teacher recruitement
-
‘ప్రభుత్వం తప్పు చేస్తే శిక్ష మేం భరించాలా’, రోడ్డెక్కిన మాజీ ఉపాధ్యాయులు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2016 నిర్వహించిన పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమీషన్ (ssc)లో అవకతవకలు జరిగాయంటూ సుమారు 26 వేల మంది టీచర్ల నియామకాల్ని సుప్రీం కోర్టు రద్దు చేసింది. అయితే ఈ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసిన 26వేలమంది టీచర్లలో సుమారు 500 మంది రోడ్డెక్కారు.తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాల్సిందేనంటూ పశ్చిమబెంగాల్ సీల్దా, సెంట్రల్ అవెన్యూ ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జోగ్యో శిక్షక్ మంచ్ (అర్హత గల ఉపాధ్యాయుల ఫోరం) ప్రతినిధి మెహబూబ్ మండల్ మాట్లాడుతూ.. ‘పరీక్షలో మంచి స్కోరు సాధించినా, నియామకాల్లో జరిగిన అవినీతి వల్ల మేం అర్హులమే అయినప్పటికీ ఉద్యోగాలు పోయాయి ఇది మా తప్పా?' అని ఆవేదన వ్యక్తం చేశారు. #WATCH | West Bengal: A large number of teachers in Purulia district locked the gates of Purulia District Education Department and protested in the wake of 26,000 teachers in Bengal schools losing their jobs following a Supreme Court order. pic.twitter.com/F0x3x9bnXw— TIMES NOW (@TimesNow) April 10, 2025అయితే, మా ఉద్యోగం మాకు తిరిగి ఇవ్వండి. లేదంటే అర్హులు, అవినీతి పరుల్ని గుర్తించాలని కోరుతూ చేసిన ఈ ధర్నాలో బాధితులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. పలువురిపై దాడి చేశారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దాడి,లాఠీఛార్జీపై ఆందోళన కారులు మాట్లాడుతూ. ప్రజాస్వామ్యంలో మేము శాంతియుతంగా నిరసన తెలపలేకపోతే, న్యాయం కోసం మేము ఎవరి దగ్గరకు వెళ్లాలి? అని ప్రశ్నించారు. Kolkata Police officer using “mild force” to “violent mob” who happens to be teachers terminated from jobs due to ruling party’s monumental scam. #SSCScam pic.twitter.com/N2yd4u0acP— Aparna (@chhuti_is) April 9, 2025అవినీతికి శిక్ష, న్యాయానికి గౌరవం దక్కాలన్నదే మా డిమాండ్. త్వరలో మరింత మంది అర్హులైన ఉపాధ్యాయులతో సంప్రదింపులు జరపనున్నాం. ఆ తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు.టీచర్ల నియామకం రద్దు.. తీర్పు వెలువరించిన సుప్రీం అంతకుముందు పశ్చిమబెంగాల్ టీచర్ స్కాంపై సుప్రీం కోర్టు ఏప్రిల్ 3న విచారణ చేపట్టింది. అనంతరం తుదితీర్పును వెలువరించింది. పశ్చిమ బెంగాల్లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్ల్యూబీఎస్ఎస్సీ)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది.మొత్తం 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల్లో అవకతవకలను, లోపాలను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మొత్తం నియామకాలు చెల్లవని తీర్పు వెలువరించింది. మళ్లీ నియామకాలు చేపట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం గురువారం ఆదేశించింది. విద్యాశాఖ మంత్రితో సహా పలువురి అరెస్ట్2016లో పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(డబ్ల్యూబీఎస్ఎస్సీ)నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో కేంద్ర దర్యాప్తు సంస్థలైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్,ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు రంగంలోకి దిగాయి. దర్యాప్తు చేపట్టి పశ్చిమ బెంగాల్ మాజీ విద్యా శాఖ మంత్రి పార్థ ఛటర్జీ , రాష్ట్రస్కూల్ సర్వీస్ కమిషన్ పదవులు నిర్వహించిన మరికొందరు అధికారులను అరెస్ట్ చేశాయి. -
సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
