార్పొరేషన్లకు ముస్లింలను ఛైర్మన్లుగా చేశారు. చంద్రబాబు హామీలు ఇవ్వటమే తప్ప.. ముస్లింలకు చేసింది ఏమీ చేయలేదు..వక్ఫ్ ఆస్తులు కాపాడటంలో కూటమి ప్రభుత్వం విఫలం. 460 ఎకరాల వక్ఫ్ భూమి కబ్జాకు గురైంది. చినకాకాని దగ్గర ఉన్న 71 ఎకరాల వక్ఫ్ భూమి మీద నారా లోకేష్ కన్ను పడింది. పరిశ్రమల పేరుతో తీసుకునేందుకు జీవో ఇచ్చారు. రాజధానిలో ఉన్న వేల ఎకరాల భూములను కాదని వక్ఫ్ భూములు ఎందుకు తీసుకుంటున్నారు?. వక్ఫ్ భూములను కాపాడుకోవటానికి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. కూటమి ప్రభుత్వంలో ముస్లింలకు రక్షణ లేదు..వినుకొండలో రషీద్ అనే ముస్లిం యువకుడిని నడిరోడ్డు మీద చంపేశారు. పుంగనూరులో మైనారిటీ బాలికను హత్య చేసి నీళ్లలో పడేశారు. రాయచోటిలో కౌన్సిలర్ మీద టీటీడీ గూండాలు దాడి చేశారు. పులివెందులలో బీటెక్ రవి అనుచరులు.. దంపతుల మీద దాడి చేశారు. నెల్లూరు జిల్లాలో ఒక ముస్లింని హత్య చేశారు’’ అంటూ అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తిరుపతిలో దారుణం.. మహిళను జుట్టు పట్టి ఈడ్చుకెళ్లిన TDP కార్యకర్త
-
తిరుపతి చంద్రగిరిలో దారుణం..
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు సొంత మండలం చంద్రగిరిలో దారుణ ఘటన వెలుగుచూసింది. పోలీసులు కళ్ల ఎదుటే మహిళపై టీడీపీ కార్యకర్త దాడి చేస్తుంటే ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రేక్షక పాత్ర పోషించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రగిరి మండలం కొటాల గ్రామంలో మహిళ అని చూడకుండా విచక్షణా రహితంగా దాడి చేస్తూ టీడీపీ కార్యకర్త నాగరాజు నాయుడు రెచ్చిపోయాడు. భూ వివాదంలో విశ్వేశ్వరి అనే మహిళపై నాగరాజ నాయుడు దాడికి పాల్పడ్డాడు. సర్వే నెంబర్ 445/1A లోని 38 సెంట్ల స్థలం విషయంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా బేఖాతరు చేస్తూ నాగరాజ నాయుడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. పోలీసుల సమక్షంలోనే బాధితురాలిపై విచక్షణా రహితంగా నాగరాజు నాయుడు.. ఆమెపై దాడికి పాల్పడ్డాడు.అనంతరం, బాధితురాలు మాట్లాడుతూ..‘టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర, హేమ కుమార్, వంశీ ఒత్తిళ్లు వల్లే మాపై దాడి చేస్తున్నారు. మా భూమిని కబ్జా చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు. టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి నన్ను రాజీ చేసుకోమని బెదిరిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్కు ఈ విషయమై 12 సార్లు ఫిర్యాదు చేశాను. అయినా నాకు న్యాయం జరగలేదు. నన్ను చంపేస్తారని భయంగా ఉంది. నాకు న్యాయం చేయండి’ అని వేడుకుంది. -
YSRCP యువనేతను చూసి వణుకుతున్న టీడీపీ మంత్రి
-
తప్పు జరిగింది..! టీడీపీ ఎంపీ పుట్టా వీడియో
-
కోడిని కోస్తే జైల్.. కొకైన్ పీలిస్తే బెయిల్
-
డ్రగ్స్ మాఫియా అరాచకం
హైదరాబాద్ శివారులో ఒక పెద్ద ఫాంహౌస్... అక్కడొక ఈత కొలను...దాని పక్కనే ఆశీనులైన బడాబాబులు... ముందున్న టేబుళ్లపై ఖరీదైన మద్యం సీసాలు, మాదక ద్రవ్యాలు... జర్మన్ తయారీ రివాల్వర్తో పోలీసులపై కాల్పులు, బెదిరింపులు, వాగ్వాదాలు– క్రైమ్ కథాచిత్రాన్ని తలదన్నే శనివారం నాటి ఈ దృశ్యం మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటే కించిత్తు ఆశ్చర్యం కలుగుతుంది. మొన్న జనవరిలో కూటమి ప్రభుత్వ భాగస్వామ్య పక్షమైన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పట్టుబడితే, తాజాగా ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్తోపాటు