ఢిల్లీ: టీచర్ల నియామకాలకు సంబంధించిన కేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊరట లభించింది. 24 వేల టీచర్ల నియామకాన్ని పూర్తిగా రద్దు చేసి, సీబీఐ విచారణ చేపట్టాలని కోల్కతా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును టీఎంసీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్కు చెందిన ప్రభుత్వ అధికారులపై లోతుగా దర్యాప్తు చేయాలన్న సీబీఐకి ఇచ్చిన ఆదేశాలపై తాజాగా స్టే విధించింది.2016 నాటి టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్లో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అప్పటి మొత్తం రిక్రూట్మెంట్ను రద్దు చేయాలని... ఇప్పటివరకు టీచర్లు తీసుకున్న జీతాలను వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఇక ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియపై పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ను మరింత దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. కోల్కత హైకోర్టు తీర్పుపై దీదీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో తాజాగా సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసుపై సుప్రీం కోర్టు తదుపరి విచారణను మే 6 తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే ఈ వ్యవహరంలో సీబీఐ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీ, పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్లోని పలువురు అధికారులను సీబీఐ అరెస్ట్ చేయటం గమనార్హం. -
అర్పిత ఎల్ఐసీ పాలసీల్లో నామినీగా పార్థ ఛటర్జీ!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ టీచర్ నియామకాల కుంభకోణం దర్యాప్తులో లోతుగా వెళ్లే కొద్దీ మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈడీ సోదాల్లో బయటపడ్డ డబ్బుతో తనకేం సంబంధం లేదని, తనపై జరిగిన కుట్రకు కాలమే సమాధానం చెప్తుందని టీఎంసీ బహిష్కృత నేత.. బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ చెప్తున్నారు. మరోవైపు ఆయన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీ మాత్రం తాను లేని టైంలో తన ఇంట్లో ఆ డబ్బును పార్థనే ఉంచారని, తన ఇంటిని మినీ బ్యాంకుగా వాడుకున్నారంటూ ఈడీ ముందు వాంగ్మూలం ఇచ్చింది. ఈ తరుణంలో.. ఈ వ్యవహారంలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయాన్ని ఈడీ బయటపెట్టింది. అర్పితా ముఖర్జీకి చెందిన దాదాపు 31 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలలో నామినీగా పార్థ ఛటర్జీ పేరు ఉందని ఈడీ అధికారులు తెలిపారు. అంతేకాదు ఏపీఏ యూటిలిటీ సేవల కింద జనవరి 1, 2012 నుంచి ఇద్దరి మీద భాగస్వామ్యానికి సంబంధించిన దస్తావేజులు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు.. ఈ భాగస్వామ్యం పేరు మీదనే పలు ప్రాపర్టీలు కొనుగోలు చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ అధికారులు వెల్లడించారు. కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలు నిందితులిద్దరూ నగదు రూపంలోనే చేశారు. అయితే ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందనేది కనిపెట్టాల్సి ఉంది అని దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. మనీల్యాండరింగ్ కేసులో పార్థ ఛటర్జీ, అర్పితా ముఖర్జీలను సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాతే అరెస్ట్ చేసింది ఈడీ. అర్పితాకు చెందిన ఇళ్ల నుంచి సుమారు రూ. 50 కోట్ల నగదు, ఐదు కేజీల బంగారం, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది కూడా. ఆపై ఈడీ ఈ ఇద్దరినీ తమ కస్టడీలోకి తీసుకోగా.. ఆగస్టు 5వ తేదీతో ఆ కస్టడీ ముగియనుంది. ఇదీ చదవండి: సంజయ్ రౌత్ సతీమణికి ఈడీ సమన్లు -
50 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి
సాక్షి, ముషీరాబాద్(హైదరాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 50 వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యానగర్లోని బీసీ భవన్లో బుధవారం బీసీ సంఘం నేత గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన బీఈడీ, డీఈడీ, పీఈటీ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్న మాదిరిగానే టీచర్ పోస్టులను భర్తీకి కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను తీ ర్చిదిద్ది పేద, బడుగు, బలహీన వర్గాలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దుతున్నారని, వేలకోట్లను వెచ్చిస్తున్నా రని తెలిపారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల ముందు నో వేకెన్సీ బోర్డులు దర్శనం ఇస్తున్నాయన్నారు. అదే పరిస్థితి తెలంగాణలో కూడా తీసుకురావాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో లాల్కృష్ణ, లక్ష్మణ్యాదవ్, అంజి, సత్యనారాయణ, అనంతయ్య, సతీశ్, చంటి ముదిరాజ్, సుచిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: దళితబంధును వదులుకున్న సిసలైన శ్రీమంతులు.. -
ఈ దాపరికం ప్రమాదం..!