మరికొందరు దొరికిన వైనం దీన్ని రుజువు చేస్తోంది. వేయి తలల విషనాగు లాంటి మాదక ద్రవ్య మహమ్మారి ఆనుపానులు రాబట్టడానికి, దాన్ని అంతమొందించటానికి పోలీసులు నానా తంటాలూ పడుతున్నారు. కానీ బడి పిల్లలు మొదలుకొని ఆడ మగ తేడా లేకుండా అందరినీ కాటేస్తున్న ఈ విషనాగు వెనక రాజకీయ పలుకుబడి గల కుటుంబాలున్నాయనీ, కనుకనే దాని అదుపు అసాధ్యమవుతున్నదనీ ఈ పరిణామాలు తెలియజెబుతున్నాయి. ఒకరా ఇద్దరా... తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే నితీశ్ శర్మ, ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ వగైరా 11 మంది ఈ డ్రగ్స్ దందాలో దొరికారు. రెండేళ్ల నాడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతల ప్రసంగాలను గుర్తుంచుకుని ఇప్పుడు వెల్లడవుతున్న పరిణామాలతో బేరీజు వేసుకుంటే ఆ నేతల వంచన ఏపాటిదో అర్థమవుతుంది. మాదక ద్రవ్యాలకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందంటూ వారు పెడబొబ్బలు పెట్టారు. ‘మేం వస్తే వంద రోజుల్లో అరికడతామ’ంటూ ప్రగల్భాలు పలికారు. కానీ అధికారంలోకొచ్చాక అంతవరకూ సాధించిన విజయాలను గుల్లచేశారు. అది మళ్లీ తలెత్తి విస్తరించటానికి అవకాశమిచ్చారు. అప్పటి దుష్ప్రచారమంతా గెలుపు కోసం మాత్రమే కాదు... మాదక ద్రవ్యాలను అరికట్టడం వల్ల కలుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడం కోసమని ఆ కూటమి పీఠం ఎక్కింది మొదలు జరుగుతున్న ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఇసుక మాఫియా, మద్యం మాఫియా, డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగుతున్నాయి. ‘గంజాయి వద్దు బ్రో...’ అంటూనే మాదక ద్రవ్యాలకు తలుపులు బార్లా తెరిచారు. ఏపీలో మాదక ద్రవ్య చీడను అంతమొందించటానికి గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఆపరేషన్ పరివర్తన్ను రెండు దశల్లో విజయవంతంగా అమలు చేసింది. దానికితోడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్)ను ఏర్పాటు చేసింది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో ఉండే 11,500 ఎకరాల్లోని గంజాయి సాగును ధ్వంసం చేయడంతోపాటు, గిరిజనులు ఇతర పంటల వైపు మళ్లేలా రూ. 500 కోట్లతో ప్రోత్సాహకాలందించింది. విస్తృత తనిఖీలు చేపట్టింది. ఈ కృషినంతా కూటమి పాలన నీరుగార్చింది. పర్యవసానంగా విద్యాసంస్థల్లో చిల్లరగా... ఫామ్హౌస్ పార్టీలకు టోకుగా గంజాయి, కొకైన్, ఎల్ఎస్డీ, ఎండీఎంఏ వగైరాలు చేరిపోతున్నాయి. ఏడాదికి రూ.5,000 కోట్లు వెనకేసుకోవడమే లక్ష్యంగా సాగుతున్న ఈ దందాకు మూలవిరాట్టులు చంద్రబాబు చుట్టూ ఉండే సీనియర్ నేతల కుటుంబాలవారు కావటంతో ఏపీ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. మాదక ద్రవ్యాల వ్యాప్తిపై వెల్లడవుతున్న గణాంకాలు విస్తుగొలుపుతున్నాయి. నిరుడు దేశవ్యాప్తంగా భద్రతా విభాగాలకు రూ. 25,330 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. అంతక్రితంతో పోలిస్తే ఇది 55 శాతం కన్నా అధికం. ఏపీలో వీటికి అలవాటుపడిన వారిలో 10–17 ఏళ్ల మధ్య గలవారి సంఖ్య 3.19 లక్షలు ఉన్నట్టు చెబుతున్నారు. వీటి వెనక డబ్బాశ మాత్రమే కాదు, దాని ఆసరాతో రాజకీయాలను శాసించటం అసలు లక్ష్యం. మాదక ద్రవ్యాల నియంత్రణ విషయంలో తెలంగాణ పోలీసులకు అంతో ఇంతో మంచి పేరుంది. కానీ తాజా కేసు తీవ్రత తెలిసి కూడా, నిందితుడిగా ఉండాల్సిన వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా వ్యవహరిస్తేనే ఉగ్రవాదాన్ని మించిన ఈ మహమ్మారి దుంపనాశనం సాధ్యం.