విశ్లేషణ ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకాలు సరిగ్గా జరుగుతున్నాయో లేదో నిర్ధారించడానికి న్యాక్ సంస్థకు ఇచ్చిన నివేదికలు ముఖ్యం. ఇవన్నీ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయి. వాటిని అడిగిన వారికి ఇవ్వాల్సిందే. ప్రైవేట్ పబ్లిక్ విద్యాసంస్థ లలో బోధనా ప్రమాణాలను రక్షించేదెవరు? అసలు పాఠా లుచెప్పే వారే లేని కళాశాలలు ఎలా నడుస్తున్నాయి? విద్యా ర్థులు ఏం నేర్చుకుంటున్నారు? ఎవరు నేర్పుతున్నారు? జైపూర్ సుబోధ్ కళాశాల వారు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)కు ఇచ్చిన శాశ్వత అధ్యాపకుల జాబితా ప్రతి ఇవ్వాలని ఆర్టీఐ ద్వారా గిరి ధారి శరణ్ శర్మ అడిగారు. ఇవ్వకుండా న్యాక్ అధికారి ఆ దరఖాస్తును సుబోధ్ కళాశాలకు బదిలీ చేసారు. చాలా ప్రైవేట్ కళాశాలల్లో అధ్యాపకులు సరిగా ఉండరు. సరైన వారిని నియమించరు. నియమిస్తే జీతాలు సరిగా ఇవ్వరు. వేతనాలను ప్రభుత్వం నిర్దే శించిన ప్రకారం ఇస్తున్నామని అబద్ధాలు చెబుతారు. పరిశీలక బృందాలను నమ్మించడానికి దస్తావేజులు తయారు చేస్తారు. శాశ్వత సర్వీసులో లెక్చరర్లు ఉన్నట్టు నమ్మిస్తారు. ఉపాధ్యాయులకు తక్కువ జీతాలు, విద్యా ర్థులకు తక్కువ స్థాయి పాఠాలు, యాజమాన్యాలకు ఎక్కువ లాభాలు. పుట్టగొడుగుల్లా వెలిసిన కళాశాలల్లో కుప్పలు తెప్పలుగా బయటకు వచ్చే ఇంజినీర్లు, గ్రాడ్యు యేట్లు, డాక్టర్లు ఎంతమంది పనికొస్తారో తెలియదు. న్యాక్ వారికి ఇచ్చిన అబద్ధపత్రాలను ఎండగట్టడం ఏ విధంగా? కనీసం వారు ఇచ్చిన పత్రాల ప్రతులు అధికారికంగా బయటకు వస్తే వాటి నిజానిజాలు బయ టపెట్టడానికి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు లేదా మోసపోయిన అధ్యాపకులకు వీలవుతుంది. శాశ్వత సర్వీసు అధ్యాపకుల జాబితా ఇవ్వగానే అందులో నిజంగా నియమితులైన వారెందరో తెలిసిపోతుంది. సమాచార హక్కు అవసరం అదే. కళాశాల స్వార్థ పూరిత కార్యక్రమాలను ఆపే బదులు, వారితో పరిశీలకులు కూడా కలిసిపోతే విద్యా ప్రమాణాలకు దిక్కేమిటి? న్యాక్ పరిశీలక బృందానికి కళాశాల యజమానులు ఇచ్చిన అధ్యాపకుల జాబితా ఇవ్వడానికి ఎందుకు భయం? రెండో అప్పీలు కేంద్ర సమాచార కమిషన్ ముందుకు వచ్చింది. న్యాక్ పక్షాన లాయర్ హాజర య్యారు. అధ్యాపకుల జాబితాను కళాశాలవారు ఇవ్వ గానే కమిటీ సభ్యులు అక్కడికక్కడే చదివి, ఆయా అధ్యా పకులు నిజంగా ఉన్నారో లేదో పరిశీలిస్తారట. తరువాత ఆ జాబితా కాగితాలు కళాశాలకే ఇచ్చివేస్తారట. అయితే ఆ విధంగా చెక్ చేసినట్టు, ఇచ్చిన అధ్యా పకుల జాబితా సరిగ్గా ఉన్నట్టు లేదా లోపాలు ఉన్నట్టు ఎక్కడైనా రాసి ఉంటారు కదా, దాని ప్రతులు ఇవ్వ గలరా అనడిగితే జవాబు ‘నాకు తెలియదు. న్యాక్ వారు చెప్పలేదు’ అని. తమసంస్థ దగ్గర ఉండవలసిన పత్రాలు లేవనడం, ఉన్నా ఇవ్వకపోవడం, పైగా సమాచార దర ఖాస్తును కళాశాలకు బదిలీ చేసి, చేతులు దులుపుకో వడం సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే అవు తుంది. దానికి షోకాజ్ నోటీసు ఇవ్వక తప్పదు. సమా ధానం సరిగా లేకపోతే జరిమానా కూడా తప్పదు. ఆ విషయం చెప్పగానే లాయర్ గారు కొంత సమయం అడి గారు. న్యాక్ ఉన్నతాధికారులను అడిగి డాక్యుమెంట్ ఇవ్వడం గురించి చెబుతానన్నారు. న్యాక్ 1994 లో విద్యా ప్రమాణాలను పరిశీలించి ధృవీకరించడానికి ఏర్పడిన సంస్థ. యూజీసీ దీన్ని ఏర్పాటు చేసింది. ఏడు ప్రమాణ పరిశీలనాంశాలను గుర్తించింది. పాఠ్యాంశాలు, బోధనా, అధ్యయన పరి శీలన, పరిశోధన, సలహాలు విస్తరణ అంశాలు, మౌలిక వనరులు, అధ్యయన వనరులు, విద్యార్థుల సమర్థనాం శాలు, పాలన, నాయకత్వం యాజమాన్యం, సృజనాత్మ కత, ఉత్తమ విధానాలు. ఇవి ఉన్నాయో లేదో తేల్చాలి. ప్రతి సంస్థ సొంతంగా తమ కళాశాల వనరుల గురించి సమగ్రంగా అధ్యయన నివేదిక రూపొందించి ఇవ్వాలి. ఈ నివేదిక ఆధారంగానే పరిశీలన ప్రమాణాల నిర్ధారణ జరుగుతుంది. ఈ నివేదికకు అనుబంధంగా అనేక పత్రాలు ఉంటాయి అందులో ఒకటి అధ్యాపకులు, సిబ్బంది జాబితా. ఎంతమంది తాత్కాలిక సిబ్బంది లేదా ఎందరు శాశ్వత ప్రతిపాదికమీద నియమితులై నారు. వారి జీతాల వివరాలు ఉండాలి. న్యాక్ సభ్యులు వీటిని పరిశీలించి తనిఖీ చేయాలి. ఈ విధానమంతా పారదర్శకంగా ఉండాలి. నివేదిక తయారైన తరువాత దాన్ని కళాశాల ఉన్నతాధికారికి ఇస్తారు. ఆయన పరి శీలించి అందులో ఏ వివరాలనైనా పరిశీలించలేదని అని పిస్తే, వ్యతిరేక నిర్ధారణలకు ఆధారం లేదని అనుకుంటే ఆ వివరాలను కమిటీ ముందుకు తేవచ్చు. ఆ తరువాత నివేదికకు తుది రూపు ఇవ్వడానికి అవకాశం ఉంది. టీచర్ల నియామకాలు సరిగా జరుగుతున్నాయో లేదో నిర్ధారించడానికి ఈ న్యాక్ సంస్థకు ఇచ్చిన నివే దికలు ముఖ్యం. ఆ నివేదికలు, అనుబంధాలు అన్నీ సమాచార హక్కు చట్టం కింద సమాచారం అన్న నిర్వచనంలోకి వస్తాయి. కనుక వాటిని అడిగిన వారికి ఇవ్వక తప్పదు. ఏ విధంగానూ అవి రహస్యాలు కావు. పోటీలో నష్టపరిచే అంశాలు కూడా కావు. ఒక్క ప్రొఫె సర్ను అనేక కళాశాలలు తమ అధ్యాపకుడని చెప్పుకునే అవినీతిని నిరోధించడానికి కూడా ఈ సమాచార పార దర్శకత ఉపయోగపడుతుంది. 15 రోజుల్లో అధ్యాపకుల జాబితా ఇవ్వగలమని లాయర్ న్యాక్ తరఫున కమిషన్కు హామీ ఇచ్చారు. ఆ విధంగా ధృవీకృత ప్రతి ఇవ్వాలని కమిషన్ ఆదేశిం చింది. న్యాక్ మాత్రమే కాక సుబోధ్ కళాశాల కూడా తమ ఉద్యోగుల జాబితా ఇవ్వాలని కమిషన్ ఆదేశిం చింది. న్యాక్ తన విధి విధానాలను మరింత పార దర్శకంగా రూపొందించాలని, ఈ జాబితాలను కళాశా లల నుంచి సేకరించాలని, ఆర్టీఐ చట్టం కింద అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని కమిషన్ సూచించింది. (గిరిధారి శరణ్ శర్మ వర్సెస్ న్యాక్ CIC/SA/A/2015/001420 కేసులో జనవరి 18న ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్